అన్వేషించండి

AP Village Secretariat Employees : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పర్మినెంట్‌ ఎప్పుడు ? లాంఛనాలు పూర్తి చేసినా కన్ఫర్మ్ చేయని ప్రభుత్వం !

ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వం తమను పర్మినెంట్ చేస్తుందని ఎదురు చూస్తున్నారు. అక్టోబర్ 2కే వారి ప్రొబేషన్ పిరియడ్ పూర్తయింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకు వచ్చినా గ్రామ,వార్డు సచివాలయ వ్యవస్థలో ఉద్యోగులుగా చేరిన వారిలో నిరాశా నిస్పృహలు అలుముకుంటున్నాయి. ఎంతో కష్టనష్టాల కోర్చి పరీక్షలు వ్రాసి ప్రభుత్వం చెప్పినట్లుగా రెండేళ్లు ప్రొబేషన్‌ పూర్తి చేసుకొన్నా ఇప్పటికి పర్మినెంట్ అయినట్లుగా ఆదేశాలు రాలేదు.  గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు  540 సేవలు అందిస్తున్నారు. పింఛన్లు మొదలుకొని ఇంటింటికి బియ్యం సరఫరా, రైతు భరోసా నుండి ప్రస్తుతం రిజిస్ట్రేషన్లు సైతం చేసే అధికారం సచివాలయ వ్యవస్థకే ఇస్తోంది.

Also Read : "సంపూర్ణ గృహహక్కు" తో పేద ప్రజలకు లక్షల ఆస్తి .. జరుగుతున్నదంతా తప్పుడు ప్రచారమే ! ఓటీఎస్‌ పథకంపై పూర్తి డీటైల్స్ ఇవిగో..

వార్డు , గ్రామ సచివాలయ సిబ్బంది ప్రభుత్వ లక్ష్యాలు పూర్తి చేయాలంటే వారికి సూచించిన విధులు, బాధ్యతలతో పాటు పూర్తిస్థాయి జీతాలు కూడా మిగతా ఉద్యోగులతో పాటు ఇవ్వాలి. కానీ ఇప్పటికీ అది జరగడం లేదు. వైఎస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్ని ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించి తీసుకున్నారు. ప్రతి ఉద్యోగి రెండు సంవత్సరాలు తప్పనిసరిగా ప్రొబేషన్‌ను పూర్తి చేయాలని, ఆ తర్వాత వారందరికీ శాశ్వత ఉద్యోగాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ప్రొబేషన్‌ దశలో నెలకు 15 వేలు జీతం చెల్లిస్తామని, 2021 అక్టోబర్‌ 2 నాటికి అందరినీ పర్మినెంట్‌ చేస్తామని నియామక పత్రాలు వ్వక్తిగతంగా అందజేసింది. తర్వాత మాట మార్చి మరో మెలిక పెట్టింది. ఈ ఉద్యోగులను పర్మినెంట్‌ చేయాలంటే మరో రెండు పరీక్షలు రాయాలంది. 

Also Read : నెల్లూరు పర్యటనకు సీఎం జగన్.. స్థానిక నాయకుల్లో టెన్షన్ టెన్షన్..

ప్రభుత్వం డిపార్ట్‌మెంట్‌ పరీక్షలు నిర్వ హించినా వాటిల్లో సైతం అధికభాగం ఉత్తీర్ణులయ్యారు. ఈ అక్టోబరు 2 నాటికి గ్రామ/ వార్డు సచివాలయ కార్యదర్శు లందరికీ శాశ్వత ఉద్యోగులుగా పరిగణిస్తూ ఆదేశాలు జారీ చేస్తారని ఆశపడ్డారు. కానీ అలాంటి ఉత్తర్వులు రాలేదు. సచివాలయ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తే స్కేల్ ప్రకారం జీతాలు చెల్లించాలి. పూర్తిస్థాయి జీతాలు చెల్లించాలంటే ప్రతి నెల మరో రూ. 200 కోట్లు అదనపు భారం పడే అవకాశం ఉంది. ఆర్థిక వెసులుబాటు లేక ఉద్యోగులకు వేతన సవరణ, కరువుభత్యం వంటివి వాయిదా వేస్తున్న ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులను పర్మినెంట్‌ చేసేందుకు కూడా అందుకే వెనుకడుగు వేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. 

Also Read : ఏపీలో అధికార ఎమ్మెల్యేలపై కేసుల ఎత్తివేత.. సుమోటోగా హైకోర్టు విచారణ !

ఆర్థిక సమస్యల కారణంగానే వార్డు, గ్రామ, సచివాలయ ఉద్యోగులను పర్మినెంట్ చేయడం నిజం అయితే.. ప్రభుత్వ ఆర్థికసమస్యలు ఇప్పుడల్లా తీరే అవకాశం ఉండదన్న ఆందోళన వారిలో ఉంది. అందుకే ప్రభుత్వం వీలైనంత త్వరగా తమను శాశ్వత ఉద్యోగులుగా పరిగణించాలని కోరుతున్నారు .

Also Read : రెండున్నరేళ్ల టర్మ్ పూర్తి ! ఏపీలో కొత్త కేబినెట్ ముహుర్తం ఎప్పుడు ?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget