అన్వేషించండి

Ap Liquor Brands Raghurama : ఏపీ లిక్కర్ బ్రాండ్స్‌పై పరిశీలన.. ఎంపీ రఘురామకు కేంద్రం హామీ..!

ఏపీ లిక్కర్ బ్రాండ్లు ప్రజల ఆరోగ్యానికి హానికరంగా మారాయని విచారణ జరిపించాలని కేంద్ర ఆరోగ్య మంత్రికి ఎంపీ రఘురామ ఈ నెల6 వ తేదీన లేఖ రాశారు. స్పందించిన కేంద్ర మంత్రి పరిశీలిస్తామని తిరిగి లేఖ పంపారు.


ఆంధ్రప్రదేశ్‌లో అమ్ముతున్న లిక్కర్ బ్రాండ్లను పరిశీలిస్తామని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు సమాచారం ఇచ్చారు. ఈ నెల ఆరో తేదీన రఘురామకృష్ణరాజు మన్సుఖ్ మాండవీయకు ఏపీలో అమ్ముతున్న లిక్కర్ బ్రాండ్లు నాసిరకమైనవని ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు. " ఆంధ్రప్రదేశ్‌లో నాసిరకం మద్యం ముప్పు పెరిగిపోయిందని, కొన్ని బ్రాండ్లు, డిస్టిలరీలు తయారు చేస్తున్న ఇలాంటి మద్యం సేవించి ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని" రఘురామ కృష్ణరాజు లేఖలో కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.  

రోజువారీ కూలీపనులు చేసుకునే పేదలు ఎక్కువగా నాసిరకం మద్యం తాగుతున్నారని ఈ నాణ్యత లేని  మద్యం వల్ల భవన కార్మికులు,ఇతర పనులు చేసుకునే వారి పై తీవ్ర ప్రభావం పడుతోందని రఘురామ ఆందోళన వ్యక్తం చేశారు.ఈ మద్యం విక్రయాలపై కేంద్రఆరోగ్య శాఖ నిపుణుల తో కమిటీ ఏర్పాటు చేయాలని లేఖలో రఘురామ కోరారు. నాణ్యతలేని మద్యం నమూనాలను వివిధ ప్రాంతాల నుంచి సేకరించి దాన్ని తాగితే మధ్య మరియు దిగువ తరగతి ప్రజల ఆరోగ్యాల పై కలిగే అనారోగ్యాల పై అధ్యయనం చేయించాలని అప్పటి లేఖలో రఘురాకృష్ణరాజు సూచించారు. తన లేఖపై త్వరగా స్పందించాలని కూడా కోరారు. ఈ వ్యవహరంపై కాలయాపన చేస్తే ప్రజల ప్రాణాలకు హానీ కలిగే అవకాశం ఉంటుందన్నారు.

ఆరో తేదీన రాసిన లేఖపై కేంద్ర, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మన్సూఖ్ మాండవీయ స్పందించారు. లేఖ అందిందని అందులోని అంశాలపై పరిశీలన జరిపి.. వివరాలను తెలియజేస్తామని మాండవీయ ఎంపీకి తెలియచేశారు. అయితే ఇది విచారణ జరిపించడానికి సిద్ధపడినట్లుగా కాదని భావిస్తున్నారు.  ప్రతి కేంద్రమంత్రి తమకు వచ్చే లేఖలు అందినట్లుగా పంపిన వారికి.. విజ్ఞప్తి చేసిన వారికి అక్నాలెడ్జ్‌మెంట్ పంపుతారు. అలా రఘురామకు కూడా లెటర్ అందినట్లుగా కేంద్రమంత్రిగా లేఖ పంపారు. అందులోని అంశాలను పరిశీలిస్తామని హమీ ఇచ్చారు. ఈ అంశంపై ఎప్పట్లోపు పరిశీలన చేస్తారో స్పష్టత లేదు. 

ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మద్యం విధానం మార్చారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం అమ్ముతున్నారు. అయితే ప్రసిద్ధి చెందిన బ్రాండ్లు ఏవీ అమ్మడం లేదు. "ఫర్ సేల్ ఓన్ల ఏపీ"కి పర్మిషన్ ఉన్న బ్రాండ్లు మాత్రమే అమ్ముతున్నారు. అవీ కూడా రకరకాల కంపెనీల పేర్లతో ఉంటున్నాయి. ఇవన్నీ నాసిరకమైన మద్యం అని.. వాటిని అత్యధిక ధరకు అమ్ముతున్నారని రఘురామ ఆరోపిస్తున్నారు. మద్యం ఆదాయాన్ని తనఖా పెట్టి రుణాలు తీసుకోవడంపైనా విమర్శలు చేస్తున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Free Sand Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
Gudivada News: బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
Hyderabad: మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Free Sand Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
Gudivada News: బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
Hyderabad: మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
Andhra Pradesh: ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
Weather Latest Update: ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
Revanth Gift to Chandrababu: భేటీలో చంద్రబాబుకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
భేటీలో చంద్రబాబుకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
IND vs ZIM 1st T20I : విశ్వ విజేతలకు తొలి షాక్‌ , భారత్‌కు జింబాబ్వే చెక్‌
విశ్వ విజేతలకు తొలి షాక్‌ , భారత్‌కు జింబాబ్వే చెక్‌
Embed widget