అన్వేషించండి

Nara Lokesh: 'జగన్ హ్యాండ్సప్ వైసీపీ ప్యాకప్' - అమరావతి రైతుల ఆశయం త్వరలోనే నెరవేరుతుందన్న లోకేశ్

Andhra News: ఓడినా తనకు విచారం లేదంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. 2024లో ఇక ఆయన అధికారంలో ఉండరని అన్నారు.

Nara Lokesh Comments on CM Jagan: 'ఇప్పటికిప్పుడు ఎన్నికల్లో ఓడినా తనకు విచారం లేదు. నాకు ఎంతో సంతోషం' అంటూ సీఎం జగన్ (CM Jagan) చేసిన వ్యాఖ్యలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 'జగన్ హ్యాండ్సప్.. వైసీపీ ప్యాకప్' అంటూ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. బై బై జగన్, 2024లో ఆయన ఇక అధికారంలో ఉండరని అన్నారు. అటు, అమరావతి రైతుల ఉద్యమం 1500 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. 'కుట్రలు, కుతంత్రాలు, కుయుక్తులకు ఎదురొడ్డి అమరావతి నిలబడింది. అమరావతి పరిరక్షణకు రాజధాని రైతులు చేపట్టిన ఉద్యమం గురువారంతో 1500 రోజులు పూర్తి చేసుకుంది. ప్రజా రాజధాని కోసం ఇన్ని రోజులుగా నియంతపై పోరాడుతోన్న రైతులకు ఉద్యమాభివందనాలు. అమరావతి కోసం పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పిస్తున్నా. త్వరలోనే మీ ఆశయం నెరవేరుతుంది. రాష్ట్రం, భావితరాల భవిష్యత్తు కోసం భూమిని త్యాగం చేసిన రైతులకు న్యాయం జరుగుతుంది. అధర్మంపై ధర్మం విజయం సాధిస్తుంది.' అని పేర్కొన్నారు. 

1500 రోజులకు ఉద్యమం

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 3 రాజధానులకు వ్యతిరేకంగా.. అమరావతి పరిరక్షణే ధ్యేయంగా రైతులు, మహిళలు సాగిస్తున్న పోరాటం గురువారానికి 1500వ రోజుకు చేరుకుంది. అమరావతి నిర్మాణంపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఇన్ని రోజులుగా అక్కడి వారు ఆందోళన చేస్తూనే ఉన్నారు. సర్కారు నిర్ణయానికి వ్యతిరేకంగా న్యాయస్థానాల మెట్లు ఎక్కారు. పాదయాత్రలతో అమరావతి ప్రాధాన్యతను అందరికీ తెలిసేలా ఉద్యమం ఉద్ధృతం చేశారు. రాజధాని రైతులు 2021 నవంబర్ 1న 'న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు' పేరుతో తుళ్లూరు నుంచి తిరుమలకు పాదయాత్ర చేశారు. అలాగే, 2022, సెప్టెంబర్ 12 నుంచి శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి నుంచి పాదయాత్ర ప్రారంభించారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ రైతులు రామచంద్రాపురం వరకూ ఈ యాత్ర చేపట్టి ఆ తర్వాత పరిస్థితుల దృష్ట్యా నిలిపేశారు.

'250 మందికి పైగా మరణం'

2019, డిసెంబర్ 17న సీఎం జగన్ శాసనసభలో 3 రాజధానుల ప్రతిపాదన చేశారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని గ్రామాల్లో నిరసనలు హోరెత్తాయి. ఆ రోజు నుంచి ఇప్పటివరకూ ఆ ప్రాంత రైతులు, మహిళలు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. రైతులు, కూలీలు, మహిళలు, రాజధాని మద్దతుదారులపై దాదాపు 720కి పైగా కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. 3 రాజధానుల నిర్ణయంతో తీవ్ర మనస్తాపం చెంది అనేక మంది ఉద్యమకారులు, రైతులు, కూలీలు కన్నుమూశారని అమరావతి ఐకాస తెలిపింది. ఇప్పటి వరకూ 250 మందికి పైగా మృతి చెందినట్లు పేర్కొంది.

ప్రత్యేక కార్యాచరణ

అమరావతి ఉద్యమం 1500 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ పోరాట స్ఫూర్తిని దశదిశలా చాటేందుకు ఐకాస ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది. ప్రభుత్వం తమను ఇబ్బంది పెడుతున్న తీరును ప్రజలకు తెలియజేయాలని రాజధాని రైతులు భావిస్తున్నారు. 'అమరావతి సమర శంఖారావం' పేరుతో నిరసన కార్యక్రమాలు, రాజధాని గ్రామాల్లోని శిబిరాల్లో వినూత్న రీతిలో నిరసనలు, సభలు, సమావేశాలు నిర్వహించనున్నారు. వెలగపూడి దీక్షా శిబిరం, మందడం గ్రామదేవత పోలేరమ్మ ఆలయం వద్ద సభల్ని ఏర్పాటు చేస్తున్నారు. ఉద్యమ నేపథ్యం, పోరాట ఘట్టాల్ని వివరించేలా ప్రత్యేక గీతాల్ని ఆవిష్కరించనున్నారు.

Also Read: సంక్షేమ పథకాలే ప్రభుత్వాన్ని నిలబెడతాయి- ఆధారాలతోనే చంద్రబాబు అరెస్ట్: సీఎం జగన్

టాప్ హెడ్ లైన్స్

Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Visakhapatnam Airport Service Ends: కొన్ని గంటల్లో ముగియనున్న విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలు.. ఇక నుంచి భోగాపురం నుంచి విమాన సర్వీసులు
కొన్ని గంటల్లో ముగియనున్న విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలు.. ఇక నుంచి భోగాపురం నుంచి విమాన సర్వీసులు
Tadipatri High Tension: తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget