అన్వేషించండి

Janasena BRS Alliance : పబ్లిసిటీ స్టంట్ కోసమే అలాంటి వార్తలు, జనసేన-బీఆర్ఎస్ పొత్తుపై పృధ్విరాజ్ క్లారిటీ

Janasena BRS Alliance : జనసేన-బీఆర్ఎస్ పొత్తు అంటూ కొందరు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని జనసేన నేత పృధ్విరాజ్ అన్నారు. అదంతా పబ్లిసిటీ స్టంట్ అన్నారు.

Janasena BRS Alliance : తెలంగాణ సీఎం కేసీఆర్ జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఆఫర్ ఇచ్చారంటూ వస్తున్న వార్తలపై  జనసేన నేత పృధ్వి రాజ్ స్పందించారు. పబ్లిసిటీ స్టంట్ కోసమే ఇలాంటి వార్తలు వేస్తున్నారని ఆరోపించారు. అప్పట్లో తనకు రూ. 200 కోట్లు ఇచ్చారని వార్తలు వేశారన్నారు. ఆ రూ.200 కోట్లు లెక్క పెట్టి రావడానికి ఇన్ని రోజులు పట్టిందని వ్యంగ్యంగా అన్నారు. జనం కోసం పుట్టిన వ్యక్తి పవన్ కల్యాణ్ అన్నారు. అలాంటి పవన్ కల్యాణ్ ఎవరి ఆఫర్ల కోసం ఆశపడే వ్యక్తి కాదన్నారు. ట్యాక్స్ కట్టడానికే రూ.9 కోట్ల అప్పు చేసిన వ్యక్తి పవన్ కల్యాణ్ అని గుర్తుచేశారు. అలాంటి వార్తలు వేస్తే సర్క్యూలేషన్ వస్తాయని కొందరు ఇలా చేశారన్నారు.  తారకరత్న మరణంపై లక్ష్మీ పార్వతి మాటలు బాధాకరమన్నారు. ఆమె అలాంటి మాటలు మాట్లాడి ఉండకూడదన్నారు. లోకేశ్ ఐరన్ లెంగ్ అంటూ ఆయన పాదయాత్ర వల్లే తారకరత్న చనిపోయారని లింక్ చేస్తూ చెప్పడం దారుణం అన్నారు.  

"ఇదంతా పబ్లిసిటీ స్టంట్. అలాంటిది ఏమైనా ఉంటే నాదెండ్ల మనోహర్, నాగబాబు ఖండిస్తారు. జనానికి ఏమైనా చేయడానికి వచ్చిన వ్యక్తి పవన్ కల్యాణ్. పేపర్ల సర్క్యూలేషన్ కోసం ఇలాంటి వార్తలు రాస్తుంటారు.  ఓ సినిమా తీశాను. అది హిట్ అవ్వాలని తిరుమల వచ్చాను. నా అసలు మొక్కు 2024 మీకు తెలియజేస్తాను. కన్నా లక్ష్మీనారాయణ నాకు గురువు. రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు. అక్కడ ఆయన మనోభావాలు దెబ్బతిన్నాయని బయటకు వచ్చారు. తారకరత్న సడెన్ గా వెళ్లిపోవడం అనేది చాలా బాధాకరం. ప్రతీది లింక్ పెట్టి మాట్లాడకూడదు. లక్ష్మీ పార్వతి తారకరత్న మరణంపై చేసిన తప్పు" - పృధ్విరాజ్, సినీ నటుడు, జనసేన నేత 

జనసేన, బీఆర్ఎస్ పొత్తుపై జోరుగా ప్రచారం

 భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్... జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో పొత్తు కోసం ప్రయత్నిస్తున్నారని  ఒక్క సారి తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో గుప్పు మంది. దీనికి కారణం ఏదైనా కొంత కాలం నుంచి ఈ అంశంపై రాజకీయవర్గాల్లో గుసగుసలు నడుస్తున్నాయి. ఇప్పుడు కొన్ని మీడియా సంస్థలు ప్రకటించడంతో బయటకు వచ్చింది. దీనిపై జనసేన వర్గాలు ఎలాంటి స్పందనా వ్యక్తం చేయలేదు. అదే సమయంలో బీఆర్ఎస్ వర్గాలు కూడా సైలెంట్‌గా ఉన్నాయి.  సోషల్ మీడియాలో మాత్రం జనసేన కార్యకర్తలు తీవ్రంగా స్పందిస్తున్నారు. కారణం ఏమైనా  బీఆర్ఎస్, జనసేన మధ్య చర్చల విషయాన్ని కొట్టి పారేయలేమని రాజకీయవర్గాలు అంచనాకు వస్తున్నాయి. 

జాతీయ పార్టీగా మారాక  కలసి వచ్చే వారి కోసం కేసీఆర్ తీవ్ర ప్రయత్నాలు !

తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చిన తర్వాత కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లో కలసి వచ్చే వారి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.  ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలుగు రాష్ట్రమైన ఏపీలో ఇంకా ఎక్కువ అవకాశాలు ఉంటాయని ఆయన అనుకుంటున్నారు. అయితే బలమైన, ప్రజాకర్షణ ఉన్న నాయకుడు కావాలి. అలాంటి  నాయకుల కోసం కేసీఆర్ చేసిన ప్రయత్నాలు చాలా వరకూ ఫెలయ్యాయి. అందుకే  ప్రధాన పార్టీల తరపున  మూడు సార్లు పోటీ చేసినా ఓడిపోయిన తోట చంద్రశేఖర్‌కుఏపీ బీఆర్ఎస్  బాధ్యతలిచ్చారు. అయితే కనీసం బీఆర్ఎస్‌తో కలిసి పోటీ చేసేలా  ఇతర పార్టీలను ఒప్పించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారన్నిద బహిరంగ రహస్యమేనని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పవన్ కల్యాణ్‌కు ఓ  బలమైన సమాజికవర్గం అండ ఉంటుంది కాబట్టి.. ఆయనతో కలిసి పోటీ చేస్తే మెరుగైన పలితాలు వస్తాయన్న కేసీఆర్ అంచనాతోనే... జనసేన పార్టీని సంప్రదిస్తున్నట్లుగా భావిస్తున్నారు. 

జనసేన పార్టీతో బీఆర్ఎస్ నేతల సంప్రదింపులు ! 

అయితే  సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నట్లుగా ఎన్నికల ఖర్చు గురించి కాదు కానీ..    బీఆర్ఎస్‌తో  కలిసి పోటీ చేసే  విషయంపై పవన్ కల్యాణ్‌ను కొంత మంది బీఆర్ఎస్ ప్రతినిధులు కలిసి ప్రాథమికంగా చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది.  బీఆర్ఎస్‌తో కలిసి పోటీ చేస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి.. ఏపీ రాజకీయాలు ఎన్నికల తర్వాత ఎలా మారతాయి. బీఆర్ఎస్ , పవన్ కల్యాణ్ కలిస్తే ఎలాంటి రాజకీయ సమీకరణాలు ఏర్పడతాయి అన్నవాటిపై లోతైన పరిశీలనతో... బీఆర్ఎస్ ప్రతినిధులు పవన్ కల్యాణ్‌ను సంప్రదించినట్లుగా చెబుతున్నారు. అయితే ఇది మొత్తం బీఆర్ఎస్ వైపు నుంచి ఏపక్షంగా జరుగుతోంది కానీ పవన్ కల్యాణ్ ఇంత వరకూ ఎలాంటి ఆసక్తి చూపించలేదని చెబుతున్నారు.   

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Somu Veerraju: జగన్ నాకు సన్నిహితుడు కాదు, వైసీపీ అధినేతతో స్నేహంపై సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
జగన్ నాకు సన్నిహితుడు కాదు, వైసీపీ అధినేతతో స్నేహంపై సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
Telangana News: పాలమూరు- రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం షాక్ !
పాలమూరు- రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం షాక్ !
Nara Lokesh: రాష్ట్రంలో 125 కొత్త స్పెషల్ నీడ్స్ పాఠశాలలు: మంత్రి నారా లోకేష్
రాష్ట్రంలో 125 కొత్త స్పెషల్ నీడ్స్ పాఠశాలలు: మంత్రి నారా లోకేష్
Kannada Actress Ranya Rao: కోర్టులో బోరున విలపించిన రన్యా రావు... బంగారం స్మగ్లింగ్ కేసులో 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
కోర్టులో బోరున విలపించిన రన్యా రావు... బంగారం స్మగ్లింగ్ కేసులో 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

DMK Uncivilised Heated Argument in Parliament | నోరు జారిన ధర్మేంద్ర ప్రధాన్..ఒళ్లు దగ్గర పెట్టుకోమన్న స్టాలిన్ | ABP DesamChampions Trophy 2025 Winners Team India | కాలు కదపకుండా ఆడి ట్రోఫీ కొట్టేశామా | ABP DesamRohit Sharma Virat Kohli Kolatam | వైట్ కోటులతో రచ్చ చేసిన టీమిండియా హీరోలు | ABP DesamRohit Sharma Fitness Champions Trophy 2025 | ఫిట్ నెస్ లేకుండానే రెండు ఐసీసీ ట్రోఫీలు కొట్టేస్తాడా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Somu Veerraju: జగన్ నాకు సన్నిహితుడు కాదు, వైసీపీ అధినేతతో స్నేహంపై సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
జగన్ నాకు సన్నిహితుడు కాదు, వైసీపీ అధినేతతో స్నేహంపై సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
Telangana News: పాలమూరు- రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం షాక్ !
పాలమూరు- రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం షాక్ !
Nara Lokesh: రాష్ట్రంలో 125 కొత్త స్పెషల్ నీడ్స్ పాఠశాలలు: మంత్రి నారా లోకేష్
రాష్ట్రంలో 125 కొత్త స్పెషల్ నీడ్స్ పాఠశాలలు: మంత్రి నారా లోకేష్
Kannada Actress Ranya Rao: కోర్టులో బోరున విలపించిన రన్యా రావు... బంగారం స్మగ్లింగ్ కేసులో 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
కోర్టులో బోరున విలపించిన రన్యా రావు... బంగారం స్మగ్లింగ్ కేసులో 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
ICC Champions Trophy: ప్లేయ‌ర్ ఆఫ్ ద టోర్నీ ఇండియ‌న్ కే ఇవ్వాల్సింది.. నేనేతై అలాగే చేసేవాడిని: అశ్విన్
ప్లేయ‌ర్ ఆఫ్ ద టోర్నీ ఇండియ‌న్ కే ఇవ్వాల్సింది.. నేనేతై అలాగే చేసేవాడిని: అశ్విన్
Weight Loss Meal Plan : పోషకాలతో కూడిన హెల్తీ డైట్​ ప్లాన్.. ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ ఇది
పోషకాలతో కూడిన హెల్తీ డైట్​ ప్లాన్.. ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ ఇది
Rohit Sharma Lands In Mumbai: దుబాయ్ నుంచి వచ్చిన రోహిత్ శర్మ, ముంబైకి చేరుకున్న భారత కెప్టెన్
దుబాయ్ నుంచి వచ్చిన రోహిత్ శర్మ, ముంబైకి చేరుకున్న భారత కెప్టెన్
Telugu TV Movies Today: చిరంజీవి ‘చూడాలని వుంది’, మహేష్ ‘ఒక్కడు’ to వెంకటేష్ ‘బొబ్బిలి రాజా’, నితిన్ ‘శ్రీ ఆంజనేయం’ వరకు - ఈ మంగళవారం (మార్చి 11) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
చిరంజీవి ‘చూడాలని వుంది’, మహేష్ ‘ఒక్కడు’ to వెంకటేష్ ‘బొబ్బిలి రాజా’, నితిన్ ‘శ్రీ ఆంజనేయం’ వరకు - ఈ మంగళవారం (మార్చి 11) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
Embed widget