అన్వేషించండి

చిత్తూరుకు చంద్రబాబు చేసిన మంచి ఒక్కటీ లేదు, కుప్పం ప్రజలు ఆయనకు బైబై చెప్పేస్తున్నారు: జగన్

చంద్రబాబు కావాలనే చిత్తూరు డెయిరీని నష్టాల్లోకి నెట్టి మూసివేయించారని సీఎం జగన్ ఆరోపించారు. సొంత డెయిరీ బాగు కోసం ఇలా చేశారని ధ్వజమెత్తారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు రీఓపెన్‌ చేస్తున్నానని అన్నారు. 

చిత్తూరు జిల్లా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం చిత్తూరు డెయిరీని తెరిపిస్తున్నామన్నారు సీఎం జగన్. చిత్తూరు జిల్లా వేలూరులో ఏర్పాటు చేయబోయే ప్లాంట్‌కు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ చంద్రబాబుపై విమర్శలు చేశారు.  చిత్తూరులో జరిగినన భూమి పూజ కార్యక్రమంలో గుజరాత్ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఛైర్మన్ షమల్ బాయి బి పటేల్, కైరా జిల్లా కో ఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్ యూనియన్ లిమిటెడ్ విపుల్ పటేల్, రాష్ట్ర మంత్రులు, వ్యవసాయ, సహకార శాఖ స్పెషల్ సీఎస్ గోపాల కృష్ణ ద్వివేది తదితరులు పాల్గొన్నారు.  

చంద్రబాబు కావాలనే చిత్తూరు డెయిరీని నష్టాల్లోకి నెట్టి మూసివేయించారని జగన్ ఆరోపించారు. తన సొంత డెయిరీ బాగు కోసం చంద్రబాబు ఇలా చేశారని ధ్వజమెత్తారు. తాను పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం 20 క్రితం మూత బడిన చిత్తూరు డెయిరీని తిరిగి ప్రారంభిస్తున్నామని అన్నారు. 

ఈ డెయిరీలో 325 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు అమూల్ అంగీకరించిందని ప్రకటించారు జగన్. దీనికి శంకుస్థాపన చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ డెయిరీ కారణంగా ప్రత్యక్షంగా ఐదు వేల మందికి పరోక్షంగా రెండు లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు సీఎం జగన్. 

ఆంధ్రప్రదేశ్‌లోకి అమూల్‌ సంస్థ రావడంతో చాలా మార్పులు వచ్చాయని వివరించారు జగన్. అమూల్‌లో పాలు వేస్తున్న మహిళలకు ఆరు నెలలకోసారి బోనస్‌తోపాటు లాభాలు కూడా వస్తున్నాయన్నారు. గేదె, ఆవు పాలు రేట్లు కూడా పెరిగాయన్నారు. ఈ సంస్థ రాకతో చాలా డెయిరీలకు జ్వరం వచ్చిందని వాళ్లు కూడా పాలు రేట్లు పెంచక తప్పలేదన్నారు. దీని ఫలితంగా పాడి రైదులకు నాలుగు వేల కోట్ల రూపాయల లబ్ధి చేకూరిందన్నారు జగన్.  

ప్రస్తుతం శంకుస్థాపన చేసుకున్న ప్లాంట్‌లో పది నెలల్లో ప్రాసెసింగ్ మొదలవుతుందని జగన్ వెల్లడించారు. పది నెలల్లో పాల ప్రాసెసింగ్ మొదలవుతుంది. తొలి దశలో 150 కోట్లతో పనులు ప్రాంరభంకానున్నాయని వివరించారు. 

చిత్తూరు డెయిరీని నష్టాల్లోకి నెట్టిన చంద్రబాబు చిత్తూరు జిల్లాకు చేసిన మేలు ఒక్కటీ లేదన్నారు జగన్. చంద్రబాబు చిత్తశుద్ధి లేని వ్యక్తి అని విమర్శించారు. 2004లో చంద్రబాబు మరోసారి గెలిచి ఉంటే ఆర్టీసీ కూడా  ఉండేది కాదన్నారు. ముడుపుల కోసం ప్రభుత్వ సంస్థలను, పరిశ్రమలను నష్టాల్లోకి నెట్టేసి అమ్మేసి చరిత్ర చంద్రబాబుది అన్నారు. పరిశ్రమలకు నష్టాలు చూపించి తన వాళ్లకు కట్టబెట్టారని ఆరోపించారు. 

చంద్రబాబు చిత్తూరు జిల్లాతోపాటు తనను గెలిపిస్తున్న కుప్పం ప్రజలని కూడా మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు జగన్. 70 ఏళ్ల వయసులో ఇప్పుడు ఇల్లు కట్టుకుంటానంటూ చెబుతున్నారని ఎద్దేవా చేశారు. అందుకే కుప్ప ప్రజలకు చంద్రబాబుకు బై బై చెప్పేస్తున్నారని అన్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP Rains Alert: ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
Chandrababu Tirumala: సాంకేతికతతో ఆధ్యాత్మిక వైభవం - తిరుమలలో సీఎం చంద్రబాబు సరికొత్త మార్పులు
సాంకేతికతతో ఆధ్యాత్మిక వైభవం - తిరుమలలో సీఎం చంద్రబాబు సరికొత్త మార్పులు
Arava Sridhar: పవన్ కల్యాణ్, జనసేనకు వాల్యూ లేదా? అరవ శ్రీధర్‌ బాధితురాలి సంచలన వీడియో!
పవన్ కల్యాణ్, జనసేనకు వాల్యూ లేదా? అరవ శ్రీధర్‌ బాధితురాలి సంచలన వీడియో!
తిరుమలలో అత్యాధునిక ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్‌ను ప్రారంభించిన చంద్రబాబు, TTD ఆలయాలను ఆధునిక ఆధ్యాత్మిక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని ఆదేశం!
తిరుమలలో అత్యాధునిక ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్‌ను ప్రారంభించిన చంద్రబాబు, TTD ఆలయాలను ఆధునిక ఆధ్యాత్మిక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని ఆదేశం!

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
PM Modi Telangana Tour: ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
Dhurandhar 2 : ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
AP Nandi Awards: నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
Embed widget