అన్వేషించండి

CM Jagan: వరద బాధితులకు సీఎం జగన్ పరామర్శ... మృతుల కుటుంబాల్లో ఒకరికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం.. ఇళ్లు కోల్పోయిన వారికి 5 సెంట్ల స్థలం

కడప, చిత్తూరు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లోని సీఎం జగన్ పర్యటించారు. బాధితులను ఆదుకుంటామని సీఎం హామీ ఇచ్చారు.

ఇటీవల భారీ వర్షాలు, వరదలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని పులపుత్తూరులో వరద బాధితులతో సీఎం జగన్ మాట్లాడారు. ఇళ్లు కోల్పోయిన వరద బాధితులు సీఎం జగన్ కు తమ బాధలు వివరించారు. వరదలతో సర్వం కోల్పోయామని, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకున్నారు. వరద బాధితులకు సీఎం జగన్ భరోసా ఇచ్చారు. ధైర్యంగా ఉండండని జగన్‌ హామీ ఇచ్చారు. ఇళ్లు కోల్పోయిన బాధితులకు రూ.90వేల సాయం సరిపోదని, ఇళ్లు నిర్మించి ఇవ్వాలని సీఎం జగన్ ను బాధితులు కోరారు. ఇళ్లు నిర్మించే బాధ్యత అన్ని విధాలుగా ఆదుకుంటానని సీఎం జగన్ చెప్పారు. గ్రామంలో వరద పరిస్థితిపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ సీఎం పరిశీలించారు.

CM Jagan: వరద బాధితులకు సీఎం జగన్ పరామర్శ... మృతుల కుటుంబాల్లో ఒకరికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం.. ఇళ్లు కోల్పోయిన వారికి 5 సెంట్ల స్థలం

Also Read: ఏపీలో అధికార ఎమ్మెల్యేలపై కేసుల ఎత్తివేత.. సుమోటోగా హైకోర్టు విచారణ !

CM Jagan: వరద బాధితులకు సీఎం జగన్ పరామర్శ... మృతుల కుటుంబాల్లో ఒకరికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం.. ఇళ్లు కోల్పోయిన వారికి 5 సెంట్ల స్థలం

బాధితుల్ని అన్ని విధాలా ఆదుకుంటాం : సీఎం 

వరద బాధితులతో మాట్లాడిన సీఎం జగన్.. పొదుపు మహిళల రుణాలపై ఏడాది వడ్డీ ప్రభుత్వం చెల్లిస్తుందని బాధితులకు హామీ ఇచ్చారు. వరదల్లో చనిపోయిన వారి కుటుంబాల్లో ఒకరికి ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగం ఇస్తామని సీఎం చెప్పారు.​ వరదలతో చాలా నష్టం జరిగిందన్న సీఎం... వరద సహాయ కార్యక్రమాల్లో అధికారులు బాగా పనిచేశారని సీఎం జగన్‌ అన్నారు. రాజంపేట మండలంలోని మందపల్లి, పులపుత్తూరులో వరద బాధితులను సీఎం జగన్‌ పరామర్శించారు. 

Also Read: నెల్లూరు పర్యటనకు సీఎం జగన్.. స్థానిక నాయకుల్లో టెన్షన్ టెన్షన్..

ఇళ్లు కోల్పోయిన వారికి 5 సెంట్ల స్థలం

వరద నష్టాన్ని ఎవరూ పూడ్చలేరని సీఎం జగన్ అన్నారు. వరద ప్రాంతాల్లో అధికారులు పని తీరు భేషుగ్గా ఉందన్నారు. 'సహాయం అందని వారు గ్రామ సచివాలయంలో ఫిర్యాదు చేయండి. నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ఆదుకుంటాం. ఇళ్లు కోల్పోయిన వారికి 5 సెంట్ల స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణం చేస్తాం. డ్యామ్ లు రెండు కొట్టుకుపోయిన పరిస్థితి. పొలాల్లో ఇసుక మేటలు వచ్చాయి.  ఇసుక మేటలు ఉన్న రైతులు ప్రతి ఒక్కరికి హెక్టార్ కు రూ.12 వేలు ఇచ్చేట్లు చర్యలు తీసుకుంటాం. ఈ క్రాప్ నమోదు చేసుకున్న వారికి కూడా పరిహారం అందిస్తాం. పొదుపు సంఘాల వారికి కూడా అండగా ఉంటాం. చదువుకున్న పిల్లలకు, వాహనాలు కోల్పోయిన వారిని కూడా ఆదుకుంటాం. వరద గ్రామాల్లో జాబ్ మేళా పెట్టాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చాము. అధికారాలు ఇక్కడే ఉంటారు. 6 గ్రామాలకు ఒక సబ్ కలెక్టర్ ఇంచార్జ్ గా ఇక్కడే ఉంటారు. ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు డిప్యూటీ కలెక్టర్ లు ఇక్కడే ఉంటారు. ఎప్పుడూ ఊహించని విధంగా 3 లక్షల క్యూసెక్కుల నీరు డ్యామ్ లకు వచ్చింది. కలెక్టర్ చాలా బాగా పనిచేశారు. లేకుంటే ఇంకా ఎక్కువ నష్టం జరిగేది. డ్యామ్ లు డిజైన్ లు మార్చి కట్టేలా చర్యలు తీసుకుంటాం. నీళ్లు గ్రామాలలోకి రాకుండా రక్షణ గోడలు నిర్మిస్తాం. అన్ని రకాల ఎమ్మెల్యే మేడా, జడ్పీ ఛైర్మన్ ఆకెపాటి, వైసీపీ నాయకులు బాధితులకు అండగా నిలిచారు.' అని సీఎం జగన్ అన్నారు. 

చిత్తూరు జిల్లాలో సీఎం పర్యటన

చిత్తూరు జిల్లాకు వరదల వల్ల ఎన్నడూ లేని విధంగా భారీ నష్టం జరిగిందని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఏర్పేడు మండలం పాపా నాయుడుపేట నుంచి గుడిమల్లం మీదుగా వెళ్లే స్వర్ణముఖి నది మీద నిర్మించిన బ్రిడ్జి ఇటీవల వరదలకు కొట్టుకుపోగా ఈ ప్రాంతాన్ని ముఖ్యమంత్రి పరిశీలించారు. అంతకు ముందు ముఖ్యమంత్రి రోడ్లు భవనాలు, గ్రామీణ నీటి సరఫరా, వ్యవసాయ శాఖ,  ఏపీ ట్రాన్స్కో, ఇరిగేషన్, పంచాయతీరాజ్ శాఖలకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా జరిగిన నష్టాలకు సంబంధించి ఫొటో ఎగ్జిబిషన్ ను ముఖ్యమంత్రి పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్ సీఎంకు వివరించారు. అనంతరం గుడిమల్లం గ్రామానికి వెళ్లే బ్రిడ్జి స్వర్ణముఖి నది దాటికి కొట్టుకుపోయిన ప్రాంతాన్ని పరిశీలించారు. అదేవిధంగా నదీ ప్రవాహం వల్ల 15 గ్రామాలకు రాకపోకలు లేవని అదే విధంగా పలు భూములు కూడా ప్రవాహం ధాటికి కొట్టుకుపోయాయని ముఖ్యమంత్రికి చూపించారు. మొత్తం 195 మీటర్లు గల బ్రిడ్జి కొట్టుకు పోయిందని, తాత్కాలిక మరమ్మతులకు కోటి రూపాయలు ఖర్చు అవుతుందని, శాశ్వతంగా నిర్మించేందుకు రూ.20 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. 

సమీక్ష రద్దు

తిరుపతి శ్రీ పద్మావతి అతిథి గృహంలో జిల్లా అధికారులతో సీఎం సమీక్షా సమావేశం రద్దైంది. రేపు ఉదయం సమీక్షా సమావేశం ఉండే అవకాశం ఉంది. సమీక్షా సమావేశం అనంతరం వరద ప్రభావిత ప్రాంతాలు పాడిపేట, ఆటోనగర్, శ్రీకృష్ణ నగర్ లో సీఎం జగన్ పర్యటించనున్నారు. 

Also Read: "సంపూర్ణ గృహహక్కు" తో పేద ప్రజలకు లక్షల ఆస్తి .. జరుగుతున్నదంతా తప్పుడు ప్రచారమే ! ఓటీఎస్‌ పథకంపై పూర్తి డీటైల్స్ ఇవిగో..

Also Read: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పర్మినెంట్‌ ఎప్పుడు ? లాంఛనాలు పూర్తి చేసినా కన్ఫర్మ్ చేయని ప్రభుత్వం 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Snake In Meeting: కౌన్సిల్ సమావేశానికి నాగుపామును తెచ్చిన సభ్యుడు.. మంత్రి నియోజకవర్గంలో షాకింగ్ సీన్
కౌన్సిల్ సమావేశానికి నాగుపామును తెచ్చిన సభ్యుడు.. మంత్రి నియోజకవర్గంలో షాకింగ్ సీన్
Geetu Royal: తిరుమల గుడి ముందు రీల్స్‌కు రి'యాక్షన్'... గీతూ రాయల్‌కు ఏడుపు ఒకటే తక్కువ
తిరుమల గుడి ముందు రీల్స్‌కు రి'యాక్షన్'... గీతూ రాయల్‌కు ఏడుపు ఒకటే తక్కువ
AP Free Bus: దివ్యాంగులకు శుభవార్త.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ!
దివ్యాంగులకు శుభవార్త.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ!
Kakinada Fireworks Explosion: వేట్లపాలెం ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.20 లక్షలు, పక్కా ఇళ్లు- నలుగురు అధికారులపై వేటు!
వేట్లపాలెం ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.20 లక్షలు, పక్కా ఇళ్లు- నలుగురు అధికారులపై వేటు!

వీడియోలు

ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
ABP Network Ideas of India Summit 2026 Inaguration | ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సమ్మిట్ ప్రారంభం | ABP Desam
Kavitha about Delhi Liquor Scam Case | లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్
India vs Zimbabwe Highlights T20 World Cup | జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా
Rinku Singh Father Passes Away | రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
Israel Strike On Iran: ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
PM Modi On Kakinada Incident: సామర్లకోట ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
సామర్లకోట బాణసంచా ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
Kokapet Swarupananda Lands: కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
Nara Lokesh : సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
TTD budget: వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
Ananya Nagalla: తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
Pakistan vs Sri Lanka: టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ రికార్డు బద్ధలుకొట్టిన పాక్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్
టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ రికార్డు బద్ధలుకొట్టిన పాక్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్
Embed widget