అన్వేషించండి

Ayyannapatrudu: గుడివాడ అమర్ సవాల్‌కు అయ్యన్నపాత్రుడు ఓకే, మంత్రికి మరో ఛాలెంజ్ విసిరిన టీడీపీ నేత

అమరావతి భూములు దోచుకున్నామని టీడీపీ నేతలపై నిందలు వేయడం తగదని అయ్యన్నపాత్రుడు అన్నారు. అమరావతి భూములు, విశాఖ భూములపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల అంశంపై పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్‌నాథ్ విసిరిన సవాలుకు టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు అంగీకరించారు. మూడు రాజధానులపై ప్రజాభిప్రాయానికి తాను సిద్ధమని స్పష్టం చేశారు. దమ్ము ఉంటే తక్షణమే అసెంబ్లీని రద్దు చేయాలని, మూడు రాజధానులే అజెండాగా ఎన్నికలకు వెళ్దామని అన్నారు. అమరావతి భూములు దోచుకున్నామని టీడీపీ నేతలపై నిందలు వేయడం తగదని అన్నారు. అమరావతి భూములు, విశాఖ భూములపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దమ్ముంటే ఇప్పుడు తాను విసిరిన సవాల్ ను స్వీకరించాలని అయ్యన్నపాత్రుడు సవాల్ విసిరారు.

ఎంపీ విజయసాయి రెడ్డి లక్ష్యంగా కూడా అయ్యన్న పాత్రుడు ఆరోపణలు చేశారు. ‘‘విజయ సాయి రెడ్డి రూ.పది వేల కోట్లు ఆస్తులు అక్రమించుకున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వృద్దుల కోసం ఇచ్చిన స్థలం కూడా లాక్కున్నారు.’’ అని ఆరోపించారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన, సిదిరి అప్పలరాజు అతిగా మాట్లాడుతున్నారని విమర్శించారు. మంత్రి గుడివాడ అమర్ నాథ్ ఆయన తండ్రి ఆశీస్సులతో మంత్రి అయ్యారని, గౌరవంగా వ్యవహరించాలని హితవు పలికారు. మాటలు జాగ్రత్తగా రావాలని అన్నారు. అమరావతి రైతులు పాదయాత్ర చేస్తుంటే దయ్యాలు అని అంటున్నారని విమర్శించారు.

కాలేజీల ప్రతిపాదన ఏది?
పరిశ్రమల మంత్రి అయ్యాక రాష్ట్రానికి ఎన్ని కంపెనీలు తెచ్చారో చెప్పాలి. సీఎం జగన్ చట్ట సభల్లో అబద్ధాలు చెబుతున్నారు. రేపు ఎన్నికల్లో యువత వైఎస్ఆర్ సీపీ మీద తిరగపడతారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయాల్సిన 16 మెడికల్ కాలేజీలకు ప్రతిపాదనలు పంపలేదని కేంద్రం నుంచి లెటర్ వచ్చింది. ఏడు కాలేజ్ లకు మాత్రమే ప్రతిపాదన పంపారు. కానీ, కేంద్రం మూడు మాత్రమే అంగీకరించింది. అసెంబ్లీలో వైద్యశాఖ మంత్రి 16 కాలేజ్ లు వస్తున్నాయని చెప్తున్నారు. ప్రతి మెడికల్ కాలేజ్ కి రూ.340 కోట్లు అంచనా వేశారు. మెడికల్ కాలేజ్ కి రాష్ట్ర వాటా అస్సలు ఇవ్వలేదు.

నర్సీపట్నం మెడికల్ కాలేజ్ అన్నారు. అసలు ప్రతిపాదనలో నర్సీపట్నం పేరు లేకుండా జాయింట్ కలెక్టర్ భూ సేకరణ చేశారు. మెడికల్ కాలేజ్ రాకపోతే ఈ భూములు రియల్ ఎస్టేట్ చేసుకుంటారు. దీనికి వైద్య శాఖ మంత్రి విడుదల రజని సమాధానం చెప్పాలి. ఉదయం సాయంత్రం రెండు గంటలు మేక్ అప్ వేసుకోవడానికే ఆమెకు సమయం సరిపోతోంది. జిల్లా మంత్రి అమర్ దీనికి సమాధానం చెప్పాలి.

అమరావతి రైతులు యాత్రపై మాట్లాడుతూ.. ‘‘అరసవెల్లి దేవుడ్ని చూడటానికి అమర్ నాథ్ అనుమతి కోరాలా? భూములు ఇచ్చిన రైతులను దొంగలా చూస్తున్నారు. అలాగే విజయవాడ, తిరుపతి వెళ్తే అక్కడ వాళ్ళు అనుమతి ఇవ్వమంటే ఏం చేస్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం, గంగవరం పోర్ట్ అదానీకి అమ్మేస్తే మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎందుకు మాట్లాడలేదు. రైతులు వస్తే వారికి పాదాభివందనం చెయ్యాలి. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు వాళ్ళు.

ఉత్తరాంధ్రలో రైతుల పాదయాత్ర జరిపిస్తాం. వారికి అండగా నిలుస్తాం. ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రజలు అందరు రైతుల యాత్రను స్వాగతించాలి. అమరావతి రైతులు తిరుపతి యాత్ర చేశారు. అప్పుడు ఏ శాంతి భద్రతల విఘాతం ఏర్పడలేదు. అంటే ఈ రాష్ట్రంలో తిరగాలి అంటే వీసా, వైసీపీ వారి అనుమతి అవసరమా? మొదటి రోజు నుంచి అన్ని అబ్బదాలు అడుతున్నారు. రాజధానికి రూ.లక్ష కోట్లు అవుతాయని సీఎం జగన్ కి తెలియదా?’’

బోర్డులు పెట్టాలి
‘‘అమరావతి భూముల్లో చంద్రబాబు దోచుకున్నారు అని ఆరోపిస్తున్నారు. అధికారం ఉంది కాబట్టి, దానిపైనా విచారణ చేసుకొచ్చు. ఇంతకు ముందు వేసిన విచారణలు కోర్టులు కొట్టేసాయి. రుషికొండ లో కడుతున్న నిర్మాణాలు గురుంచి ఎందుకు కనీసం బోర్డ్ పెట్టలేదు. చట్ట ప్రకారం నిర్మాణాల వివరాలు పెట్టాలి’’ అని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు.

విశాఖ భూములు సిట్ విచారణపై మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు హయాంలో విశాఖ భూముల మీద సిట్ విచారణ చేశాం. ఆ రిపోర్ట్ వచ్చే లోపు ఎన్నికలు వచ్చేశాయి. వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం వచ్చాక ఇంకో సిట్ వేశారు. మరి ఆ నివేదిక ఇవ్వలేదు. కాబట్టి, రెండు సిట్ నివేదికలు బయట పెట్టాలి.’’ అని అయ్యన్నపాత్రుడు డిమాండ్ చేశారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad News: మాల ధారణపై హైదరాబాద్‌ పోలీసుల ఆంక్షల వివాదం- డీజీపీ ఆఫీస్‌ ముట్టడికి స్వాముల యత్నం- స్వల్ప ఉద్రిక్తత
మాల ధారణపై హైదరాబాద్‌ పోలీసుల ఆంక్షల వివాదం- డీజీపీ ఆఫీస్‌ ముట్టడికి స్వాముల యత్నం- స్వల్ప ఉద్రిక్తత
AIతో ఆకలి తీర్చే సరికొత్త పరికరం! మంగుళూరు కుర్రాడి సంచలనం, మీ కోసం ఫుడ్ ఆర్డర్ చేసే టూల్
ఆకలేస్తే ఫుడ్ ఆర్డర్ పెడుతుంది! స్టెతస్కోప్ హెల్ప్‌తో అదిరిపోయే ఏఐ టూల్ క్రియేట్ చేసిన మంగుళూరు యువకుడు
Rahul Sipligunj Harinya Reddy : ఘనంగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ వివాహం - కొత్త జంటకు వెల్లువలా విషెష్
ఘనంగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ వివాహం - కొత్త జంటకు వెల్లువలా విషెష్
Karuppu OTT : సూర్య 'కరుప్పు' ఓటీటీ డీల్ ఫిక్స్ - రిలీజ్‌కు ముందే రికార్డు ధర?
సూర్య 'కరుప్పు' ఓటీటీ డీల్ ఫిక్స్ - రిలీజ్‌కు ముందే రికార్డు ధర?
Advertisement

వీడియోలు

Gambhir Comments on Head Coach Position | గంభీర్ సెన్సేషనల్ స్టేట్‌మెంట్
World Test Championship Points Table | టెస్టు ఛాంపియన్‌షిప్ లో భారత్ స్థానం ఇదే
Reason for Team India Failure | భారత్ ఓటమికి కారణాలు ఇవే !
Rohit Sharma First Place in ICC ODI Rankings | అగ్రస్థానంలో
South Africa whitewashed India | రెండో టెస్ట్ ఓడిపోయిన టీమ్ ఇండియా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad News: మాల ధారణపై హైదరాబాద్‌ పోలీసుల ఆంక్షల వివాదం- డీజీపీ ఆఫీస్‌ ముట్టడికి స్వాముల యత్నం- స్వల్ప ఉద్రిక్తత
మాల ధారణపై హైదరాబాద్‌ పోలీసుల ఆంక్షల వివాదం- డీజీపీ ఆఫీస్‌ ముట్టడికి స్వాముల యత్నం- స్వల్ప ఉద్రిక్తత
AIతో ఆకలి తీర్చే సరికొత్త పరికరం! మంగుళూరు కుర్రాడి సంచలనం, మీ కోసం ఫుడ్ ఆర్డర్ చేసే టూల్
ఆకలేస్తే ఫుడ్ ఆర్డర్ పెడుతుంది! స్టెతస్కోప్ హెల్ప్‌తో అదిరిపోయే ఏఐ టూల్ క్రియేట్ చేసిన మంగుళూరు యువకుడు
Rahul Sipligunj Harinya Reddy : ఘనంగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ వివాహం - కొత్త జంటకు వెల్లువలా విషెష్
ఘనంగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ వివాహం - కొత్త జంటకు వెల్లువలా విషెష్
Karuppu OTT : సూర్య 'కరుప్పు' ఓటీటీ డీల్ ఫిక్స్ - రిలీజ్‌కు ముందే రికార్డు ధర?
సూర్య 'కరుప్పు' ఓటీటీ డీల్ ఫిక్స్ - రిలీజ్‌కు ముందే రికార్డు ధర?
Bigg Boss Telugu Day 81 Promo : బాయ్ ఫ్రెండ్ లేడని చెప్పిన తనూజ, ఎత్తుకుని తిప్పేసిన యావర్.. ఫ్లర్ట్ చేస్తూనే ఉన్నాడుగా
బాయ్ ఫ్రెండ్ లేడని చెప్పిన తనూజ, ఎత్తుకుని తిప్పేసిన యావర్.. ఫ్లర్ట్ చేస్తూనే ఉన్నాడుగా
Mahindra XEV 9S: భారత్ మార్కెట్‌లోకి వచ్చిన మహీంద్రా XEV 9S; 679 కిలోమీటర్ల రేంజ్‌, 202 kmph వేగంతో వెళ్లే బైక్‌ ధర ఎంత?
భారత్ మార్కెట్‌లోకి వచ్చిన మహీంద్రా XEV 9S; 679 కిలోమీటర్ల రేంజ్‌, 202 kmph వేగంతో వెళ్లే బైక్‌ ధర ఎంత?
Venkateswara Swamy Temple : అమరావతిలోని వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణకు శంకుస్థాపన- రెండేళ్లలో పూర్తి చేస్తామని హామీ 
అమరావతిలోని వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణకు శంకుస్థాపన- రెండేళ్లలో పూర్తి చేస్తామని హామీ 
తెలంగాణ పంచాయతీ ఎన్నికల సమరం: కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రత్యేక వ్యూహాలు..గ్రామాల్లో విజయం ఎవరిదో?
తెలంగాణ పంచాయతీ ఎన్నికల సమరం: కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రత్యేక వ్యూహాలు..గ్రామాల్లో విజయం ఎవరిదో?
Embed widget