అన్వేషించండి

Botsa Satyanarayana Health: బొత్స సత్యనారాయణకు తీవ్ర అస్వస్థత, ప్రసంగిస్తూ కుప్పకూలిపోయిన నేత

Botsa Satyanarayana Garu is fine | వైసీపీ ర్యాలీలో పాల్గొని ప్రసంగిస్తుండగా బొత్స సత్యనారాయణ ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. పరీక్షించిన వైద్యులు ఆందోళన అవసరం లేదన్నారు.

విజయనగరం: ఏపీ మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చీపురుపల్లిలో వెన్నుపోటు దినం ర్యాలీలో పాల్గొన్న బొత్స సత్యనారాయణ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ర్యాలీ అనంతరం సభలో ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. వాహనం మీద ఎక్కి మాట్లాడుతుండగా.. ఆయన చాలా నీరసంగా కనిపించారు. పక్కన ఉన్న నేతలు నీళ్లు తాగుతారా అని అడిగేలోపు కళ్లు తిరిగి పడిపోయారు.  అస్వస్థతకు గురైన బొత్స సత్యనారాయణను పార్టీ నేతలు, అనుచరులు  హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. 

ఆందోళన అవసరం లేదన్న పార్టీ నేతలు

శాసనమండలిలో వైసీపీపక్షనేత బొత్స సత్యనారాయణ కళ్లు తిరిగి పడిపోవడంతో పార్టీ నేతలు, ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అయితే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో సొమ్మసిల్లిపోయారని, ప్రమాదం ఏమీ లేదని డాక్టర్లు చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రాథమిక చికిత్స అనంతరం బొత్స సత్యనారాయణ ఇంటికి చేరుకుని క్షేమంగా కనిపించారు. పార్టీ నేతల సమాచారం మేరకు ఆయన సాయంత్రం నాలుగు గంటలకు హైదరాబాద్ కు ప్రయాణం కానున్నారు.

వైసీపీ వెన్నుపోటు దినోత్సవం నిరసన, ఆందోళనలు

అమరావతి:  మాజీ సీఎం వైఎస్ జగన్నేడు వైసిపి వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమానికి పిలుపు ఇచ్చారు. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు వెన్నుపోటు దినోత్సవంలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమం సమయంలో మాజీ సీఎం జగన్ తాడేపల్లి నుంచి బెంగుళూరు వెళ్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో 175 స్థానాలకుగానూ వైసీపీ 11 స్థానాల్లో నెగ్గింది. కూటమి నేతలు 164 నియోజకవర్గాల్లో విజయం సాధించారు. కాగా,  మంగళవారం నాడు తెనాలిలో పర్యటించిన జగన్ ఇటీవల పోలీసుల దాడిలో గాయపడిన బాధితుడు జాన్ విక్టర్ ను పరామర్శించారు. నడిరోడ్డు మీద యువకులు, వ్యక్తులను దారుణంగా కొట్టే హక్కు పోలీసులకు ఎవరిచ్చారని జగన్ ప్రశ్నించారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Thalliki Vandanam Status: ఆంధ్రప్రదేశ్‌లో 22న తల్లికి వందనం డబ్బులు! అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్‌లో 22న తల్లికి వందనం డబ్బులు! అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి!
Re-NEET UG 2026 Result: నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
AI Intimacy Survey: లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
Fishermen Boat Capsized: విశాఖ తీరంలో బోటు బోల్తా.. తృటిలో తప్పించుకున్న ఏడుగురు మత్స్యకారులు
విశాఖ తీరంలో బోటు బోల్తా.. తృటిలో తప్పించుకున్న ఏడుగురు మత్స్యకారులు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Embed widget