![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Amaravati Dalit Lands : అమరావతి అసైన్డ్ భూములు వెనక్కి తీసుకుంటారా..? దళిత రైతులకు ప్రభుత్వం ఇచ్చిన నోటీసుల సీక్రెట్ ఇదే..!
నాలుగో కేటగిరీ అసైన్డ్ రైతులకు గత ప్రభుత్వంలో సీఆర్డీఏ కేటాయించిన ప్లాట్లను రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. నిబంధనల ఉల్లంఘన జరిగిందని నోటీసులు జారీ చేసింది.
![Amaravati Dalit Lands : అమరావతి అసైన్డ్ భూములు వెనక్కి తీసుకుంటారా..? దళిత రైతులకు ప్రభుత్వం ఇచ్చిన నోటీసుల సీక్రెట్ ఇదే..! Notices to those who bought another operation-assigned land in Amravati Amaravati Dalit Lands : అమరావతి అసైన్డ్ భూములు వెనక్కి తీసుకుంటారా..? దళిత రైతులకు ప్రభుత్వం ఇచ్చిన నోటీసుల సీక్రెట్ ఇదే..!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/03/fe004d56ce9b683670c656f7222ed802_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు ఇప్పుడల్లా ఉండదని కేంద్ర ప్రభుత్వం మరోసారి చాలా స్పష్టంగా తెలిపింది. విభజన చట్టం ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లను ఎప్పుడు పెంచుతారని లోక్సభలో ఎంపీ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఆయన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ లో నియోజకవర్గాలను 175 నుంచి 225 కు, తెలంగాణలో అసెంబ్లీ సీట్లను 119 నుంచి 153కు పెంచేందుకు పరిశీలన చేయాలని ఉంది. కానీ ఖచ్చితంగా పెంచాలని లేదు.
ఇక్కడే అసలు సమస్య వచ్చింది. గతంలో నియోజకవర్గాల పునర్విభజన చేసినప్పుడు 2026 వరకు అసెంబ్లీ సీట్లలో మార్పులు, చేర్పులు చేయకుండా సీలింగ్ పెట్టారు. అందుకే అసెంబ్లీ సీట్లను పెంచాలంటే ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. శాసనసభ స్థానాల పెంచాలంటే ఆర్టికల్ 170 (3)ను సవరించాలని, అందుకే అసెంబ్లీ సీట్ల పెంపు ప్రక్రియ 2026వరకు సాధ్యం కాదని కేంద్రం గతంలోనే పార్లమెంట్ లో చెప్పింది. 2026 తర్వాత ప్రచురించే జనాభా లెక్కల ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని కేంద్ర మంత్రి తెలిపారు. అయితే నియోజకవర్గాల పునర్విభజన అని.. తరచూ వార్తలు వస్తూనే ఉన్నాయి. 2014లో రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలుగా ఉన్నా తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలు.. అసెంబ్లీ సీట్ల పెంపు కోసం తీవ్రంగా పట్టుబట్టాయి. ప్రభుత్వంలో భాగంగా ఉన్న టీడీపీ నేతలు.. ఇందు కోసం తీవ్రమైన ప్రయత్నాలే చేశారు. కానీ రాజ్యాంగ సవరణ చిక్కులతో ఎక్కడిదక్కడ ఉండిపోయింది.
మారిన రాజకీయ పరిస్థితుల్లో అసెంబ్లీ సీట్ల పెంపు ఉంటుందని అవరూ అనుకోవడంలేదు. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు రెండూ... సీట్ల పెంపు గురించి ఆలోచించడమే మానేశాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఈ అంశాన్ని లోక్సభలో ప్రశ్న ద్వారా అడగడంతో కేంద్రం సూటిగా సమాధానం చెప్పింది. జమ్మూకశ్మీర్లో ఆర్టికల్ 370ను రద్దు చేసి రెండు రాష్ట్రాలుగా విడగొట్టిన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన చేయాలని కేంద్రం నిర్ణయించింది. జమ్మూ కశ్మీర్లో సీట్లు పెంచిన తర్వాతే ఎన్నికలు నిర్వహించనున్నారు. అందుకే ఇటీవల కశ్మీర్ నేతలందర్నీ పిలిచి మోడీ సమావేశం నిర్వహించారు. అయితే కశ్మీర్లో నియోజకవర్గాల పునర్విభజన చేయడానికి రాజ్యాంగసవరణ చేయాల్సిన అవసరం లేదు. అయితే వాటితో పాటే తెలుగు రాష్ట్రాల్లోనూ డీమిలేటేషన్ చేస్తారన్న ప్రచారం మాత్రం సాగుతోంది. ఆ ప్రచారానికి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి సమాధానం చెక్ పెట్టినట్లయింది.
నియోజకవర్గాల పెంపు హామీ విభజన చట్టంలో ఉందని దాన్ని నెరవేర్చకపోతే ఎలా అనికొంత మంది ప్రశ్నిస్తూ ఉంటారు. అయితే విభజన చట్టంలో ఏదీ ఖచ్చితంగా చేయాలని పెట్టలేదు. పరిశీలించాలి.. అధ్యయనం చేయాలి అని మాత్రమే ఉన్నాయి. ఈ కారణంగా.. ఖచ్చితంగా నియోజకవర్గాల పునర్విభజన చేయాల్న రూలేమీ లేదు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)