అన్వేషించండి

Pawan Kalyan: పిఠాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కల్యాణ్ - అధికారికంగా ప్రకటించిన జనసేనాని

AP Politics: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం అధికారిక ప్రకటన చేశారు.

Pawan Kalyan Contesting From Pithapuram Assenmbly Constituency: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వచ్చే ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. ఈ మేరకు మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా ఆయన గురువారం అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతానికి ఎంపీగా పోటీ చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఈ క్రమంలో సుదీర్ఘ ఉత్కంఠకు తెర పడింది. కాగా, 2019 ఎన్నికల్లో పవన్ భీమవరం, గాజువాక నియోజకవర్గాల్లో పోటీ చేశారు.

కాగా, ఈ స్థానంలో వైసీపీ అభ్యర్థిగా ఎవరినీ ప్రకటించలేదు. వంగా గీత, ముద్రగడ పద్మనాభం పేర్లను వైసీపీ అధిష్టానం పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ పవన్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే దానిపై స్పష్టత లేకపోవడంతో సీఎం జగన్ నిర్ణయం వెలువరించలేదు. ఇక, ఈ స్థానంపై ఆయన త్వరలోనే స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. కాగా, టీడీపీ - జనసేన - బీజేపీ పొత్తు నేపథ్యంలో జనసేనాని పవన్ కల్యాణ్ ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే స్థానాలపై అటు అభిమానులు, పార్టీ శ్రేణులు, ఇటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆయన ఓ చోట ఎంపీగా పోటీ చేస్తారని, మరో చోట ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. ఎట్టకేలకు పవన్ పిఠాపురం నుంచే ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని స్ఫష్టం చేయడంతో ఉత్కంఠకు తెరపడింది. 

ఇప్పటివరకూ అభ్యర్థులు వీరే

టీడీపీ, బీజేపీతో పొత్తు నేపథ్యంలో జనసేనకు 21 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానాలు కేటాయించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆరు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన జనసేనాని.. బుధవారం రాత్రి మరో 9 మందికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తొలి జాబితాలో నెల్లిమర్ల- మాధవి, అనకాపల్లి- కొణతాల రామకృష్ణ, కాకినాడ రూరల్-  పంతం నానాజీ, తెనాలి- నాదేండ్ల మనోహర్, రాజానగరం - బత్తుల బలరామకృష్ణ, నిడదవోలు కందుల దుర్గేష్ పేర్లను ఖరారు చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని పెందుర్తి నియోజకవర్గం నుంచి పంచకర్ల రమేశ్, ఎలమంచిలి నుంచి సుందరపు విజయ్ కుమార్, విశాఖ దక్షిణం నుంచి వంశీకృష్ణ యాదవ్ లను సీట్లపై పవన్ స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. వారిని పిలిచి మాట్లాడిన ఆయన.. ప్రచారం చేసుకోవాలని సూచించారు. అలాగే, ఉమ్మడి ప.గో జిల్లా తాడేపల్లిగూడెం అభ్యర్థిగా బొలిశెట్టి శ్రీనివాస్, ఉంగుటూరు నుంచి పత్సమట్ట ధర్మరాజు, నరసాపురం నుంచి బొమ్మిడి నాయకర్, భీమవరం నుంచి మంగళవారం పార్టీలో చేరిన పులపర్తి ఆంజనేయుల పేర్లు దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం. ఉమ్మడి తూ.గో జిల్లా రాజోలు నుంచి దేవవరప్రసాద్ అభ్యర్థిత్వానికి ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. అటు, తిరుపతి నుంచి అరణి శ్రీనివాసులుతో భేటీ కాగా.. ఈ స్థానం కూడా దాదాపు ఖరారైనట్లేనని పేర్కొంటున్నారు.

ఏబీపీ ఆనాడే చెప్పింది
Pawan Kalyan: పిఠాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కల్యాణ్ - అధికారికంగా ప్రకటించిన జనసేనాని

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారని ఏబీపీ దేశం గతేడాదే అంచనా వేసింది. అక్కడ రాజకీయ పరిస్థితులు, సామాజిక సమీకరణల దృష్ట్యా ఈ విశ్లేషణ చేసింది. 

Also Read: PM Modi: ఎన్నికల శంఖారావం - తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటన, పూర్తి షెడ్యూల్ ఇదే!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kadiri: కదిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో రాజకీయాలు - బీజేపీ నేతలకు అవమానం - ఎమ్మెల్యే పనే ?
కదిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో రాజకీయాలు - బీజేపీ నేతలకు అవమానం - ఎమ్మెల్యే పనే ?
Andhra Pradesh Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్‌లో దూకుడు - జగన్ సన్నిహితుల విచారణ - ఏం జరుగుతోంది?
ఏపీ లిక్కర్ స్కామ్‌లో దూకుడు - జగన్ సన్నిహితుల విచారణ - ఏం జరుగుతోంది?
Chief Minister Chandrababu Naidu: బ్లాక్ చైన్ టెక్నాలజీతో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు - హార్టికల్చర్ హబ్ సీమ - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
బ్లాక్ చైన్ టెక్నాలజీతో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు - హార్టికల్చర్ హబ్ సీమ - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Nara Lokesh: మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kadiri: కదిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో రాజకీయాలు - బీజేపీ నేతలకు అవమానం - ఎమ్మెల్యే పనే ?
కదిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో రాజకీయాలు - బీజేపీ నేతలకు అవమానం - ఎమ్మెల్యే పనే ?
Kavitha Hunger Strike: ఖమ్మంలో సెగలు రేపుతున్న కవిత దీక్ష! భూబాధితుల కోసం అంబేద్కర్ భవన్‌లో నిరవధిక పోరాటం! 
ఖమ్మంలో సెగలు రేపుతున్న కవిత దీక్ష! భూబాధితుల కోసం అంబేద్కర్ భవన్‌లో నిరవధిక పోరాటం! 
LPG Cylinder New Rule: ఎల్‌పిజి ఉత్పత్తి పెంచాలని రిఫైనరీస్‌కు కేంద్రం ఆదేశం!రెస్టారెంట్లు, హోటళ్లకు సరఫరా చేయడానికి కమిటీ ఏర్పాటు!
ఎల్‌పిజి ఉత్పత్తి పెంచాలని రిఫైనరీస్‌కు కేంద్రం ఆదేశం!రెస్టారెంట్లు, హోటళ్లకు సరఫరా చేయడానికి కమిటీ ఏర్పాటు!
India LPG Cylinder News: మధ్యప్రాచ్య యుద్ధంతో LPG సిలిండర్లపై కీలక నిర్ణయం! బుకింగ్ సమయాన్ని పొడిగింపు!
మధ్యప్రాచ్య యుద్ధంతో LPG సిలిండర్లపై కీలక నిర్ణయం! బుకింగ్ సమయాన్ని పొడిగింపు!
Pakistan Oil Crisis: పాకిస్తాన్‌లో చమురు సంక్షోభం! పాఠశాలలు బంద్‌! వారానికి 4 రోజులే ప్రభుత్వ ఆఫీస్‌లు! మంత్రుల జీతాల్లో కోత! ఇఫ్తార్ విందులపై నిషేధం! 
పాకిస్తాన్‌లో చమురు సంక్షోభం! పాఠశాలలు బంద్‌! వారానికి 4 రోజులే ప్రభుత్వ ఆఫీస్‌లు! మంత్రుల జీతాల్లో కోత! ఇఫ్తార్ విందులపై నిషేధం! 
Velugumatla Issue: వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
Nara Lokesh: మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
Budget Session 2026: ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
Embed widget