అన్వేషించండి

Tirumala: తిరుమలలో స్మార్ట్ సౌకర్యం - చెప్పుల ట్రాకింగ్ వ్యవస్థకు భక్తుల ప్రశంసలు

Sandal tracking system: తిరుమలకు వెళ్లిన భక్తులు.. చాలా మంది దర్శనానికి వెళ్లేటప్పుడు.. అన్న ప్రసాదానికి వెళ్లేటప్పుడు చెప్పులను ఎక్కడ ఉంచాలో తెలియక ఇబ్బందిపడేవారు. ఈ సమస్యను స్మార్ట్ గా పరిష్కరించారు

Tirumala Devotees praise the sandal tracking system:  ఏడుకొండల వాడి చెంతకు వచ్చే భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన  QR కోడ్ ఆధారిత పాదరక్షల ట్రాకింగ్  అండ్ మేనేజ్‌మెంట్ వ్యవస్థ  అద్భుత ఫలితాలను ఇస్తోంది. గత ఆరు నెలల్లోనే సుమారు  8.45 లక్షలకు పైగా పాదరక్షల లావాదేవీలను ఈ విధానం ద్వారా సమర్థవంతంగా నిర్వహించారు. భక్తులు తమ పాదరక్షలను భద్రపరుచుకోవడంలో గతంలో ఎదుర్కొన్న గందరగోళానికి ఈ ఆధునిక సాంకేతికత చెక్ పెట్టింది.

ఆరు నెలల్లో 8.45 లక్షల లావాదేవీలు

2025 సెప్టెంబర్ నుండి 2026 ఫిబ్రవరి 15 వరకు ఈ స్మార్ట్ విధానం ద్వారా మొత్తం  4,24,047 పాదరక్షలను భక్తులు దర్శనానికి వెళ్తూ భద్ర పరుచుకోగా.. అందులో **4,21,769 జతలను** అత్యంత సురక్షితంగా తిరిగి అందజేశారు. అంటే సేకరించిన వాటిలో దాదాపు 99 శాతం విజయవంతంగా పంపిణీ కావడం ఈ వ్యవస్థ పనితీరుకు అద్దం పడుతోంది. కేవలం ఫిబ్రవరి మొదటి 15 రోజుల్లోనే 1.35 లక్షల లావాదేవీలు జరగడం ఈ వ్యవస్థ పట్ల భక్తులకున్న నమ్మకాన్ని తెలియజేస్తోంది.

 ప్రధాన కేంద్రాల్లో రికార్డు స్థాయి నిర్వహణ

తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్లలో  పీఏసీ-5  కేంద్రం అత్యధికంగా 1.38 లక్షల పాదరక్షల నిర్వహణతో అగ్రస్థానంలో నిలిచింది. రామ్ భగీచా వద్ద 76,556,  కృష్ణ తేజ సర్కిల్  వద్ద  56,019, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం వద్ద 55,238,  వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద  53,250,  ఏటీజీహెచ్ వద్ద  44,714 జతల చెప్పులను భక్తులకు సురక్షితంగా అందచేశారు. పై కేంద్రాల్లో పాదరక్షలు తప్పిపోయే అవకాశం లేకుండా టెక్నాలజీ సాయంతో భక్తులకు వేగంగా సేవలు అందుతున్నాయి.

అదనపు ఈవో చొరవ.. కోరమాండల్ సహకారం

గతంలో రద్దీ ప్రాంతాల్లో పాదరక్షలు అస్తవ్యస్తంగా పడి ఉండటం వల్ల భక్తులు పడే ఇబ్బందులను గమనించిన  టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి ఈ వినూత్న పరిష్కారానికి శ్రీకారం చుట్టారు. కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ సహకారంతో, డిప్యూటీ ఈవో శ్రీ సోమన్నారాయణ పర్యవేక్షణలో ఈ ప్రాజెక్ట్ భక్తులకు చేరువైంది. భక్తుల నుంచి ఈ విధానంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతుండటంతో, త్వరలో కల్యాణకట్ట, బేడి ఆంజనేయస్వామి ఆలయం, ఏటీసీ సర్కిల్ వద్ద మరో మూడు నూతన కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

 మాడ వీధుల్లో నిషిద్ధం.. భక్తులకు విజ్ఞప్తి

శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీధులు అత్యంత పవిత్రమైనవని, అక్కడ నిత్యం స్వామి వారు విహరిస్తుంటారు కాబట్టి పాదరక్షలు ధరించడం నిషిద్ధమని టీటీడీ గుర్తు చేసింది. భక్తులు తమ పాదరక్షలను నిర్ణీత కౌంటర్లలో ఈ స్మార్ట్ పద్ధతి ద్వారా డిపాజిట్ చేసి, దర్శనం అనంతరం సులభంగా పొందాలని కోరింది. ఈ 'స్మార్ట్ షూ కీపింగ్' విధానం తిరుమలలో పరిశుభ్రతను పెంచడమే కాకుండా, సామాన్య భక్తులకు ఆహ్లాదకరమైన దర్శన అనుభూతిని కలిగిస్తోంది.                                               

టాప్ హెడ్ లైన్స్

Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
Tirumala News: శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget