అన్వేషించండి

Amaravati New Cases : ఆమరావతిలో ఆళ్ల పెట్టిన కొత్త కేసు ఇదే ! పూర్తి వివరాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే

అమరావతి రింగ్ రోడ్ విషయంలో ఆళ్ల చేసిన ఫిర్యాదులో ఏముందంటే ?

అమరావతిలో ల్యాండ్ పూలింగ్, ఇన్ సైడర్ ట్రేడింగ్ కేసులన్నీ తేలిపోయిన తర్వాత రాత్రికి రాత్రి కొత్తగా ఇన్నర్ రింగ్ రిడ్ అలైన్ మెంట్, మాస్టర్ ప్లాన్‌లో అక్రమాల కేసులు పెట్టారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ఫిర్యాదు చేయడం వెంటనే కేసులు నమోదు చేయడం.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఏ-1గా పెట్టడం చకచకా జరిగిపోయాయి. నారాయణను టెన్త్ పేపర్ల లీక్ కేసులో అరెస్ట్ చేశారు కాబట్టి ఈ కేసులోనూ అరెస్ట్ చూపించే అవకాశం ఉంది. అసలు ఈ కేసేంటి ? ఆళ్ల ఏమని ఫిర్యాదు చేశారో చూద్దాం..

అమరావతి మాస్టర్ ప్లాన్‌లో  ఇన్నర్ రింగ్ రోడ్డు !

అమరావతి నుంచి విజయవాడ చుట్టూ  గుంటూరు జిల్లాలోని కొంత ప్రాంతాన్ని కలుపుతూ  75 మీటర్ల వెడల్పుతో నిర్మించే 94.5 కిలోమీటర్ల ఇన్నర్ రింగ్‌రోడ్డును అమరావతి మాస్టర్ ప్లాన్‌లో ప్రతిపాదించారు.   కృష్ణా నదిని ఆనుకుని గుంటూరు జిల్లా పరిధిలో వైకుంఠపురం, పెద్దమద్దూరు, కర్లపూడి, మోతడక, నిడుముక్కల, తాడికొండ, కంతేరు మీదుగా ఐఆర్‌ఆర్ జాతీయ రహదారిలో కలుస్తుంది.  తాడిగడప-ఎనికేపాడు మధ్య ఉన్న 100 అడుగుల రోడ్డుకు ఐఆర్‌ఆర్‌ను కలపాలనేది ప్రతిపాదన. అక్కడి నుంచి వీజీటీఎం-ఉడా హయాంలో మొదలైన రామవరప్పాడు రింగ్ వద్ద నిర్మాణంలోని ఐఆర్‌ఆర్‌కు కలిపి గొల్లపూడి వరకు తీసుకువెళ్లాలని ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. 

రియల్ ఎస్టేట్ కంపెనీలకు లాభం చేకూర్చేలా అలైన్ మెంట్ మార్చారని ఎమ్మెల్యే ఆళ్ల ఫిర్యాదు !

విజయవాడ, గుంటూరు మధ్య చాలా కాలంగా రియల్ ఎస్టేట్ కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. రామకృష్ణ హౌసింగ్, లింగమనేని ఎస్టేట్స్ వంటి కంపెనీలు రాష్ట్ర విభజనకు ముందే పెద్ద పెద్ద అపార్టుమెంట్లు నిర్మించి అమ్ముతున్నాయి. అక్కడ చాలా కంపెనీలకు భూములున్నాయి. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలకు లాభం కలిగించేలా వారి భూములకు విలువ పెంచేలా అలైన్‌మెంట్ మార్చారని ఆళ్ల సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిజానికి అలైన్‌మెంట్ మార్చడం అనేది లేదు.. ఎందుకంటే మాస్టర్ ప్లాన్‌లో భాగంగా ప్రభుత్వమే ఇన్నర్ రింగ్‌రోడ్ ని ఖరారు చేసింది. ఈ ఇన్నర్ రింగ్ రోడ్ ఖరారులో అనేక అంశాలను పరిశీలనలోకి తీసుకుంటారు. ఇవన్నీ అధికారులు చూసుకుంటారు. చివరికి కేంద్ర ప్రభుత్వ అనుమతితో  నిర్మాణం ప్రారంభిస్తారు. 

నష్టపోయామని ఏ  ఒక్క బాధితుడూ ఫిర్యాదు చేయలేదు!

ఏ కేసులో అయినా తాము నష్టపోయామని బాధితులు కేసులు పెడుతూ ఉంటారు. కానీ అమరావతి కేసుల్లో మాత్రం ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేస్తూంటారు. సీఐడీ కేసులు నమోదు చేస్తూ ఉంటారు. ఈ ఐఆర్ఆర్ అలైన్‌మెంట్ ఖరారులో అవినీతి జరిగిందని.. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఒక్క రైతు కూడా ఫిర్యాదు చేయలేదు. కానీ ఎమ్మెల్యే మాత్రం సామాన్యులకు .... ప్రజల ఆస్తులకు నష్టం చేకూర్చారని ఫిర్యాదు చేశారు. ఎవరికి నష్టం చేశారు...? ఎలా నష్టపోయారు? అన్న అంశాలు ఎఫ్ఐఆర్‌లో లేవు. 

పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది !

సీఐడీ పోలీసులు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారని.. ప్రాథమిక దర్యాప్తు నిర్వహించామని.. ఆ దర్యాప్తులో ఆధారాలున్నాయని కేసులు పెట్టామని ఎఫ్ఐఆర్‌లో చెప్పారు. అంతే తప్ప.. ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. అవన్నీ పోలీసులు ప్రకటించిన తర్వాత ఈ కేసు రాజకీయంగా పెట్టారా లేదా అనేది తేలే అవకాశం ఉంది. 

 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP activist arrest: రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
Tirupati Govindarajaswamy Temple: వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?

వీడియోలు

1 Crore to Pak U-19 Players | పాక్ ఆటగాళ్లకి ఒక్కొక్కరికీ కోటి రూపాయలు | ABP Desam
Shubman Gill vs Yashasvi Jaiswal | t20 వరల్డ్ కప్ 2026 ఇండియన్ స్క్వాడ్ లో జైస్వాల్ కి చోటు దక్కల్సింది | ABP Desam
Virat Kohli Under Pant Captaincy | పంత్ కెప్టెన్సీలో బరిలోకి దిగబోతున్న విరాట్ కోహ్లీ | ABP Desam
Vaibhav Suryavanshi Shoe Controversy | పాక్ పేసర్‌కు వైభవ్ సూర్యవంశీ షూ చూపించిన ఘటనపై క్లారిటీ | ABP Desam
Nidhhi Agerwal Samantha Anasuya Incidents | హీరోయిన్లతో అసభ్య ప్రవర్తన..ఎటు పోతోంది సమాజం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP activist arrest: రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
Tirupati Govindarajaswamy Temple: వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
Stranger Things Series Season 5 OTT : అవెయిటెడ్ 'స్ట్రేంజర్ థింగ్స్' వెబ్ సిరీస్ - ఫైనల్ సీజన్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
అవెయిటెడ్ 'స్ట్రేంజర్ థింగ్స్' వెబ్ సిరీస్ - ఫైనల్ సీజన్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Nagoba Jatara: నెలవంకను దర్శించుకున్న మెస్రం వంశీయులు.. కేస్లాపూర్ నాగోబా మహాపూజలకు శ్రీకారం
నెలవంకను దర్శించుకున్న మెస్రం వంశీయులు.. కేస్లాపూర్ నాగోబా మహాపూజలకు శ్రీకారం
Why Mouth Taste Bitter During Fever: జ్వరం వచ్చిన తర్వాత నోరు ఎందుకు చేదుగా మారుతుంది?
జ్వరం వచ్చిన తర్వాత నోరు ఎందుకు చేదుగా మారుతుంది?
India- New Zealand Trade Deal: భారత్‌తో ట్రేడ్ డీల్‌పై న్యూజిలాండ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. వ్యర్థమైన FTAగా విమర్శలు
భారత్‌తో ట్రేడ్ డీల్‌పై న్యూజిలాండ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. వ్యర్థమైన FTAగా విమర్శలు
Embed widget