అన్వేషించండి

Pawan Kalyan : కఠినమైన చట్టాలు - సమాంతరంగా ఉద్యోగావకాశాలు ! ప్రభుత్వానికి గంజాయి సమస్యను నిర్మూలించే సలహాలిచ్చిన పవన్ కల్యాణ్ !

గంజాయి సమస్యను పరిష్కరించాలంటే కఠినమైనచట్టాలు, సమాంతరంగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ సూచించారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు.


గంజాయి స్మగ్లింగ్ అనేది సామాజిక ఆర్థిక అంశమని పవన్ కల్యాణ్ మరోసారి ట్వీట్ చేశారు. ఈ అంశాన్ని తాను 2018నుంచి హైలెట్ చేస్తున్నాననని గుర్తు చేశారు. ఆంధ్రా-ఒరిస్సా బోర్డర్‌లో ఇది గత పదిహేను, ఇరవై ఏళ్ల నుంచి ఉన్న సమస్యని.. ఒక్క సారిగా వచ్చి పడింది కాదన్నారు. అయితే ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గంజాయి స్మగ్లింగ్ విపరీతంగా పెరిపోయిందన్నారు.

Also Read : నిన్న నాగార్జున.. ఇవాళ దిల్ రాజు బృందం ! ఏపీ ప్రభుత్వంతో టాలీవుడ్ చర్చలే చర్చలు !

ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ గంజాయి మాఫియాకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని జనసేనాని స్పష్టం చేశారు. ఇందు కోసం కఠినమైన చట్టాలు చేయడంతో పాటు గిరిజన యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలన్నారు. ఈ రెండు సమాంతరంగా జరిగితేనే .. వేల కోట్లుగా రూపాంతరం చెందిన గంజాయి సమస్య నుంచి బయటపడతామన్నారు.  

Also Read : సూపర్ స్టార్ రజినీ హెల్త్‌పై భార్య కీలక ప్రకటన.. ఆరోగ్యం ఎలా ఉందంటే..

ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి సమస్య ఇప్పుడు రాజకీయం అయింది. ప్రభుత్వంపై విపక్ష తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు చేస్తోంది. ఏపీ నుంచి వస్తున్న గంజాయిని ఢిల్లీ సహా పొరుగు రాష్ట్రాు, ఇతర ఉత్తరాది రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున పట్టుకుంటున్నారు. దీంతో గంజాయి కేపిటల్‌గా ఏపీ మారిపోయిందన్న విమర్శలు వస్తున్నాయి. ఈ అంశంపై రేగిన రాజకీయ దుమారం, విమర్శలు - ప్రతి విమర్శల వల్లనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు టీడీపీ ఆఫీసుపై దాడులు చేశారు.  పట్టాభి ఇంట్లో విధ్వంసం సృష్టించారు. 

Also Read : పొత్తులపై మాట్లాడటానికి వాళ్లెవరు..? రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనన్న సీఎం రమేష్ !

ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా ఈ అంశంపై దృష్టి పెట్టారు. రెండు రోజుల నుంచి వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. గతంలో తాను ఒరిస్సా-ఆంధ్రా బోర్డర్‌లో పర్యటించినప్పుడే గుర్తించానని ప్రకటించారు. ఇటీవలి వరకు గంజాయి సమస్య ఇప్పటిది కాదని చెబుతూ వచ్చిన పోలీసులు ఇప్పుడు మనసు మార్చుకున్నారు. త్వరలో గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని డీజీపీ సవాంగ్ ప్రకటించారు. కావాలంటే ఎన్‌ఐఏ సాయం తీసుకుంటామన్నారు. త్వరలో విశాఖలో ఇతర రాష్ట్రాల పోలీసులతో సమావేశం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. 

Also Read : అలా అయితే రాష్ట్రాలను కలిపేస్తే సరిపోతుందిగా ? కేసీఆర్‌కు ఏపీ మంత్రి పేర్ని నాని కౌంటర్ !

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్‌లో దూకుడు - జగన్ సన్నిహితుల విచారణ - ఏం జరుగుతోంది?
ఏపీ లిక్కర్ స్కామ్‌లో దూకుడు - జగన్ సన్నిహితుల విచారణ - ఏం జరుగుతోంది?
Chief Minister Chandrababu Naidu: బ్లాక్ చైన్ టెక్నాలజీతో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు - హార్టికల్చర్ హబ్ సీమ - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
బ్లాక్ చైన్ టెక్నాలజీతో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు - హార్టికల్చర్ హబ్ సీమ - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Nara Lokesh: మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. కవితకు మళ్లీ నోటీసులు!
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. కవితకు మళ్లీ నోటీసులు!

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Velugumatla Issue: వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
Nara Lokesh: మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
Budget Session 2026: ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
Telangana Voter List: తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR ! వారి ఓట్లు గల్లంతే
తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR !
గూగుల్‌ నోట్ బుక్‌ ఎల్‌ఎమ్‌లో అద్భుతమైన ఫీచర‌-గంటల పని నిమిషాల్లోనే పూర్తి!
గూగుల్‌ నోట్ బుక్‌ ఎల్‌ఎమ్‌లో అద్భుతమైన ఫీచర‌-గంటల పని నిమిషాల్లోనే పూర్తి!
Pawan Kalyan CM: ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
Jana Nayagan : జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
Stock Market 9 March: మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలతో భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
Embed widget