అన్వేషించండి

Tirumala Brahmotsavam 2022 : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు, రెండేళ్ల తర్వాత అత్యంత వైభవంగా

Tirumala Brahmotsavam 2022 :తిరుమల శ్రీవారికి ఏడాదికొకసారి జరిగే బ్రహ్మోత్సవాలకు రంగం సిద్ధమైంది. ఈ ఏడాది తిరుమలలో బ్రహ్మోత్సవ సందడే నెలకొననుంది. సెప్టెంబర్ 27 నుంచి తొమ్మిది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.

Tirumala Brahmotsavam 2022 : నిత్యం కళ్యాణం పచ్చతోరణంగా భాసిలుతున్న తిరుమల క్షేత్రంలో ప్రతి నిత్యం ఒక ఉత్సవం జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒక ఊరేగింపు నిర్వహిస్తూనే ఉంటారు. తిరుమలలో ఏడాది పొడవునా ప్రతిరోజు పండుగే. తొమ్మిది రోజులు పాటు నిర్వహించే బ్రహ్మోత్సవాలకు తిరుమల చరిత్రలోనే అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. వేంకటాచల క్షేత్రంలో వెలసిన తొలి రోజులలో శ్రీనివాసుడు బ్రహ్మదేవుణి పిలిచి లోకకళ్యాణార్థం తనకు వైభవంగా ఉత్సవాలు నిర్వహించమని ఆజ్ఞాపించాడటా, శ్రీవారి ఆజ్ఞ మేరకు బ్రహ్మ దేవుడు, శ్రీవారు ఆనంద నిలయం మధ్యలో ఆవిర్భవించిన కన్యామాసంలోని శ్రవణా నక్షత్రానికి పూర్తి అయ్యేలా తొమ్మిది రోజులు పాటు వైభవంగా ఉత్సవాలను నిర్వహించారటా, సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే శ్రీవారికి నిర్వహించే ఉత్సవాలు కావడంతో ఇవి బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి పొందాయని అంటారు. 

తొమ్మిది రోజుల పాటు 

నిత్యకల్యాణం పచ్చతోరణమైన తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. తొమ్మిది రోజుల పాటు శ్రీవారు భక్తుల ముందుకు తరలివచ్చి అనుగ్రహించే ఈ మహాత్తర ఘట్టానికి తిరుమలలో చాలా ప్రాధాన్యత ఉంది. ఏటా కన్యామాసంలో శ్రీవారి జన్మనక్షత్రమైన శ్రవణంతో ముగిసేలా ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ ఏడాది సెప్టెంబరు 27వ తేదీ నుంచి తొమ్మిది రోజుల పాటు బ్రహ్మోత్సవాల నిర్వహించనున్నారు. ప్రతి రోజు రెండు వాహానాలపై శ్రీవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం సూచికగా ముందురోజు సెప్టెంబరు 26న ఉత్సవాలకు అంకురార్పణ నిర్వహించనున్నారు. 

వాహన సేవలు 

బ్రహ్మోత్సవాలలో మొదటిరోజు స్వామి ఊరేగే వాహనం పెద్దశేష వాహనం, రెండో రోజు ఉదయం చిన్నశేషవాహనంపై దర్శనమిస్తే, అదే రోజు రాత్రి సరస్వతి మూర్తిగా హంస వాహనంపై శ్రీవారు దర్శనం ఇస్తారు. ఇక మూడో రోజు ఉదయం సింహ వాహనంపై, రాత్రి ముత్యపు పందిరి వాహనంలో అధిరోహించనున్నారు. నాలుగోవ రోజు ఉదయం కల్పవృక్షవాహనంపై, రాత్రి సర్వభూపాల వాహనంపై, ఇక ఐదోవ రోజు ఉదయం మోహిని అవతారంలో దర్శనమిస్తే, అదే రోజు రాత్రి స్వామి వారు గరుడ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. ఇక‌ ఆరో రోజు ఉదయం హనుమంత వాహనం, సాయంకాలం స్వర్ణరథం, రాత్రి గజ వాహనం, ఏడో రోజు ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం, ఎనిమిదో రోజు ఉదయం రధోత్సవం, అదే రోజు అశ్వ వాహనం, ఇక బ్రహ్మోత్సవాలలో చివరి రోజు చక్రస్నానం నిర్వహించనున్నారు. తొమ్మిదో రోజు ఉదయం శ్రీవారి పుష్కరిణిలో నిర్వహించగా, బ్రహ్మోత్సవాలలో చివరి ఘట్టం ధ్వజాఅవరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. 

శ్రీవారి బ్రహ్మోత్సవాలు 

శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని టీటీడీ యంత్రాంగం గత మూడు నెలలుగా నిరంతరాయంగా ఏర్పాట్లుచేస్తుంది. ఇవాళ అన్నమయ్య భవన్ లో టీటీడీ ఈవో ఏవీ. ధర్మారెడ్డి అధికారులతో బ్రహ్మోత్సవాలపై సమీక్ష నిర్వహించారు. గత రెండేళ్లుగా కరోనా ప్రభావంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహించారు. బ్రహ్మోత్సాలు ఈ ఏడాది సెప్టెంబర్ 27వ తేదీ ప్రారంభం అవుతాయి. 

  • అక్టోబర్ 1న గరుడ సేవ 
  • అక్టోబర్ 2న బంగారు రథం
  • అక్టోబర్ 4న మహా రథం 
  • అక్టోబర్ 5న చక్రస్నానం 

ప్రివిలేజ్ దర్శనాలు రద్దు 

‌సెప్టెంబర్ 27వ తేదీన సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పిస్తారని, బ్రహ్మోత్సవాలు సమయంలో అన్ని ప్రివిలేజ్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని, ఈ ఏడాది భక్తుల రద్దీ ఎక్కువ ఉంటుందనే అంచనాకు టీటీడీ అధికారులు వచ్చారు. మూడో శనివారం అధికంగా భక్తులు వచ్చే అవకాశం ఉందని, బ్రహ్మోత్సవాల సమయంలో ప్రోటోకాల్ ప్రముఖులకే వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
Ilayaraja : ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
Ilayaraja : ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Bandla Ganesh : బండ్ల గణేష్ సంకల్ప యాత్ర ప్రారంభం - హైదరాబాద్ To తిరుమల వెంకటేశుని సన్నిధి వరకూ...
బండ్ల గణేష్ సంకల్ప యాత్ర ప్రారంభం - హైదరాబాద్ To తిరుమల వెంకటేశుని సన్నిధి వరకూ...
ఫుల్ ట్యాంక్‌తో 800 KM రేంజ్ ఇస్తున్న TVS Star City Plus.. అత్యంత చవకైన డిస్క్ బ్రేక్ బైక్
ఫుల్ ట్యాంక్‌తో 800 KM రేంజ్ ఇస్తున్న TVS Star City Plus.. అత్యంత చవకైన డిస్క్ బ్రేక్ బైక్
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
Embed widget