అన్వేషించండి

Nara Chandra Babu: ప్రజలంతా వైసీపీ ప్రభుత్వానికి తిరగబడాలి - చంద్రబాబు

Nara Chandra Babu: అధికారంలో ఉన్న వైసీపీ పాలనకు బుద్ధి చెప్పాలంటే ప్రజలు తిరుగుబాటు చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రజలను బురదలో వదిలేసి సీఎం గాల్లో తిరుగుతున్నారని మండిపడ్డారు.

Nara Chandra Babu: ప్రజలను బురదలో వదిలేసి సీఎం జగన్ గాల్లో తిరుగుతున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రంలో బాధ్యాతాయుతమైన ప్రభుత్వం లేదని అన్నారు. వరద బాధితుల దగ్గరకు వచ్చి క్షేత్ర స్థాయిలో వారి సమస్యలు అడిగి తెల్సుకోకుండా గాలిలో వచ్చి పైపైనే తిరిగి వెళ్లిపోతే ప్రజల కష్టాలు ఎలా తెలుస్తాయంటూ ప్రశ్నించారు. వరద బాధితుల కష్టాలు తనను తీవ్రంగా బాధించాయని చంద్రబాబు చెప్పారు. నేను వస్తున్నానని తెలిసే ప్రభుత్వం వరద బాధితులకు రెండు వేల రూపాయల ఇస్తోందని.. అదే తెలంగాణలో 10 వేల రూపాయలు ఇస్తున్నారని అన్నారు. ఈ ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోతోందని అన్నారు.

తాగుతున్న కలుషిత నీటిని చూపించిన బాధితులు 

రెండో రోజు పర్యటనలో భాగంగా పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు. ఆచంట మండలం కోడేరు నుంచి గోదావరిలో పంటుపై ప్రయాణించి ఆయోధ్య లంకలో బాధితులను పరామర్శించారు. ప్రభుత్వ సహాయక చర్యలపై ఆరా తీశారు. ఇద్దరు బాధితుల ఇళ్లకు వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. తమకు వంతెన నిర్మించాలని, తాగునీటి సమస్యను పరిష్కరించాలని బాధితులు కోరారు. తాము తాగుతున్న కలుషిత నీటిని ఆయనకు చూపించారు. 

లక్ష రూపాయల చొప్పున సాయం..

పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన అనంతరం వశిష్ట గోదావరి నదిలో ప్రయాణిస్తూ.. పంటులో కోనసీమ జిల్లాలోని రాజోలు మండలం సోంపల్లి పుష్కర ఘాట్ వద్దకు చేరుకున్నారు. రాత్రి 10 గంటలకు మానేపల్లి పల్లెపాలం చేరుకుని.. వరదలో మృతి చెందిన కారాడి రామకృష్ణ, కడలి శ్రీను కుటుంబాలను కలిసి లక్ష చొప్పున సాయం అందించారు. బాధితుల కష్టాలు విని భరోసా నింపిన చంద్రబాబు పలుచోట్ల ప్రసంగించారు. 

ప్రజలు తిరుగుబాటు చేస్తే నాయకత్వం వహిస్తా..

14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విపత్తులో సత్వరం స్పందించి సహాయ చర్యలు అందించాను. ఈ ముఖ్యమంత్రి సీడబ్ల్యూసీ హెచ్చరించినా ముందస్తు చర్యలు తీసుకోలేకపోయారు. ప్రజలన్ని అప్రమత్తం చేయలేనప్పపుడు సచివాలయ, వాలంటీర్ల వ్యవస్ఖలు ఎందుకంటూ ప్రశ్నించారు. ప్రజలు తిరగబడితే తప్ప వాళ్లు సరైన పద్దతిలో ఉండరంటూ కామెంట్లు చేశారు. ప్రజలు తిరుగుబాటు చేస్తే వారి పోరాటానికి నాయకత్వం వహిస్తానని ప్రకటించారు. ఏపీలోని పిల్ల భవిష్యత్తు బాగుండాలంటే ప్రజలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. నరసాపురం ఎంపీని తన ప్రాంతానికి కూడా జగన్ రానివ్వడం లేదని ఆరోపించారు. ప్రజల ఆస్తులకు ఎక్కడ కూడా రక్షణ లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ దోపిడిని ప్రశ్నిస్తే.. బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. సీఎం జగన్ అరాచకాలు ఇలాగే కొనసాగితే ఎక్కడా కూడా ఆయన తిరగలేడని టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడించారు.  

టాప్ హెడ్ లైన్స్

Software Engineer Murder: భీమవరంలో ఘోరం.. తనను దూరం పెడుతుందని కత్తితో పొడిచి టెకీ దారుణ హత్య
భీమవరంలో ఘోరం.. తనను దూరం పెడుతుందని కత్తితో పొడిచి టెకీ దారుణ హత్య
Nalgonda Road Accident: హైదరాబాద్- విజయవాడ హైవేపై కారును ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. నలుగురు మృతి
హైదరాబాద్- విజయవాడ హైవేపై కారును ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. నలుగురు మృతి
Breaking News: రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో భారత్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం
రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో భారత్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం
Polavaram MLA Attacked: ​ఏలూరు జనసేన ఆఫీస్‌ వద్ద ఎమ్మెల్యేపై దాడికి యత్నం! సొంత పార్టీ నేతలపైనే చిర్రి బాలరాజు ఫైర్‌!
​ఏలూరు జనసేన ఆఫీస్‌ వద్ద ఎమ్మెల్యేపై దాడికి యత్నం! సొంత పార్టీ నేతలపైనే చిర్రి బాలరాజు ఫైర్‌!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Himanshu Rao Gym Accident: జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
DSP Bheem Reddy Remand: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
Nara Lokesh: దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
Modi Cabinet Expansion Postponed: మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
Ahmedabad Serial Blasts: అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
Cristiano Ronaldo Retirement: స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
Andhra Pradesh Zones: 2 మల్టీ జోన్లు... 6 జోన్లు- 26 జిల్లాల ప్రకారం ఏపీలో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు
2 మల్టీ జోన్లు... 6 జోన్లు- 26 జిల్లాల ప్రకారం ఏపీలో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు
Jangaon Crime News: నగ్నంగా మహిళ ఇంట్లోకి ప్రవేశించిన కౌన్సిలర్.. నోరు మూసి అత్యాచారయత్నం! జనగామలో దారుణం
నగ్నంగా మహిళ ఇంట్లోకి ప్రవేశించిన కౌన్సిలర్.. నోరు మూసి అత్యాచారయత్నం! జనగామలో దారుణం
Embed widget