అన్వేషించండి

AP BJP Politics: కేంద్రం వేలకోట్లు ఇచ్చినా, రాష్ట్రం నుంచి సహకారం లేదు!: పురంధేశ్వరి సంచలనం

Andhra Politics: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం వేల కోట్లు నిధులు మంజూరు చేసిందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు.

BJP Leader Purandeswari: పాలకొల్లు: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం వేల కోట్లు నిధులు మంజూరు చేసిందని, దేశం లో సుపరిపాలన అందించగలిగే పార్టీ బిజెపి అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి (Daggubati Purandeswari) అన్నారు. జిల్లాలో జాతీయ రహదారులు రైల్వే లైన్ అభివృద్ధి వశిష్ట బ్రిడ్జి నిర్మాణానికి వేల కోట్లు కేంద్రం మంజూరు చేసింది, కానీ రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా నిధులు మంజూరు చేయకపోవడంతో కొన్ని పనులు నిలిచిపోయాయని చెప్పారు. పాలకొల్లులో జరిగిన కార్యక్రమంలో దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ.. మడం తిప్పం మాట తప్పం అని చెప్పిన వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రాంతాలు కులాల మధ్య విభేదాలు సృష్టిస్తుందని ఆరోపించారు. ప్రశ్నిస్తే అట్రాసిటీ కేసులు నమోదు చేస్తున్నారు. ఆడుకుందాం ఆంధ్రా పథకం పెట్టి రాష్ట్రంతో వైసీపి ప్రభుత్వం ఆడుకుంటుందని ఎద్దేవా చేశారు.

గోదావరి జోన్ పర్యటనలో భాగంగా పాలకొల్లుకు వచ్చినట్లు తెలిపారు. కార్యకర్తల మనోభావాలు తెలుసుకోవడంతో పాటు సంస్థాగతంగా పార్టీ పటిష్టతపై ఫోకస్ చేస్తామని పేర్కొన్నారు. స్థానికంగా రాజకీయ కార్యాచరణ రూపొందించి ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు. ఏపీకి కేంద్రం ఆర్థిక సహకారాన్ని అందిస్తోంది, ప్రధాని నరేంద్ర మోడీ సహాకారంతో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందన్నారు. 

పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి 216 జాతీయ రహదారి 316 కోట్లతో నిర్మాణం జరుగుతోంది. వశిష్ట నదిపై వంతెన, బైపాస్ ఏర్పాటు. 165 నెంబర్ జాతీయ రహదారి నిర్మాణానికి భూసేకరణ చేశామన్నారు. దాంతో పాటు నరసాపురం, భీమవరం రైల్వే స్టేషన్ మౌలిక సదుపాయాలు.. భీమవరం, నరసాపురం రైల్వే స్టేషన్ లకు 75కోట్లు కేంద్రం కేటాయించిందన్నారు. గుడివాడ -భీమవరం రైల్వే అభివృద్ధికి 1200కోట్లు, కోటిపల్లి నరసాపురం రైల్వే అభివృద్ధికి 75శాతం నిధులు మంజూరు చేసినా రాష్ట్రం వాటాను వైసీపీ ప్రభుత్వం చెల్లించడం లేదని ఆరోపించారు. 

ఆక్వా రంగం అభివృద్ధికి సరిపల్లెలో ఆక్వా యూనివర్సిటీ ఏర్పాటు కు 112 కోట్ల నిధులతో కేంద్రం సహకరిస్తోంది. జిల్లాలో లక్షా 5వేలు ఇళ్ళు మంజూరు చేస్తే ఎన్ని నిర్మాణం చేశారు. టిడ్కో ఇళ్ళు కాలనీల్లో మౌలిక సదుపాయాలు లేవు. వీధి లైట్లు లేవని విమర్శించారు. టిడ్కో ఇళ్ళు తాకట్టు పెట్టి బ్యాంకు రుణాలు వడ్డీ కట్టమంటోంది అంటూ జగన్ ప్రభుత్వంపై పురంధేశ్వరి మండిపడ్డారు. ఎవరైనా రాష్ట్ర ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తే ఎట్రాసిటీ కేసులు పెడుతూ నియంతృత్వం పాలన సాగుతోందని అభిప్రాయపడ్డారు. 

ఏపీలో అభివృద్ధి కోసం ప్రశ్నిస్తే కులవిభేదాలు సృష్టించి పబ్బం గడుపు కోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 40 లక్షల భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకపోయినా ఏపీ ప్రభుత్వానికి చలనం లేదని పురంధేశ్వరి విమర్శించారు. ఏపీ ప్రభుత్వంపై బీజేపీ పోరాటం కొనసాగుతోందని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో కేంద్రం కీలకపాత్ర పోషిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగి కాశీ విశ్వనాథ్ రాజు, రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాస వర్మ, జిల్లా అధ్యక్షుడు నార్ని తాతాజీ, కపర్థి, తదితరులు పాల్గొన్నారు.
Also Read: Nagababu in Nellore: మంత్రులందరికీ హాఫ్ బ్రెయిన్, నెల్లూరులో నాగబాబు హాట్ కామెంట్స్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: భవానీ ద్వీపం ఇండియా, పాక్ బార్డర్‌లో ఉందా? హైదరాబాద్‌లో ఫ్లైఓవర్ కట్టలేకపోయా: సీఎం చంద్రబాబు
భవానీ ద్వీపం ఇండియా, పాక్ బార్డర్‌లో ఉందా? హైదరాబాద్‌లో ఫ్లైఓవర్ కట్టలేకపోయా: చంద్రబాబు
YSRCP strategic mistake: నిలకడ లేని విధానాలతో తగ్గిపోతున్న విశ్వసనీయత - వైఎస్ఆర్‌సీపీ సలహాదారులు విఫలమవుతున్నారా?
నిలకడ లేని విధానాలతో తగ్గిపోతున్న విశ్వసనీయత - వైఎస్ఆర్‌సీపీ సలహాదారులు విఫలమవుతున్నారా?
Araku Kauni: గిరిజన రుచులకు గ్లోబల్ బ్రాండింగ్ - అరకు కౌని మిల్లెట్ మెనూను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
గిరిజన రుచులకు గ్లోబల్ బ్రాండింగ్ - అరకు కౌని మిల్లెట్ మెనూను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
Autonomous shipbuilding: నెల్లూరులో డ్రైవర్లు అవసరం లేని నౌకల తయారీ కేంద్రం -అటానమస్ షిప్‌బిల్డింగ్ సెంటర్‌ ప్రత్యేకత ఇదే !
నెల్లూరులో డ్రైవర్లు అవసరం లేని నౌకల తయారీ కేంద్రం -అటానమస్ షిప్‌బిల్డింగ్ సెంటర్‌ ప్రత్యేకత ఇదే !

వీడియోలు

IPL 2026 First Phase Schedule | ఐపీఎల్ 2026 సమరానికి షెడ్యూల్ ఖరారు | ABP Desam
Irfan Pathan Predicts Future Captain of Team India | శ్రేయాస్ పై ఇర్ఫాన్ పఠాన్ కామెంట్స్ | ABP Desam
ICC T20 Rankings after T20WC | ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా హవా | ABP Desam
Shivam Dube's Secret Train Journey | ట్రైన్ లో ప్రయాణించిన వరల్డ్ కప్ హీరో | ABP Desam
Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: భవానీ ద్వీపం ఇండియా, పాక్ బార్డర్‌లో ఉందా? హైదరాబాద్‌లో ఫ్లైఓవర్ కట్టలేకపోయా: సీఎం చంద్రబాబు
భవానీ ద్వీపం ఇండియా, పాక్ బార్డర్‌లో ఉందా? హైదరాబాద్‌లో ఫ్లైఓవర్ కట్టలేకపోయా: చంద్రబాబు
Hyderabad Fire Accident: హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. 5 ఫ్లోర్ బిల్డింగ్‌లో కాలిబూడిదైన ఫర్నీచర్
హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. 5 ఫ్లోర్ బిల్డింగ్‌లో కాలిబూడిదైన ఫర్నీచర్
Tamil Nadu Assembly Elections 2026: దళపతిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న మైండ్ గేమ్ - ఎన్డీఏలో చేరిక ప్రచారం అంతా విజయ్‌ను బలహీనపరిచేందుకేనా?
దళపతిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న మైండ్ గేమ్ - ఎన్డీఏలో చేరిక ప్రచారం అంతా విజయ్‌ను బలహీనపరిచేందుకేనా?
Gas Charge In Hotel Bills: LPG ఎఫెక్ట్.. హోటల్, రెస్టారెంట్లలో అదనంగా గ్యాస్ ఛార్జీలు! నెటిజన్ల రియాక్షన్ ఇదే
LPG ఎఫెక్ట్.. హోటల్, రెస్టారెంట్లలో అదనంగా గ్యాస్ ఛార్జీలు! నెటిజన్ల రియాక్షన్ ఇదే
CEC Gyanesh Kumar : సీఈసీపై అభిశంసన - దేశ చరిత్రలో మొదటి సారి - 193 మంది ఎంపీల సంతకాలు!?
సీఈసీపై అభిశంసన - దేశ చరిత్రలో మొదటి సారి - 193 మంది ఎంపీల సంతకాలు!?
Iran Israel War: ఇకచాలు, వెంటనే చర్చలు జరపండి.. అమెరికా, ఇజ్రాయెల్- ఇరాన్ లకు UN సెక్రటరీ జనరల్ విజ్ఞప్తి
ఇకచాలు, వెంటనే చర్చలు జరపండి.. అమెరికా, ఇజ్రాయెల్- ఇరాన్ లకు UN సెక్రటరీ జనరల్ విజ్ఞప్తి
Ustaad Bhagat Singh : సెకండాఫ్ ఇంటెన్స్ సీన్ పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది - ఫ్యాన్స్ గెట్ రెడీ అంటున్న హరీష్ శంకర్
సెకండాఫ్ ఇంటెన్స్ సీన్ పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది - ఫ్యాన్స్ గెట్ రెడీ అంటున్న హరీష్ శంకర్
LPG Delivery Delay : గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత సిలిండర్ డెలివరీ కాకపోతే.. ఇలా ఫిర్యాదు చేయండి
గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత సిలిండర్ డెలివరీ కాకపోతే.. ఇలా ఫిర్యాదు చేయండి
Embed widget