అన్వేషించండి

Nara Chandra Babu: ప్రజలంతా వైసీపీ ప్రభుత్వానికి తిరగబడాలి - చంద్రబాబు

Nara Chandra Babu: అధికారంలో ఉన్న వైసీపీ పాలనకు బుద్ధి చెప్పాలంటే ప్రజలు తిరుగుబాటు చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రజలను బురదలో వదిలేసి సీఎం గాల్లో తిరుగుతున్నారని మండిపడ్డారు.

Nara Chandra Babu: ప్రజలను బురదలో వదిలేసి సీఎం జగన్ గాల్లో తిరుగుతున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రంలో బాధ్యాతాయుతమైన ప్రభుత్వం లేదని అన్నారు. వరద బాధితుల దగ్గరకు వచ్చి క్షేత్ర స్థాయిలో వారి సమస్యలు అడిగి తెల్సుకోకుండా గాలిలో వచ్చి పైపైనే తిరిగి వెళ్లిపోతే ప్రజల కష్టాలు ఎలా తెలుస్తాయంటూ ప్రశ్నించారు. వరద బాధితుల కష్టాలు తనను తీవ్రంగా బాధించాయని చంద్రబాబు చెప్పారు. నేను వస్తున్నానని తెలిసే ప్రభుత్వం వరద బాధితులకు రెండు వేల రూపాయల ఇస్తోందని.. అదే తెలంగాణలో 10 వేల రూపాయలు ఇస్తున్నారని అన్నారు. ఈ ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోతోందని అన్నారు.

తాగుతున్న కలుషిత నీటిని చూపించిన బాధితులు 

రెండో రోజు పర్యటనలో భాగంగా పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు. ఆచంట మండలం కోడేరు నుంచి గోదావరిలో పంటుపై ప్రయాణించి ఆయోధ్య లంకలో బాధితులను పరామర్శించారు. ప్రభుత్వ సహాయక చర్యలపై ఆరా తీశారు. ఇద్దరు బాధితుల ఇళ్లకు వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. తమకు వంతెన నిర్మించాలని, తాగునీటి సమస్యను పరిష్కరించాలని బాధితులు కోరారు. తాము తాగుతున్న కలుషిత నీటిని ఆయనకు చూపించారు. 

లక్ష రూపాయల చొప్పున సాయం..

పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన అనంతరం వశిష్ట గోదావరి నదిలో ప్రయాణిస్తూ.. పంటులో కోనసీమ జిల్లాలోని రాజోలు మండలం సోంపల్లి పుష్కర ఘాట్ వద్దకు చేరుకున్నారు. రాత్రి 10 గంటలకు మానేపల్లి పల్లెపాలం చేరుకుని.. వరదలో మృతి చెందిన కారాడి రామకృష్ణ, కడలి శ్రీను కుటుంబాలను కలిసి లక్ష చొప్పున సాయం అందించారు. బాధితుల కష్టాలు విని భరోసా నింపిన చంద్రబాబు పలుచోట్ల ప్రసంగించారు. 

ప్రజలు తిరుగుబాటు చేస్తే నాయకత్వం వహిస్తా..

14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విపత్తులో సత్వరం స్పందించి సహాయ చర్యలు అందించాను. ఈ ముఖ్యమంత్రి సీడబ్ల్యూసీ హెచ్చరించినా ముందస్తు చర్యలు తీసుకోలేకపోయారు. ప్రజలన్ని అప్రమత్తం చేయలేనప్పపుడు సచివాలయ, వాలంటీర్ల వ్యవస్ఖలు ఎందుకంటూ ప్రశ్నించారు. ప్రజలు తిరగబడితే తప్ప వాళ్లు సరైన పద్దతిలో ఉండరంటూ కామెంట్లు చేశారు. ప్రజలు తిరుగుబాటు చేస్తే వారి పోరాటానికి నాయకత్వం వహిస్తానని ప్రకటించారు. ఏపీలోని పిల్ల భవిష్యత్తు బాగుండాలంటే ప్రజలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. నరసాపురం ఎంపీని తన ప్రాంతానికి కూడా జగన్ రానివ్వడం లేదని ఆరోపించారు. ప్రజల ఆస్తులకు ఎక్కడ కూడా రక్షణ లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ దోపిడిని ప్రశ్నిస్తే.. బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. సీఎం జగన్ అరాచకాలు ఇలాగే కొనసాగితే ఎక్కడా కూడా ఆయన తిరగలేడని టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడించారు.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh News:ఏపీలో 2.50 లక్షల గృహప్రవేశాలు! ఏప్రిల్‌ నుంచి ఆకస్మిక తనిఖీలు చేస్తున్నట్టు సీఎం ప్రకటన
ఏపీలో 2.50 లక్షల గృహప్రవేశాలు! ఏప్రిల్‌ నుంచి ఆకస్మిక తనిఖీలు చేస్తున్నట్టు సీఎం ప్రకటన
AP Capital Amaravati: ఏపీ రాజధాని అమరావతిపై చట్ట సవరణ! ట్రెండ్‌ సెట్ చేస్తున్న తీర్మానంపై సమగ్ర విశ్లేషణ!
ఏపీ రాజధాని అమరావతిపై చట్ట సవరణ! ట్రెండ్‌ సెట్ చేస్తున్న తీర్మానంపై సమగ్ర విశ్లేషణ!
Konaseema News: పూలనపాన్పులా కోనసీమ రహదారులు! తిప్పుకోలేని సుందర దృశ్యాలు! మైమరిపిస్తున్న ట్రంపెట్ చెట్ల అందాలు!
పూలనపాన్పులా కోనసీమ రహదారులు! తిప్పుకోలేని సుందర దృశ్యాలు! మైమరిపిస్తున్న ట్రంపెట్ చెట్ల అందాలు!
Amaravati: ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధానిగా అమరావతి! అసెంబ్లీలో శాశ్వత చట్టబద్ధత తీర్మానం!
ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధానిగా అమరావతి! అసెంబ్లీలో శాశ్వత చట్టబద్ధత తీర్మానం!

వీడియోలు

Vaibhav Suryavanshi RR vs CSK IPL 2026 | వైభవ్ కు సలహా ఇచ్చిన జైస్వాల్ | ABP Desam
Rohit Suggestions to Hardik IPL 2026 | హిట్ మ్యాన్ వ్యూహంతో ముంబై విజయం | ABP Desam
Rohit Sharma Fastest Half Century IPL 2026 | ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించిన రోహిత్ | ABP Desam
Rohit Dance in Front of Injured Rahane | రహానే కింద పడిపోతే.. రోహిత్ డాన్స్ | ABP Desam
Rahane Innings KKR vs MI IPL 2026 | వాంఖడేలో కేకేఆర్ పరుగుల విధ్వంసం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS MLA Padi Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు.. వెనక్కి తగ్గేది లేదంటూనే ప్రభుత్వంపై ఆరోపణలు
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు.. వెనక్కి తగ్గేది లేదంటూనే ప్రభుత్వంపై ఆరోపణలు
Bihar Stampede: ఆలయంలో తొక్కిసలాట, 8 మంది భక్తులు మృతి.. సీఎం నితీష్ కుమార్ దిగ్భ్రాంతి
ఆలయంలో తొక్కిసలాట, 8 మంది భక్తులు మృతి.. సీఎం నితీష్ కుమార్ దిగ్భ్రాంతి
Third Temple In Israel: ఇజ్రాయెల్‌లో మూడో టెంపుల్ గొడవేంటి..? మెస్సియా కోసం యూదుల ఎదురుచూపులు.. ఇరాన్‌తో యుద్ధంలో నెతన్యాహు మతం సెంటిమెంట్
ఇజ్రాయెల్‌లో మూడో టెంపుల్ గొడవేంటి..? మెస్సియా కోసం యూదుల ఎదురుచూపులు.. ఇరాన్‌తో యుద్ధంలో నెతన్యాహు మతం సెంటిమెంట్
Manisharma : హార్మోనియం దుమ్ము దులిపి మరీ ట్యూన్స్ - చెన్నై లవ్ స్టోరీ సాంగ్స్‌పై మణిశర్మ రియాక్షన్
హార్మోనియం దుమ్ము దులిపి మరీ ట్యూన్స్ - చెన్నై లవ్ స్టోరీ సాంగ్స్‌పై మణిశర్మ రియాక్షన్
Explosion at Challapalli Police Station: చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు.. నలుగురు పోలీసులకు తీవ్ర గాయాలు
చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు.. నలుగురు పోలీసులకు తీవ్ర గాయాలు
AP Capital Amaravati: ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత.. రేపే పార్లమెంటులోకి కీలక బిల్లు.. సర్వత్రా ఉత్కంఠ
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత.. రేపే పార్లమెంటులోకి కీలక బిల్లు.. సర్వత్రా ఉత్కంఠ
ఫుల్ ట్యాంక్‌తో 1200 కి.మీ.. Toyota Innova Hycross ఇప్పుడు కొత్త అవతార్‌లో వచ్చేస్తోంది
ఫుల్ ట్యాంక్‌తో 1200 కి.మీ.. Toyota Innova Hycross ఇప్పుడు కొత్త అవతార్‌లో వచ్చేస్తోంది
Today LPG, CNG, PNG Costs : LPG, CNG, PNG సిలిండర్ల కొత్త ధరలు.. హైదరాబాద్లోనే గ్యాస్ కాస్ట్ ఎక్కువ
LPG, CNG, PNG సిలిండర్ల కొత్త ధరలు.. హైదరాబాద్లోనే గ్యాస్ కాస్ట్ ఎక్కువ
Embed widget