అన్వేషించండి

Three Capitals : మూడు రాజధానులకు కట్టుబడే ఉన్నాం.. హైకోర్టులో ఏపీ ప్రభుత్వం మరో అనుబంధ అఫిడవిట్ !

శుక్రవారం రాజధాని బిల్లుల అంశంపై దాఖలు చేసినఅఫిడవిట్లకు అదనంగా శనివారం ప్రభుత్వం మరో అఫిడవిట్ సమర్పించింది.మూడు రాజధానులపై వెనక్కి తగ్గబోమని తెలిపింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానుల విషయంలో మరో అనుబంధ అఫిడవిట్‌ను హైకోర్టులో సమర్పించింది. మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణ అఫిడవిట్‍కు అనుబంధంగా కొత్తగా తెచ్చిన బిల్లులను కోర్టుకు ఏపీ ప్రభుత్వం సమర్పించింది. ఏపీ అభివృద్ధి వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామని అందులో ప్రభుత్వం స్పష్టంచేసింది.  రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు, సమగ్ర అభివృద్ధి కోసం మూడు రాజధానుల ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని తెలిపింది. అందుకు అనుగుణంగా సమగ్ర మార్పులు తీసుకొచ్చేందుకే ఈ బిల్లులు ఉపసంహరించుకున్నామని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. 

Also Read : జగన్ పాలన ఫెయిల్ - ఏపీలో ప్రజాస్వామ్యం లేనట్లేనన్న ఉండవల్లి అరుణ్ కుమార్ !

చట్టం రద్దు ద్వారా సీఆర్డీఏను పునరుద్ధరించామని..ప్రభుత్వం తెలిపింది. అఫిడవిట్‌లో శ్రీబాగ్ ఒప్పందం గురించి ప్రభుత్వం ప్రస్తావించింది. శుక్రవారమే ప్రభుత్వ పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టాలను ఉపసంహరించుకున్నట్లు ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఈ మేరకు శాసన సభ, మండలి సమావేశాల్లో ఉప సంహరణ బిల్లులను ఆమోదించినట్లు పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీలక్ష్మి ప్రభుత్వం తరుఫున అఫిడవిట్‌ను సమర్పించారు. ఏపీలో రాజధాని అమరావతిని కొనసాగించాలని గత రెండేళ్లుగా రైతులు, ఐక్యకార్యచరణ నాయకులు కోర్టులో పిటిషన్లు వేశారు. 

Also Read : త్రివిక్ర‌మ్‌కు, ఏపీ మంత్రి పేర్ని ప్రస్తావించిన ట్వీట్‌కు సంబంధం లేదు

ఈ కేసులను విచారిస్తున్న త్రిసభ్య ధర్మాసనం రోజువారీగా విచారిస్తుంది. ఈ కేసుల విచారణ తుది దశకు వస్తున్న తరుణంలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం తమ బిల్లులను మంత్రివర్గ సమావేశం, అసెంబ్లీ సమావేశాల్లో ఉపసంహరించుకుంటున్నట్లు అడ్వకేట్‌ జనరల్‌ కోర్టుకు తెలిపారు. ఇందుకు సంబంధించన అఫిడవిట్‌ను దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. 26 వరకు ఇందు కోసం గడువును హైకోర్టు ఇచ్చింది. 

Also Read: దేశమంతా ఒకే జీఎస్టీ - టిక్కెట్ రేట్లూ అలాగే ఉండాలి.. జగన్ సర్కార్‌కు చిరంజీవి విజ్ఞప్తి !

26న అఫిడవిట్లు సమర్పించిన ప్రభుత్వం 27న మరో అనుబంధ అఫిడవిట్ సమర్పించి అందర్నీ ఆశ్చర్య పరిచింది. అనుబంధ అఫివిట్‌లో శ్రీబాగ్ ఒప్పందం వంటివి ప్రస్తావించడంతో  న్యాయస్థానంలో వాదనలు కొనసాగే అవకాశాలు ఉన్నట్లుగా భావిస్తున్నారు. ఈ అంశంపై రైతు తరపు న్యాయవాదులు అఫిడవిట్లను అధ్యనం చేస్తున్నారు. వీటిపై సోమవారం హైకోర్టులో వాదనలు సాగే అవకాశం ఉంది. 

Also Read: సహాయ చర్యలకు ఆటంకం కలుగుతుందనే వెళ్లలేదు.. అందరికీ సాయం చేశాం.. అసెంబ్లీలో సీఎం జగన్ !

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

జాబ్ ఫ్రాడ్.. మయన్మార్‌లో చిక్కుకున్న ఏపీ యువతకు మంత్రి నారా లోకేష్ భరోసా
జాబ్ ఫ్రాడ్.. మయన్మార్‌లో చిక్కుకున్న ఏపీ యువతకు మంత్రి నారా లోకేష్ భరోసా
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
YSRCP Assembly March: అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?
అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget