అన్వేషించండి

సంక్షేమ పథకాలే ప్రభుత్వాన్ని నిలబెడతాయి- ఆధారాలతోనే చంద్రబాబు అరెస్ట్: సీఎం జగన్

చంద్రబాబు నాయుడు అవినీతి ఆరోపణలతోనే అరెస్ట్‌ అయ్యారని, అందుకు పూర్తి ఆధారాలు ఉన్నాయన్నారు సీఎం జగన్. కోర్టు ఆయనను జైలుకు పంపిందని, మరి అలాంటప్పుడు ఎవరైనా అది ప్రతీకార రాజకీయం ఎలా అవుతుందన్నారు.

Jagan Comments : చంద్రబాబు నాయుడు (Chandrababu ) అవినీతి ఆరోపణలతోనే అరెస్ట్‌ అయ్యారని... అందుకు పూర్తి ఆధారాలు ఉన్నాయని సీఎం (Cm)జగన్ ( Jagan) అన్నారు. కోర్టు ఆయనను జైలుకు పంపిందని, మరి అలాంటప్పుడు ఎవరైనా అది ప్రతీకార రాజకీయం అని ఎలా అంటారని ప్రశ్నించారు. తిరుపతి (Tirupati)లో జరుగుతున్న ఓ సదస్సులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు.  ఎవరైనా ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయలేరని. ఏం చేసినా కోర్టుల్లో లిట్మస్‌ టెస్ట్‌ ఉంటుందన్నారు. ఆధారాలు లేకపోతే, ఆరోపణల్లో వాస్తవాలు లేకపోతే, కేసులు కోర్టుల్లో నిలబడవని అన్నారు. ఆధారాలు ఉన్నాయని కోర్టులు కన్విన్స్‌ అయితే తప్ప, నిర్ణయాలు తీసుకోవన్నారు. చంద్రబాబుది హైప్రొఫైల్‌ కేసని... త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఏ సీఎం కూడా అలాంటి చర్యలకు దిగరని అన్నారు. కచ్చితమైన ఆధారాలు ఉంటే తప్పా...అరెస్టులు జరగవన్నారు. 

రెండు జాతీయ పార్టీలు నామమాత్రమే
రాష్ట్రంలో రెండు జాతీయ పార్టీలు నామమాత్రమేనన్నారు సీఎం జగన్. కాంగ్రెస్, బీజేపీకి ఇక్కడ బలం లేదని, కాబట్టి సహజంగానే ఇక్కడ వైఎస్సార్‌సీపీకి, తెలుగుదేశం, జనసేన కూటమితో పాటు, వారికి మద్దతు ఇచ్చే వారితోనే పోటీ ఉంటుందన్నారు. ఎన్నికల సమయంలో ప్రతి పార్టీ స్వయంగా సర్వే నిర్వహిస్తుందని, దాని ప్రకారం వ్యూహరచన చేసుకుంటుందన్నారు సీఎం జగన్. ప్రజలకు చాలా మేలు చేశామని, అందుకే తమ ప్రభుత్వంపై ప్రజలకు చాలా నమ్మకం ఉందన్నారు. స్థానికంగా కొందరు నాయకుల తీరు, వారు ప్రజలతో మమేకం కాకపోవడంతో వారిపై వ్యతిరేకత వచ్చిందన్నారు. అనేక అంశాల ఆధారంగా కొన్ని మార్పులు చేశామన్నారు. ఎన్నికలు మరో 70, 80 రోజుల్లో వస్తాయన్న జగన్...ఆఖరి క్షణంలో ప్రయోగాలు చేసే బదులు.. ముందుగా చేస్తే క్లారిటీ ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. 

 99 శాతం హామీలు అమలు 
వాస్తవం కంటే విశ్వాసం అనేది ఎప్పటికైనా బలమైందని, అదే అందరూ చెబుతారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. తాను ఎన్నికల ముందు ఏయే హామీలు ఇచ్చాను ? ఏమేం చేశాను ? అన్నదే ముఖ్యమన్నారు. మేనిఫెస్టోలో ప్రకటించిన వాటిలో 99 శాతం అమలు చేశామన్నారు. వాటిని అమలు చేయడమే కాకుండా, ఆ మేనిఫెస్టోను ప్రజలకు చూపి, వారి విశ్వాసం పొందుతున్నామని వెల్లడించారు. ఆ విధంగా తమ ప్రభుత్వం ప్రజల్లో నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంచుకుందన్నారు. రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేశామన్న సీఎం జగన్... ప్రతి 2 వేల జనాభాకు గ్రామ సచివాలయం ఏర్పాటు చేశామన్నారు. ప్రతి 60 ఇళ్లకు ఒక వాలంటీర్‌ను నియమించామని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకం అందజేస్తున్నామని స్పష్టం చేశారు. ఎక్కడా వివక్ష చూపడం లేదని...అర్హతే ప్రామాణికంగా పథకాలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. ప్రతి ఒక్కటీ డీబీటీ ద్వారానే జరుగుతోందన్నారు. 

రూ. 2.53 లక్షల కోట్లు డీబీటీ ద్వారా పంపిణీ
నిజం చెప్పాలంటే విద్య, వైద్య రంగాల్లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయన్నారు జగన్, ప్రభుత్వ పనితీరు మారిందని, మహిళ సాధికారతలో మార్పు వచ్చిందని గుర్తు చేశారు. ఎక్కడా వివక్ష, అవినీతికి తావు లేకుండా నేరుగా పథకాల అమలు. లబ్ధిదారులకు నగదు బదిలీ డీబీటీ ద్వారానే జరుగుతున్నాయని అన్నారు. ఇవన్నీ తమ ప్రభుత్వాన్ని నిలబెడుతాయనే నమ్మకం తనకు ఉందన్నారు. ఏ పార్టీ కూడా హామీలు అమలు చేయలేదని, అవినీతి చేశామని చూపలేదని సవాల్ విసిరారు సీఎం జగన్.  56 నెలల్లో వివిధ పథకాల ద్వారా నేరుగా ప్రజల ఖాతాల్లో పూర్తి పారదర్శకంగా రూ. 2.53 లక్షల కోట్లు డీబీటీ విధానంలో జమ చేశామని వెల్లడించారు.  గత ప్రభుత్వంతో పోల్చి చూస్తే.. తక్కువ అప్పులు మాత్రమేనన్నారు. ఈ పరిస్థితుల్లో కేవలం సీఎం మాత్రమే మారారన్న జగన్... ఈ ప్రభుత్వం ఇన్ని చేయగలిగినప్పుడు, గత ప్రభుత్వం ఎందుకు చేయలేదన్నది ప్రజలు ఆలోచిస్తున్నారని అన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

3 States Polling: అసోం, కేరళ, పుదుచ్చేరిలో పోటెత్తిన ఓటర్లు - భారీగా పోలింగ్ నమోదు !
అసోం, కేరళ, పుదుచ్చేరిలో పోటెత్తిన ఓటర్లు - భారీగా పోలింగ్ నమోదు !
Jagityala KTR: జగిత్యాలలో జీవన్ రెడ్డితో కేటీఆర్ భేటీ - బీఆర్ఎస్‌లోకి ఆహ్వానం
జగిత్యాలలో జీవన్ రెడ్డితో కేటీఆర్ భేటీ - బీఆర్ఎస్‌లోకి ఆహ్వానం
Gold Price: మార్చిలో పడిపోయిన బంగారం ధరలు ఏప్రిల్‌లో పెరుగుతాయా? పెట్టుబడిదారులు ఇప్పుడేం చేయాలి?
మార్చిలో పడిపోయిన బంగారం ధరలు ఏప్రిల్‌లో పెరుగుతాయా? పెట్టుబడిదారులు ఇప్పుడేం చేయాలి?
KKR vs LSG Match Update: కేకేఆర్ ఎల్‌ఎస్జీ మ్యాచ్‌లో అలెన్ అవుటా? నాటౌటా? బౌండరీ లైన్ టచ్ అయిన దిగ్వేష్ రాఠీ!
కేకేఆర్ ఎల్‌ఎస్జీ మ్యాచ్‌లో అలెన్ అవుటా? నాటౌటా? బౌండరీ లైన్ టచ్ అయిన దిగ్వేష్ రాఠీ!

వీడియోలు

Gujarat Victory by One Run vs DC | ఒక్క పరుగు తేడాతో గుజరాత్ విక్టరీ
Gujarat Victory Over Delhi IPL 2026 | ఢిల్లీపై గుజరాత్ థ్రిల్లింగ్ విక్టరీ
Delhi Capitals Bowlers Come Back IPL 2026 | ఢిల్లీ బౌలర్ల స్ట్రాంగ్ కమ్ బ్యాక్
Reason for CSK Failures in IPL 2026 | సీఎస్కే కోచ్‌పై వెల్లువెత్తుతున్న విమ‌ర్శ‌లు
IPL 2026 DC vs GT Highlights | ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ ఫస్ట్ విక్టరీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
3 States Polling: అసోం, కేరళ, పుదుచ్చేరిలో పోటెత్తిన ఓటర్లు - భారీగా పోలింగ్ నమోదు !
అసోం, కేరళ, పుదుచ్చేరిలో పోటెత్తిన ఓటర్లు - భారీగా పోలింగ్ నమోదు !
Jagityala KTR: జగిత్యాలలో జీవన్ రెడ్డితో కేటీఆర్ భేటీ - బీఆర్ఎస్‌లోకి ఆహ్వానం
జగిత్యాలలో జీవన్ రెడ్డితో కేటీఆర్ భేటీ - బీఆర్ఎస్‌లోకి ఆహ్వానం
Gold Price: మార్చిలో పడిపోయిన బంగారం ధరలు ఏప్రిల్‌లో పెరుగుతాయా? పెట్టుబడిదారులు ఇప్పుడేం చేయాలి?
మార్చిలో పడిపోయిన బంగారం ధరలు ఏప్రిల్‌లో పెరుగుతాయా? పెట్టుబడిదారులు ఇప్పుడేం చేయాలి?
KKR vs LSG Match Update: కేకేఆర్ ఎల్‌ఎస్జీ మ్యాచ్‌లో అలెన్ అవుటా? నాటౌటా? బౌండరీ లైన్ టచ్ అయిన దిగ్వేష్ రాఠీ!
కేకేఆర్ ఎల్‌ఎస్జీ మ్యాచ్‌లో అలెన్ అవుటా? నాటౌటా? బౌండరీ లైన్ టచ్ అయిన దిగ్వేష్ రాఠీ!
Atchannaidu: వైఎస్సార్ మరణం వెనుక జగన్ హస్తం ఉందన్న అనుమానాలు - అచ్చెన్నాయుడు సంచలన ఆరోపణలు
వైఎస్సార్ మరణం వెనుక జగన్ హస్తం ఉందన్న అనుమానాలు - అచ్చెన్నాయుడు సంచలన ఆరోపణలు
Jagan Vs Sharmila: జగన్, షర్మిల మధ్య పాదయాత్ర వారసత్వ వార్ - సోషల్ మీడియా వాగ్వాదం వైరల్
జగన్, షర్మిల మధ్య పాదయాత్ర వారసత్వ వార్ - సోషల్ మీడియా వాగ్వాదం వైరల్
Nobel Peace: నోబెల్ అంటే అంత కామెడీ అయిపోయిందా? పాకిస్తాన్ ప్రధానికీ కావాలట.. ట్రంప్‌కు తెలిస్తే!?
నోబెల్ అంటే అంత కామెడీ అయిపోయిందా? పాకిస్తాన్ ప్రధానికీ కావాలట.. ట్రంప్‌కు తెలిస్తే!?
Sharmila: 3 రాజధానుల పేరుతో రుషికొండ మింగేసి ప్యాలెస్ లు కట్టుకున్నారు - మావిగన్ జోకర్ జగన్ - వైఎస్ షర్మిలా ఘాటు విమర్శలు
3 రాజధానుల పేరుతో రుషికొండ మింగేసి ప్యాలెస్ లు కట్టుకున్నారు - మావిగన్ జోకర్ జగన్ - వైఎస్ షర్మిలా ఘాటు విమర్శలు
Embed widget