అన్వేషించండి

YSRCP MPs CEC Meet: హస్తినలో ఏపీ రాజకీయం... టీడీపీ గుర్తింపు రద్దు చేయాలని ఈసీకి వైసీపీ ఫిర్యాదు

ఏపీలో పట్టాభి వ్యాఖ్యలతో మొదలైన పొలిటికల్ వార్ ఇంకా కొనసాగుతోంది. ఇవాళ వైసీపీ ఎంపీలు ఈసీని కలిసి టీడీపీ గుర్తింపు రద్దు చేయాలని ఫిర్యాదు చేశారు.

ఏపీలో పొలిటికల్ హీట్ కొనసాగుతుంది. టీడీపీ కార్యాలయాలపై దాడి ఘటన అనంతరం వైఎస్ఆర్సీపీ, టీడీపీ కేంద్ర పెద్దలను కలిసి పోటాపోటీగా ఫిర్యాదు చేసుకుంటున్నారు. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రపతిని కలిసి ఏపీలో పరిస్థితులపై ఫిర్యాదు చేశారు. ఇప్పుడు వైసీపీ కూడా అదే దారిలో హస్తిన బాటపట్టింది. టీడీపీ గుర్తింపు రద్దు చేయాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేసింది. గురువారం ఎంపీ విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ ఎంపీలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. టీడీపీ గుర్తింపు రద్దుచేయాలని ఈసీని కోరారు. టీడీపీ నేత పట్టాభిరామ్ సీఎం జగన్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలతో ఏపీలో రాజకీయ పరిమాణాలు వేగంగా మారాయి. టీడీపీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణులు దాడి చేశారు. ఇందుకు నిరసనగా టీడీపీ అధినేత చంద్రబాబు 36 గంటల పాటు నిరసన దీక్ష చేశారు. అనంతరం దిల్లీ వెళ్లి రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు. 

Also Read: జగన్‌తో భేటీకి తాడేపల్లికి వచ్చిన నాగార్జున ! టాలీవుడ్ కోసం కాదు.. వ్యక్తిగతమే ?

అమిత్ షాకు ఫిర్యాదు

టీడీపీ నేతలు సీఎం జగన్, అధికార పార్టీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని వైసీపీ ఎంపీలు సీఈసీకి ఫిర్యాదు చేశారు. సీఎం, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ప్రజాప్రతినిధులందరినీ టీడీపీ నేతలు దూషిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారడానికి టీడీపీ అధినేత చంద్రబాబు కారణమని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శించారు. సీఈసీని కలిసిన వైసీపీ ఎంపీలలో విజయసాయి రెడ్డి, మార్గాని భరత్, ఎన్. రెడ్డప్ప, డా.సత్యవతి, తలారి రంగయ్య, డా.సంజీవ్, మాధవి, గోరంట్ల మాధవ్ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను గురువారం కలిశారు. వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డిపై టీడీపీ చేసిన అనుచిత వ్యాఖ్యలను అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లారు. అసభ్యంగా మాట్లాడిన వారిని శిక్షించేలా చట్టాలను కఠినతరం చేయాలని కేంద్ర మంత్రి అమిత్‌ షాకు ఎంపీ గోరంట్ల కోరారు.  

Also Read:  జూన్ నుంచి అమ్మఒడి.. అదానీకి విశాఖలో 130 ఎకరాలు.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు !

డ్రగ్స్ వ్యవహారంపై మాటల యుద్ధం

రాష్ట్రంలో డ్రగ్స్ దందా పెరుగుతోందని ప్రతిపక్ష నేతలు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీంతో వైసీపీ నేతలు కూడా అంతే స్థాయిలో టీడీపీపై విమర్శలు చేశారు. విశాఖ మన్యంలో గంజాయికి సంబంధించి టీడీపీ నేతలు నక్కా ఆనందబాబు, పట్టాభి చేసిన వ్యాఖ్యలను వైసీపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఇందులో భాగంగా నక్కా ఆనందబాబుకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీంతో పట్టాభి వైసీపీపై విరుచుకు పడ్డారు. 

Also Read:  పోలీసులు పట్టాభిని కొట్టారన్న రఘురామ .. ఆధారాలడిగితే ఇస్తానన్న ఎంపీ !

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP Free Bus: దివ్యాంగులకు శుభవార్త.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ!
దివ్యాంగులకు శుభవార్త.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ!
Kakinada Fireworks Explosion: వేట్లపాలెం ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.20 లక్షలు, పక్కా ఇళ్లు- నలుగురు అధికారులపై వేటు!
వేట్లపాలెం ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.20 లక్షలు, పక్కా ఇళ్లు- నలుగురు అధికారులపై వేటు!
UTS మొబైల్ యాప్‌లో ట్రైన్ టికెట్ తీసుకుంటున్నారా.. యాప్ మూసేస్తున్న రైల్వే.. వాలెట్ లోని డబ్బులు ఏమవుతాయి..?
UTS మొబైల్ యాప్‌లో ట్రైన్ టికెట్ తీసుకుంటున్నారా.. యాప్ మూసేస్తున్న రైల్వే.. వాలెట్ లోని డబ్బులు ఏమవుతాయి..?
AP CM Chandrababu: వేట్లపాలెంలో బాణసంచా పేలుడు స్థలాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు
వేట్లపాలెంలో బాణసంచా పేలుడు స్థలాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు

వీడియోలు

ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
ABP Network Ideas of India Summit 2026 Inaguration | ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సమ్మిట్ ప్రారంభం | ABP Desam
Kavitha about Delhi Liquor Scam Case | లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్
India vs Zimbabwe Highlights T20 World Cup | జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా
Rinku Singh Father Passes Away | రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Israel Strike On Iran: ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
PM Modi On Kakinada Incident: సామర్లకోట ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
సామర్లకోట బాణసంచా ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
Pakistan vs Sri Lanka: టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ రికార్డు బద్ధలుకొట్టిన పాక్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్
టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ రికార్డు బద్ధలుకొట్టిన పాక్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్
Kokapet Swarupananda Lands: కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
Nara Lokesh : సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
TTD budget: వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
Ananya Nagalla: తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
Ranji Trophy Winner: తొలిసారి రంజీ ట్రోఫీ టైటిల్‌ నెగ్గిన జమ్మూ కాశ్మీర్.. ఫైనల్లో కర్ణాటకపై ఘనవిజయం
తొలిసారి రంజీ ట్రోఫీ టైటిల్‌ నెగ్గిన జమ్మూ కాశ్మీర్.. ఫైనల్లో కర్ణాటకపై ఘనవిజయం
Embed widget