అన్వేషించండి

YSRCP MPs CEC Meet: హస్తినలో ఏపీ రాజకీయం... టీడీపీ గుర్తింపు రద్దు చేయాలని ఈసీకి వైసీపీ ఫిర్యాదు

ఏపీలో పట్టాభి వ్యాఖ్యలతో మొదలైన పొలిటికల్ వార్ ఇంకా కొనసాగుతోంది. ఇవాళ వైసీపీ ఎంపీలు ఈసీని కలిసి టీడీపీ గుర్తింపు రద్దు చేయాలని ఫిర్యాదు చేశారు.

ఏపీలో పొలిటికల్ హీట్ కొనసాగుతుంది. టీడీపీ కార్యాలయాలపై దాడి ఘటన అనంతరం వైఎస్ఆర్సీపీ, టీడీపీ కేంద్ర పెద్దలను కలిసి పోటాపోటీగా ఫిర్యాదు చేసుకుంటున్నారు. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రపతిని కలిసి ఏపీలో పరిస్థితులపై ఫిర్యాదు చేశారు. ఇప్పుడు వైసీపీ కూడా అదే దారిలో హస్తిన బాటపట్టింది. టీడీపీ గుర్తింపు రద్దు చేయాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేసింది. గురువారం ఎంపీ విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ ఎంపీలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. టీడీపీ గుర్తింపు రద్దుచేయాలని ఈసీని కోరారు. టీడీపీ నేత పట్టాభిరామ్ సీఎం జగన్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలతో ఏపీలో రాజకీయ పరిమాణాలు వేగంగా మారాయి. టీడీపీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణులు దాడి చేశారు. ఇందుకు నిరసనగా టీడీపీ అధినేత చంద్రబాబు 36 గంటల పాటు నిరసన దీక్ష చేశారు. అనంతరం దిల్లీ వెళ్లి రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు. 

Also Read: జగన్‌తో భేటీకి తాడేపల్లికి వచ్చిన నాగార్జున ! టాలీవుడ్ కోసం కాదు.. వ్యక్తిగతమే ?

అమిత్ షాకు ఫిర్యాదు

టీడీపీ నేతలు సీఎం జగన్, అధికార పార్టీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని వైసీపీ ఎంపీలు సీఈసీకి ఫిర్యాదు చేశారు. సీఎం, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ప్రజాప్రతినిధులందరినీ టీడీపీ నేతలు దూషిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారడానికి టీడీపీ అధినేత చంద్రబాబు కారణమని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శించారు. సీఈసీని కలిసిన వైసీపీ ఎంపీలలో విజయసాయి రెడ్డి, మార్గాని భరత్, ఎన్. రెడ్డప్ప, డా.సత్యవతి, తలారి రంగయ్య, డా.సంజీవ్, మాధవి, గోరంట్ల మాధవ్ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను గురువారం కలిశారు. వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డిపై టీడీపీ చేసిన అనుచిత వ్యాఖ్యలను అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లారు. అసభ్యంగా మాట్లాడిన వారిని శిక్షించేలా చట్టాలను కఠినతరం చేయాలని కేంద్ర మంత్రి అమిత్‌ షాకు ఎంపీ గోరంట్ల కోరారు.  

Also Read:  జూన్ నుంచి అమ్మఒడి.. అదానీకి విశాఖలో 130 ఎకరాలు.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు !

డ్రగ్స్ వ్యవహారంపై మాటల యుద్ధం

రాష్ట్రంలో డ్రగ్స్ దందా పెరుగుతోందని ప్రతిపక్ష నేతలు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీంతో వైసీపీ నేతలు కూడా అంతే స్థాయిలో టీడీపీపై విమర్శలు చేశారు. విశాఖ మన్యంలో గంజాయికి సంబంధించి టీడీపీ నేతలు నక్కా ఆనందబాబు, పట్టాభి చేసిన వ్యాఖ్యలను వైసీపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఇందులో భాగంగా నక్కా ఆనందబాబుకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీంతో పట్టాభి వైసీపీపై విరుచుకు పడ్డారు. 

Also Read:  పోలీసులు పట్టాభిని కొట్టారన్న రఘురామ .. ఆధారాలడిగితే ఇస్తానన్న ఎంపీ !

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
RTA Challan Link Scam: ఎమ్మెల్యేకే తప్పని సైబర్ షాక్.. చలాన్ పేరుతో లింక్, ఒక్క క్లిక్‌తో ₹12 లక్షలు మాయం
ఎమ్మెల్యేకే తప్పని సైబర్ షాక్.. చలాన్ పేరుతో లింక్, ఒక్క క్లిక్‌తో ₹12 లక్షలు మాయం
AP Ration Shops: ఏపీలో రేషన్ షాపుల్లో మళ్లీ కిరోసిన్ పంపిణీ.. గ్యాస్ కొరతతో ప్రభుత్వం నిర్ణయం
ఏపీలో రేషన్ షాపుల్లో మళ్లీ కిరోసిన్ పంపిణీ.. గ్యాస్ కొరతతో ప్రభుత్వం నిర్ణయం
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran US War Updates: శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
SRH Playing 11: ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. సన్‌రైజర్స్ ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. SRH ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
Embed widget