అన్వేషించండి

Pawan Kalyan : టీడీపీ మంచిగా ఉంటూ 20 సీట్లే ఇచ్చే సూచనలు, ఏ పార్టీతో లోపాయికారి ఒప్పందాలు పెట్టుకోం- పవన్ కల్యాణ్

Pawan Kalyan : కాపులకు సంఖ్యా బలం ఉన్నా ఐక్యత లేదని పవన్ కల్యాణ్ అన్నారు. కాపులు అధికారంలోకి వస్తే మిగతా వాళ్లను తొక్కేస్తారని విషప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

Pawan Kalyan : ఏపీలో కులాలపై విష ప్రచారం జరుగుతోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఆదివారం మంగళగిరి జనసేన కార్యాలయంలో కాపు సంక్షేమ సేన ప్రతినిధులతో పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... కాపుల సంఖ్యా బలం ఉన్నా, అంత ఆర్థిక బలం, ఐక్యత లేదన్నారు. సమాజంలో కులాలను విడదీసే వాళ్లే ఎక్కువన్నారు. ఐక్యత ఉంటేనే రాజ్యాధికారం సాధ్యం అవుతుందన్నారు. సంఖ్యాబలం ఉంటే అధికారం పంచుకోక తప్పదని అర్థం చేసుకోవాలని పవన్ అన్నారు. ఒక కులం పక్షాన నేను మాట్లాడనన్న పవన్...అధికారం ఒకరి సొంతం కాదన్నారు. సరిగ్గా సినిమాలు చేస్తే రోజుకు రూ.2 కోట్లు సంపాదించే సత్తా తనకు ఉందన్నారు. కుళ్లు, కుట్రలు, కుతంత్రాలు లేనిదే రాజకీయం లేదన్నారు. నేను మెత్తటి మనిషిని కాదన్నారు పవన్. రాయలసీమలో బలిజలు గొంతెత్తాలంటే భయపడతారన్నారు. కాపులు ఎదగడమంటే మిగతా కులాలు తగ్గడం కాదన్నారు. 

ఏ పార్టీతో లోపాయికారి ఒప్పందాలు పెట్టుకోం 

"నేను ఓడిపోతే తొడలు కొట్టింది కాపులే, కుళ్లు, కుట్రలు కుతంత్రాలు లేనిదే రాజకీయం లేదు. ప్రజల్లో మార్పు రానంత వరకు రాజకీయ సాధికారత సాధ్యం కాదు. కాపులు కూడా కొన్ని సంఘాలుగా విడిపోయారు. కాపులు రాష్ట్రంలో పెద్దన్న పాత్ర పోషించాలి. అధికారంలో ఉన్న కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలకు గౌరవం ఇచ్చి తీరాలి. సమస్యల గురించి గొడవ పెట్టుకుంటే ఇంట్లో వాళ్లను ఇబ్బంది పెడతారనే భయం ఉంటుంది. టీడీపీ మంచిగా ఉంటూనే 20 సీట్లకే పరిమితం చేస్తామని  సంకేతాలు ఇస్తోంది. ఏ పార్టీతో లోపాయికారి ఒప్పందాలు పెట్టుకోను. వాస్తవికతను దృష్టిలో పెట్టుకునే నేను మాట్లాడతాను. అవమానపడుతూ ఎక్కడైనా ఎందుకు ఉండాలి. ఏ పార్టీ అజెండా కోసం మేంపనిచేయాం. జనసేనను నమ్ముకున్న వారి ఆత్మ గౌరవాన్ని తగ్గించం. ఒకరేమో రూ.1000 కోట్లకు ఒప్పందం అని అంటారు. రూ.1000 కోట్లతో రాజకీయాలను నడపొచ్చంటే అంతకంటే హాస్యాస్పదం మరొకటి ఉండదు. డబ్బులతో పార్టీలను నడపలేం. కాపులు పెద్దన్న పాత్ర వహిస్తే ఈ వ్యక్తి సీఎంగా ఉండడు." - పవన్ కల్యాణ్ 

2024 ఎన్నికలు కీలకం 

వైసీపీకి మాత్రం ఎట్టివ పరిస్థితుల్లో ఓటు వేయొద్దని పవన్ కల్యాణ్ అన్నారు.నాయకుడు చనిపోయినప్పుడు జిల్లాకు ఆయన పేరు పెట్టమనడం కాదని, ఆయన బతికున్నప్పుడు వెంట నడవాలని  పవన్ అన్నారు. రాజకీయ సాధికారిత కావాలంటే కాపులంతా ఏకం కావాలని పవన్ అన్నారు. రాష్ట్రంలో కులాలను విడగొట్టి లబ్ధి పొందే నాయకులు ఎక్కువయ్యారన్నారు. 2008-09లో జరిగిన ఘటనలు తనలో పంతం పెంచాయన్నారు. ఉపాధి, ఉద్యోగాలు కావాలని అడిగే స్థితిలోనే ఇంకా ఉన్నామన్నారు. పెద్ద కులాలతో గొడవలు వద్దని, అన్ని కులాలను సమానంగా చూడాలని పవన్ పిలుపునిచ్చారు. కులం నుంచి నేను ఎప్పుడూ పారిపోనన్న పవన్... సంఖ్యాబలం ఉన్న కాపులు అధికారానికి దూరంగా ఉన్నారన్నారు. కాపులు అధికారంలోకి వస్తే మిగతావారిని తొక్కేస్తారని విషప్రచారం చేస్తున్నారన్నారు.  గత ప్రభుత్వంలో రిజర్వేషన్‌ గురించి మాట్లాడినవాళ్లు ఇప్పుడు ఎందుకు మాట్లాడడంలేదని ప్రశ్నించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక కాపు రిజర్వేషన్‌ గురించి మాట్లాడారా అని నిలదీశారు. కుల ఆత్మగౌరవాన్ని చంపుకుని వైసీపీకి ఎందుకు ఓటేశారని ప్రశ్నించారు. 2024 ఎన్నికలు ఏపీ రాజకీయాలకు చాలా కీలకం అన్నారు. సంఖ్యా బలం ఉన్న వాళ్లు సత్తా చాటాలన్నారు.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
Karnataka Express: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
CM Revanth Reddy : రవాణా రంగంలో అగ్రగామిగా తెలంగాణ - డ్రైపోర్టు ఏపీలో మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం, సీఎం రేవంత్ ప్రణాళికలు
రవాణా రంగంలో అగ్రగామిగా తెలంగాణ - డ్రైపోర్టు ఏపీలో మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం, సీఎం రేవంత్ ప్రణాళికలు
UPSC CSE 2025: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2025 నోటిఫికేషన్ విడుదల - 979 ఉద్యోగాల భర్తీ, ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2025 నోటిఫికేషన్ విడుదల - 979 ఉద్యోగాల భర్తీ, ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nara Lokesh Walk in Davos | ట్రాఫిక్ లో చిక్కుకోవటంతో కాలినడకన లోకేశ్ ప్రయాణం | ABP DesamJawan Karthik Final Journey | దేశం కోసం ప్రాణాలర్పించిన కార్తీక్ కు కన్నీటి వీడ్కోలు | ABP DesamCM Chandrababu Met Bill gates | దావోస్  ప్రపంచ ఆర్థిక సదస్సులో బిల్ గేట్స్ తో సీఎం చంద్రబాబు | ABP DesamBazball In T20 | ఇంగ్లండ్ పరిమిత ఓవర్లకూ కోచ్ గా మెక్ కల్లమ్ | Ind vs Eng | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
Karnataka Express: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
CM Revanth Reddy : రవాణా రంగంలో అగ్రగామిగా తెలంగాణ - డ్రైపోర్టు ఏపీలో మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం, సీఎం రేవంత్ ప్రణాళికలు
రవాణా రంగంలో అగ్రగామిగా తెలంగాణ - డ్రైపోర్టు ఏపీలో మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం, సీఎం రేవంత్ ప్రణాళికలు
UPSC CSE 2025: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2025 నోటిఫికేషన్ విడుదల - 979 ఉద్యోగాల భర్తీ, ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2025 నోటిఫికేషన్ విడుదల - 979 ఉద్యోగాల భర్తీ, ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
Kolkata T20 Updates: అభి'షేకాడించాడు' - సూపర్ ఫిఫ్టీతో చెలరేగిన అభిషేక్, ఇంగ్లాండ్‌పై భారత్ సూపర్ విక్టరీ
అభి'షేకాడించాడు' - సూపర్ ఫిఫ్టీతో చెలరేగిన శర్మ, ఇంగ్లాండ్‌పై భారత్ సూపర్ విక్టరీ
UPSC IFS 2025: ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్-2025 నోటిఫికేషన్ వెల్లడి - పోస్టులెన్నంటే?
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్-2025 నోటిఫికేషన్ వెల్లడి - పోస్టులెన్నంటే?
Chandrababu on Lokesh: రాజకీయాల్లో వారసత్వం ఓ భ్రమ - లోకేష్ నాయకత్వంపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
రాజకీయాల్లో వారసత్వం ఓ భ్రమ - లోకేష్ నాయకత్వంపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Vizag News: విశాఖలో జువనైల్ హోమ్ నుంచి రోడ్లపైకి వచ్చిన బాలికలు - మానసిక రోగులుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపణలు
విశాఖలో జువనైల్ హోమ్ నుంచి రోడ్లపైకి వచ్చిన బాలికలు - మానసిక రోగులుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపణలు
Embed widget