అన్వేషించండి

TTD: 'సోషల్ మీడియాలో ఆ తప్పుడు ప్రచారం నమ్మొద్దు' - భక్తులకు టీటీడీ విజ్ఞప్తి

Andhrapradesh News: తిరుమలలో సీనియర్ సిటిజన్లకు శ్రీవారి దర్శనంపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది. అధికారిక వెబ్ సైట్ మాత్రమే చూడాలని తెలిపింది.

TTD Request To Devotees: తిరుమలలో (Tirumala) సీనియర్ సిటిజన్లకు (Senior Citizens) స్వామి వారి దర్శనంపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది. ప్రతి రోజూ వెయ్యి మంది వృద్ధులు, దివ్యాంగులకు వెంకటేశుని దర్శన భాగ్యం కల్పిస్తున్నట్లు తెలిపింది. 3 నెలల ముందే ఆన్ లైన్‌లో టికెట్ల కోటాను రిలీజ్ చేస్తామని.. ప్రతి నెలా 23వ తేదీన సీనియర్ సిటిజన్లకు దర్శనాలకు సంబంధించి టికెట్లను జారీ చేస్తామని స్పష్టం చేసింది. వారిని తిరుమల నంబి ఆలయానికి ఆనుకుని ఉన్న సీనియర్ సిటిజన్/పీహెచ్సీ లైన్ ద్వారా రోజూ మధ్యాహ్నం 3 గంటలకు స్వామి వారి దర్శనానికి అనుమతిస్తామని పేర్కొంది. స్వామి వారి దర్శనాలు, గదుల కేటాయింపు, ఇతర సేవలకు సంబంధించి సరైన సమాచారం కోసం భక్తులు టీటీడీ అధికారిక వెబ్ సైట్ మాత్రమే సందర్శించాలని టీటీడీ అధికారులు సూచించారు.

రెండుసార్లు గరుడ సేవ

తిరుమల శ్రీవారికి ఈ నెలలో రెండుసార్లు గరుడవాహన సేవ జరగనుంది. ఈ నెల 9న గరుడ పంచమి 19న శ్రావణ పౌర్ణమి పర్వదినాల సందర్భంగా స్వామి వారు గరుడ వాహనంపై నాలుగు మాఢ వీధుల్లో విహరించి భక్తులకు అభయమివ్వనున్నారు. గరుడ పంచమి రోజున శ్రీ మలయప్పస్వామి వారు రాత్రి 7 నుంచి 9 గంటల వరకు ఇష్టవాహనమైన గరుడునిపై అధిరోహించి భక్తులను అనుగ్రహించనున్నారు. ప్రతి ఏడాది గరుడ పంచమిని శుక్ల పక్షమి 5వ రోజున టీటీడీ ఘనంగా నిర్వహిస్తోంది. 

అక్టోబర్‌లో వార్షిక బ్రహ్మోత్సవాలు

మరోవైపు, శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను అక్టోబరులో ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా అక్టోబర్ 4న ధ్వజారోహణం, 8న గరుడసేవ, 9న స్వర్ణరథం, 11న రథోత్సవం, 12న చక్రస్నానం కార్యక్రమాలు నిర్వహిస్తారు. శ్రీవారి వాహన సేవలు ప్రతి రోజు ఉదయం 8 గంటలకు, సాయంత్రం 7 గంటలకు ప్రారంభించనున్నట్లు టీటీడీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. సాధారణంగా గరుడ సేవ రోజున భక్తుల రద్దీ ఎక్కువగా ఉండనున్న క్రమంలో అక్టోబర్ 7న రాత్రి 11 గంటల నుంచి అక్టోబర్ 8న అర్ధరాత్రి వరకు ద్విచక్ర వాహనాల రాకపోకలపై నిషేధం అమలు చేయనున్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో ఎన్‌ఆర్‌ఐలు, వయో వృద్ధులు, వికలాంగులు, చిన్న పిల్లల తల్లిదండ్రులతో సహా అన్ని ఆర్జిత సేవలు, శ్రీవారి ప్రత్యేక దర్శనాలు రద్దు చేయనుంది.

అన్నదానం ట్రస్టుకు రూ.కోటి విరాళం

శ్రీవారి అన్న ప్రసాదం ట్రస్టుకు హైదరాబాద్‌కు చెందిన సుమధుర గ్రూప్ సీఎండీ మధుసూదన్ రూ.కోటి విరాళం అందించారు. ఈ మేరకు విరాళానికి సంబంధించిన డీడీని గోకులం అతిథి భవనంలో టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు భరత్ కుమార్, నవీన్ కుమార్, శ్రీనివాస్ పాల్గొన్నారు. 

అటు, తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామి వారి దర్శనం కోసం 11 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వ దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. శనివారం శ్రీవారిని 75,140 మంది భక్తులు దర్శించుకోగా.. 28,256 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామి వారి హుండీ ఆదాయం రూ.3.76 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

Also Read: AP Capital Donations: అమరావతి కోసం రెండు బంగారు గాజులు విరాళంగా ఇచ్చిన విజయవాడకు చెందిన వృద్ధురాలు

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Breaking News: నల్లచెరువు పునరుద్ధరణపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
నల్లచెరువు పునరుద్ధరణపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
AP JAC Demand: ఏపీ ప్రభుత్వంపై ఉద్యోగుల ఆగ్రహం - పీఆర్‌సీ, ఐఆర్‌కై ఏపీ జేఏసీ ఉద్యమ శంఖారావం - సచివాలయంలో నిరసనలకు రెడీ
ఏపీ ప్రభుత్వంపై ఉద్యోగుల ఆగ్రహం - పీఆర్‌సీ, ఐఆర్‌కై ఏపీ జేఏసీ ఉద్యమ శంఖారావం - సచివాలయంలో నిరసనలకు రెడీ
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Secret Soldier : చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
ప్రపంచవ్యాప్తంగా కేవలం 100 బైక్‌లే.. రాయల్ ఎన్‌ఫీల్డ్ లిమిటెడ్ ఎడిషన్‌కు అతి భారీ డిమాండ్
కేవలం 3 నిమిషాల్లోనే అమ్ముడైన రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 X రఫ్ క్రాఫ్ట్స్ - ఏంటి దీని స్పెషాలిటీ?
Embed widget