Pawan Kalyan Delhi Tour: ఢిల్లీలో పవన్ కల్యాణ్ బిజీ టూర్ - అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులతో చర్చలు
Pawan Kalyan: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులతో కీలక సమావేశాలు నిర్వహించారు. రాష్ట్ర అంశాలపై మాట్లాడారు.

Pawan Kalyan busy tour in Delhi : ఢిల్లీ పర్యటనలో భాగంగా పవన్ కల్యాణ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కీలక పెండింగ్ సమస్యలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ,పరిపాలనాపరమైన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా రాష్ట్ర భద్రత ,శాంతిభద్రతల అంశాలతో పాటు, విభజన చట్టంలోని హామీల అమలు కోసం కేంద్రం నుండి అందాల్సిన పూర్తి సహకారంపై ఆయన విన్నవించారు.
కాకినాడ జిల్లాలోని ఉప్పాడ తీర ప్రాంత కోతను అరికట్టేందుకు ప్రతిపాదించిన ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాల్ ప్రాజెక్టు గురించి పవన్ కల్యాణ్ హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ ప్రతిపాదనను NDMA టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ముందు ఉంచేందుకు అవకాశం ఇచ్చినందుకు ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధుల విడుదలకు సహకరించాలని కోరారు. తీర ప్రాంత ప్రజల రక్షణ కోసం ఈ ప్రాజెక్టు అత్యంత కీలకమని ఆయన స్పష్టం చేశారు.
Today, I had a meaningful meeting with Hon’ble Union Home Minister Shri @AmitShah ji at his residence. We held detailed discussions on the ongoing issues in Andhra Pradesh, and several other important matters of public and administrative importance.
— Pawan Kalyan (@PawanKalyan) January 28, 2026
I extended my sincere thanks… pic.twitter.com/XoF9Qi4WKO
కేంద్ర రైల్వే , ఐటీ శాఖ మంత్రి అశ్వనీ వైష్ణువ్ తో జరిగిన సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీలో రైల్వే మౌలిక సదుపాయాల కల్పన, ముఖ్యంగా విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని పవన్ కల్యాణ్ కోరారు. అలాగే రాష్ట్రంలో కొత్త రైల్వే లైన్ల నిర్మాణం, రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, ఐటీ రంగంలో రాష్ట్రానికి రావాల్సిన కొత్త ప్రాజెక్టుల గురించి ఈ భేటీలో వివరించారు.
With a focus on improving rail infrastructure in Andhra Pradesh, Today I met Hon’ble Union Railway Minister Shri @AshwiniVaishnaw ji to discuss the development of Pithapuram Railway Station, construction of a Road Over Bridge, and key railway projects in the state.
— Pawan Kalyan (@PawanKalyan) January 28, 2026
I requested… pic.twitter.com/Kw6xSco6Tl
ఈ ఢిల్లీ పర్యటన కేవలం వినతులకే పరిమితం కాకుండా, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయాన్ని పటిష్టం చేసే దిశగా సాగింది. వివిధ కేంద్ర మంత్రులతో జరిగిన వరుస భేటీల ద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సానుకూలత వ్యక్తం చేసినట్లు సమాచారం. రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా ఈ పర్యటనలో పవన్ కల్యాణ్ అనేక పరిపాలనాపరమైన మరియు ,అభివృద్ధికి సంబంధించిన సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















