అన్వేషించండి

CM Jagan: వరద బాధితులకు సీఎం జగన్ పరామర్శ... మృతుల కుటుంబాల్లో ఒకరికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం.. ఇళ్లు కోల్పోయిన వారికి 5 సెంట్ల స్థలం

కడప, చిత్తూరు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లోని సీఎం జగన్ పర్యటించారు. బాధితులను ఆదుకుంటామని సీఎం హామీ ఇచ్చారు.

ఇటీవల భారీ వర్షాలు, వరదలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని పులపుత్తూరులో వరద బాధితులతో సీఎం జగన్ మాట్లాడారు. ఇళ్లు కోల్పోయిన వరద బాధితులు సీఎం జగన్ కు తమ బాధలు వివరించారు. వరదలతో సర్వం కోల్పోయామని, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకున్నారు. వరద బాధితులకు సీఎం జగన్ భరోసా ఇచ్చారు. ధైర్యంగా ఉండండని జగన్‌ హామీ ఇచ్చారు. ఇళ్లు కోల్పోయిన బాధితులకు రూ.90వేల సాయం సరిపోదని, ఇళ్లు నిర్మించి ఇవ్వాలని సీఎం జగన్ ను బాధితులు కోరారు. ఇళ్లు నిర్మించే బాధ్యత అన్ని విధాలుగా ఆదుకుంటానని సీఎం జగన్ చెప్పారు. గ్రామంలో వరద పరిస్థితిపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ సీఎం పరిశీలించారు.

CM Jagan: వరద బాధితులకు సీఎం జగన్ పరామర్శ... మృతుల కుటుంబాల్లో ఒకరికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం.. ఇళ్లు కోల్పోయిన వారికి 5 సెంట్ల స్థలం

Also Read: ఏపీలో అధికార ఎమ్మెల్యేలపై కేసుల ఎత్తివేత.. సుమోటోగా హైకోర్టు విచారణ !

CM Jagan: వరద బాధితులకు సీఎం జగన్ పరామర్శ... మృతుల కుటుంబాల్లో ఒకరికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం.. ఇళ్లు కోల్పోయిన వారికి 5 సెంట్ల స్థలం

బాధితుల్ని అన్ని విధాలా ఆదుకుంటాం : సీఎం 

వరద బాధితులతో మాట్లాడిన సీఎం జగన్.. పొదుపు మహిళల రుణాలపై ఏడాది వడ్డీ ప్రభుత్వం చెల్లిస్తుందని బాధితులకు హామీ ఇచ్చారు. వరదల్లో చనిపోయిన వారి కుటుంబాల్లో ఒకరికి ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగం ఇస్తామని సీఎం చెప్పారు.​ వరదలతో చాలా నష్టం జరిగిందన్న సీఎం... వరద సహాయ కార్యక్రమాల్లో అధికారులు బాగా పనిచేశారని సీఎం జగన్‌ అన్నారు. రాజంపేట మండలంలోని మందపల్లి, పులపుత్తూరులో వరద బాధితులను సీఎం జగన్‌ పరామర్శించారు. 

Also Read: నెల్లూరు పర్యటనకు సీఎం జగన్.. స్థానిక నాయకుల్లో టెన్షన్ టెన్షన్..

ఇళ్లు కోల్పోయిన వారికి 5 సెంట్ల స్థలం

వరద నష్టాన్ని ఎవరూ పూడ్చలేరని సీఎం జగన్ అన్నారు. వరద ప్రాంతాల్లో అధికారులు పని తీరు భేషుగ్గా ఉందన్నారు. 'సహాయం అందని వారు గ్రామ సచివాలయంలో ఫిర్యాదు చేయండి. నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ఆదుకుంటాం. ఇళ్లు కోల్పోయిన వారికి 5 సెంట్ల స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణం చేస్తాం. డ్యామ్ లు రెండు కొట్టుకుపోయిన పరిస్థితి. పొలాల్లో ఇసుక మేటలు వచ్చాయి.  ఇసుక మేటలు ఉన్న రైతులు ప్రతి ఒక్కరికి హెక్టార్ కు రూ.12 వేలు ఇచ్చేట్లు చర్యలు తీసుకుంటాం. ఈ క్రాప్ నమోదు చేసుకున్న వారికి కూడా పరిహారం అందిస్తాం. పొదుపు సంఘాల వారికి కూడా అండగా ఉంటాం. చదువుకున్న పిల్లలకు, వాహనాలు కోల్పోయిన వారిని కూడా ఆదుకుంటాం. వరద గ్రామాల్లో జాబ్ మేళా పెట్టాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చాము. అధికారాలు ఇక్కడే ఉంటారు. 6 గ్రామాలకు ఒక సబ్ కలెక్టర్ ఇంచార్జ్ గా ఇక్కడే ఉంటారు. ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు డిప్యూటీ కలెక్టర్ లు ఇక్కడే ఉంటారు. ఎప్పుడూ ఊహించని విధంగా 3 లక్షల క్యూసెక్కుల నీరు డ్యామ్ లకు వచ్చింది. కలెక్టర్ చాలా బాగా పనిచేశారు. లేకుంటే ఇంకా ఎక్కువ నష్టం జరిగేది. డ్యామ్ లు డిజైన్ లు మార్చి కట్టేలా చర్యలు తీసుకుంటాం. నీళ్లు గ్రామాలలోకి రాకుండా రక్షణ గోడలు నిర్మిస్తాం. అన్ని రకాల ఎమ్మెల్యే మేడా, జడ్పీ ఛైర్మన్ ఆకెపాటి, వైసీపీ నాయకులు బాధితులకు అండగా నిలిచారు.' అని సీఎం జగన్ అన్నారు. 

చిత్తూరు జిల్లాలో సీఎం పర్యటన

చిత్తూరు జిల్లాకు వరదల వల్ల ఎన్నడూ లేని విధంగా భారీ నష్టం జరిగిందని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఏర్పేడు మండలం పాపా నాయుడుపేట నుంచి గుడిమల్లం మీదుగా వెళ్లే స్వర్ణముఖి నది మీద నిర్మించిన బ్రిడ్జి ఇటీవల వరదలకు కొట్టుకుపోగా ఈ ప్రాంతాన్ని ముఖ్యమంత్రి పరిశీలించారు. అంతకు ముందు ముఖ్యమంత్రి రోడ్లు భవనాలు, గ్రామీణ నీటి సరఫరా, వ్యవసాయ శాఖ,  ఏపీ ట్రాన్స్కో, ఇరిగేషన్, పంచాయతీరాజ్ శాఖలకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా జరిగిన నష్టాలకు సంబంధించి ఫొటో ఎగ్జిబిషన్ ను ముఖ్యమంత్రి పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్ సీఎంకు వివరించారు. అనంతరం గుడిమల్లం గ్రామానికి వెళ్లే బ్రిడ్జి స్వర్ణముఖి నది దాటికి కొట్టుకుపోయిన ప్రాంతాన్ని పరిశీలించారు. అదేవిధంగా నదీ ప్రవాహం వల్ల 15 గ్రామాలకు రాకపోకలు లేవని అదే విధంగా పలు భూములు కూడా ప్రవాహం ధాటికి కొట్టుకుపోయాయని ముఖ్యమంత్రికి చూపించారు. మొత్తం 195 మీటర్లు గల బ్రిడ్జి కొట్టుకు పోయిందని, తాత్కాలిక మరమ్మతులకు కోటి రూపాయలు ఖర్చు అవుతుందని, శాశ్వతంగా నిర్మించేందుకు రూ.20 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. 

సమీక్ష రద్దు

తిరుపతి శ్రీ పద్మావతి అతిథి గృహంలో జిల్లా అధికారులతో సీఎం సమీక్షా సమావేశం రద్దైంది. రేపు ఉదయం సమీక్షా సమావేశం ఉండే అవకాశం ఉంది. సమీక్షా సమావేశం అనంతరం వరద ప్రభావిత ప్రాంతాలు పాడిపేట, ఆటోనగర్, శ్రీకృష్ణ నగర్ లో సీఎం జగన్ పర్యటించనున్నారు. 

Also Read: "సంపూర్ణ గృహహక్కు" తో పేద ప్రజలకు లక్షల ఆస్తి .. జరుగుతున్నదంతా తప్పుడు ప్రచారమే ! ఓటీఎస్‌ పథకంపై పూర్తి డీటైల్స్ ఇవిగో..

Also Read: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పర్మినెంట్‌ ఎప్పుడు ? లాంఛనాలు పూర్తి చేసినా కన్ఫర్మ్ చేయని ప్రభుత్వం 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: స్టీల్ ప్లాంట్ కాదు.. కాబోయే స్టీల్ సిటీ - మిట్టల్ పరిశ్రమ శంకుస్థాపనలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
స్టీల్ ప్లాంట్ కాదు.. కాబోయే స్టీల్ సిటీ - మిట్టల్ పరిశ్రమ శంకుస్థాపనలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Foundation stone laid for steel plant: చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
YS Sharmila On Jagan: నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Police complaint about uncooked mutton: మటన్ ఉడకలేదని పోలీస్ స్టేషన్‌కు.. అనంతపురంలో వింత ఫిర్యాదు!
మటన్ ఉడకలేదని పోలీస్ స్టేషన్‌కు.. అనంతపురంలో వింత ఫిర్యాదు!

వీడియోలు

MS Dhoni about IPL Retirement | రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన తల ధోని | ABP Desam
Virat Kohli Reacts on Fake News | ఫేక్ వార్తలపై విరాట్ ఫన్నీ రియాక్షన్ | ABP Desam
Abhishek Sharma Shouts 'Jai Babu' | జై బాబు అంటూ అభిషేక్ శర్మ రచ్చ | ABP Desam
Aakash Chopra comments on SRH | SRH బౌలింగ్‌పై ఆకాశ్ చోప్రా ఘాటు వ్యాఖ్యలు | ABP Desam
Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Foundation stone laid for steel plant: చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
Hyderabad Latest News: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
YS Sharmila On Jagan: నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Pawan Kalyan : పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
Gold and Silver Price: పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
Stock Market 23 March: కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
Harish Rao: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
National Highways: జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
Embed widget