అన్వేషించండి

Volunteer Letter: ప్రజలను సోమరిపోతులను చేయొద్దు...ప్రజాసమస్యలపై దృష్టి పెట్టండి ... వైరల్ అవుతున్న వాలంటీర్ లేఖ

పథకాలపై కాకుండా ప్రజాసమస్యలపై సీఎం దృష్టి పెట్టాలని వాలంటీర్ రాసిన లేఖ వైరల్ అయ్యింది. సంక్షేమ పథకాలతో ప్రజలను సోమరిపోతులను చేయ్యొద్దంటూ లేఖలో పేర్కొన్నారు.

ప్రజలను సోమరిపోతులను చేయెుద్దంటూ ఓ వాలంటీర్ లేఖ రాశారు. పింఛను నిబంధనలను మార్చేశారని, ఈ-కేవైసీ అవ్వకపోవడం వల్ల తీసుకోలేకపోయారని వాలంటీర్ ఆవేదన చెందారు. ఆ బకాయి పింఛన్ ను ఈ నెల ఇవ్వవద్దన్నారని లేఖలో తెలిపారు.  పదెకరాల భూములు ఉన్నవారికి పింఛను అందుతుందని, కానీ ఎంతోమంది నిరుపేదలు పింఛన్లు అందడంలేదన్నారు. అనేక పథకాలు తీసుకువచ్చి ప్రజలకు నేరుగా డబ్బులిస్తున్నారని, ప్రజలను సోమరిపోతులను చేయొద్దని లేఖలో తెలిపిపారు. అది మంచిది కాదన్నారు. సమస్యల మీద దృష్టిసారించి, యువతకు మంచి ఉద్యోగాలు కల్పించే దిశగా ఆలోచించాలని కోరారు. నిత్యావసర సరకుల ధరలు తగ్గించాలని శ్రీకాకుళం జిల్లా ఎల్‌ఎన్‌ పేట మండలం రావిచెంద్రి గ్రామ సచివాలయానికి చెందిన గ్రామ వాలంటీర్ చిట్టివలస కృష్ణ ఆవేదన వ్యక్తం చేస్తూ రాసిన లేఖ  సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది. 

ప్రజాసమస్యలపై దృష్టిపెట్టండి

సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి పథకాలపై కాక ప్రజాసమస్యలపై దృష్టిపెట్టాలని ఆయన లేఖలో కోరారు. వేల రూపాయలు జీతాలు తీసుకుంటున్న ఉద్యోగులు అవినీతికి పాల్పడుతున్నారన్నారు. వాలంటీర్లకు రూ.5 వేల జీతం ఇస్తున్నారని ఇవి పెట్రోలుకూ సరిపోవట్లేదన్నారు. ఉద్యోగభద్రత లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన చెందారు. 

Also Read: Central Varsities Jobs:సెంట్రల్ యూనివర్సిటీల్లో 6,229 జాబ్స్.. 10 లోగా నోటిఫికేషన్.. కేంద్ర మంత్రి వెల్లడి

వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామా

చిత్తూరు జిల్లాలో  74 మంది వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామా కలకలం రేపింది. సమస్యల పరిష్కారం కోసం స్థానిక ఎంపీడీవో కార్యాలయం ముందు శుక్రవారం నిరసన చేశారు. గ్రామపంచాయతీకి ఈవోగా ఉన్న అధికారిపై చర్యలు తీసుకునే వరకు విధులకు హాజరు కామని స్పష్టం చేశారు. చంద్రగిరి నియోజకవర్గంలోని పాకాలలో ఈవో కుసుమకుమారి, స్థానిక అధికార పార్టీ నాయకులు తమను తీవ్రంగా వేధిస్తున్నారని పాకాల మండలంలోని వాలంటీర్లు ఎంపీడీవో కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. ఈవోను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మొత్తం 74 మంది వాలంటీర్లు రాజీనామా చేస్తున్నామని తెలిపారు. ఈవో తమను అసభ్య పదజాలంతో దూషించారని, మానసికంగా వేధించారని ఆరోపించారు. ఆమెపై ఉన్నతాధికారులు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వాలంటీర్లపై స్థానిక నేతలు పెత్తనాలు మానుకోవాలని ఫిర్యాదు చేయడం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

 

Also Read: DGP Vs Chintamaneni : అన్నీ తప్పుడు కేసులే ..కోర్టుల్లో నిరూపించగలరా ? డీజీపీ సవాంగ్‌కు చింతమనేని ప్రశ్న..!

టాప్ హెడ్ లైన్స్

YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Nadendla Manohar: తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం.. సబ్సిడీ విక్రయాలు ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్
తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం.. సబ్సిడీ విక్రయాలు ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Adilabad Airport Credit War: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Secret Soldier : చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
Embed widget