అన్వేషించండి

Jada Sravan Kumar: హత్యలు, మారణహోమాలు సృష్టించే జగన్.. నువ్వా మా భవిష్యత్: జడ శ్రావణ్ ఘాటు వ్యాఖ్యలు

Jada Sravan Kumar: జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమాన్ని తీసుకురావడంపై జైభీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకులు జడ శ్రావణ్ కుమార్ విమర్శలు గుప్పించారు.

Jada Sravan Kumar: సీఎం వైఎస్ జగన్ ఏపీ రాష్ట్ర అభివృద్ధి ఏం చేశారని.. జగనన్నే మా భవిష్యత్ అనే కార్యక్రమం పెట్టుకుంటున్నారని జైభీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకులు జడ శ్రావణ్ విమర్శించారు. జగనన్నకు చెప్పుకుందాం.. జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమాలు నిర్వహించుకోవడం హాస్యాస్పదంగా ఉన్నాయని విమర్శలు గుప్పించారు. ఉదయం లేవగానే హత్యలు, మారణహోమాలు సృష్టించే జగన్.. నువ్వా మా భవిష్యత్ అని జడ శ్రావణ్ ప్రశ్నించారు. మూడు దఫాలుగా ముఖ్యమంత్రిగా ఉంటున్న నవీన్ పట్నాయక్ లాంటి వారు ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకోవాలి, జగన్ లాంటి వారు కాదని ఆయన విమర్శించారు. 

పదవులు ఇస్తే సరిపోతుందా, దళితులకు ఏం మేలు చేశారు
దళితులకు హోంమంత్రి, ఉప ముఖ్యమంత్రి పోస్టులు ఇస్తే సరిపోతుందా.. ఎస్సీ, ఎస్టీలకు సీఎం జగన్ ఏం మేలు చేశారని జడ శ్రావణ్ ప్రశ్నించారు. వెనకబడిన వర్గాలకు ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వం నాలుగేళ్లలో ఏం చేసిందో ఆధారాలతో సహా చూపిస్తానని అన్నారు. దళితులపై దాడుల విషయంలో సమాధానం చెప్పాలని నిలదీశారు. 

'గడప గడపకు దగా ప్రభుత్వం' పేరుతో పుస్తకం ఆవిష్కరిస్తాం..! 
దాడులకు, హత్యలకు గురైన డాక్టర్ సుధాకర్, కిరణ్, శిరో ముండనం వరప్రసాద్, రమ్య కుటుంబాలను పరామర్శించారా అని ముఖ్యమంత్రిని శ్రావణ్ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలు, దళితులపై జరుగుతున్న దాడులపై ఉద్యమిస్తానని జడ శ్రావణ్ తెలిపారు. ఏప్రిల్ 14వ తేదీన అంబేద్కర్ జయంతి రోజున విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ స్మారక సభలో 'గడప గడపకు దగా ప్రభుత్వం' పేరుతో పుస్తకాన్ని ఆవిష్కరిస్తామని వెల్లడించారు. 'గడప గడపకు దగా ప్రభుత్వం' పుస్తకాన్ని ప్రతి దళిత గడపకు అందిస్తామని జడ శ్రావణ్ తెలిపారు. 1500 మంది దళిత బిడ్డలపై జరిగిన దాడుల వివరాలను ఆధారాలతో సహా దళిత బిడ్డలకు అందిస్తామని వెల్లడించారు. ఈ పుస్తకమే జగన్ ప్రభుత్వానికి రాజకీయ సమాధి కడుతుందని అన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా 175 శాసన నియోజక వర్గాల్లో, 25 పార్లమెంటు నియోజక వర్గాల్లో పోటీకు జైభీమ్ భారత్ పార్టీ సిద్ధంగా ఉందని జడ శ్రావణ్ తెలిపారు. ప్రజలు తమను ఆదరించాలని కోరారు. 

రాష్ట్ర ప్రజలు కుమిలిపోతున్నారు: జడ శ్రావణ్ 
రాష్ట్రంలో ఇసుక కొరతతో అసంఘటిత రంగాల కార్మికులు పనులు లేక పస్తులు ఉండాల్సి వస్తోందని జడ శ్రావణ్ తెలిపారు. రాష్ట్రానికి ఉన్న 2 లక్షల 46 వేల కోట్ల అప్పును 10 లక్షల కోట్ల అప్పుగా చేశారని జడ శ్రావణ్ మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల నెత్తిపై అప్పుల కుంపటి పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలను 151 స్థానాల్లో గెలిపించినందుకు ప్రజలు కుమిలి పోతున్నారని జడ శ్రావణ్ అన్నారు. విజ్ఞత కలిగిన ఎమ్మెల్యేలు జగన్ పార్టీ నుండి బయటకు రావాలని సూచించారు. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు వచ్చారని తెలిపారు. చాలా మంది పార్టీ నుంచి బయటకు వచ్చే ఆలోచనలో ఉన్నారని, ఇతర పార్టీలతో సంప్రదింపులు చేస్తున్నారని జడ శ్రావణ్ తెలిపారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
Kailasagir iTrishul: కైలాసగిరిపై ఆధ్యాత్మిక శోభ - 65 అడుగుల భారీ త్రిశూలం ఆవిష్కరణ.. విశాఖ పర్యాటకానికి కొత్త ఆకర్షణ! వీడియో
కైలాసగిరిపై ఆధ్యాత్మిక శోభ - 65 అడుగుల భారీ త్రిశూలం ఆవిష్కరణ.. విశాఖ పర్యాటకానికి కొత్త ఆకర్షణ! వీడియో
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Jagan towards Congress: మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Chiranjeevi: బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Embed widget