అన్వేషించండి

Chandrababu: ఆ గోతులతో నా నడుం విరిగిపోయింది, నిర్వాసితుల్ని జగన్ ముంచేశారు: చంద్రబాబు

పోలవరం ఎడమ ప్రధాన కాలువ పరిధిలో కొత్తగా ఒక్క కట్టడం కూడా జగన్‌ మోహన్ రెడ్డి చేపట్టలేదని చంద్రబాబు విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల పరిశీలన కార్యక్రమం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చేరింది. ఉమ్మడి జిల్లాలోని నీటి ప్రాజెక్టుల స్థితి, కొత్త ప్రాజెక్టుల పనులపై చంద్రబాబు మంగళవారం (ఆగస్టు 8) పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. పోలవరం నిర్వాసితులను సీఎం జగన్ మోసం చేశారని చంద్రబాబు ఆరోపించారు. నాలుగేళ్లలో ఏ ఒక్కరికీ పరిహారం అందించలేదని అన్నారు. పైగా, లబ్ధిదారుల జాబితాలో మార్పులు చేసి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పట్టిసీమతో సమానంగా ఎకరానికి  రూ.19 లక్షలు పరిహారం ఇస్తానని జగన్ ఇచ్చిన హామీ ఏమైందని చంద్రబాబు జగన్‌ను నిలదీశారు.

తెలుగుదేశం ప్రభుత్వం హాయాంలో పోలవరం నిర్వాసితులకు కేంద్ర నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి పునరావాసం కల్పించామని గుర్తు చేశారు. ఇళ్ల నిర్మాణం కూడా వేగంగా చేపట్టామని గుర్తు చేశారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువ పరిధిలో కొత్తగా ఒక్క కట్టడం కూడా జగన్‌ మోహన్ రెడ్డి చేపట్టలేదని విమర్శించారు. ఇంకా 214 కట్టడాలు కట్టాల్సి ఉండగా, 50 శాతం కూడా కనెక్టివిటీ పనులు చేయలేదని, అవి ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయని అన్నారు. విశాఖపట్నం తాగునీటి అవసరాల కోసం ఉద్దేశించిన పురుషోత్తపట్నం ఎత్తిపోతల ప్రాజెక్టు నుంచి సుమారు 23 టీఎంసీల నీటిని సరఫరా చేయాలని ప్రణాళిక చేస్తే, దాన్ని కూడా వైసీపీ ప్రభుత్వం పక్కన పెట్టేసిందని చంద్రబాబు తప్పుబట్టారు.

ఇంకా మరో 2 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలనే ఉద్దేశంతో పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ప్రారంభిస్తే, పురుషోత్తపట్నం పథకానికి భూములు ఇచ్చిన రైతులను జగన్ మోసం చేశారని అన్నారు. రాజమండ్రి నుంచి పురుషోత్తపట్నంకు వచ్చే రహదారి కూడా గోతుల మయంగా ఉందని అన్నారు. ఆ గోతులతో తన నడుం విరిగిపోయిందని అన్నారు. చంద్రబాబు రాజమండ్రి నుంచి పురుషోత్తపట్నం చేరుకున్నారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం తొలి దశ పనులను చంద్రబాబు పరిశీలించారు.

టీడీపీ వచ్చాక పురుషోత్తపట్నం పూర్తి

టీడీపీ అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా రైతులకు నష్ట పరిహారం ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. రాజమండ్రి నుంచి పురుషోత్తంపట్నం వరకు రోడ్డు కూడా నిర్మాణం చేపడతానని అన్నారు. మోసం చేసే వైసీపీని ఓడించి బంగాళాఖాతంలో కలపాలని అన్నారు.

టాప్ హెడ్ లైన్స్

AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
Tenth Class Student Death: సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
Rains In AP, Telangana: వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ - మత్స్యకారులకు వార్నింగ్
వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ - మత్స్యకారులకు వార్నింగ్

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
కొత్త టయోటా హైలక్స్‌ వచ్చేసింది.. 360 డిగ్రీ కెమెరా, 204hp డీజిల్‌ ఇంజిన్‌తో అదిరిపోయే పికప్‌
2026 టయోటా హైలక్స్‌ లాంచ్‌.. కొత్త లుక్‌, కొత్త ఫీచర్లతో మీ ఆదాయానికి మరింత ఊపు
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
Embed widget