అన్వేషించండి

Ayyannapatrudu: గుడివాడ అమర్ సవాల్‌కు అయ్యన్నపాత్రుడు ఓకే, మంత్రికి మరో ఛాలెంజ్ విసిరిన టీడీపీ నేత

అమరావతి భూములు దోచుకున్నామని టీడీపీ నేతలపై నిందలు వేయడం తగదని అయ్యన్నపాత్రుడు అన్నారు. అమరావతి భూములు, విశాఖ భూములపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల అంశంపై పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్‌నాథ్ విసిరిన సవాలుకు టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు అంగీకరించారు. మూడు రాజధానులపై ప్రజాభిప్రాయానికి తాను సిద్ధమని స్పష్టం చేశారు. దమ్ము ఉంటే తక్షణమే అసెంబ్లీని రద్దు చేయాలని, మూడు రాజధానులే అజెండాగా ఎన్నికలకు వెళ్దామని అన్నారు. అమరావతి భూములు దోచుకున్నామని టీడీపీ నేతలపై నిందలు వేయడం తగదని అన్నారు. అమరావతి భూములు, విశాఖ భూములపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దమ్ముంటే ఇప్పుడు తాను విసిరిన సవాల్ ను స్వీకరించాలని అయ్యన్నపాత్రుడు సవాల్ విసిరారు.

ఎంపీ విజయసాయి రెడ్డి లక్ష్యంగా కూడా అయ్యన్న పాత్రుడు ఆరోపణలు చేశారు. ‘‘విజయ సాయి రెడ్డి రూ.పది వేల కోట్లు ఆస్తులు అక్రమించుకున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వృద్దుల కోసం ఇచ్చిన స్థలం కూడా లాక్కున్నారు.’’ అని ఆరోపించారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన, సిదిరి అప్పలరాజు అతిగా మాట్లాడుతున్నారని విమర్శించారు. మంత్రి గుడివాడ అమర్ నాథ్ ఆయన తండ్రి ఆశీస్సులతో మంత్రి అయ్యారని, గౌరవంగా వ్యవహరించాలని హితవు పలికారు. మాటలు జాగ్రత్తగా రావాలని అన్నారు. అమరావతి రైతులు పాదయాత్ర చేస్తుంటే దయ్యాలు అని అంటున్నారని విమర్శించారు.

కాలేజీల ప్రతిపాదన ఏది?
పరిశ్రమల మంత్రి అయ్యాక రాష్ట్రానికి ఎన్ని కంపెనీలు తెచ్చారో చెప్పాలి. సీఎం జగన్ చట్ట సభల్లో అబద్ధాలు చెబుతున్నారు. రేపు ఎన్నికల్లో యువత వైఎస్ఆర్ సీపీ మీద తిరగపడతారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయాల్సిన 16 మెడికల్ కాలేజీలకు ప్రతిపాదనలు పంపలేదని కేంద్రం నుంచి లెటర్ వచ్చింది. ఏడు కాలేజ్ లకు మాత్రమే ప్రతిపాదన పంపారు. కానీ, కేంద్రం మూడు మాత్రమే అంగీకరించింది. అసెంబ్లీలో వైద్యశాఖ మంత్రి 16 కాలేజ్ లు వస్తున్నాయని చెప్తున్నారు. ప్రతి మెడికల్ కాలేజ్ కి రూ.340 కోట్లు అంచనా వేశారు. మెడికల్ కాలేజ్ కి రాష్ట్ర వాటా అస్సలు ఇవ్వలేదు.

నర్సీపట్నం మెడికల్ కాలేజ్ అన్నారు. అసలు ప్రతిపాదనలో నర్సీపట్నం పేరు లేకుండా జాయింట్ కలెక్టర్ భూ సేకరణ చేశారు. మెడికల్ కాలేజ్ రాకపోతే ఈ భూములు రియల్ ఎస్టేట్ చేసుకుంటారు. దీనికి వైద్య శాఖ మంత్రి విడుదల రజని సమాధానం చెప్పాలి. ఉదయం సాయంత్రం రెండు గంటలు మేక్ అప్ వేసుకోవడానికే ఆమెకు సమయం సరిపోతోంది. జిల్లా మంత్రి అమర్ దీనికి సమాధానం చెప్పాలి.

అమరావతి రైతులు యాత్రపై మాట్లాడుతూ.. ‘‘అరసవెల్లి దేవుడ్ని చూడటానికి అమర్ నాథ్ అనుమతి కోరాలా? భూములు ఇచ్చిన రైతులను దొంగలా చూస్తున్నారు. అలాగే విజయవాడ, తిరుపతి వెళ్తే అక్కడ వాళ్ళు అనుమతి ఇవ్వమంటే ఏం చేస్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం, గంగవరం పోర్ట్ అదానీకి అమ్మేస్తే మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎందుకు మాట్లాడలేదు. రైతులు వస్తే వారికి పాదాభివందనం చెయ్యాలి. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు వాళ్ళు.

ఉత్తరాంధ్రలో రైతుల పాదయాత్ర జరిపిస్తాం. వారికి అండగా నిలుస్తాం. ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రజలు అందరు రైతుల యాత్రను స్వాగతించాలి. అమరావతి రైతులు తిరుపతి యాత్ర చేశారు. అప్పుడు ఏ శాంతి భద్రతల విఘాతం ఏర్పడలేదు. అంటే ఈ రాష్ట్రంలో తిరగాలి అంటే వీసా, వైసీపీ వారి అనుమతి అవసరమా? మొదటి రోజు నుంచి అన్ని అబ్బదాలు అడుతున్నారు. రాజధానికి రూ.లక్ష కోట్లు అవుతాయని సీఎం జగన్ కి తెలియదా?’’

బోర్డులు పెట్టాలి
‘‘అమరావతి భూముల్లో చంద్రబాబు దోచుకున్నారు అని ఆరోపిస్తున్నారు. అధికారం ఉంది కాబట్టి, దానిపైనా విచారణ చేసుకొచ్చు. ఇంతకు ముందు వేసిన విచారణలు కోర్టులు కొట్టేసాయి. రుషికొండ లో కడుతున్న నిర్మాణాలు గురుంచి ఎందుకు కనీసం బోర్డ్ పెట్టలేదు. చట్ట ప్రకారం నిర్మాణాల వివరాలు పెట్టాలి’’ అని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు.

విశాఖ భూములు సిట్ విచారణపై మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు హయాంలో విశాఖ భూముల మీద సిట్ విచారణ చేశాం. ఆ రిపోర్ట్ వచ్చే లోపు ఎన్నికలు వచ్చేశాయి. వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం వచ్చాక ఇంకో సిట్ వేశారు. మరి ఆ నివేదిక ఇవ్వలేదు. కాబట్టి, రెండు సిట్ నివేదికలు బయట పెట్టాలి.’’ అని అయ్యన్నపాత్రుడు డిమాండ్ చేశారు.

టాప్ హెడ్ లైన్స్

Top MBBS Colleges: ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
PV Sindhu Sports Academy Visakhapatnam: విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి రెండోసారి శంకుస్థాపన జరిగిందా? 
విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి రెండోసారి శంకుస్థాపన జరిగిందా?
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
Embed widget