అన్వేషించండి

Anantapur: చేనేత పరిశ్రమ కుదేలు! ప్రభుత్వ ఆ నిర్ణయంతో మరింతగా భారం - ఆవేదనలో కార్మికులు

Handlooms Industry: సంక్షోభంలో కూరుకుపోయిన చేనేత రంగం మరింతగా దిగజారే పరిస్థితులు ఏర్పడ్డాయి. గత మూడు నెలల్లో ముడిసరుకుల ధర రెట్టింపు కావడమే ఇందుకు ప్రధాన కారణం.

రోజు రోజుకి చేనేత ముడిసరుకుల ధరలు రాకెట్ స్పీడ్ తో పైకి వెళ్తున్నాయి. చేనేత ఉత్పత్తుల ధరలు మాత్రం స్థిరంగా ఉంటున్నాయి. దీంతో గిట్టుబాటు కాకపోవడంతో చేనేత వృత్తిని వీడేందుకు నేతన్నలు సిద్ధమవుతున్నారు. తమ తర్వాతి తరాలను ఎట్టి పరిస్థితులలో ఈ వృత్తికి దూరంగా పెంచేందుకే నిర్ణయించుకున్నట్టు తెగేసి చెబుతున్నారు. కిలో పట్టు ధర రూ.3,500 నుంచి రూ.7 వేలకి చేరిందని అంటున్నారు. ఇది కూడా కేవలం రెండు నెలల వ్యవధిలోనే సుమారు వంద శాతం ధర పెరగడం ఆశ్చర్యకరమని నేతన్నలు చెబుతున్నారు.  

వివిధ కారణాల వల్ల ధరలు పెరిగాయా? లేక దళారీలు తమ ఇష్టారాజ్యంగా పెంచారా? అన్న విషయం కూడా అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత శాఖ అధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం ఆందోళన కలిగించే విషయమని ఆరోపిస్తున్నారు. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని అధికంగా చేయడం మరింత ఆందోళనకరమని నేతన్నలు విచారం వ్యక్తం చేస్తున్నారు.

జిల్లా వ్యాప్తంగా ఐదు లక్షల మంది చేనేత వర్గానికి సంబంధించిన జనాభా ఉంది. వేలాదిగా చేనేత మగ్గాలు ఉన్నాయి. అయితే ధరలు పెరిగిపోవడం, ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లేకపోవడంతో తీవ్ర నష్టాలను చవిచూసిన నేతన్నలు చేనేత మగ్గాలను తీసేస్తున్నారు.  ఇతర వృత్తులపై దృష్టిసారించి అష్టకష్టాలు పడుతున్నారు. దీనికి చేనేతకి పోటీగా పవర్ లూమ్స్ రావడంతో చేనేత పరిశ్రమ మరింత సంక్షోభంలోకి కూరుకుపోయిందని చేనేతలు చెబుతున్నారు. ప్రభుత్వాలు తమకు కూడా పవర్లూమ్స్ ఏర్పాటు చేసుకునేందుకు రుణాలు మంజూరు చేసి తమ వర్గాలను ఆదుకోవాలని కోరుతున్నారు.
Anantapur: చేనేత పరిశ్రమ కుదేలు! ప్రభుత్వ ఆ నిర్ణయంతో మరింతగా భారం - ఆవేదనలో కార్మికులు

ఒక్కఅనంతపురం జిల్లాలోనే దాదాపుగా 5 లక్షల కుటుంబాలు చేనేత వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. అయితే, వీరిలో చాలా మంది ఇప్పటికే ఈ వృత్తి నుంచి దూరం అవుతున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. పాత తరం వారు మాత్రమే ఈ వృత్తిలో కొనసాగుతుండగా, కొత్త తరం వారు హ్యాండ్లూమ్స్ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఓ వైపు పవర్ లూమ్స్, మరోవైపు రోజురోజుకు పెరుగుతున్న ముడి సరకుల ధరలతో మరింత ఇబ్బందులకు గురవుతున్నామంటున్నారు చేనేత కార్మికులు.

ఇప్పటికే తెలంగాణలో అక్కడి నేతల చేనేత ముడిసరుకుల ధరలపై జీఎస్టీ లేకుండా చూడాలంటూ కేంద్రానికి విజ్ణప్తి చేయగా, ఇక్కడ ఏపీలో కూడా తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు. ముడి సరకులకు జీఎస్టీని తొలగించాలంటూ విన్నవించారు. అనంతపురంలో నాసిన్ భూమిపూజకు వచ్చిన కేంద్రమంత్రికి స్థానిక నేతలు కూడా ఇదే వినతి పత్రం ఇచ్చారు. కానీ ఆర్థిక మంత్రి ఏ మాత్రం స్పందించలేదు. ఇప్పటికే సంక్షోభంలో కూరుకుపోయిన చేనేత పరిశ్రమ మరింతగా దిగజారే పరిస్థితులు ఏర్పడ్డాయంటున్నారు చేనేత కార్మికులు. ప్రభుత్వాలు ఏ విధంగా స్పందిస్తాయనేదానిపై ఆశగా ఎదురు చూస్తున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Breaking News: కేబినెట్ నుంచి తొలగింపు! కొత్త పార్టీ ఏర్పాటుపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
కేబినెట్ నుంచి తొలగింపు! కొత్త పార్టీ ఏర్పాటుపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
Andhra Pradesh Heatwave: మండుతున్న ఆంధ్రప్రదేశ్‌! 47 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు! ఈ జిల్లావాసులు అవసరమైతే తప్ప బయటకు రావద్దు! 
మండుతున్న ఆంధ్రప్రదేశ్‌! 47 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు! ఈ జిల్లావాసులు అవసరమైతే తప్ప బయటకు రావద్దు! 
Heatwave In AP and Telangana: తెలుగు రాష్ట్రాల్లో భానుడి ఉగ్రరూపం.. వచ్చే వారం రోజులు అప్రమత్తంగా ఉండాలని IMD వార్నింగ్!
తెలుగు రాష్ట్రాల్లో భానుడి ఉగ్రరూపం.. వచ్చే వారం రోజులు అప్రమత్తంగా ఉండాలని IMD వార్నింగ్!
Rajdhani Express Fire Accident: రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. కాశీ యాత్రకు వెళ్తున్న భక్తుల బస్సు శ్రీకాకుళంలో బోల్తా
రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. కాశీ యాత్రకు వెళ్తున్న భక్తుల బస్సు శ్రీకాకుళంలో బోల్తా

వీడియోలు

Jaanvi on BucchiBabu: ఈ డైరక్టర్ మామూలోడు కాదు.. పెద్ద రౌడీ.. బుచ్చిబాబుపై జాన్వీ కామెంట్స్
Adilabad Garden Village: ఇంటింటికి పూలవనం... దానితోనే ధనం
RTC Bus Overtake Shock సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం
“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 MI VS KKR Result Update: కేకేఆర్ స్ట‌న్నింగ్ విక్ట‌రీ.. ప్లే ఆఫ్స్ రేసులోనే ర‌హానే సేన‌.. రాణించిన మ‌నీశ్.. ముంబైకి మ‌రో ఓట‌మి
కేకేఆర్ స్ట‌న్నింగ్ విక్ట‌రీ.. ప్లే ఆఫ్స్ రేసులోనే ర‌హానే సేన‌.. రాణించిన మ‌నీశ్.. ముంబైకి మ‌రో ఓట‌మి
AP Green Energy: రాయలసీమలో గ్రీన్ ఎనర్జీ విప్లవం - ౩ వేల కోట్లతో భారీ సోలార్ ప్రాజెక్ట్.. 11 నెలల్లోనే రికార్డు స్థాయి పూర్తి!
రాయలసీమలో గ్రీన్ ఎనర్జీ విప్లవం - ౩ వేల కోట్లతో భారీ సోలార్ ప్రాజెక్ట్.. 11 నెలల్లోనే రికార్డు స్థాయి పూర్తి!
Tata Sierra SUVకు గట్టి పోటీ ఇవ్వనున్న Jeep Renegade.. దీని ధర, ఫీచర్లు చూసి కొనేయండి
Tata Sierra SUVకు గట్టి పోటీ ఇవ్వనున్న Jeep Renegade.. దీని ధర, ఫీచర్లు చూసి కొనేయండి
Caste Census 2027: కుల గణనపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు- ప్రభుత్వానికి తెలియాల్సిందే .. వ్యతిరేక పిటిషన్ కొట్టివేత
కుల గణనపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు- ప్రభుత్వానికి తెలియాల్సిందే .. వ్యతిరేక పిటిషన్ కొట్టివేత
FD Rates 2026: బ్యాంకుల కొత్త స్కీమ్స్ ద్వారా ఎక్కువ లాభాలు.. ఆ ఎఫ్‌డీల కండీషన్లు మరిచిపోవద్దు
బ్యాంకుల కొత్త స్కీమ్స్ ద్వారా ఎక్కువ లాభాలు.. ఆ FDల కండీషన్లు మరిచిపోవద్దు
Modi In Italy: మెలోనీకి ‘మెలొడీ’ చాక్లెట్లు ఇచ్చిన మోదీ.. ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న క్రేజీ పిక్స్!
మెలోనీకి ‘మెలొడీ’ చాక్లెట్లు ఇచ్చిన మోదీ.. ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న క్రేజీ పిక్స్!
Ebola Virus : ఆఫ్రికాలో మళ్లీ ఎబోలా కలకలం.. బుండిబుగ్యో రకంపై WHO అత్యవసర హెచ్చరికలు
ఆఫ్రికాలో మళ్లీ ఎబోలా కలకలం.. బుండిబుగ్యో రకంపై WHO అత్యవసర హెచ్చరికలు
He Man Telugu Trailer : హీ మ్యాన్ తెలుగు ట్రైలర్ - టాలీవుడ్ హీరో నిఖిల్ వాయిస్ ఓవర్... బిగ్ సర్ప్రైజ్ ఏంటో తెలుసా?
హీ మ్యాన్ తెలుగు ట్రైలర్ - టాలీవుడ్ హీరో నిఖిల్ వాయిస్ ఓవర్... బిగ్ సర్ప్రైజ్ ఏంటో తెలుసా?
Embed widget