అన్వేషించండి

Tirumala Tickets: శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్... నడకదారిలో వచ్చే భక్తులకు దర్శనాలు..!

శ్రీవారి దర్శనంపై రెండు, మూడు రోజుల్లో టీటీడీ కీలక నిర్ణయం తీసుకోనుంది. సర్వదర్శన టోకెన్లు ఆఫ్ లైన్ విషయంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆదివారం ఉదయం స్వామి వారి సేవలో పాల్గొన్నారు. అనంతరం ఆలయం బయటకు వచ్చిన వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తుల సంఖ్యను క్రమేపి పెంచుతున్నట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా రాత్రి సమయాల్లో తిరుమలకు రాకపోకలు నిలుపుదల చేశామన్నారు. త్వరలో నడకదారిలో తిరుమలకు వచ్చే భక్తులకు దర్శనాలు కల్పించేందుకు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. అధికారులతో మాట్లాడి రెండు, మూడు రోజుల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మరి కొన్ని సేవలు ప్రారంభించాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Also Read: గిరిజన తేనెతో శ్రీవారికి అభిషేకం... జీసీసీ ప్రతిపాదనకు టీటీడీ ఓకే

సర్వదర్శనం టికెట్లపై త్వరలో నిర్ణయం

భారీ వర్షాల కారణంగా నడకదారిలో వచ్చే భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. అందుకే రాత్రి సమయాల్లో రాకపోకలు నిలిపివేశామన్నారు. క్రమంగా కరోనా తగ్గుముఖం పడుతున్న కారణంగా అధికారులతో చర్చించి భక్తుల సంఖ్య పెంపుపై ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. సర్వదర్శనం టోకెన్లు ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌ లైన్ అందుబాటులో ఉంచాలనేది త్వరలో నిర్ణయం తీసుకుంటామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. 

Also Read: టీటీడీలో కార్పొరేషన్ కలకలం... ఉద్యోగులకు పవన్ కల్యాణ్ బాసట... సుప్రీంతీర్పు ఉల్లంఘనంటూ విమర్శలు

టికెట్ల కోసం భారీ డిమాండ్

ప్రస్తుతం టీటీడీ దర్శనం టోకెన్లను ఆన్‌లైన్‌లో మాత్రమే విడుదల చేస్తుంది. శ్రీవారి దర్శనానికి సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, టైంస్లాట్‌ సర్వదర్శన టోకెన్లను గోవింద యాప్‌లో కాకుండా టీటీడీ వెబ్‌సైట్‌లోనే బుక్‌ చేసుకోవాలని అధికారులు తెలిపారు. శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం నవంబర్, డిసెంబర్‌ నెలల టికెట్లను టీటీడీ ఆన్‌లైన్‌లో ఉంచింది. కొన్ని గంటల వ్యవధిలోనే భక్తులు టికెట్లను కొనుగోలు చేసేశారు. అక్టోబర్ 22వ తేదీ ఉదయం 9 గంటలకు టికెట్లు విడుదల అవ్వగా మధ్యాహం 1.30 వరకు టికెట్లు అన్నీ ఖాళీ అయ్యాయి. రెండు నెలలకు రోజుకు 12 వేల చొప్పున రెండు నెలలకు 7 లక్షల 8 వేల టికెట్లను టీటీడీ విడుదల చేసింది. టికెట్ల కోసం భక్తుల నుంచి భారీ డిమాండ్ ఉంది. టికెట్ల విక్రయం ద్వారా టీటీడీకి దాదాపు రూ.21 కోట్ల ఆదాయం వచ్చింది. సర్వదర్శనం టికెట్లను కూడా టీటీడీ ఆన్‌లైన్‌లో మాత్రమే ఉంచుతుంది. అయితే పరిమిత సంఖ్యలోనే టికెట్లు జారీ చేస్తుండడంతో చాలా మంది భక్తులకు టికెట్లు దొరకడంలేదు. అయితే శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసుల సర్టిఫికెట్‌ లేదా కోవిడ్‌ నెగిటివ్‌ రిపోర్టుతో రావాల్సి ఉంటుంది. 

Also Read: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సీఎం జగన్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TDP MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్
TDP MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్

వీడియోలు

ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం
Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam
Yuvraj Singh Mentoring Rishabh Pant | స్పైడీ రిషభ్ పంత్ కు అండగా యువరాజ్ సింగ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
Lavanya Tripathi : టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన
టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Embed widget