అన్వేషించండి

Parakamani Case : "పరకామణి కేసులో జైలులో పెట్టినా కుట్రలు బయటకు వస్తాయి" వైసీపీ నేత కరుణాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Parakamani Case : పరకామణి కేసులో తాము ఎలాంటి తప్పు చేయలేదని టీటీడీ మాజీ ఛైర్మన్ కరుణాకర్‌రెడ్డి కామెంట్ చేశారు. ప్రభుత్వం చేసిన కుట్రలు కచ్చితంగా వెలుగులోకి వస్తాయని అన్నారు.

Parakamani Case : పరకామణి కేసులో నేడు సిబిఐ విచారణకు టిటిడి మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి హాజరయ్యారు . మధ్యాహ్నం మూడున్నర గంటల నుంచి దాదాపు అరగంట పాటు విచారించారు అధికారులు. పరకామణి చోరీ కేసులో అధికారులకు వచ్చిన అనుమానాలపై రకరకాల ప్రశ్నలు అడిగారు. విచారణ అనంతరం బయటకు వచ్చిన కరుణాకర్రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

దాదాపు అరగంట పాటు పరకాణి కేసులో విచారణ ఎదుర్కొన్న కరుణాకర్రెడ్డి, తర్వాత మీడియాతో మాట్లాడుతూ... తిరుమల తిరుపతి దేవస్థానంపై మాట్లాడుతున్నందునే ప్రభుత్వానికి, టీటీడీ వాళ్లకు సమస్యగా మారిందని ఆరోపించారు. తను మాట్లాడిన విషయాలు ప్రభుత్వానికి ఇబ్బంది కలిగిస్తున్నందున కక్ష పెట్టుకున్నారని మండిపడ్డారు. అందుకే తనను పరకాణి కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగా చాలా కాలం నుంచి పద్ధతి ప్రకారం తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. "నాకు ఆ కేసుకు ఏ రకమైనటువంటి సంబంధం లేకపోయినా ఆ జరిగినటువంటి వ్యవహారంలో నేను అధ్యక్షుడిగా ఉండకపోయినా నేనే అధ్యక్షుడిగా ఉండి చేశానని ఒకసారి లేదా నేనే ఒత్తిడి పెట్టాను రవికుమార్తో రాజీ చేయించినట్టు ఎలా పడితే అలా నా మీద మాట్లాడుతున్నారు. కరుణాకర్ రెడ్డి దొరికిపోయారని దొంగ అని ముఖ్యమంత్రి కుమారుడు నారా లోకేష్ మాట్లాడితే సమాధానం ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది.

ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారానికి భయపడి లొంగిపోయే రకం తాము కాదని కరుణాకర్రెడ్డి అన్నారు. ఇప్పటి వరకు తప్పు చేయలేదని ఇకపై కూడా తప్పులు చేయబోమని అన్నారు. " బిఆర్ నాయుడు లాంటి పనికిమాలిన వ్యక్తిని టీటీడీ అధ్యక్షుడిగా చంద్రబాబు ఎంపిక చేసినప్పుడే తిరుమల తిరుపతి దేవస్థానాల మీద నమ్మకం లేదని అర్థమైంది. ఏమాత్రం మంచి చేయాలనే ఆలోచన లేదు.ఛానల్ ద్వారా బెదిరించి డబ్బులు వసూళ్లు చేసిన తనకు మద్దతుగా నిలిచారనే పెద్ద ఆధ్యాత్మిక క్షేత్రానికి అధ్యక్షునిగా నియమించినప్పుడే తిరుమల తిరుపతి దేవస్థానాల ప్రతిష్ట మంటకలిపారు. ఇది అందరికీ అర్థమైంది." అని తీవ్ర ఆరోపణలు చేశారు.

"పరకామాణిలో చోరీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విజిలెన్స్ ఎంక్వయిరీ వేసింది. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో అక్కడ ఏం జరగలేదనే తేలింది. ఇదే విషయాన్ని చంద్రబాబు పతిక్రా సమావేశంలో చెప్పారు. విచారణ సరిగ్గా చేయండి న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు అనుసరించి మళ్లీ విచారణ చేస్తున్నారు. ఈసారి తాము దొరికామనే విషయాన్ని పదే పదే ప్రచారం చేస్తున్నారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ నుంచి ప్రతి ఒక్కరూ మమ్మల్ని బ్రష్టు పట్టిస్తున్నారు. వారి మాటల ద్వారా మీడియాలో కూడా దుష్ప్రచారం చేస్తున్నారు. చేయని తప్పునకు దోషుల్ని చేసి జైలుకు పంపించినా మీరు సంతృప్తిపడవచ్చు ఏమో కానీ, నిజం బయటికి రాకుండా పోదు." అని అన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh: ఉగాది కానుక.. ఏపీలో 2.5 లక్షల ఇండ్లు పంపిణీ- సూళ్లూరుపేటలో శ్రీకారం చుట్టనున్న సీఎం చంద్రబాబు
ఉగాది కానుక.. ఏపీలో 2.5 లక్షల ఇండ్లు పంపిణీ- సూళ్లూరుపేటలో పాల్గొనున్న సీఎం చంద్రబాబు
AP Capital Amaravati: ఏపీ రాజధాని అమరావతిపై చట్ట సవరణ! ట్రెండ్‌ సెట్ చేస్తున్న తీర్మానంపై సమగ్ర విశ్లేషణ!
ఏపీ రాజధాని అమరావతిపై చట్ట సవరణ! ట్రెండ్‌ సెట్ చేస్తున్న తీర్మానంపై సమగ్ర విశ్లేషణ!
Amaravati: ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధానిగా అమరావతి! అసెంబ్లీలో శాశ్వత చట్టబద్ధత తీర్మానం!
ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధానిగా అమరావతి! అసెంబ్లీలో శాశ్వత చట్టబద్ధత తీర్మానం!
Amaravati: ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతికి శాశ్వత చట్టబద్ధత! అసెంబ్లీలో చారిత్రాత్మక తీర్మానం,కేంద్ర చట్ట సవరణ దిశగా రాష్ట్ర కీలక అడుగు!
ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతికి శాశ్వత చట్టబద్ధత! అసెంబ్లీలో చారిత్రాత్మక తీర్మానం,కేంద్ర చట్ట సవరణ దిశగా రాష్ట్ర కీలక అడుగు!

వీడియోలు

కోహ్లీ భాయ్ సెట్ అయితే అంతే ఓటమికి గల కారణాలు చెప్పిన ఇషాన్
IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Gold Man: హైదరాబాద్ గోల్డ్ మ్యాన్ గుట్టురట్టు.. మెరిసేదంతా రోల్డ్ గోల్డ్ అని తేల్చిన ఐటీ అధికారులు
హైదరాబాద్ గోల్డ్ మ్యాన్ గుట్టురట్టు.. మెరిసేదంతా రోల్డ్ గోల్డ్ అని తేల్చిన ఐటీ అధికారులు
YSRCP Family Politics: కుటుంబ వివాదాలతో రాజకీయం - జగన్ వ్యూహాత్మక తప్పిదం - ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయా?
కుటుంబ వివాదాలతో రాజకీయం - జగన్ వ్యూహాత్మక తప్పిదం - ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయా?
MLA Rajgopal Reddy: నిధులన్నీ సీఎం, మంత్రుల నియోజకవర్గాలకే! ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అసహనం
నిధులన్నీ సీఎం, మంత్రుల నియోజకవర్గాలకే! ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అసహనం
Andhra Pradesh: ఉగాది కానుక.. ఏపీలో 2.5 లక్షల ఇండ్లు పంపిణీ- సూళ్లూరుపేటలో శ్రీకారం చుట్టనున్న సీఎం చంద్రబాబు
ఉగాది కానుక.. ఏపీలో 2.5 లక్షల ఇండ్లు పంపిణీ- సూళ్లూరుపేటలో పాల్గొనున్న సీఎం చంద్రబాబు
MK Stalin DMK Manifesto: మహిళలు, వృద్ధులకు నెలకు 2000, ఉచిత విద్యుత్, ల్యాప్‌టాప్.. DMK మేనిఫెస్టో విడుదల
మహిళలు, వృద్ధులకు నెలకు 2000, ఉచిత విద్యుత్, ల్యాప్‌టాప్.. DMK మేనిఫెస్టో విడుదల
Visakhapatnam Crime News: భార్యలేని టైంలో యువతిని ఇంటికి పిలిచి హత్య, ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో.. విశాఖలో దారుణం
భార్యలేని టైంలో యువతిని ఇంటికి పిలిచి హత్య, ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో.. విశాఖలో దారుణం
IPL 2026 MI Vs KKR Result Update: ముంబై రికార్డు ఛేజింగ్.. స‌త్తా చాటిన రికెల్ట‌న్, రోహిత్.. 14 ఏళ్ల త‌ర్వాత తొలి మ్యాచ్ లో MI గెలుపు
ముంబై రికార్డు ఛేజింగ్.. స‌త్తా చాటిన రికెల్ట‌న్, రోహిత్.. 14 ఏళ్ల త‌ర్వాత తొలి మ్యాచ్ లో MI గెలుపు
Parents Protection Bill: తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం.. ప్రజా ప్రతినిధులకు సైతం వర్తింపు
తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం.. ప్రజా ప్రతినిధులకు సైతం వర్తింపు
Embed widget