అన్వేషించండి

Polavaram Files: ధవళేశ్వరం ఇరిగేషన్ ఆఫీసు వద్ద పత్రాలు దగ్దం, పోలవరానికి సంబంధించినవని ఆరోపణలు

Andhra Pradesh | ధవళేశ్వరం ఇరిగేషన్ కార్యాలయం వద్ద కొన్ని పత్రాలు కాలిపోయి కనిపించాయి. అవి పోలవరం ప్రాజెక్టు భూ సేకరణకు సంబంధించిన పత్రాలు అని ఆరోపణలు వస్తున్నాయి.

Dowleswaram irrigation office | ధవళేశ్వరం: ఇటీవల అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్ లో అగ్నిప్రమాదం జరిగి, కీలక డాక్యుమెంట్స్ దగ్దం కావడం తెలిసిందే. తాజాగా తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో ఇలాంటి సీన్ రిపీట్ అయింది. ధవళేశ్వరం ఇరిగేషన్ కార్యాలయం సంబంధించిన కొన్ని పత్రాలు కాలిపోయాయి. అవి పోలవరం ఎడమ ప్రధాన కాలువ భూసేకరణ పత్రాలు దగ్ధం అంటూ ప్రచారం జరిగింది. 

డిప్యూటీ కలెక్టర్  వేదవల్లి ఇరిగేషన్ ఆఫీసుకు వెళ్లి కాలి బూడిదైన దస్త్రాలు పరిశీలించారు. అనంతరం డిప్యూటీ కలెక్టర్ వేదవల్లి మీడియాతో మాట్లాడుతూ.. ధవళేశ్వరం ఇరిగేషన్ r&r ఆఫీసు బయట కొన్ని డాక్యుమెంట్స్ దగ్దమయ్యాయని సమాచారం వచ్చింది. వెంటనే అక్కడికి వెళ్లి పరిశీలించినట్లు తెలిపారు. Nmc వన్ పేపర్స్ తగల బెట్టారని చెబుతున్నారు. లెఫ్ట్ కెనాల్ అధికారుల ఆఫీసులో కింద పేపర్స్ ఉంటే స్వీపర్ బయట పడేయగా.. చెత్త పేపర్లు అని కాల్చివేశారని చెప్పారు. పేపర్స్ పై సంతకాలు ఏమీ లేవు అని, అయితే సగం కాలిన పేపర్స్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. వీరిలో కొన్ని ఆధార్ కార్డులు ఉన్నాయి. పేపర్లపై ఎలాంటి సంతకాలు లేవు కనుక అంత ఇంపార్టెంట్ కాదన్నారు. అయితే ఏ పేపర్స్ దగ్ధం చేయాలన్నా తన అనుమతి తీసుకొవాలని... అలా ఎందుకు జరగలేదు, పేపర్లు ఎవరు కాల్చారో విచారణ చేపడతాం అన్నారు.

రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి కామెంట్స్...
ఈ ఘటనపై రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి స్పందించారరు. ఆయన మాట్లాడుతూ.. ‘ధవళేశ్వరం ఇరిగేషన్ కార్యాలయంలో కొత్త బీరువాలు వచ్చాయని,  ఫైల్స్ అన్ని బీరువాలో సర్దిపెట్టారు. బీరువాలో వేస్ట్ పేపరు తీసి, దగ్ధం చేసామని చెబుతున్నారు. రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. మదనపల్లి సబ్ కలెక్టరేట్ లో జరిగిన ఘటనపై ప్రభుత్వం ఇప్పటికే విచారణ చేపట్టింది. ధవళేశ్వరంలో సగం కాలిపోయిన కాగితాలపై అధికారులు సంతకాలు లేవు, కనుక అవి అంత ముఖ్యమైన పేపర్లుగా అనిపించలేదు. పూర్తి విచారణ జరిపి వివరాలు వెల్లడిస్తామని’ బుచ్చయ్య చౌదరి అన్నారు.

ఏపీలో భూ కబ్జాలు విపరీతంగా పెరిగిపోయాయని, ఈ ఘటనపై ఇరిగేషన్ సూపరింటెండ్ కుమారి బాధ్యత వహించాలన్నారు. కాగా, అక్కడ పేపర్లు దగ్దం చేసిన యువతి విశాఖకు వెళ్లినట్లు చెబుతున్నారు. అయితే సరిగ్గా ఇప్పుడే అంత అత్యవసరంగా సెలవు పెట్టాల్సిన అవసరం ఏం వచ్చిందని ప్రశ్నించారు. సగం కాలిన పేపర్లన్నీ పోలీస్ డిపార్ట్మెంట్ స్వాధీనం చేసుకుని సమగ్ర విచారణ చేపట్టాలన్నారు.

వైసీపీ పనేనని రామానాయుడు ఆరోపణలు

ఆ పత్రాలను వైసీపీ నేతలే తగలబెట్టి ఉంటారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. వైసీపీ హయాంలో జరిగిన తప్పులను కప్పి పుచ్చేందుకు ఈ పని చేసి ఉంటారని అనుమానించారు. నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. 

ఆధారాలు ఉంటే కేసు పెట్టాలన్న అంబటి రాంబాబు

ధవళేశ్వరం ఇరిగేషన్ ఆఫీసులో పత్రాలు కాలిపోవడాన్ని సైతం టీడీపీ రాజకీయం చేస్తుందంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. వైసీపీ నేతలు ఈ పని చేశారని నిరూపించేందుకు మీ వద్ద ఆధారాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. మదనపల్లె సబ్ కలెక్టరేట్ లో అగ్నిప్రమాదం జరిగితే పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి పని అని దుష్ప్రచారం చేశారన్నారు. ఇప్పుడు పోలవరంపై తమ తప్పుల్ని కప్పి పుచ్చుకునేందుకు వైసీపీ నేతలపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Jagan: రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
Revanth Reddy comments: కార్పొరేట్ కంపెనీల కోసమే ఉపాధి హామీ పథకంలో మార్పులు- మోదీ ప్రభుత్వంపై రేవంత్ సంచలన ఆరోపణలు
కార్పొరేట్ కంపెనీల కోసమే ఉపాధి హామీ పథకంలో మార్పులు- మోదీ ప్రభుత్వంపై రేవంత్ సంచలన ఆరోపణలు
YS Jagan on Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు భూ సేకరణ చేసింది మేమే, కేసులు వాదించింది మేమే, అనుమతులు తెచ్చింది మేమే- మొదటి ఫ్లైట్‌ ఎప్పుడు ఎగురుతుందో చెప్పింది మేమే: జగన్
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు భూ సేకరణ చేసింది మేమే, కేసులు వాదించింది మేమే, అనుమతులు తెచ్చింది మేమే- మొదటి ఫ్లైట్‌ ఎప్పుడు ఎగురుతుందో చెప్పింది మేమే: జగన్
Hyderabad Crime News: సంక్రాంతి వేళ హైదరాబాద్‌లో చైనా మాంజాపై ఉక్కుపాదం; ఆ దారంతో పతంగులు ఎగరేసిన వారిపై కేసులు! పోలీసుల సంచలన నిర్ణయం
సంక్రాంతి వేళ హైదరాబాద్‌లో చైనా మాంజాపై ఉక్కుపాదం; ఆ దారంతో పతంగులు ఎగరేసిన వారిపై కేసులు! పోలీసుల సంచలన నిర్ణయం

వీడియోలు

India vs South Africa Vaibhav Suryavanshi | మూడో వన్డేలో 233 పరుగుల తేడాతో విజయం
Shreyas Iyer Fitness Update Ind vs NZ | టీమ్ ఇండియాకు గుడ్‌న్యూస్!
Robin Uthappa about Team India | ఉత‌ప్ప సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagan: రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
Revanth Reddy comments: కార్పొరేట్ కంపెనీల కోసమే ఉపాధి హామీ పథకంలో మార్పులు- మోదీ ప్రభుత్వంపై రేవంత్ సంచలన ఆరోపణలు
కార్పొరేట్ కంపెనీల కోసమే ఉపాధి హామీ పథకంలో మార్పులు- మోదీ ప్రభుత్వంపై రేవంత్ సంచలన ఆరోపణలు
YS Jagan on Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు భూ సేకరణ చేసింది మేమే, కేసులు వాదించింది మేమే, అనుమతులు తెచ్చింది మేమే- మొదటి ఫ్లైట్‌ ఎప్పుడు ఎగురుతుందో చెప్పింది మేమే: జగన్
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు భూ సేకరణ చేసింది మేమే, కేసులు వాదించింది మేమే, అనుమతులు తెచ్చింది మేమే- మొదటి ఫ్లైట్‌ ఎప్పుడు ఎగురుతుందో చెప్పింది మేమే: జగన్
Hyderabad Crime News: సంక్రాంతి వేళ హైదరాబాద్‌లో చైనా మాంజాపై ఉక్కుపాదం; ఆ దారంతో పతంగులు ఎగరేసిన వారిపై కేసులు! పోలీసుల సంచలన నిర్ణయం
సంక్రాంతి వేళ హైదరాబాద్‌లో చైనా మాంజాపై ఉక్కుపాదం; ఆ దారంతో పతంగులు ఎగరేసిన వారిపై కేసులు! పోలీసుల సంచలన నిర్ణయం
ED Raids at IPAC Office: IPAC కార్యాలయంలో ED సోదాలు! ఫైల్స్‌తో రైడ్ జరిగే ప్రాంతానికి మమతా బెనర్జీ!
IPAC కార్యాలయంలో ED సోదాలు! ఫైల్స్‌తో రైడ్ జరిగే ప్రాంతానికి మమతా బెనర్జీ!
Gurram Papireddy OTT : ఓటీటీలోకి డార్క్ కామెడీ 'గుర్రం పాపిరెడ్డి' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి డార్క్ కామెడీ 'గుర్రం పాపిరెడ్డి' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Bank Of Bhagyalakshmi OTT : ఓటీటీలోకి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ 'బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి' - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ 'బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి' - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
Telangana News: హిస్టరీ క్రియేట్ చేసిన తెలంగాణ లేడీ కానిస్టేబుల్! తొలిసారి తెలుగు భాషలో ఛార్జిషీట్‌
హిస్టరీ క్రియేట్ చేసిన తెలంగాణ లేడీ కానిస్టేబుల్! తొలిసారి తెలుగు భాషలో ఛార్జిషీట్‌
Embed widget