అన్వేషించండి

CM Ramesh : పొత్తులపై మాట్లాడటానికి వాళ్లెవరు..? రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనన్న సీఎం రమేష్ !

తెలుగుదేశం పార్టీతో పొత్తుపై బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇతర నేతలు ఎవరు ఎన్ని వ్యాఖ్యలు చేసినా పార్టీ అధ్యక్షుడిదే నిర్ణయమన్నారు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని వ్యాఖ్యానించారు.


సాధారణ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్లు ఉన్న సమయంలోనే ఆంధ్రప్రదేశ్‌లో పొత్తులపై చర్చ జరుగుతోంది. జనసేన - టీడీపీ కలిస్తే మంచి ఫలితాలు వస్తాయంటూ ఓ వైపు విశ్లేషకులు చర్చలు జరుపుతూ ఆ దిశగా రెండు పార్టీలను మోటివేట్ చేసే ప్రయత్నం చేస్తూంటే.. తాజాగా రేసులోకి బీజేపీ వచ్చింది. టీడీపీతో పొత్తే లేదంటూ జీవీఎల్ నరసింహారావు, సోము వీర్రాజు, సునీల్ ధియోధర్ వంటి వారు అదే పనిగా ప్రకటనలు చేస్తూంటారు. ట్వీట్లు చేస్తూంటారు. అయితే వీరికి భిన్నంగా మాట్లాడారు ఎంపీ సీఎం రమేష్. పొత్తుల గురించి మాట్లాడటానికి వీరెవరని.. ఆయన వ్యాఖ్యానించారు. 

Also Read : అమరావతి రైతుల మహా పాదయాత్రకు నో పర్మిషన్.. శాంతిభద్రతల సమస్య వస్తుందన్న డీజీపీ !

బీజేపీ ఎవరితో అయినా పొత్తులు పెట్టుకోవాలనుకుంటే నిర్ణయం తీసుకోవాల్సింది జాతీయ అధ్యక్షుడని సీఎం రమేష్ స్పష్టం చేశారు. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చని ప్రకటించి కొత్తగా ఊహాగానాలకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు సీఎం రమేష్ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కొత్తగా చర్చనీయాంశం అవుతున్నాయి.  2014లో బీజేపీ - జనసేన - టీడీపీ కలిసి పోటీ చేసి అధికారం దక్కించుకున్నాయి. అయితే 2019లో అందరూ ఎవరికి వారే పోటీ చేశారు. ఫలితంగా ఘోర పరాజయం పాలయ్యారు. అప్పట్నుంచి మళ్లీ పొత్తుల గురించి చర్చ జరుగుతూనే ఉంది.

Also Read : హస్తినలో ఏపీ రాజకీయం... టీడీపీ గుర్తింపు రద్దు చేయాలని ఈసీకి వైసీపీ ఫిర్యాదు

తెలుగుదేశం పార్టీ నేతలు బీజేపీతో పొత్తు గురించి పెద్దగా స్పందించడం లేదు. ఆ పార్టీకి ఒక్క శాతం మాత్రమే ఓటు బ్యాంక్ కనిపిస్తోంది. జనసేన పార్టీ కలిసి వస్తామంటే టీడీపీ సంతోషంగా ఆహ్వానిస్తుంది. 2019 ఎన్నికల సమయంలో చివరి నిమిషంలో కూడా చంద్రబాబు కలసి రావాలని పవన్ కల్యాణ్‌ను ఆహ్వానించారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ బీజేపీతో పొత్తులో ఉన్నారు. ఒక వేళ కలసి వస్తే మూడు పార్టీలు కూటమిగా పోటీ చేయాల్సి ఉంటుంది. 

Also Read : జగన్‌ను చూసేందుకు వచ్చా ! భేటీ వ్యక్తిగతమేనన్న నాగార్జున !

సీఎం రమేష్ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు, రాష్ట్ర బీజేపీ నేతలు ఇంకా స్పందించలేదు. సీఎం రమేష్ గతంలో టీడీపీలోనే ఉన్నారు. ఆయన టీడీపీ తరపునే ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితునిగా పేరుంది. ఈ క్రమంలో సీఎం రమేష్ వ్యాఖ్యలపై బీజేపీలో మరో వర్గం ఎలా స్పందిస్తుందన్నదానిపై ఆసక్తి వ్యక్తమవుతోంది.  సీఎం రమేష్ పొత్తులు ఉంటాయని చెప్పలేదు కానీ.. రాజకీయాల్లో ఏదీ అసాధ్యం కాదని ఆయన చెప్పారు. అది మాత్రం వంద శాతం నిజమని అనుకోవచ్చు. 

Also Read : అలా అయితే రాష్ట్రాలను కలిపేస్తే సరిపోతుందిగా ? కేసీఆర్‌కు ఏపీ మంత్రి పేర్ని నాని కౌంటర్ !

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Breaking News: నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
Netanna Sevalo Scheme: ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
Uravakonda latest News: ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
Telangana Constable: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
Spider Man Collections : ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
Netanna Sevalo Scheme: ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Varanasi : వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
Embed widget