అన్వేషించండి

TTD: 'సోషల్ మీడియాలో ఆ తప్పుడు ప్రచారం నమ్మొద్దు' - భక్తులకు టీటీడీ విజ్ఞప్తి

Andhrapradesh News: తిరుమలలో సీనియర్ సిటిజన్లకు శ్రీవారి దర్శనంపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది. అధికారిక వెబ్ సైట్ మాత్రమే చూడాలని తెలిపింది.

TTD Request To Devotees: తిరుమలలో (Tirumala) సీనియర్ సిటిజన్లకు (Senior Citizens) స్వామి వారి దర్శనంపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది. ప్రతి రోజూ వెయ్యి మంది వృద్ధులు, దివ్యాంగులకు వెంకటేశుని దర్శన భాగ్యం కల్పిస్తున్నట్లు తెలిపింది. 3 నెలల ముందే ఆన్ లైన్‌లో టికెట్ల కోటాను రిలీజ్ చేస్తామని.. ప్రతి నెలా 23వ తేదీన సీనియర్ సిటిజన్లకు దర్శనాలకు సంబంధించి టికెట్లను జారీ చేస్తామని స్పష్టం చేసింది. వారిని తిరుమల నంబి ఆలయానికి ఆనుకుని ఉన్న సీనియర్ సిటిజన్/పీహెచ్సీ లైన్ ద్వారా రోజూ మధ్యాహ్నం 3 గంటలకు స్వామి వారి దర్శనానికి అనుమతిస్తామని పేర్కొంది. స్వామి వారి దర్శనాలు, గదుల కేటాయింపు, ఇతర సేవలకు సంబంధించి సరైన సమాచారం కోసం భక్తులు టీటీడీ అధికారిక వెబ్ సైట్ మాత్రమే సందర్శించాలని టీటీడీ అధికారులు సూచించారు.

రెండుసార్లు గరుడ సేవ

తిరుమల శ్రీవారికి ఈ నెలలో రెండుసార్లు గరుడవాహన సేవ జరగనుంది. ఈ నెల 9న గరుడ పంచమి 19న శ్రావణ పౌర్ణమి పర్వదినాల సందర్భంగా స్వామి వారు గరుడ వాహనంపై నాలుగు మాఢ వీధుల్లో విహరించి భక్తులకు అభయమివ్వనున్నారు. గరుడ పంచమి రోజున శ్రీ మలయప్పస్వామి వారు రాత్రి 7 నుంచి 9 గంటల వరకు ఇష్టవాహనమైన గరుడునిపై అధిరోహించి భక్తులను అనుగ్రహించనున్నారు. ప్రతి ఏడాది గరుడ పంచమిని శుక్ల పక్షమి 5వ రోజున టీటీడీ ఘనంగా నిర్వహిస్తోంది. 

అక్టోబర్‌లో వార్షిక బ్రహ్మోత్సవాలు

మరోవైపు, శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను అక్టోబరులో ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా అక్టోబర్ 4న ధ్వజారోహణం, 8న గరుడసేవ, 9న స్వర్ణరథం, 11న రథోత్సవం, 12న చక్రస్నానం కార్యక్రమాలు నిర్వహిస్తారు. శ్రీవారి వాహన సేవలు ప్రతి రోజు ఉదయం 8 గంటలకు, సాయంత్రం 7 గంటలకు ప్రారంభించనున్నట్లు టీటీడీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. సాధారణంగా గరుడ సేవ రోజున భక్తుల రద్దీ ఎక్కువగా ఉండనున్న క్రమంలో అక్టోబర్ 7న రాత్రి 11 గంటల నుంచి అక్టోబర్ 8న అర్ధరాత్రి వరకు ద్విచక్ర వాహనాల రాకపోకలపై నిషేధం అమలు చేయనున్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో ఎన్‌ఆర్‌ఐలు, వయో వృద్ధులు, వికలాంగులు, చిన్న పిల్లల తల్లిదండ్రులతో సహా అన్ని ఆర్జిత సేవలు, శ్రీవారి ప్రత్యేక దర్శనాలు రద్దు చేయనుంది.

అన్నదానం ట్రస్టుకు రూ.కోటి విరాళం

శ్రీవారి అన్న ప్రసాదం ట్రస్టుకు హైదరాబాద్‌కు చెందిన సుమధుర గ్రూప్ సీఎండీ మధుసూదన్ రూ.కోటి విరాళం అందించారు. ఈ మేరకు విరాళానికి సంబంధించిన డీడీని గోకులం అతిథి భవనంలో టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు భరత్ కుమార్, నవీన్ కుమార్, శ్రీనివాస్ పాల్గొన్నారు. 

అటు, తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామి వారి దర్శనం కోసం 11 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వ దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. శనివారం శ్రీవారిని 75,140 మంది భక్తులు దర్శించుకోగా.. 28,256 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామి వారి హుండీ ఆదాయం రూ.3.76 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

Also Read: AP Capital Donations: అమరావతి కోసం రెండు బంగారు గాజులు విరాళంగా ఇచ్చిన విజయవాడకు చెందిన వృద్ధురాలు

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs Nz 3rd ODI: ఒక మార్పుతో బరిలోకి దిగిన గిల్ సేన.. ఇండోర్‌లో తమ రికార్డు కాపాడుకుంటుందా?
ఒక మార్పుతో బరిలోకి దిగిన గిల్ సేన.. ఇండోర్‌లో తమ రికార్డు కాపాడుకుంటుందా?
AR Rahman Vs Kangana Ranaut: ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం

వీడియోలు

Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్
Vande Bharat Sleeper Train Started | పచ్చ జెండా ఊపి వందేభారత్ స్లీపర్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ | ABP Desam
WPL 2026 RCB vs GG Highlights | హ్యాట్రిక్ కొట్టిన బెంగళూరు!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Nz 3rd ODI: ఒక మార్పుతో బరిలోకి దిగిన గిల్ సేన.. ఇండోర్‌లో తమ రికార్డు కాపాడుకుంటుందా?
ఒక మార్పుతో బరిలోకి దిగిన గిల్ సేన.. ఇండోర్‌లో తమ రికార్డు కాపాడుకుంటుందా?
AR Rahman Vs Kangana Ranaut: ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Rafale Fighter Jets: భారత్‌లో తయారుకానున్న రాఫెల్ ఫైటర్ జెట్స్.. విదేశాలకు ఎగుమతితో ఎలైట్ క్లబ్‌లోకి
భారత్‌లో తయారుకానున్న రాఫెల్ ఫైటర్ జెట్స్.. విదేశాలకు ఎగుమతితో ఎలైట్ క్లబ్‌లోకి
Shefali Jariwala Death Reason: చేతబడి వల్లే నా భార్య మరణించింది... అజ్ఞాతవాసి, సర్కారు వారి పాట విలన్
చేతబడి వల్లే నా భార్య మరణించింది... అజ్ఞాతవాసి, సర్కారు వారి పాట విలన్
IND vs NZ 3rd ODI: కీలకమైన మూడో వన్డేలో పరుగుల వర్షమే.. పిచ్ రిపోర్ట్, IND vs NZ ప్లేయింగ్ XI అంచనా
కీలకమైన మూడో వన్డేలో పరుగుల వర్షమే.. పిచ్ రిపోర్ట్, IND vs NZ ప్లేయింగ్ XI అంచనా
CM Revanth Reddy: ఖమ్మంలో కీలక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
ఖమ్మంలో కీలక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
Embed widget