అన్వేషించండి

AP Assembly PAC Issue: జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?

YSRCP: వైఎస్ఆర్‌సీపీ రాజకీయ నిర్ణయాలు ఆ పార్టీకి ఎదురు తిరుగుతున్నాయి.తాజాగా పీఏసీ విషయంలోనూ పెద్దిరెడ్డికి పోటీకి పెట్టి వైసీపీ ఎమ్మెల్యేలు ఓటింగ్‌కు వెళ్లలేదు.

MLA Peddireddy: వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టీడీపీ ఎమ్మెల్యేలు  ఎగతాళి చేసే పరిస్థితి శుక్రవారం ఏర్పడింది. పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్ సభ్యుడి పదవికి మాజీ మంత్రి పెద్దిరెడ్డితో వైసీపీ అధినేత జగన్ నామినేషన్ వేయించారు. తీరా ఓటింగ్ సమయానికి ఆయన కూడా అసెంబ్లీకి రాలేదు. బెంగళూరు వెళ్లిపోయారు. ఇతర ఎమ్మెల్యేలు కూడా ఓటింగ్ కు రాకపోవడంతో ఎన్నికను బాయ్ కాట్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. దీంతో వైసీపీ అసలు చేస్తుందో ఆ పార్టీ నేతలకైనా అర్థమవుతుందా అన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. 

పీఏసీ సభ్యుడిగా ఎన్నిక కావడానికి అవసరమైన బలం లేని వైసీపీ 

పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవి సాధారణంగా విపక్షాలకే ఇస్తారు. అయితే పీఏసీ సభ్యుడిగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. అలా ఎన్నిక కావాలంటే పదో వంతు సభ్యుల మద్దతు ఉండాలి. అంత బలం వైసీపీకి లేకనే జగన్ మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. ఇప్పుడు పీఏసీ సభ్యుడికి ఆ బలం వచ్చే అవకాశం లేదు. నిజానికి ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు. అందుకే  బలం ప్రకారం వెళ్లాలని నిర్ణయించారు. కానీ పీఏసీ చైర్మన్ పదవి కూడా తమకే ఇవ్వాలని వైసీపీ వాదించింది. అలా ఇవ్వాలంటే ముందుగా పీఏసీ సభ్యుడిగా గెలవాలని ఎన్నికలు పెట్టింది. జగన్ తమ పార్టీ తరపున పెద్దిరెడ్డిని పోటీకి పెట్టారు. 

Also Read:  షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్

అయినా పెద్దిరెడ్డిని పోటీ పెట్టిన జగన్ 

పెద్దిరెడ్డికి పోటీకి పెట్టడం వెనుక తమకు చాలా పెద్ద వ్యూహం ఉందని వైసీపీ వర్గాలు చెబుతూ వచ్చాయి. ఆ వ్యూహం ఏమిటంటే కూటమి సభ్యులకు ఉన్న 164 మంది ఎమ్మెల్యేలు సభకు రావడంకష్టమని వాారిలో కొంత మందికి అత్యవసర పనులు ఉంటాని వారు రారని అంచనా వేశారు. ఇలా పది మంది రాకపోతే సరిపోతుందని పెద్దిరెడ్డి పీఏసీ సభ్యుడిగా ఎన్నికవుతారని తర్వాత తప్పనిసరిగా పీఏసీ చైర్మన్ పదవి ఇస్తారని అనుకున్నారు. 

Also Read:  ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్

చివరికి జగన్ కూడా ఓటింగ్ కు రాని వైనం ! 

అయితే పీఏసీలో ఓటింగ్ ప్రారంభం కాక ముందే తాము బాయ్ కాట్ చేస్తున్నట్లుగా వైసీపీ ప్రకటించింది. దీనికి కారణం ఉన్న పదకొండు మంది ఎమ్మెల్యేలు కూడా ఓటింగ్ కు రాకపోవడం. స్వయంగా పార్టీ అధినేత జగన్ ఓటింగ్ కు రాకుండా అంసెబ్లీ  ప్రారంభమయ్యే సమయానికి బెంగళూరు వెళ్లిపోయారు. దీంతో మరికొంత మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. తమ పార్టీకి  ఉన్న ఓట్లు కూడా పెద్దిరెడ్డికి రాకపోతే పరువు పోతుందన్న ఉద్దేశంతో బాయ్ కాట్ చేయడమే మంచిదని నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఏ మాత్రం ఆలోచన లేని రాజకీయం చేయడం వల్ల పెద్దిరెడ్డి వంటి నేత అవమానానికి గురయ్యారని ఆయన వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

గోవా నైట్ క్లబ్‌లో విషాదం.. సిలిండర్ పేలుడుతో 25 మంది మృతి- విచారణకు ఆదేశించిన సీఎం
గోవా నైట్ క్లబ్‌లో విషాదం.. సిలిండర్ పేలుడుతో 25 మంది మృతి- విచారణకు ఆదేశించిన సీఎం
Indigo Show Cause Notice: ఇండిగో సీఈవోకు DGCA నోటీసులు.. గందరగోళంపై చర్యలకు సిద్ధమైన ప్రభుత్వం
ఇండిగో సీఈవోకు DGCA నోటీసులు.. గందరగోళంపై చర్యలకు సిద్ధమైన ప్రభుత్వం
Telangana Rising Global Summit Agenda: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అజెండా ఖరారు.. హాజరయ్యే సినీ, క్రీడా ప్రముఖులు వీరే
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అజెండా ఖరారు.. హాజరయ్యే సినీ, క్రీడా ప్రముఖులు వీరే
RGV ఊర్మిళ: రంగీలా బ్యూటీతో అఫైర్ గురించి ఫస్ట్ టైమ్ మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ! అసలు నిజం ఇదేనా?
RGV ఊర్మిళ: రంగీలా బ్యూటీతో అఫైర్ గురించి ఫస్ట్ టైమ్ మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ! అసలు నిజం ఇదేనా?

వీడియోలు

Ind vs SA 3rd ODI Highlights | సెంచరీతో సత్తా చాటిన జైశ్వాల్..సిరీస్ కొట్టేసిన భారత్ | ABP Desam
Virat Kohli Records in Vizag Stadium | వైజాగ్ లో విరాట్ రికార్డుల మోత
Team India Bowling Ind vs SA | తేలిపోయిన భారత బౌలర్లు
Smriti Mandhana Post after Wedding Postponement | పెళ్లి వాయిదా తర్వాత స్మృతి తొలి పోస్ట్
India vs South Africa 3rd ODI Preview | వైజాగ్ లో మూడో వన్డే మ్యాచ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
గోవా నైట్ క్లబ్‌లో విషాదం.. సిలిండర్ పేలుడుతో 25 మంది మృతి- విచారణకు ఆదేశించిన సీఎం
గోవా నైట్ క్లబ్‌లో విషాదం.. సిలిండర్ పేలుడుతో 25 మంది మృతి- విచారణకు ఆదేశించిన సీఎం
Indigo Show Cause Notice: ఇండిగో సీఈవోకు DGCA నోటీసులు.. గందరగోళంపై చర్యలకు సిద్ధమైన ప్రభుత్వం
ఇండిగో సీఈవోకు DGCA నోటీసులు.. గందరగోళంపై చర్యలకు సిద్ధమైన ప్రభుత్వం
Telangana Rising Global Summit Agenda: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అజెండా ఖరారు.. హాజరయ్యే సినీ, క్రీడా ప్రముఖులు వీరే
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అజెండా ఖరారు.. హాజరయ్యే సినీ, క్రీడా ప్రముఖులు వీరే
RGV ఊర్మిళ: రంగీలా బ్యూటీతో అఫైర్ గురించి ఫస్ట్ టైమ్ మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ! అసలు నిజం ఇదేనా?
RGV ఊర్మిళ: రంగీలా బ్యూటీతో అఫైర్ గురించి ఫస్ట్ టైమ్ మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ! అసలు నిజం ఇదేనా?
Ind vs SA 3rd ODI Highlights: జైస్వాల్ తొలి సెంచరీ, రాణించిన రోహిత్, కోహ్లీ.. దక్షిణాఫ్రికాపై 2-1తో వన్డే సిరీస్ కైవసం
జైస్వాల్ తొలి సెంచరీ, రాణించిన రోహిత్, కోహ్లీ.. దక్షిణాఫ్రికాపై 2-1తో వన్డే సిరీస్ కైవసం
భారత్‌లో అతి చవకైన, అత్యధిక మైలేజ్ ఇచ్చే బైక్స్.. 800 Km రేంజ్, లిస్ట్ చూశారా
భారత్‌లో అతి చవకైన, అత్యధిక మైలేజ్ ఇచ్చే బైక్స్.. 800 Km రేంజ్, లిస్ట్ చూశారా
CM Revanth Reddy: కేటీఆర్ బీఆర్ఎస్‌ను సమాధి చేస్తాడు - మంచి రోజులు ఎలా వస్తాయి? - కేసీఆర్‌కు రేవంత్ కౌంటర్
కేటీఆర్ బీఆర్ఎస్‌ను సమాధి చేస్తాడు - మంచి రోజులు ఎలా వస్తాయి? - కేసీఆర్‌కు రేవంత్ కౌంటర్
Adulterated Liquor Scam Charge Sheet: జోగి రమేష్ అండతో అద్దేపల్లి సోదరుల నకిలీ లిక్కర్ దందా - విజయవాడ ఎక్సైజ్ కోర్టులో 8 మందిపై చార్జ్ షీట్
జోగి రమేష్ అండతో అద్దేపల్లి సోదరుల నకిలీ లిక్కర్ దందా - విజయవాడ ఎక్సైజ్ కోర్టులో 8 మందిపై చార్జ్ షీట్
Embed widget