అన్వేషించండి

Nara Lokesh: 'జగన్ హ్యాండ్సప్ వైసీపీ ప్యాకప్' - అమరావతి రైతుల ఆశయం త్వరలోనే నెరవేరుతుందన్న లోకేశ్

Andhra News: ఓడినా తనకు విచారం లేదంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. 2024లో ఇక ఆయన అధికారంలో ఉండరని అన్నారు.

Nara Lokesh Comments on CM Jagan: 'ఇప్పటికిప్పుడు ఎన్నికల్లో ఓడినా తనకు విచారం లేదు. నాకు ఎంతో సంతోషం' అంటూ సీఎం జగన్ (CM Jagan) చేసిన వ్యాఖ్యలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 'జగన్ హ్యాండ్సప్.. వైసీపీ ప్యాకప్' అంటూ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. బై బై జగన్, 2024లో ఆయన ఇక అధికారంలో ఉండరని అన్నారు. అటు, అమరావతి రైతుల ఉద్యమం 1500 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. 'కుట్రలు, కుతంత్రాలు, కుయుక్తులకు ఎదురొడ్డి అమరావతి నిలబడింది. అమరావతి పరిరక్షణకు రాజధాని రైతులు చేపట్టిన ఉద్యమం గురువారంతో 1500 రోజులు పూర్తి చేసుకుంది. ప్రజా రాజధాని కోసం ఇన్ని రోజులుగా నియంతపై పోరాడుతోన్న రైతులకు ఉద్యమాభివందనాలు. అమరావతి కోసం పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పిస్తున్నా. త్వరలోనే మీ ఆశయం నెరవేరుతుంది. రాష్ట్రం, భావితరాల భవిష్యత్తు కోసం భూమిని త్యాగం చేసిన రైతులకు న్యాయం జరుగుతుంది. అధర్మంపై ధర్మం విజయం సాధిస్తుంది.' అని పేర్కొన్నారు. 

1500 రోజులకు ఉద్యమం

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 3 రాజధానులకు వ్యతిరేకంగా.. అమరావతి పరిరక్షణే ధ్యేయంగా రైతులు, మహిళలు సాగిస్తున్న పోరాటం గురువారానికి 1500వ రోజుకు చేరుకుంది. అమరావతి నిర్మాణంపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఇన్ని రోజులుగా అక్కడి వారు ఆందోళన చేస్తూనే ఉన్నారు. సర్కారు నిర్ణయానికి వ్యతిరేకంగా న్యాయస్థానాల మెట్లు ఎక్కారు. పాదయాత్రలతో అమరావతి ప్రాధాన్యతను అందరికీ తెలిసేలా ఉద్యమం ఉద్ధృతం చేశారు. రాజధాని రైతులు 2021 నవంబర్ 1న 'న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు' పేరుతో తుళ్లూరు నుంచి తిరుమలకు పాదయాత్ర చేశారు. అలాగే, 2022, సెప్టెంబర్ 12 నుంచి శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి నుంచి పాదయాత్ర ప్రారంభించారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ రైతులు రామచంద్రాపురం వరకూ ఈ యాత్ర చేపట్టి ఆ తర్వాత పరిస్థితుల దృష్ట్యా నిలిపేశారు.

'250 మందికి పైగా మరణం'

2019, డిసెంబర్ 17న సీఎం జగన్ శాసనసభలో 3 రాజధానుల ప్రతిపాదన చేశారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని గ్రామాల్లో నిరసనలు హోరెత్తాయి. ఆ రోజు నుంచి ఇప్పటివరకూ ఆ ప్రాంత రైతులు, మహిళలు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. రైతులు, కూలీలు, మహిళలు, రాజధాని మద్దతుదారులపై దాదాపు 720కి పైగా కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. 3 రాజధానుల నిర్ణయంతో తీవ్ర మనస్తాపం చెంది అనేక మంది ఉద్యమకారులు, రైతులు, కూలీలు కన్నుమూశారని అమరావతి ఐకాస తెలిపింది. ఇప్పటి వరకూ 250 మందికి పైగా మృతి చెందినట్లు పేర్కొంది.

ప్రత్యేక కార్యాచరణ

అమరావతి ఉద్యమం 1500 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ పోరాట స్ఫూర్తిని దశదిశలా చాటేందుకు ఐకాస ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది. ప్రభుత్వం తమను ఇబ్బంది పెడుతున్న తీరును ప్రజలకు తెలియజేయాలని రాజధాని రైతులు భావిస్తున్నారు. 'అమరావతి సమర శంఖారావం' పేరుతో నిరసన కార్యక్రమాలు, రాజధాని గ్రామాల్లోని శిబిరాల్లో వినూత్న రీతిలో నిరసనలు, సభలు, సమావేశాలు నిర్వహించనున్నారు. వెలగపూడి దీక్షా శిబిరం, మందడం గ్రామదేవత పోలేరమ్మ ఆలయం వద్ద సభల్ని ఏర్పాటు చేస్తున్నారు. ఉద్యమ నేపథ్యం, పోరాట ఘట్టాల్ని వివరించేలా ప్రత్యేక గీతాల్ని ఆవిష్కరించనున్నారు.

Also Read: సంక్షేమ పథకాలే ప్రభుత్వాన్ని నిలబెడతాయి- ఆధారాలతోనే చంద్రబాబు అరెస్ట్: సీఎం జగన్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Revanth Reddy: చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
KCR News: కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Revanth Reddy: చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
KCR News: కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
Modi Speech: రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
CM Revanth Reddy: 'అలా చేస్తేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి' - చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన
'అలా చేస్తేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి' - చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన
Janasena MLA Chirri Balaraju : జనసేన ఎమ్మెల్యేకు కారు కొనిచ్చిన కార్యకర్తలు - కానీ ఈఎంఐ ఆయన కట్టుకోవాల్సిందే !
జనసేన ఎమ్మెల్యేకు కారు కొనిచ్చిన కార్యకర్తలు - కానీ ఈఎంఐ ఆయన కట్టుకోవాల్సిందే !
Embed widget