అన్వేషించండి

Anantapur News Today: బీజేపీ, జనసేనతోనే టీడీపీ ముప్పు- సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేతలు

Anantapur Latest News: మిత్రపక్షాలతో టీడీపీ ప్రమాదం ఉందని వైసీపీ నేతలు హెచ్చరించారు. అనంతపురంలో జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు.

Anantapur Latest News Updates: ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే భవిష్యత్ అంతా వైసీపీదేనంటున్నారు ఆ పార్టీ నేతలు. అనంతపురం జిల్లా కమిటీ సమావేశంలో ఆ పార్టీ నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కనుమరుగయ్యే పరిస్థితులు వస్తాయని జోస్యం చెప్పారు. ఆ పార్టీకి మిత్ర పక్షాల నుంచి ముప్పు పొంచి ఉందని బీజేపీ, జనసేనను ఉద్దేశించి ఈ కామెంట్స్ చేశారు. 

వైసీపీ అనంతపురము జిల్లా కమిటీ సమావేశం
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి అధ్యక్షతన వైసీపీ జిల్లా కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశమైంది. జిల్లా కమిటీ కార్యవర్గం, అనుబంధ సంఘాల అధ్యక్షులు, నియోజకవర్గాల సమన్వయకర్తలు తలారి రంగయ్య, విశ్వేశ్వరరెడ్డి, మెట్టు గోవిందరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, వీరాంజనేయులు, ఎమ్మెల్సీ మంగమ్మ, జెడ్పీ చైర్‌పర్సన్‌ గిరిజమ్మ, పంచాయతీ రాజ్‌ విభాగం రాష్ట్ర అధ్యక్షులు వెన్నపూస రవీంద్రారెడ్డి హాజరయ్యారు. ముందుగా వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించిన నాయకులు అనంతరం పార్టీ విధివిధానాలపై చర్చించారు. 

Anantapur News Today: బీజేపీ, జనసేనతోనే టీడీపీ ముప్పు- సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేతలు

క్షేత్రస్థాయి నుంచి వైసీపీ బలోపేతం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై అనంత వెంకటరామిరెడ్డి దిశానిర్దేశం చేశారు. ఏడు నెలల్లోనే ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుందని అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై గ్రామ స్థాయి నుంచి పోరాటం చేద్దామని కేడర్‌కు సూచించారు. నియోజకవర్గ, మండల స్థాయి కమిటీలను త్వరలోనే నియమిస్తామని వెల్లడించారు. 

Also Read: నిన్న మహాసేన రాజేష్, ఇవాళ శ్రీనివాస్ రెడ్డి - లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయయాాలని డిమాండ్ - ప్లానేనా ?

త్వరలో జిల్లా వైసీపీ కార్యాలయం ప్రారంభమిస్తారమన్నారు వెంకటరామిరెడ్డి. అన్ని నియోజకవర్గాల్లోనూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాలు అందుబాటులోకి రావాలని సూచించారు. సమన్వయకర్తలు, జిల్లా కమిటీలోని నాయకులు కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలని హితవుపలికారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా మన పార్టీ ఆఫీస్‌ గుర్తుకు రావాలని దిశానిర్దేశం చశారు. అక్కడికి వెళ్తే సమస్య పరిష్కారం దిశగా అడుగులు పడతాయన్న భరోసా కల్పించాలన్నార. 

కేడర్‌ కూడా మరింత యాక్టివ్‌గా ఉండాలని వెంకటరామిరెడ్డి సూచించారు. పార్టీ ఒక్క పిలుపు ఇస్తే గ్రామ స్థాయి నుంచి క్యాడర్‌ అంతా కదలాలని ఉత్సాహం నింపారు. వైసీపీకి లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారని వాళ్లను కాపాడుకోవాల్సిన బాధ్యత నాయకులందరిపై కూడా ఉందని సూచించారు. జమిలి వస్తాయో లేదో తెలియదు కానీ అంతకుముందే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయని అందరూ సమాయత్తం కావాల తెలిపారు. 

Also Read: పవన్ కళ్యాణ్ కి చిత్తశుద్ధి ఉంటే ఆ ఎమ్మెల్యేను సస్పెండ్ చేయాలి - జక్కంపూడి రాజా డిమాండ్

కార్యకర్తల విషయంలో గతంలో జరిగిన తప్పిదాలు ఇకపై జరగబోవని హామీ ఇచ్చారు వెంకటరామిరెడ్డి. తప్పకుండా పార్టీ కోసం కష్టపడిన వారికి గుర్తింపు ఉంటుందని భరోసా ఇచ్చారు. అధికార యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని దౌర్జన్యాలు చేస్తున్నారని వాటిని సమర్థవంతంగా ఎదుర్కొందామన్నారు. ఈ సమావేశంలోనే వైసీపీ బలోపేతంపై నియోజకవర్గాల సమన్వయకర్తలు సూచనలు, సలహాలు ఇచ్చారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేద్దామని, అందరూ ఐకమత్యంతో కలిసి ముందుకెళ్దామని పిలుపునిచ్చారు. 

సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన అనంత వెంకటరామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హామీలను అమలు చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విఫలం అయ్యారని ఆరోపించారు. ధనార్జనే ధ్యేయంగా టీడీపీ కూటమి నేతలు పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ప్రజాసమస్యలపై పోరాటాలు ఉద్ధృతం చేస్తామన్నారు. టీడీపీ కూటమి ఎమ్మెల్యేల కనుసన్నల్లో పోలీసులు పని చేయడం బాధాకరమని అన్నారు. క్షేత్రస్థాయిలో వైఎస్సార్‌ సీపీ ని బలోపేతం చేస్తామన్నారు. 


Anantapur News Today: బీజేపీ, జనసేనతోనే టీడీపీ ముప్పు- సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేతలు

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ చేయవద్దని వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో తీర్మానం చేశామని గుర్తు చేశారు వెంకటరామిరెడ్డి. వైఎస్‌ జగన్‌ కృషి వల్లే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు రూ.11500 కోట్లు మంజూరు అయ్యాయని అన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు క్యాపిటీవ్‌ మైన్‌ కేటాయించాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌లో విలీనం చేయాలన్నారు.   

ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ... చంద్రబాబు ప్రజావ్యతిరేక విధానాలపై దీటుగా పోరాటం చేస్తామన్నారు. డైవర్షన్‌ పాలిటిక్స్‌ వల్ల చంద్రబాబుకే నష్టం వాటిల్లిందన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వంలో లుకలుకలు మొదలయ్యాయని అభిప్రాయపడ్డారు. మిత్రపక్షమే టీడీపీని మింగేస్తుందని రాజకీయ విశ్లేషకులు బహిరంగంగా చెబుతున్నారని తెలిపారు. మాజీ ఎంపీ తలారి రంగయ్య మాట్లాడుతూ... ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూపర్‌ సిక్స్‌ హామీలను అమలు చేయలేదన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రజల గొంతుక పనిచేస్తుందన్నారు. 


Anantapur News Today: బీజేపీ, జనసేనతోనే టీడీపీ ముప్పు- సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేతలు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Chiranjeevi: బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Jagan towards Congress: మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
Embed widget