అన్వేషించండి

Nara Lokesh: 'జగన్ హ్యాండ్సప్ వైసీపీ ప్యాకప్' - అమరావతి రైతుల ఆశయం త్వరలోనే నెరవేరుతుందన్న లోకేశ్

Andhra News: ఓడినా తనకు విచారం లేదంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. 2024లో ఇక ఆయన అధికారంలో ఉండరని అన్నారు.

Nara Lokesh Comments on CM Jagan: 'ఇప్పటికిప్పుడు ఎన్నికల్లో ఓడినా తనకు విచారం లేదు. నాకు ఎంతో సంతోషం' అంటూ సీఎం జగన్ (CM Jagan) చేసిన వ్యాఖ్యలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 'జగన్ హ్యాండ్సప్.. వైసీపీ ప్యాకప్' అంటూ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. బై బై జగన్, 2024లో ఆయన ఇక అధికారంలో ఉండరని అన్నారు. అటు, అమరావతి రైతుల ఉద్యమం 1500 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. 'కుట్రలు, కుతంత్రాలు, కుయుక్తులకు ఎదురొడ్డి అమరావతి నిలబడింది. అమరావతి పరిరక్షణకు రాజధాని రైతులు చేపట్టిన ఉద్యమం గురువారంతో 1500 రోజులు పూర్తి చేసుకుంది. ప్రజా రాజధాని కోసం ఇన్ని రోజులుగా నియంతపై పోరాడుతోన్న రైతులకు ఉద్యమాభివందనాలు. అమరావతి కోసం పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పిస్తున్నా. త్వరలోనే మీ ఆశయం నెరవేరుతుంది. రాష్ట్రం, భావితరాల భవిష్యత్తు కోసం భూమిని త్యాగం చేసిన రైతులకు న్యాయం జరుగుతుంది. అధర్మంపై ధర్మం విజయం సాధిస్తుంది.' అని పేర్కొన్నారు. 

1500 రోజులకు ఉద్యమం

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 3 రాజధానులకు వ్యతిరేకంగా.. అమరావతి పరిరక్షణే ధ్యేయంగా రైతులు, మహిళలు సాగిస్తున్న పోరాటం గురువారానికి 1500వ రోజుకు చేరుకుంది. అమరావతి నిర్మాణంపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఇన్ని రోజులుగా అక్కడి వారు ఆందోళన చేస్తూనే ఉన్నారు. సర్కారు నిర్ణయానికి వ్యతిరేకంగా న్యాయస్థానాల మెట్లు ఎక్కారు. పాదయాత్రలతో అమరావతి ప్రాధాన్యతను అందరికీ తెలిసేలా ఉద్యమం ఉద్ధృతం చేశారు. రాజధాని రైతులు 2021 నవంబర్ 1న 'న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు' పేరుతో తుళ్లూరు నుంచి తిరుమలకు పాదయాత్ర చేశారు. అలాగే, 2022, సెప్టెంబర్ 12 నుంచి శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి నుంచి పాదయాత్ర ప్రారంభించారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ రైతులు రామచంద్రాపురం వరకూ ఈ యాత్ర చేపట్టి ఆ తర్వాత పరిస్థితుల దృష్ట్యా నిలిపేశారు.

'250 మందికి పైగా మరణం'

2019, డిసెంబర్ 17న సీఎం జగన్ శాసనసభలో 3 రాజధానుల ప్రతిపాదన చేశారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని గ్రామాల్లో నిరసనలు హోరెత్తాయి. ఆ రోజు నుంచి ఇప్పటివరకూ ఆ ప్రాంత రైతులు, మహిళలు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. రైతులు, కూలీలు, మహిళలు, రాజధాని మద్దతుదారులపై దాదాపు 720కి పైగా కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. 3 రాజధానుల నిర్ణయంతో తీవ్ర మనస్తాపం చెంది అనేక మంది ఉద్యమకారులు, రైతులు, కూలీలు కన్నుమూశారని అమరావతి ఐకాస తెలిపింది. ఇప్పటి వరకూ 250 మందికి పైగా మృతి చెందినట్లు పేర్కొంది.

ప్రత్యేక కార్యాచరణ

అమరావతి ఉద్యమం 1500 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ పోరాట స్ఫూర్తిని దశదిశలా చాటేందుకు ఐకాస ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది. ప్రభుత్వం తమను ఇబ్బంది పెడుతున్న తీరును ప్రజలకు తెలియజేయాలని రాజధాని రైతులు భావిస్తున్నారు. 'అమరావతి సమర శంఖారావం' పేరుతో నిరసన కార్యక్రమాలు, రాజధాని గ్రామాల్లోని శిబిరాల్లో వినూత్న రీతిలో నిరసనలు, సభలు, సమావేశాలు నిర్వహించనున్నారు. వెలగపూడి దీక్షా శిబిరం, మందడం గ్రామదేవత పోలేరమ్మ ఆలయం వద్ద సభల్ని ఏర్పాటు చేస్తున్నారు. ఉద్యమ నేపథ్యం, పోరాట ఘట్టాల్ని వివరించేలా ప్రత్యేక గీతాల్ని ఆవిష్కరించనున్నారు.

Also Read: సంక్షేమ పథకాలే ప్రభుత్వాన్ని నిలబెడతాయి- ఆధారాలతోనే చంద్రబాబు అరెస్ట్: సీఎం జగన్

టాప్ హెడ్ లైన్స్

Breaking News: గచ్చిబౌలిలో ట్రిపుల్‌ ఐటీ విద్యార్థి ఆత్మహత్య.. ఆరో అంతస్తు నుంచి దూకడంతో విషాదం
గచ్చిబౌలిలో ట్రిపుల్‌ ఐటీ విద్యార్థి ఆత్మహత్య.. ఆరో అంతస్తు నుంచి దూకడంతో విషాదం
Sai Krishna Case: ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
Vijayawada Sai Krishna Case: సాయికృష్ణ లాకప్ డెత్.. విచారణకు హాజరైన వైసీపీ నేతలు, బాధిత కుటుంబసభ్యులు.. సీబీఐ విచారణకు వినతి
సాయికృష్ణ లాకప్ డెత్.. విచారణకు హాజరైన వైసీపీ నేతలు, బాధిత కుటుంబసభ్యులు.. సీబీఐ విచారణకు వినతి
Rayalaseema Manufacturing Hub: పారిశ్రామిక చదరంగంలో ‘రాయల్’ సీమ.. తయారీ రంగ కేంద్రంగా మార్చేందుకు కూటమి సర్కార్ పక్కా స్కెచ్!
పారిశ్రామిక చదరంగంలో ‘రాయల్’ సీమ.. తయారీ రంగ కేంద్రంగా మార్చేందుకు కూటమి సర్కార్ పక్కా స్కెచ్!

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Parliament Monsoon Session 2026: జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
Notice To Telegram: పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
TRS Chief Kavitha: టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
Hindu Dharma: హిందూ ధర్మం -
హిందూ ధర్మం - "దుస్తులకు సంబంధించిందా , గుణానికి సంబంధించిందా?
Vijayawada Sai Krishna Case: సాయికృష్ణ లాకప్ డెత్.. విచారణకు హాజరైన వైసీపీ నేతలు, బాధిత కుటుంబసభ్యులు.. సీబీఐ విచారణకు వినతి
సాయికృష్ణ లాకప్ డెత్.. విచారణకు హాజరైన వైసీపీ నేతలు, బాధిత కుటుంబసభ్యులు.. సీబీఐ విచారణకు వినతి
Rayalaseema Manufacturing Hub: పారిశ్రామిక చదరంగంలో ‘రాయల్’ సీమ.. తయారీ రంగ కేంద్రంగా మార్చేందుకు కూటమి సర్కార్ పక్కా స్కెచ్!
పారిశ్రామిక చదరంగంలో ‘రాయల్’ సీమ.. తయారీ రంగ కేంద్రంగా మార్చేందుకు కూటమి సర్కార్ పక్కా స్కెచ్!
Telangana Police Recruitment 2026: తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ కొలువులు జాతర! ఐదు వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్!
తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ కొలువులు జాతర! ఐదు వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్!
200 Rupee News: 200 రూపాయల నోటు అసలైనదో, నకిలీదో ఎలా గుర్తించాలి? ఆర్‌బిఐ చెప్పిన ట్రిక్స్‌ ఇవే!
200 రూపాయల నోటు అసలైనదో, నకిలీదో ఎలా గుర్తించాలి? ఆర్‌బిఐ చెప్పిన ట్రిక్స్‌ ఇవే!
Embed widget