అన్వేషించండి

Tirumala News: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి 12 గంటలు సమయం

Devotees Increased In Tirumala : తిరుపతి వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. సోమవారం 21 కంపార్ట్‌మెంట్లలో దర్శనానికి నిరీక్షిస్తున్నారు.

Crowd Of Devotees Increased In Tirupati: తిరుపతి వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తుల సంఖ్య గడిచిన వారం రోజులు నుంచి భారీగా పెరిగింది. ప్రతిరోజూ 50 వేల మంది నుంచి 70 వేల మంది భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. దేశ, విదేశాల నుంచి వేలాది మంది భక్తులు స్వామి వారి దర్శనానికి వస్తుండడంతో కొండపై రద్దీ నెలకొంది. ఎక్కడ చూసినా వందలాది మంది భక్తులు కనిపిస్తున్నారు. ప్రత్యేక గదులు ఖాళీ లేకపోవడంతో బయటే పలు ప్రాంతాల్లో భక్తులు సేద తీరుతున్నారు. సోమవారం ఉదయం నాటికి భక్తులు 21 కంపార్ట్‌మెంట్లలో దర్శనానికి నిరీక్షిస్తున్నారు. స్వామిని దర్శించుకునేందుకు 12 గంటలు సమయం పడుతోంది. కంపార్ట్‌మెంట్లలో ఉన్న భక్తులకు అవసరమైన ఏర్పాట్లు టీటీడీ అధికారులు చేశారు. మంచి నీళ్లు, మజ్జిగ, చిన్నారులకు పాలు వంటివి పంపిణీ చేస్తున్నట్టు టీటీడీ అధికారులు వెల్లడించారు. 

భారీగా సమకూరిన ఆదాయం

గత పది రోజులు నుంచి వెంకన్న స్వామిని దర్శించుకునే వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. భక్తులు సమర్పిస్తున్న కానుకలు భారీగానే ఉండడంతో హుండీ ఆదాయం పెరిగింది. ఆదివారం ఒక్కరోజే స్వామి వారిని 72,256 మంది భక్తులు దర్శించుకోగా, వీరు సమర్పించిన కానుకలు ద్వారా రూ.3.04 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. వీరిలో 28,021 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. గడిచిన పది రోజుల్లో 70 వేల మందికిపైగా భక్తులు దర్శించుకోవడం ఇది ఐదో రోజుగా అధికారులు చెబుతున్నారు. శని, ఆదివారాల్లో వరుస సెలవులు రావడంతో అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. 

భక్తుల నిరీక్షణ

స్వామి వారి దర్శనానికి వచ్చిన భక్తుల సంఖ్య అధికంగా ఉండడంతో దర్శనానికి అధిక సమయం పడుతోంది. భారీగా వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు కిక్కిరిశాయి. సర్వదర్శనం కోసం భక్తులు కనీసం 10 నుంచి 12 గంటలు సమయం నిరీక్షించాల్సిన వస్తోంది. తలనీలాలు సమర్పించేందుకు కనీసం మూడు నుంచి నాలుగు గంటలు సమయం పడుతోంది. అన్నదాన సత్రం, ప్రసాదం కౌంటర్ల వద్ద కూడా భారీగా భక్తుల రద్దీ నెలకొంది. స్వామి వారి దర్శనానికి వచ్చిన వారిలో చిన్నారులు, మహిళు, వృద్ధులు ఉన్నారు. అనేక రాష్ట్రాల నుంచి వెంకటేశ్వర స్వామి దర్శనార్థం భక్తులు తరలివచ్చారు. సోమవారం ఉదయం 2.20 గంటలు నుంచి 3 గంటలు వరకు స్వామి వారికి సుప్రబాతం, 3.30 గంటలు నుంచి 4 గంటల వరకు తోమాల సేవ(ఏకాంత సేవ), నాలుగు గంటలు నుంచి 4.15 గటల వరకు కొలువు, పంచాంగ శ్రవనాన్ని నిర్వహించనున్నారు. 4.15 నుంచి 5 గంటల వరకు తొలి అర్చన, సహస్ర నామార్చన నిర్వహిస్తారు. 5.30 నుంచి 6.30 గంటల వరకు విశేష పూజ, ఏడు గంటలు నుంచి రాత్రి ఏడు గంటలు వరకు భక్తులకు దర్శన అవకాశం కల్పిస్తారు. వీటితోపాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు, స్వామి వారికి ఏకాంత సేవ నిర్వహించనున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Assembly Indiramma Controversy: తెలంగాణ అసెంబ్లీలో ఇప్పసారా చిచ్చు - ఇందిరమ్మ పేరు తెచ్చిన బీజేపీ ఎమ్మెల్యే - తర్వాత మాటల యుద్ధమే!
తెలంగాణ అసెంబ్లీలో ఇప్పసారా చిచ్చు - ఇందిరమ్మ పేరు తెచ్చిన బీజేపీ ఎమ్మెల్యే - తర్వాత మాటల యుద్ధమే!
Varanasi Movie Set: వారణాసి సెట్‌లో ఏమున్నాయి..? రాజమౌళిని ఇండియన్ క్రిస్టోఫర్ నోలన్ అని విదేశీ మీడియా ఎందుకు అంటోంది..?
వారణాసి సెట్‌లో ఏమున్నాయి..? రాజమౌళిని ఇండియన్ క్రిస్టోఫర్ నోలన్ అని విదేశీ మీడియా ఎందుకు అంటోంది..?
Deputy CM Pawan Kalyan: రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Rakasa Trailer : ఊరిలో కోట మిస్టరీ ఏంటి? - భయపెడుతూనే నవ్వించిన రాకాస ట్రైలర్
ఊరిలో కోట మిస్టరీ ఏంటి? - భయపెడుతూనే నవ్వించిన రాకాస ట్రైలర్

వీడియోలు

Shreyas Iyer as captain of Team India? | టీమిండియా నెక్స్ట్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్? | ABP Desam
SRH Spends 10 Crores for Uppal Stadium | 10 కోట్లతో ఉప్పల్ స్టేడియం రినోవేషన్ | ABP Desam
RCB Sold to Aditya Birla Group IPL 2026 | భారీ ధరకు అమ్ముడైన RCB | ABP Desam Bangalore
Women Reservations 2029 | లోక్ సభ, అసెంబ్లీలో 50 శాతం స్థానాల పెంపు | ABP Desam
RCB KSCA Tributes Stampede Victims | విషాధ ఘటనను జ్ఞాపకంగా మార్చిన ఆర్సీబీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Assembly Indiramma Controversy: తెలంగాణ అసెంబ్లీలో ఇప్పసారా చిచ్చు - ఇందిరమ్మ పేరు తెచ్చిన బీజేపీ ఎమ్మెల్యే - తర్వాత మాటల యుద్ధమే!
తెలంగాణ అసెంబ్లీలో ఇప్పసారా చిచ్చు - ఇందిరమ్మ పేరు తెచ్చిన బీజేపీ ఎమ్మెల్యే - తర్వాత మాటల యుద్ధమే!
Varanasi Movie Set: వారణాసి సెట్‌లో ఏమున్నాయి..? రాజమౌళిని ఇండియన్ క్రిస్టోఫర్ నోలన్ అని విదేశీ మీడియా ఎందుకు అంటోంది..?
వారణాసి సెట్‌లో ఏమున్నాయి..? రాజమౌళిని ఇండియన్ క్రిస్టోఫర్ నోలన్ అని విదేశీ మీడియా ఎందుకు అంటోంది..?
Deputy CM Pawan Kalyan: రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Rakasa Trailer : ఊరిలో కోట మిస్టరీ ఏంటి? - భయపెడుతూనే నవ్వించిన రాకాస ట్రైలర్
ఊరిలో కోట మిస్టరీ ఏంటి? - భయపెడుతూనే నవ్వించిన రాకాస ట్రైలర్
New Corona: ఉన్నవి సరిపోనట్లుగా మళ్లీ కరోనా కొత్త రకం వచ్చేస్తోందట - వ్యాక్సిన్ కూడా పని చేయదని తేల్చిన శాస్త్రవేత్తలు
ఉన్నవి సరిపోనట్లుగా మళ్లీ కరోనా కొత్త రకం వచ్చేస్తోందట - వ్యాక్సిన్ కూడా పని చేయదని తేల్చిన శాస్త్రవేత్తలు
AP Assembly special meeting: 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం - అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ తీర్మానం !
28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం - అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ తీర్మానం !
Vijayawada Terror Links Case: విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు
విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు
West Asia Conflict: ప్రపంచ ఇంధన సంక్షోభం! భారత్ అప్రమత్తం! మైలేజీ పెంచుకోవడానికి నిపుణుల కీలక సూచనలు !
ప్రపంచ ఇంధన సంక్షోభం! భారత్ అప్రమత్తం! మైలేజీ పెంచుకోవడానికి నిపుణుల కీలక సూచనలు !
Embed widget