అన్వేషించండి

Pinnelli to Macherla Clash : మాచర్లలో దాడులు టీడీపీ కుట్రే, ప్రచారం కోసమే పార్టీ ఆఫీస్ కు నిప్పు- ఎమ్మెల్యే పిన్నెల్లి

Pinnelli to Macherla Clash : వైసీపీ ప్రభుత్వ సంక్షేమం చూసి ఓర్వలేక టీడీపీ దాడులకు పాల్పడుతుందని ఎమ్మెల్యే పిన్నెల్లి ఆరోపించారు. మాచర్లలో దాడులు టీడీపీ కుట్ర అన్నారు.

Pinnelli to Macherla Clash : మాచర్లలో అల్లర్లు, దాడులు టీడీపీ కుట్రలో భాగమేనని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. టీడీపీ చేపట్టిన కార్యక్రమంలో పథకం ప్రకారం వైఎస్సార్ పీపీ కార్యకర్తలపై దాడులు చేశారని వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు. టీడీపీ ప్రచార కార్యక్రమంలో ఎవరైనా రాడ్లు, కర్రలు, మారణాయుధాలు సిద్ధం చేసుకుంటారా? అని ప్రశ్నించారు. పార్టీ జెండాల స్థానంలో రాడ్లు పట్టుకుని టీడీపీ మాచర్ల నియోజకవర్గ ఇన్ ఛార్జ్ జూలకంటి బ్మహ్మారెడ్డి, ఆ పార్టీ కార్యకర్తలు మాచర్లలో భయానక వాతావరణం సృష్టించారన్నారు. డిసెంబరు 16 సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు పల్నాడులో చెలరేగిన హింసాత్మక ఘర్షణలను మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఖండించారు. టీడీపీ చేపడుతున్న కార్యక్రమాలు ఓర్చుకోలేక ప్లాఫ్ షోలు చేస్తుంటే ప్రజలు తిరగబడుతున్నారని, అందుకే ప్రచారం కోసం మాచర్లలో దాడులకు తెగబడిందన్నారు. టీడీపీ ఫ్యాక్షన్, బెదిరింపు రాజకీయాలపై ఎమ్మెల్యే పిన్నెల్లి మండిపడ్డారు. శుక్రవారం జరిగిన ఘటన పల్నాడులో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ప్రజల మధ్య సామరస్యాన్ని ధ్వంసం చేసేలా ఉన్నాయన్నారు. వైఎస్సార్సీపీని ఎదుర్కొలేక టీడీపీ నాయకులు ప్రజలను దాడులతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. 

దాడులకు టీడీపీదే బాధ్యత 

పల్నాడులో ప్రజల నుంచి ఎదురుదెబ్బ తగిలిన తర్వాత టీడీపీ దౌర్జన్యంతో దాడులు చేస్తోందని ఎమ్మెల్యే పిన్నెల్లి ఆరోపించారు. సొంత వాహనాలకు నిప్పు పెట్టి జూలకంటి బ్రహ్మారెడ్డి వర్గం వైఎస్సార్‌సీపీ ప్రతిష్టను దిగజార్చేందుకు తప్పుడు ప్రచారం చేస్తోందని పిన్నెల్లి అన్నారు. టీడీపీ అగ్రనేతలు చంద్రబాబు, లోకేశ్ కావాలనే మాచర్లకు ఫ్యాక్షన్ నేతలను పంపి గొడవలు చేశారని మండిపడ్డారు. ఈ ప్రాంతంలో టీడీపీ ఫ్యాక్షన్ మూలాలతో దాడులు చేసి ప్రజల సెంటిమెంట్ దెబ్బతీయాలని, రాజకీయ ప్రయోజనాల కోసం టీడీపీ ఈ సెంటిమెంట్లను దుర్వినియోగం చేస్తోందన్నారు. టీడీపీ అసలు రంగు ఇదేనని ప్రజలు ఇప్పటికే బాగా తెలుసుకున్నారన్నారు.  ఇలాంటి దాడులతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు భయపడేది లేదన్నారు. టీడీపీ నేత బ్రహ్మానందరెడ్డి తప్పుడు ప్రచారాలతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. కార్లు, ఇళ్లను ధ్వంసం చేయడంతో పాటు ప్రజలపై దాడికి పాల్పడేలా టీడీపీ కార్యకర్తలకు ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. ప్రజా ఆస్తులు, వాహనాలు, ఇళ్లు ధ్వంసానికి టీడీపీదే బాధ్యత అని పిన్నెల్లి అన్నారు. ఈ ఘటన మొత్తం కెమెరాల్లో రికార్డు అయ్యిందన్నారు. దాడుల వీడియో ఆధారాలన్నీ తమ వద్ద ఉన్నాయన్నారు.  ఆధారాలన్నీ పోలీసులకు అందిస్తామన్నారు. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ జరిపి నిజాలు నిగ్గుతేల్చి బాధ్యులపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి కోరారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirupati News: తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలు- కార్పొరేటర్ల కిడ్నాప్‌తో ఉద్రిక్తత, అర్ధరాత్రి హైడ్రామా!
తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలు- కార్పొరేటర్ల కిడ్నాప్‌తో ఉద్రిక్తత, అర్ధరాత్రి హైడ్రామా!
Indiramma Atmiya Bharosa Scheme: ఇందిరమ్మ ఆత్మీయ భరోసాపై కీలక అప్‌డేట్, వారిని అనర్హులుగా గుర్తిస్తున్న తెలంగాణ ప్రభుత్వం
ఇందిరమ్మ ఆత్మీయ భరోసాపై కీలక అప్‌డేట్, వారిని అనర్హులుగా గుర్తిస్తున్న తెలంగాణ ప్రభుత్వం
Sandeep Reddy Vanga : 'అర్జున్ రెడ్డి'లో హీరోయిన్​గా సాయి పల్లవికి ఛాన్స్ మిస్... 'తండేల్' స్టేజ్​పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన సందీప్ రెడ్డి వంగా
'అర్జున్ రెడ్డి'లో హీరోయిన్​గా సాయి పల్లవికి ఛాన్స్ మిస్... 'తండేల్' స్టేజ్​పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన సందీప్ రెడ్డి వంగా
ISROs 100th Mission: ఎన్‌వీఎస్‌-02 శాటిలైట్‌లో టెక్నికల్ ప్రాబ్లమ్, నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టేందుకు ఇస్రో యత్నాలు
ఎన్‌వీఎస్‌-02 శాటిలైట్‌లో టెక్నికల్ ప్రాబ్లమ్, నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టేందుకు ఇస్రో యత్నాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ayodhya MP Breaks in to Tears | నేను రిజైన్ చేసేస్తానంటూ కన్నీళ్లు పెట్టుకున్న అయోధ్య ఎంపీ | ABP DesamJudicial Enquiry Tirupati Stampede | తిరుపతి తొక్కిసలాట ఘటనలో జ్యూడీషియల్ ఎంక్వైరీ మొదలు | ABP DesamDirector Jennifer Alphonse Interview | నాగోబా, గుస్సాడీని వరల్డ్ ఫేమస్ చేసే వరకూ ఆగను | ABP DesamSircilla Santhosh Tragedy | కన్నీళ్లు పెట్టిస్తున్న చేనేత కార్మికుడి మరణం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirupati News: తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలు- కార్పొరేటర్ల కిడ్నాప్‌తో ఉద్రిక్తత, అర్ధరాత్రి హైడ్రామా!
తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలు- కార్పొరేటర్ల కిడ్నాప్‌తో ఉద్రిక్తత, అర్ధరాత్రి హైడ్రామా!
Indiramma Atmiya Bharosa Scheme: ఇందిరమ్మ ఆత్మీయ భరోసాపై కీలక అప్‌డేట్, వారిని అనర్హులుగా గుర్తిస్తున్న తెలంగాణ ప్రభుత్వం
ఇందిరమ్మ ఆత్మీయ భరోసాపై కీలక అప్‌డేట్, వారిని అనర్హులుగా గుర్తిస్తున్న తెలంగాణ ప్రభుత్వం
Sandeep Reddy Vanga : 'అర్జున్ రెడ్డి'లో హీరోయిన్​గా సాయి పల్లవికి ఛాన్స్ మిస్... 'తండేల్' స్టేజ్​పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన సందీప్ రెడ్డి వంగా
'అర్జున్ రెడ్డి'లో హీరోయిన్​గా సాయి పల్లవికి ఛాన్స్ మిస్... 'తండేల్' స్టేజ్​పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన సందీప్ రెడ్డి వంగా
ISROs 100th Mission: ఎన్‌వీఎస్‌-02 శాటిలైట్‌లో టెక్నికల్ ప్రాబ్లమ్, నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టేందుకు ఇస్రో యత్నాలు
ఎన్‌వీఎస్‌-02 శాటిలైట్‌లో టెక్నికల్ ప్రాబ్లమ్, నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టేందుకు ఇస్రో యత్నాలు
Allu Arjun : 'తండేల్' ప్రీ రిలీజ్ ఈవెంట్​కి అల్లు అర్జున్ డుమ్మా... కారణం ఏంటో తెలుసా?
'తండేల్' ప్రీ రిలీజ్ ఈవెంట్​కి అల్లు అర్జున్ డుమ్మా... కారణం ఏంటో తెలుసా?
Telangana Caste Survey: తెలంగాణలో ఏ సామాజిక వర్గం వారు ఎంత శాతం ఉన్నారో లెక్కలు తేల్చిన ప్రభుత్వం, రేపు అసెంబ్లీకి సర్వే నివేదిక
Telangana Caste Survey: తెలంగాణలో ఏ సామాజిక వర్గం వారు ఎంత శాతం ఉన్నారో లెక్కలు తేల్చిన ప్రభుత్వం, రేపు అసెంబ్లీకి సర్వే నివేదిక
Viral News: నర్సీపట్నంలో కత్తితో తిరుగుతూ యువతి హల్‌చల్, ఆమె మాటలు విని అంతా షాక్!
నర్సీపట్నంలో కత్తితో తిరుగుతూ యువతి హల్‌చల్, ఆమె మాటలు విని అంతా షాక్!
Crime News: పెళ్లి చేసుకోకుంటే యాసిడ్‌ పోసి చంపేస్తా! యువకుడి బెదిరింపులతో యువతి ఇంటికి తాళం
పెళ్లి చేసుకోకుంటే యాసిడ్‌ పోసి చంపేస్తా! యువకుడి బెదిరింపులతో యువతి ఇంటికి తాళం
Embed widget