అన్వేషించండి

YSRCP in Kothapet: కొత్తపేట వైసీపీ కోటగా ఎలా మారింది? ఈసారి చేజారిపోతుందా?

Kothapet Politics: కొత్తపేటలో కాంగ్రెస్‌ పార్టీ గెలుపొందుతూ రాగా 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సాఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విజ‌యం సాధించింది.

Kothapet Assembly Constituency: స్వాతంత్య్ర సమరయోధుడు కళా వెంకట్రావు ప్రాతినిథ్యం వహించిన కొత్తపేట నియోజకవర్గానికి అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోనే ఓ ప్రత్యేకత ఉంది.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడ్డాక 1955లో కొత్తపేట నియోజకవర్గం ఏర్ప‌డింది.  అప్పటినుంచి ఎక్కువ సార్లు కాంగ్రెస్‌ పార్టీ గెలుపొందుతూ రాగా 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సాఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలుపొందుతూ వస్తోంది.. కొత్తపేట నియోజకవర్గంలో చిర్ల కుటుంబం నుంచే ప్రాతినిధ్యం వహిస్తుండగా టీడీపీ నుంచే చిర్ల సోమసుందర రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తరువాత కాంగ్రెస్‌ పార్టీలో చేరి మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన కుమారుడు చిర్ల జగ్గిరెడ్డి 2004లో కాంగ్రెస్‌ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి 2014, 2019లో వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు.. 

వైసీపీ కంచుకోట బద్దలు అవుతోందా..
ఇటీవల భరోసా యాత్రలో భాగంగా రావులపాలెంలో నిర్వహించిన బహిరంగ సభలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిర్ల జగ్గిరెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చిల్లర జగ్గిరెడ్డి అంటూ సంభోదిస్తూ ఇసుక దోపిడీ చేస్తున్నారంటూ, కాంట్రాక్టులు తీసుకుని దోచేస్తున్నారని, భూ కజ్జాలు చేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.. 2014, 2019 ఎన్నికల్లో తిరుగు లేని విజయాన్ని సంపాదించిన జగ్గిరెడ్డి మరోసారి గెలిచి హ్యాట్రిక్‌ కొట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఏది ఏమైనా ఈ సారి ఎన్నికల్లో వైసీపీని ఓడించాలన్న లక్ష్యంతో టీడీపీ, జనసేన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి.. ఇప్పటికే టీడీపీ తరపున నియోజకవర్గ ఇంచార్జ్‌ బండారు సత్యానందరావు, జనసేన ఇంచార్జ్‌ బండారు శ్రీనివాసరావులు పోటాపోటీగా ఈసారి గెలుపు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.. అయితే ఈసారి టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా ఏపార్టీ పోటీచేస్తుందో తెలియని పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఎవ్వరికి వారు తమ పని తాము చేసుకుపోతూ ప్రజల్లో తమ గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు..

గెలుపుకోసం వ్యూహాలు.. సమీకరణాలు..
వైసీపీ గెలుపు కోసం ప్రభుత్వ విప్‌, కొత్తపేట సిట్టింగ్‌ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ముచ్చటగా మూడోసారి కూడా గెలుపు ద్వారా హ్యాట్రిక్‌ను సాధించాలని చిర్ల తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారట.. ఇందుకోసమే వైసీపీకు సాంప్రదాయ ఓటింగ్‌గా ఉన్న ఎస్సీ, బీసీ ఓటర్లుతో నిరంతరం టచ్‌లో ఉంటూ చెక్కుచెదరని ఓటుబ్యాంకుతో విజయం సాధించాలని పట్టుదలతో పనిచేసుకుపోతున్నారన్న ప్రచారం సాగుతోంది.. అయితే రావులపాలెంలో చోటుచేసుకున్న పలు వివాదాలు, అట్రాసిటీ కేసులు నమోదు కాకుండా మోకాలడ్డారన్న ఆరోపణలు ఎస్సీ సామాజిక వర్గాన్ని కొంత వరకు చిర్ల జగ్గిరెడ్డికి దూరం చేశాయన్న మాటలు వినిపిస్తున్నాయి.. ముఖ్యంగా అంబేడ్కర్‌ చిత్రపటంతో ఉన్న పేపర్‌ ప్లేట్స్‌ వివాదంలో ఓ వర్గానికి కొమ్ముకాసి దళిత యువకులను తిరిగి జైల్లో పెట్టించారని ఆరోపణలు చిర్లపై తీవ్రంగా ఉన్నాయి.. ఇదే సమయంలో కాపు సాసమాజిక వర్గాన్ని కాపు కాసుకుంటూ అదే సమయంలో ఎస్సీ వర్గీయుల్లో  పట్టుసాధించాలన్న పట్టుదలతో బండారు సత్యానందరావు నిమగ్నమయ్యారన్నది కూడా వినిపిస్తోంది. ఇదే ప్రాంతానికి చెందిన శాసన మండలి మాజీ ఛైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం, ఆయన సతీమణి కూడా కోనసీమ ప్రాంతంలో టీడీపీ నుంచి కీలకంగా పనిచేస్తున్నారు.  బీసీ సామాజిక వర్గానికి చెందిన సుబ్రహ్మణ్యం ద్వారా కూడా బీసీ వర్గం నుంచి టీడీపీకు అనుకూల ఓటు బ్యాంకు లభిస్తే ఇక టీడీపీ, జనసేన పొత్తుతో విజయం తథ్యం అన్న ధీమాతో రెండు పార్టీలు ఉన్నట్లు తెలుస్తోంది.. 

కొత్తపేట నుంచి శాసన సభకు ప్రాతినిథ్యం వహించిన వారి జాబితా పరిశీలిస్తే.. 2004లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధిగా పోటీచేసిన చిర్ల జగ్గిరెడ్డి టీడీపీ అభ్యర్ధి బండారు సత్యానందరావుపై 2,271 ఓట్లు మెజారిటీతో గెలుపొందారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భాంతో ఇక్కడ ముక్కోణపు పోటీ జరిగింది. పీఆర్పీ నుంచి బండారు సత్యానందరావు, కాంగ్రెస్‌ నుంచి చిర్ల జగ్గిరెడ్డి, టీడీపీ నుంచి రెడ్డి సుబ్రహ్మణ్యం లు తలపడ్డారు. ప్రజారాజ్యం నుంచి పోటీచేసిన బండారు సత్యానందరావు జగ్గిరెడ్డిపై 2,470 ఓట్లుతో గెలుపొందారు.. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా పోటీచేసిన సత్యానందరావుపై చిర్ల జగ్గిరెడ్డి 713 ఓట్లుతో గెలుపొందారు.  2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి సత్యానందరావు, జనసేన అభ్యర్ధి బండారు శ్రీనివాసరావులపై 4,038 ఓట్లు మెజార్టీ సాధించిన జగ్గిరెడ్డి విజయం సాధించారు. మొత్తం 2004 నుంచి పరిశీలిస్తే కొత్తపేటలో ఏ పార్టీకు అయినా స్వల్ప మెజార్టీ మాత్రమే లభిస్తుందన్నది తెలుస్తుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Manchu Lakshmi: ప్లీజ్‌ నాకు సాయం చేయండి -  మంచు లక్ష్మి షాకింగ్ పోస్ట్,  అసలేమైంది..
ప్లీజ్‌ నాకు సాయం చేయండి - మంచు లక్ష్మి షాకింగ్ పోస్ట్, అసలేమైంది..
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
Embed widget