అన్వేషించండి

Viveka Murder Case Updates: వివేకా కేసులో ఏం జరుగుతోంది? సీబీఐ అధికారులను కలిసిన సునీత

మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ 73వ రోజు కొనసాగుతోంది. కేసును విచారిస్తోన్న సీబీఐ అధికారులను వివేకా కుమార్తె సునీత కలవడం చర్చనీయాంశమైంది.

మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కేసును విచారిస్తోన్న సీబీఐ అధికారులను వివేకా కుమార్తె సునీత కలవడం చర్చనీయాంశమైంది. వివేకా హత్య కేసుకు సంబంధించి గత రెండు రోజులుగా పులివెందుల ఉన్న వైఎస్‌ కుటుంబ సభ్యులను సీబీఐ విచారిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హత్యకు సంబంధించి ఏమైనా వివరాలు వెల్లడయ్యాయా? పురోగతి ఏంటనే విషయాలు తెలుసుకునేందుకు సునీత సీబీఐ అధికారులను కలుసుకున్నట్లుగా సమాచారం. 

73వ రోజుకు చేరిన విచారణ..
వివేకా హత్య కేసు విచారణ 73వ రోజు కొనసాగుతోంది. కేసు విచారణ జరిపేందుకు పులివెందులకు వచ్చిన అధికారులు అనుమానితులను విచారిస్తున్నారు. దీనిలో భాగంగా కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో సునీల్‌ యాదవ్‌ సమీప బంధువు భరత్‌ యాదవ్‌ను అధికారులు విచారిస్తున్నారు. భరత్ తో పాటు పులివెందులకు చెందిన నాగేంద్ర, మహబూబ్‌ బాషా సహా హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న మరో వ్యక్తి కూడా ఈ విచారణకు హాజరయ్యారు.

Also Read: Viveka Cbi : కడప ఎంపీ తండ్రిని ప్రశ్నించిన సీబీఐ ! తర్వాత ఎవరు..?

సుంకేసులకు చెందిన జగదీశ్వర్‌రెడ్డిని కూడా ఈరోజు విచారణకు పిలిచినట్లు సమాచారం. జగదీశ్వర్‌రెడ్డి గతంలో వివేకా పొలం పనులు చూసేవాడు. కడప ఎంపీ అవినాష్‌ తండ్రి భాస్కర్‌రెడ్డి, చిన్నాన్న మనోహర్‌రెడ్డి, వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డిలను మరోసారి ఈ రోజు విచారణకు పిలిచింది. పులివెందుల ఆర్‌ అండ్‌ బీ అతిథి గృహంలో వీరిని విచారించనుంది. 

నిన్న ఎవరెవరిని విచారించారు?
వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు వైఎస్ కుటుంబ సభ్యులను ప్రశ్నిస్తున్నారు. మంగళవారం సీబీఐ టీం కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని ప్రశ్నించింది. సీబీఐ రెండు టీములుగా మారి ఈ కేసును విచారిస్తోంది. ఒక టీమ్ కడపలో... మరో టీమ్ పులివెందులలో ఉండి అనుమానితుల్ని ప్రశ్నిస్తోంది. సునీల్ కుమార్ యాదవ్‌ను కస్టడీలోకి తీసుకుని వివరాలు రాబడుతోంది. ఇక్కడ రాబట్టిన వివరాలను బట్టి పులివెందులలో రెండో బృందం.. ఇతర అనుమానితుల్ని ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది.

వివేకా హత్య జరిగినప్పుడు ఆయన ఇంటి వద్దకు మొదటగా వెళ్లిన వ్యక్తుల్లో భాస్కర్ రెడ్డి ఒకరన్న ప్రచారం ఉంది. వివేకా కుమార్తె సునీత ఇచ్చిన 15మంది అనుమానితుల లిస్టులో కూడా ఈయన పేరు ప్రముఖంగా వినిపించింది. 

Also Read: Viveka Murder Case: మా ఇంటి చుట్టూ అనుమానితులు తిరుగుతున్నారు.. భయంగా ఉంది.. కడప ఎస్పీకి వివేకా కుమార్తె లేఖ

Also Read: YS Viveka Murder Case Updates: ప్రాణహాని ఉందని ఎస్పీకి వివేకా కుమార్తె లేఖ ఎఫెక్ట్... పోలీసుల అదుపులో మణికంఠరెడ్డి!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Delhi Earthquake: ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
Aamir Khan Weight Loss : జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో
జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో

వీడియోలు

Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు
Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delhi Earthquake: ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
Aamir Khan Weight Loss : జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో
జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Ilayaraja : ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
Bandla Ganesh : బండ్ల గణేష్ సంకల్ప యాత్ర ప్రారంభం - హైదరాబాద్ To తిరుమల వెంకటేశుని సన్నిధి వరకూ...
బండ్ల గణేష్ సంకల్ప యాత్ర ప్రారంభం - హైదరాబాద్ To తిరుమల వెంకటేశుని సన్నిధి వరకూ...
Embed widget