By: ABP Desam | Updated at : 29 Oct 2021 02:23 PM (IST)
గంజాయి సమస్య నిర్మూలనకు పవన్ కల్యాణ్ సలహాలు
గంజాయి స్మగ్లింగ్ అనేది సామాజిక ఆర్థిక అంశమని పవన్ కల్యాణ్ మరోసారి ట్వీట్ చేశారు. ఈ అంశాన్ని తాను 2018నుంచి హైలెట్ చేస్తున్నాననని గుర్తు చేశారు. ఆంధ్రా-ఒరిస్సా బోర్డర్లో ఇది గత పదిహేను, ఇరవై ఏళ్ల నుంచి ఉన్న సమస్యని.. ఒక్క సారిగా వచ్చి పడింది కాదన్నారు. అయితే ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గంజాయి స్మగ్లింగ్ విపరీతంగా పెరిపోయిందన్నారు.
The issue of ‘Ganja smuggling’ should be seen as socio- economic issue in’Andhra Orissa border.’This issue did n’t occur suddenly,it’s been there since 15-20 years. I have been highlighting this issue since 2018. In current YCP rule the ganja smuggling has become more rampant. https://t.co/LhNL87eE1y
— Pawan Kalyan (@PawanKalyan) October 29, 2021
Also Read : నిన్న నాగార్జున.. ఇవాళ దిల్ రాజు బృందం ! ఏపీ ప్రభుత్వంతో టాలీవుడ్ చర్చలే చర్చలు !
ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ గంజాయి మాఫియాకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని జనసేనాని స్పష్టం చేశారు. ఇందు కోసం కఠినమైన చట్టాలు చేయడంతో పాటు గిరిజన యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలన్నారు. ఈ రెండు సమాంతరంగా జరిగితేనే .. వేల కోట్లుగా రూపాంతరం చెందిన గంజాయి సమస్య నుంచి బయటపడతామన్నారు.
YCP Govt should curb this menace.Strong law enforcement & equal employment opportunities should be created in parallel, to end this thousands crores of worth of ganja business.
— Pawan Kalyan (@PawanKalyan) October 29, 2021
Also Read : సూపర్ స్టార్ రజినీ హెల్త్పై భార్య కీలక ప్రకటన.. ఆరోగ్యం ఎలా ఉందంటే..
ఆంధ్రప్రదేశ్లో గంజాయి సమస్య ఇప్పుడు రాజకీయం అయింది. ప్రభుత్వంపై విపక్ష తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు చేస్తోంది. ఏపీ నుంచి వస్తున్న గంజాయిని ఢిల్లీ సహా పొరుగు రాష్ట్రాు, ఇతర ఉత్తరాది రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున పట్టుకుంటున్నారు. దీంతో గంజాయి కేపిటల్గా ఏపీ మారిపోయిందన్న విమర్శలు వస్తున్నాయి. ఈ అంశంపై రేగిన రాజకీయ దుమారం, విమర్శలు - ప్రతి విమర్శల వల్లనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు టీడీపీ ఆఫీసుపై దాడులు చేశారు. పట్టాభి ఇంట్లో విధ్వంసం సృష్టించారు.
Also Read : పొత్తులపై మాట్లాడటానికి వాళ్లెవరు..? రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనన్న సీఎం రమేష్ !
ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా ఈ అంశంపై దృష్టి పెట్టారు. రెండు రోజుల నుంచి వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. గతంలో తాను ఒరిస్సా-ఆంధ్రా బోర్డర్లో పర్యటించినప్పుడే గుర్తించానని ప్రకటించారు. ఇటీవలి వరకు గంజాయి సమస్య ఇప్పటిది కాదని చెబుతూ వచ్చిన పోలీసులు ఇప్పుడు మనసు మార్చుకున్నారు. త్వరలో గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని డీజీపీ సవాంగ్ ప్రకటించారు. కావాలంటే ఎన్ఐఏ సాయం తీసుకుంటామన్నారు. త్వరలో విశాఖలో ఇతర రాష్ట్రాల పోలీసులతో సమావేశం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
Breaking News Live Telugu Updates: జూబ్లీహిల్స్ లో కారు బీభత్సం, మద్యం మత్తు వల్లే ప్రమాదం?
Actor Prithvi On Nude Video: వ్రతం ముందురోజే ఆ దరిద్రం చూశా, అక్కాచెల్లెళ్లు ఫోన్లు చూడొద్దు - నటుడు పృథ్వీ
Tirumala: ప్రతి శుక్రవారం ఆకాశ గంగ నుండి పవిత్ర జలాలు శ్రీవారి ఆలయానికి, అలా ఎందుకు తెస్తారంటే?
Petrol-Diesel Price, 12 August: ఈ నగరంలో నేడు బాగా పెరిగిన ఇంధన ధరలు, ఇక్కడ తగ్గుదల - మీ ప్రాంతంలో ఈరోజు ఇలా
Weather Latest Update: ఇంకో అల్పపీడనం రేపు, తెలంగాణపై ఎఫెక్ట్ ఇలా! ఏపీలో వీరికి హెచ్చరిక: IMD
TS ECET Results 2022: తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ ఇక్కడ చూసుకోండి!
Nizamabad: పెళ్లి చేయట్లేదని తండ్రి, బాబాయ్ హత్య - కర్రతో చావ బాదిన కొడుకు!
Malik Review: మాలిక్ రివ్యూ: ఫహాద్ ఫాజిల్ గ్యాంగ్స్టర్ థ్రిల్లర్ ఆకట్టుకుంటుందా?
Telangana Cabinet : ఆగస్టు 15 నుంచి పది లక్షల మంది కొత్తగా సామాజిక పెన్షన్లు - తెలంగాణ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు !