అన్వేషించండి

Srikakulam Bear: శ్రీకాకుళంలో మళ్లీ ఎలుగుబంటి కలకలం, అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచనలు

Srikakulam Bear: గత మూడు నెలల నుంచి శ్రీకాకుళం జిల్లాలో ఎలుగు బంటి సంచారం కలకలం రేపుతోంది. తాజాగా అర్ధరాత్రి మొగిలిపాడు గ్రామంలో కనిపించగా.. ప్రజలంతా భయపడిపోయారు. దాన్ని తరిమే ప్రయత్నాలు చేశారు. 

Srikakulam Bear: శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపుతుంది. మందస మండలం దున్నవూరు పంచాయతీ మొగిలిపాడు గ్రామంలో అర్ధరాత్రి అందరూ పడుకున్న తర్వాత ఎలుగుబంటి వీదుల్లోకి వచ్చింది. విషయం గుర్తించిన పలువురు స్థానికులు ఎలుగుబంటి వచ్చిందంటూ కేకలు వేశారు. కొందరు వాటిని ఇళ్లలో నుంచే చూస్తూ.. గజగజా వణికిపోగా, ధైర్యవంతులు దాన్ని వెళ్లగొట్టేందుకు ప్రయత్నాలు చేశారు. అంతా కలిసి గట్టి గట్టిగా కేకలు వేస్తూ... దాన్ని తరిమికొట్టారు. అటవీ శాఖ అధికారులు అప్రమత్తమై ఎలుగుబంటిని త్వరగా పట్టుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఎలుగుబంటి వల్ల ఇళ్లలోనుంచి బయటకు రావాలన్ని భయంగా ఉంటోందని వివరించారు. వ్యవసాయ క్షేత్రాలకు కూడా ఒంటరిగా వెళ్లి పనులు చేస్కోలేకపోతున్నామని తెలిపారు. 

మొన్నటికి మొన్న మన్యం జిల్లాలో.. 
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎలుగుబంటి హల్ చల్ చేసింది. ఎలుగుబంటి సంచారంతో గిరిజనులు భయాందోళనకు గురవుతున్నారు. కురుపాం నియోజకవర్గం సూర్యనగర్ గ్రామ పరిసర ప్రాంతాల్లో ఎలుగుబంటి సంచరిస్తున్నట్లు గ్రామస్తులు గుర్తించారు. దీంతో గ్రామస్తులు పొలాలకు వెళ్లాలంటేనా భయంగా ఉందని ఆందోళన చెందుతున్నారు. పోడు వ్యవసాయం కోసం కొండ మీదకు వెళ్తోన్న రైతులకు ఎలుగుబంటి కనిపించిందని గ్రామస్తులు చెబుతున్నారు. వ్యవసాయ పనులు ముగించుకొని విశ్రాంతి కోసం కొండ మీద ఏర్పాటు చేసుకున్న  పాక వద్దకు వెళ్లగా ఆ పాకలో ఉన్న ఎలుగుబంటి కనిపించిందని తెలిపారు. పోడు వ్యవసాయం చేయడానికి వెళ్లాలంటనే భయంగా ఉందని రైతులు అంటున్నారు. ఎలుగుబంటి నుంచి ఎటువంటి ప్రమాదం, ప్రాణహాని జరగకుండా ఫారెస్ట్ అధికారులు రక్షణ కల్పించాలని గిరిజన రైతులు కోరుతున్నారు. 

రెండు నెలల కిందట గ్రామస్తులపై దాడి.. 
ఇటీవల శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలోని కిడిసింగి గ్రామ శివారులో ఎలుగుబంటి గ్రామస్తులపై దాడి చేసింది. అతి కష్టంమీద దానిని పట్టుకున్నారు. విశాఖ జూకు తరలించే క్రమంలో ఎలుగుబంటి మృతి చెందింది. తాజాగా అదే ప్రాంతంలో మరో ఎలుగుబంటి సంచరిస్తున్నట్లు గ్రామస్తులు గుర్తించారు. ఉమ్మడి విజయనగరం జిల్లా కురుపాం ఏజెన్సీలోని పలు గ్రామాల్లో ఎలుగుబంటి సంచారంతో గిరిజనులు హడలిపోతున్నారు. 4 రోజుల క్రితమే. కిడిసింగి వద్ద తోటల్లో ఎలుగుబంటి రైతులపై చేసిన దాడిలో ఒకరి మృతి చెందగా, ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. పలువ తాడివాడ వద్ద ఇవాళ మరో ఎలుగుబంటి సంచారం స్థానికంగా కలకలం రేపుతోంది. గత కొద్ది రోజులుగా మండలంలో ఎలుగుబంట్ల సంచారంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 

అప్రమత్తంగా ఉండండి.. 
కిడిసింగి, వజ్రపుకొత్తూరు సమీపంలోని తాడివాడ తోటల్లో కాళీమాత గుడి నుంచి గుల్లపాడు చెరువు గట్టుకు వెళ్తోన్న స్థానికులు ఎలుగుబంటిని చూశారు. తోటల్లోకి వెళ్లేందుకు గ్రామస్తులు భయపడుతున్నారు. ఎప్పుడు ఎటువైపు నుంచి వచ్చి దాడిచేస్తుందో అని హడలిపోతున్నారు. వెంటనే అటవీ అధికారులు స్పందించి ఎలుగుబంటిని పట్టుకోవాలని కోరుతున్నారు. గిరిజన గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పార్వతీపురం మన్యం జిల్లా అటవీ రేంజ్ ఆఫీసర్ మురళీకృష్ణ సూచించారు. గతంలో కూడా బియ్యాలవలస పంచాయతీ పరిధిలోని సూర్యనగర్, పెల్లివలస, దురుబిలి, గోటివాడ, లోమడ, బల్లుకోట గ్రామాల పరిసరాల్లో ఎలుగుబంట్లు సంచారాన్ని గుర్తించామని తెలిపారు. రైతులను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఒంటరిగా పొలాలకు, తోటల్లోకి వెళ్లొద్దంటున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kavuri Sambasivarao Passes Away: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
Kerala Assembly Elections 2026: కేరళ కాంగ్రెస్‌లో సీఎం సెగ - వేణుగోపాల్ రాకతో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు!
కేరళ కాంగ్రెస్‌లో సీఎం సెగ - వేణుగోపాల్ రాకతో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు!
Telangana Politics: బీఆర్ఎస్‌ను మించి గ్రౌండ్ పాలిటిక్స్‌లో కవిత దూకుడు - క్యాడర్, లీడర్‌ను ఆకర్షిస్తారా?
బీఆర్ఎస్‌ను మించి గ్రౌండ్ పాలిటిక్స్‌లో కవిత దూకుడు - క్యాడర్, లీడర్‌ను ఆకర్షిస్తారా?

వీడియోలు

Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్
ICC Penalizes Arshdeep After T20 World Cup Final | అర్ష్‌దీప్ సింగ్‌పై ఐసీసీ వేటు
Shahid Afridi praises Team India | భారత జట్టుపై షాహిద్ అఫ్రిదీ ప్రశంసలు
BCCI Reward for T20 World Cup Champions | టీమిండియాపై బీసీసీఐ కాసుల వర్షం
Gambhir Dedicates T20WC Win to Dravid & Laxman | ట్రోఫీ గెలిచాక గంభీర్ సంచలన నిర్ణయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kavuri Sambasivarao Passes Away: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
Kerala Assembly Elections 2026: కేరళ కాంగ్రెస్‌లో సీఎం సెగ - వేణుగోపాల్ రాకతో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు!
కేరళ కాంగ్రెస్‌లో సీఎం సెగ - వేణుగోపాల్ రాకతో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు!
Telangana Politics: బీఆర్ఎస్‌ను మించి గ్రౌండ్ పాలిటిక్స్‌లో కవిత దూకుడు - క్యాడర్, లీడర్‌ను ఆకర్షిస్తారా?
బీఆర్ఎస్‌ను మించి గ్రౌండ్ పాలిటిక్స్‌లో కవిత దూకుడు - క్యాడర్, లీడర్‌ను ఆకర్షిస్తారా?
Rajendra Prasad : మళ్లీ నోరు జారిన రాజేంద్ర ప్రసాద్ - స్టేజ్‌పై అలా మాట్లాడతారా అంటూ...
మళ్లీ నోరు జారిన రాజేంద్ర ప్రసాద్ - స్టేజ్‌పై అలా మాట్లాడతారా అంటూ...
Andhra Pradesh alliance Politics: ఏపీలో కూటమి గడబిడ - పైస్థాయిలో బాండింగ్ సరే - నియోజకవర్గ నేతల మధ్య ఆధిపత్యపోరు సంగతేంటి?
ఏపీలో కూటమి గడబిడ - పైస్థాయిలో బాండింగ్ సరే - నియోజకవర్గ నేతల మధ్య ఆధిపత్యపోరు సంగతేంటి?
MG Comet నుంచి Gloster వరకు - రూ.60 వేల నుంచి రూ.4 లక్షల వరకు స్పెషల్‌ డిస్కౌంట్స్‌
MG Comet నుంచి Gloster వరకు - రూ.60 వేల నుంచి రూ.4 లక్షల వరకు స్పెషల్‌ డిస్కౌంట్స్‌
Velugumatla Issue: వెలుగుమట్ల నిర్వాసితులకు సర్కారు తీపి కబురు! ఇందిరమ్మ ఇళ్లు, పట్టాల పంపిణీకి సిద్ధం!
వెలుగుమట్ల నిర్వాసితులకు సర్కారు తీపి కబురు! ఇందిరమ్మ ఇళ్లు, పట్టాల పంపిణీకి సిద్ధం!
Embed widget