అన్వేషించండి

చిత్తూరుకు చంద్రబాబు చేసిన మంచి ఒక్కటీ లేదు, కుప్పం ప్రజలు ఆయనకు బైబై చెప్పేస్తున్నారు: జగన్

చంద్రబాబు కావాలనే చిత్తూరు డెయిరీని నష్టాల్లోకి నెట్టి మూసివేయించారని సీఎం జగన్ ఆరోపించారు. సొంత డెయిరీ బాగు కోసం ఇలా చేశారని ధ్వజమెత్తారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు రీఓపెన్‌ చేస్తున్నానని అన్నారు. 

చిత్తూరు జిల్లా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం చిత్తూరు డెయిరీని తెరిపిస్తున్నామన్నారు సీఎం జగన్. చిత్తూరు జిల్లా వేలూరులో ఏర్పాటు చేయబోయే ప్లాంట్‌కు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ చంద్రబాబుపై విమర్శలు చేశారు.  చిత్తూరులో జరిగినన భూమి పూజ కార్యక్రమంలో గుజరాత్ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఛైర్మన్ షమల్ బాయి బి పటేల్, కైరా జిల్లా కో ఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్ యూనియన్ లిమిటెడ్ విపుల్ పటేల్, రాష్ట్ర మంత్రులు, వ్యవసాయ, సహకార శాఖ స్పెషల్ సీఎస్ గోపాల కృష్ణ ద్వివేది తదితరులు పాల్గొన్నారు.  

చంద్రబాబు కావాలనే చిత్తూరు డెయిరీని నష్టాల్లోకి నెట్టి మూసివేయించారని జగన్ ఆరోపించారు. తన సొంత డెయిరీ బాగు కోసం చంద్రబాబు ఇలా చేశారని ధ్వజమెత్తారు. తాను పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం 20 క్రితం మూత బడిన చిత్తూరు డెయిరీని తిరిగి ప్రారంభిస్తున్నామని అన్నారు. 

ఈ డెయిరీలో 325 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు అమూల్ అంగీకరించిందని ప్రకటించారు జగన్. దీనికి శంకుస్థాపన చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ డెయిరీ కారణంగా ప్రత్యక్షంగా ఐదు వేల మందికి పరోక్షంగా రెండు లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు సీఎం జగన్. 

ఆంధ్రప్రదేశ్‌లోకి అమూల్‌ సంస్థ రావడంతో చాలా మార్పులు వచ్చాయని వివరించారు జగన్. అమూల్‌లో పాలు వేస్తున్న మహిళలకు ఆరు నెలలకోసారి బోనస్‌తోపాటు లాభాలు కూడా వస్తున్నాయన్నారు. గేదె, ఆవు పాలు రేట్లు కూడా పెరిగాయన్నారు. ఈ సంస్థ రాకతో చాలా డెయిరీలకు జ్వరం వచ్చిందని వాళ్లు కూడా పాలు రేట్లు పెంచక తప్పలేదన్నారు. దీని ఫలితంగా పాడి రైదులకు నాలుగు వేల కోట్ల రూపాయల లబ్ధి చేకూరిందన్నారు జగన్.  

ప్రస్తుతం శంకుస్థాపన చేసుకున్న ప్లాంట్‌లో పది నెలల్లో ప్రాసెసింగ్ మొదలవుతుందని జగన్ వెల్లడించారు. పది నెలల్లో పాల ప్రాసెసింగ్ మొదలవుతుంది. తొలి దశలో 150 కోట్లతో పనులు ప్రాంరభంకానున్నాయని వివరించారు. 

చిత్తూరు డెయిరీని నష్టాల్లోకి నెట్టిన చంద్రబాబు చిత్తూరు జిల్లాకు చేసిన మేలు ఒక్కటీ లేదన్నారు జగన్. చంద్రబాబు చిత్తశుద్ధి లేని వ్యక్తి అని విమర్శించారు. 2004లో చంద్రబాబు మరోసారి గెలిచి ఉంటే ఆర్టీసీ కూడా  ఉండేది కాదన్నారు. ముడుపుల కోసం ప్రభుత్వ సంస్థలను, పరిశ్రమలను నష్టాల్లోకి నెట్టేసి అమ్మేసి చరిత్ర చంద్రబాబుది అన్నారు. పరిశ్రమలకు నష్టాలు చూపించి తన వాళ్లకు కట్టబెట్టారని ఆరోపించారు. 

చంద్రబాబు చిత్తూరు జిల్లాతోపాటు తనను గెలిపిస్తున్న కుప్పం ప్రజలని కూడా మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు జగన్. 70 ఏళ్ల వయసులో ఇప్పుడు ఇల్లు కట్టుకుంటానంటూ చెబుతున్నారని ఎద్దేవా చేశారు. అందుకే కుప్ప ప్రజలకు చంద్రబాబుకు బై బై చెప్పేస్తున్నారని అన్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Road Safety Cess in Telangana : కారుపై రూ. 5000, బైక్‌పై రూ.2000 భారం - తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్లపై రోడ్‌ సేఫ్టీ సెస్‌
తెలంగాణలో కొత్త బండ్లకు భారీ షాక్‌ - బైక్‌ నుంచి కారు వరకు అదనపు బాదుడు
Durgam Cheruvu Cable Bridge: నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
Amaravati Land Pooling: అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?
అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?
Warangal Viral News: లేగ దూడకు నామకరణ మహోత్సవం! అయ్యప్ప మాలధరణ స్వాముల సమక్షంలో పేరు పెట్టిన వరంగల్ జిల్లా రైతు 
లేగ దూడకు నామకరణ మహోత్సవం! అయ్యప్ప మాలధరణ స్వాముల సమక్షంలో పేరు పెట్టిన వరంగల్ జిల్లా రైతు 

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Safety Cess in Telangana : కారుపై రూ. 5000, బైక్‌పై రూ.2000 భారం - తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్లపై రోడ్‌ సేఫ్టీ సెస్‌
తెలంగాణలో కొత్త బండ్లకు భారీ షాక్‌ - బైక్‌ నుంచి కారు వరకు అదనపు బాదుడు
Durgam Cheruvu Cable Bridge: నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
Amaravati Land Pooling: అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?
అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?
Warangal Viral News: లేగ దూడకు నామకరణ మహోత్సవం! అయ్యప్ప మాలధరణ స్వాముల సమక్షంలో పేరు పెట్టిన వరంగల్ జిల్లా రైతు 
లేగ దూడకు నామకరణ మహోత్సవం! అయ్యప్ప మాలధరణ స్వాముల సమక్షంలో పేరు పెట్టిన వరంగల్ జిల్లా రైతు 
Fact Check: మార్చి 2026 నుంచి రూ.500 నోట్ల చెలామణి ఆగిపోతుందా? మళ్ళీ నోట్ల రద్దు జరుగుతుందా?
మార్చి 2026 నుంచి రూ.500 నోట్ల చెలామణి ఆగిపోతుందా? మళ్ళీ నోట్ల రద్దు జరుగుతుందా?
Aadi Saikumar: ఆది సాయి కుమార్ ఇంట్లో డబుల్ ధమాకా - 'శంబాల' సక్సెస్ తర్వాత మరో శుభవార్త!
ఆది సాయి కుమార్ ఇంట్లో డబుల్ ధమాకా - 'శంబాల' సక్సెస్ తర్వాత మరో శుభవార్త!
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
Embed widget