అన్వేషించండి

CM Revanth Reddy : రవాణా రంగంలో అగ్రగామిగా తెలంగాణ - డ్రైపోర్టు ఏపీలో మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం, సీఎం రేవంత్ ప్రణాళికలు

Hyderabad Development : రవాణా రంగంలో పెట్టుబడులకు ముందుకు రావాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. దావోస్‌లో సీఐఐ, మోటార్ కార్ప్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు.

CM Revanth Reddy Davos Tour: తెలంగాణలో రవాణా రంగ అభివృద్ధికి పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి  పిలుపునిచ్చారు. దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక ఫోరం సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణను ప్రపంచ స్థాయి రవాణా మౌలిక సదుపాయాలు కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పటిష్ఠ ప్రణాళికలు రూపొందించిందని పేర్కొన్నారు. పారిశ్రామికవేత్తలు, మౌలిక వనరుల అభివృద్ధి సంస్థలు కలిసి రవాణా రంగంలో పెట్టుబడులు పెట్టాలని, ఈ రంగాన్ని మరింత విస్తరించి తెలంగాణను దేశానికి మోడల్ రాష్ట్రంగా మార్చేందుకు సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

తెలంగాణలో రవాణా విప్లవం
హైదరాబాద్‌ను ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన, పర్యావరణ అనుకూల నగరంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని సీఎం రేవంత్ తెలిపారు. 4 కోట్ల మంది ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలు అందించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను ప్రభుత్వం సమకూరుస్తుందని హామీ ఇచ్చారు.

ఈవీ వాహనాలకు ప్రోత్సాహం
తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ వాహనాల (EV) వినియోగాన్ని గణనీయంగా పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. విద్యుత్ వాహనాలపై రోడ్ టాక్స్, రిజిస్ట్రేషన్ ఛార్జీలను రద్దు చేయడం ద్వారా ఈ రంగానికి ప్రోత్సాహం అందజేస్తోంది. దేశవ్యాప్తంగా ఈవీ వాహనాల విక్రయాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని సీఎం రేవంత్ తెలిపారు. హైదరాబాద్‌ను ఫ్యూచర్ సిటీగా అభివృద్ధి చేయడంలో అర్బన్ మొబిలిటీ కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. కోటి 20 లక్షలకు పైగా జనాభా ఉన్న హైదరాబాద్‌లో ఇప్పటికే ఉన్న మెట్రో రైల్ నెట్వర్క్‌ను మరింత విస్తరించేందుకు కొత్తగా 100 కిలోమీటర్ల మెట్రో లైన్లను నిర్మిస్తున్నట్లు చెప్పారు.

జీహెచ్ఎంసీ పరిధిలో 3  వేల ఎలక్ట్రిక్ బస్సులు
హైదరాబాద్‌లో పర్యావరణ అనుకూల రవాణా సేవల విస్తరణలో భాగంగా, 3 వేల ఎలక్ట్రిక్ బస్సులను నగర రోడ్లపై నడిపేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. దీని ద్వారా రవాణా ఖర్చులు తగ్గడంతో పాటు కాలుష్యాన్ని నియంత్రించడంలో కీలక ముందడుగు వేయబోతోంది.

డ్రైపోర్ట్ ద్వారా కొత్త అవకాశాలు
తీరప్రాంతం లేని తెలంగాణ రాష్ట్రానికి వాణిజ్య రంగంలో లోటు ఏర్పడకుండా, కొత్తగా డ్రైపోర్టును నిర్మించి రాష్ట్రాన్ని వేర్‌హౌజ్ హబ్‌గా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వస్తోంది. ఈ డ్రైపోర్టును ఏపీలోని మచిలీపట్నం పోర్టుతో ప్రత్యేక రోడ్డు, రైలు మార్గాల ద్వారా అనుసంధానం చేయనున్నట్లు సీఎం రేవంత్ వెల్లడించారు. రాష్ట్ర ప్రజలకు తక్కువ ఖర్చుతో వేగవంతమైన రవాణా సదుపాయాలను అందించడం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో తక్కువ కాలుష్యంతో, వేగంగా ప్రయాణించగల సౌకర్యాలే నగర అభివృద్ధికి, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు కీలకమని సీఎం అభిప్రాయపడ్డారు.

Also Read : Gandhi Bhavan fight: గాంధీభవన్ ముందు కాంగ్రెస్ యువ కార్యకర్తల స్ట్రీట్ ఫైటింగ్ - పదవుల కోసం పోరాటం ఇలాగే ! వీడియో

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Breaking News: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు సర్జరీ.. వేగంగా కోలుకుంటున్నట్లు వెల్లడి
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు సర్జరీ.. వేగంగా కోలుకుంటున్నట్లు వెల్లడి
Adilabad Crime News: క్యాష్ విత్‌డ్రా చేసిన నిమిషాల్లో కొట్టేస్తున్న దొంగల ముఠా ప్రధాన నిందితుడు అరెస్ట్
క్యాష్ విత్‌డ్రా చేసిన నిమిషాల్లో కొట్టేస్తున్న అంతరాష్ట్ర దొంగల ముఠా ప్రధాన నిందితుడు అరెస్ట్
Cheruvugattu Fire Accident: చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dharmendra Pradhan Resignation: విద్యార్థుల ఆందోళన తొలిరోజే రాజీనామాకు సిద్ధపడిన ధర్మేంద్ర ప్రధాన్, కానీ!: విజయ్‌ వర్గీయా
విద్యార్థుల ఆందోళన తొలిరోజే రాజీనామాకు సిద్ధపడిన ధర్మేంద్ర ప్రధాన్, కానీ!: విజయ్‌ వర్గీయా
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Cheruvugattu Fire Accident: చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
CSK-MI Trade War: హార్దిక్ కు బ‌దులుగా MI మైండ్ బ్లాకింగ్ డిమాండ్.. ఆ ప్లేయ‌ర్ ను ఇవ్వలేమన్న CSK, ఐపీఎల్ 2027 ట్రేడ్ డీల్ లో ఊరించే ట్విస్ట్!
హార్దిక్ కు బ‌దులుగా MI మైండ్ బ్లాకింగ్ డిమాండ్.. ఆ ప్లేయ‌ర్ ను ఇవ్వలేమన్న CSK, ఐపీఎల్ 2027 ట్రేడ్ డీల్ లో ఊరించే ట్విస్ట్!
టాటా టియాగో vs హ్యుందాయ్‌ గ్రాండ్‌ i10 నియోస్‌ - యాక్సిలరేషన్‌ టెస్ట్‌లో ఏ కారు గెలిచింది?
టాటా టియాగో vs హ్యుందాయ్‌ గ్రాండ్‌ i10 నియోస్‌ - రియల్‌ రోడ్‌ టెస్ట్‌లో ఏ కారు పికప్‌ చూపించింది?
Chennai Love Story Collections: చెన్నై లవ్ స్టోరీ రెండు రోజుల కలెక్షన్లు... టోటల్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?
చెన్నై లవ్ స్టోరీ రెండు రోజుల కలెక్షన్లు... టోటల్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Breaking News: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు సర్జరీ.. వేగంగా కోలుకుంటున్నట్లు వెల్లడి
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు సర్జరీ.. వేగంగా కోలుకుంటున్నట్లు వెల్లడి
కాక్రోచ్ వ్యాఖ్యతో ప్రారంభం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ముగిసింది.. CJP Protest లో కీలక ఘట్టాలు
కాక్రోచ్ వ్యాఖ్యతో ప్రారంభం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ముగిసింది.. CJP Protest లో కీలక ఘట్టాలు
Embed widget