అన్వేషించండి

రైల్వే అధికారులతో దక్షిణ మధ్య రైల్వే జీఎం సమావేశం - చర్చించిన అంశాలివే

రైళ్ల రాకపోకల విషయంలో సమయపాలన పాటించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ సూచించారు. ప్రయాణికుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.

రైళ్ల రాకపోకల విషయంలో సమయపాలన పాటించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ సూచించారు. ప్రయాణికుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.  
అధికారులతో జీఎం సమీక్ష...
విజయవాడ రైల్వే డివిజనల్ కాన్ఫరెన్స్ హాల్ లో బెజవాడ డివిజనల్ పని తీరుపై దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ సమీక్ష నిర్వహించారు. విజయవాడ డివిజన్‌ ​​డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ శివేంద్ర మోహన్‌, ఏడీఆర్‌ఎం డి.శ్రీనివాసరావు, వివిధ విభాగాల ఉన్నతాధికారులతో ఆయన పలు అంశాలపై సమీక్షించారు. డివిజన్‌లో పురోగతిలో ఉన్న అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల గురించి అధికారులు జీఎం అరుణ్ కుమార్ జైన్ కు వివరించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 135.8 కి.మీల గూడూరు - విజయవాడ ట్రిప్లింగ్ పనులను ప్రారంభించి, బ్రాంచ్ - లైన్ డబ్లింగ్ పనులను పూర్తి చేసినందుకు గానూ విజయవాడ టీమ్ అధికారులను జీఎం అభినందించారు.  ట్రిప్లింగ్ పనులను వేగవంతం చేయడం, బాటిల్ నెక్‌ల తొలగింపు, విద్యుద్దీకరణ పనులు, రద్దీగా ఉండే గ్రాండ్ ట్రంక్ రూట్‌లో రైలు కార్యకలాపాలను తగ్గించడం, తదితర అంశాలపై జీఎం ఉన్నతాధికారులతో చర్చించారు. 
భద్రతపై ప్రత్యేక శ్రద్ధ...
ఈ సందర్బంగా అరుణ్ కుమార్ జైన్ మాట్లాడుతూ.. రైలు కార్యకలాపాలలో సమయపాలనతో పాటు భద్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఈ విషయంలో రాజీ పడే ప్రస్తకి లేదని, ఆయన అధికారులతో అన్నారు. ట్రాఫిక్‌ బ్లాక్‌లు, మెయింటెనెన్స్‌ పనులు, మరమ్మతులు ఆలస్యం కాకుండా రైళ్ల రాకపోకలపై ప్రభావం చూపకుండా సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఇందుకు అవసరం అయిన సాంకేతికతను వినియోగించి సమస్యలను పరిష్కరించగలమని చెప్పారు. భద్రతకు రైల్వే అదిక ప్రాదాన్యత ఇస్తుందని, ప్రయాణీకుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా రైల్వే అధికారులు, సిబ్బంది వ్యవహరించాలని సూచించారు. సాంకేతికంగా వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు గమనించి, ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ  విషయంలో దిగువ స్థాయిలో ఉన్న సిబ్బందికి, అధికారులకు అవగాహన అవసరం అని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ అభిప్రాయపడ్డారు.
సిబ్బంది కష్టాలపై ఆరా...
రైల్వేలో పని చేస్తున్న సిబ్బంది సమస్యలు పై దశాబ్దాలుగా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్  సిబ్బంది ఫిర్యాదులను కూడా పరిశీలించారు. పదోన్నతి, వేతన స్థిరీకరణ,  సెటిల్‌మెంట్లకు సంబంధించిన సమస్యలతో సంబంధిత శాఖ ఉన్నతాధికారులు సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని హితవు పలికారు. ఆరోగ్యవంతమైన ఆపరేటింగ్ నిష్పత్తిని సాధించడంతో పాటు ఆదాయాల పెంపు, వ్యయాలను తగ్గించడానికి చర్యలు చేపట్టాలన్నారు. రికార్డుల డిజిటలైజేషన్‌ ప్రక్రియ చేపట్టడానికి గల అవకాశాలను పరిశీలించాని జీఎం సూచించారు. 
అనంతరం రోజువారీ పనిలో ఎదురవుతున్న సమస్యలు, జోనల్ హెడ్ క్వార్టర్స్ నుంచి సహాయం అవసరమైన ప్రాంతాల గురించి విజయవాడ డివిజన్ బ్రాంచ్  అధికారులను అడిగి తెలుసుకున్నారు. బ్రాంచ్ అధికారులకు హెడ్ క్వార్టర్స్ నుండి పూర్తి  సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. వార్షిక ఆదాయాలలో కొత్త రికార్డులు నమోదు చేయాలని ఆకాంక్షించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా ఇదే జోరు కొనసాగించాలని కోరారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Gas Cylinder shortage: గ్యాస్ కొరతతో అయోధ్య సహా అనేక దేవాలయాల్లో అన్నదానం నిలిపివేత - మరి తిరుమల పరిస్థితి ఏమిటి?
గ్యాస్ కొరతతో అయోధ్య సహా అనేక దేవాలయాల్లో అన్నదానం నిలిపివేత - మరి తిరుమల పరిస్థితి ఏమిటి?
Google AI Hub Issue: గూగుల్ ఏఐ హబ్‌కు భూముల కేటాయింపుపై తిరుపతి ఎంపీ పిల్ - ఏపీపై జగన్ ద్వేషానికి నిదర్శనమని లోకేష్ ఆగ్రహం
గూగుల్ ఏఐ హబ్‌కు భూముల కేటాయింపుపై తిరుపతి ఎంపీ పిల్ - ఏపీపై జగన్ ద్వేషానికి నిదర్శనమని లోకేష్ ఆగ్రహం
Good news for AP farmers: ఏపీ రైతులకు ఉగాది కానుక - 13న అన్నదాత సుఖీభవ నిధులు రూ.6వేలు జమ !
ఏపీ రైతులకు ఉగాది కానుక - 13న అన్నదాత సుఖీభవ నిధులు రూ.6వేలు జమ !
CM Chandrababu: ఈ 23న ఆర్సెల్లార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన.. గేమ్ ఛేంజర్‌గా P4 మోడల్: సీఎం చంద్రబాబు
ఈ 23న ఆర్సెల్లార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన.. గేమ్ ఛేంజర్‌గా P4 మోడల్: సీఎం చంద్రబాబు

వీడియోలు

Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్
ICC Penalizes Arshdeep After T20 World Cup Final | అర్ష్‌దీప్ సింగ్‌పై ఐసీసీ వేటు
Shahid Afridi praises Team India | భారత జట్టుపై షాహిద్ అఫ్రిదీ ప్రశంసలు
BCCI Reward for T20 World Cup Champions | టీమిండియాపై బీసీసీఐ కాసుల వర్షం
Gambhir Dedicates T20WC Win to Dravid & Laxman | ట్రోఫీ గెలిచాక గంభీర్ సంచలన నిర్ణయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Good news for AP farmers: ఏపీ రైతులకు ఉగాది కానుక - 13న అన్నదాత సుఖీభవ నిధులు రూ.6వేలు జమ !
ఏపీ రైతులకు ఉగాది కానుక - 13న అన్నదాత సుఖీభవ నిధులు రూ.6వేలు జమ !
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
Kavuri Sambasivarao Passes Away: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
Team India నెక్ట్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు ఆడుతుంది? IPL కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
Team India నెక్ట్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు ఆడుతుంది? IPL కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
Kerala Assembly Elections 2026: కేరళ కాంగ్రెస్‌లో సీఎం సెగ - వేణుగోపాల్ రాకతో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు!
కేరళ కాంగ్రెస్‌లో సీఎం సెగ - వేణుగోపాల్ రాకతో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు!
Telangana Politics: బీఆర్ఎస్‌ను మించి గ్రౌండ్ పాలిటిక్స్‌లో కవిత దూకుడు - క్యాడర్, లీడర్‌ను ఆకర్షిస్తారా?
బీఆర్ఎస్‌ను మించి గ్రౌండ్ పాలిటిక్స్‌లో కవిత దూకుడు - క్యాడర్, లీడర్‌ను ఆకర్షిస్తారా?
Rajendra Prasad : మళ్లీ నోరు జారిన రాజేంద్ర ప్రసాద్ - స్టేజ్‌పై అలా మాట్లాడతారా అంటూ...
మళ్లీ నోరు జారిన రాజేంద్ర ప్రసాద్ - స్టేజ్‌పై అలా మాట్లాడతారా అంటూ...
Andhra Pradesh alliance Politics: ఏపీలో కూటమి గడబిడ - పైస్థాయిలో బాండింగ్ సరే - నియోజకవర్గ నేతల మధ్య ఆధిపత్యపోరు సంగతేంటి?
ఏపీలో కూటమి గడబిడ - పైస్థాయిలో బాండింగ్ సరే - నియోజకవర్గ నేతల మధ్య ఆధిపత్యపోరు సంగతేంటి?
Embed widget