అన్వేషించండి

AP BJP Politics: కేంద్రం వేలకోట్లు ఇచ్చినా, రాష్ట్రం నుంచి సహకారం లేదు!: పురంధేశ్వరి సంచలనం

Andhra Politics: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం వేల కోట్లు నిధులు మంజూరు చేసిందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు.

BJP Leader Purandeswari: పాలకొల్లు: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం వేల కోట్లు నిధులు మంజూరు చేసిందని, దేశం లో సుపరిపాలన అందించగలిగే పార్టీ బిజెపి అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి (Daggubati Purandeswari) అన్నారు. జిల్లాలో జాతీయ రహదారులు రైల్వే లైన్ అభివృద్ధి వశిష్ట బ్రిడ్జి నిర్మాణానికి వేల కోట్లు కేంద్రం మంజూరు చేసింది, కానీ రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా నిధులు మంజూరు చేయకపోవడంతో కొన్ని పనులు నిలిచిపోయాయని చెప్పారు. పాలకొల్లులో జరిగిన కార్యక్రమంలో దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ.. మడం తిప్పం మాట తప్పం అని చెప్పిన వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రాంతాలు కులాల మధ్య విభేదాలు సృష్టిస్తుందని ఆరోపించారు. ప్రశ్నిస్తే అట్రాసిటీ కేసులు నమోదు చేస్తున్నారు. ఆడుకుందాం ఆంధ్రా పథకం పెట్టి రాష్ట్రంతో వైసీపి ప్రభుత్వం ఆడుకుంటుందని ఎద్దేవా చేశారు.

గోదావరి జోన్ పర్యటనలో భాగంగా పాలకొల్లుకు వచ్చినట్లు తెలిపారు. కార్యకర్తల మనోభావాలు తెలుసుకోవడంతో పాటు సంస్థాగతంగా పార్టీ పటిష్టతపై ఫోకస్ చేస్తామని పేర్కొన్నారు. స్థానికంగా రాజకీయ కార్యాచరణ రూపొందించి ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు. ఏపీకి కేంద్రం ఆర్థిక సహకారాన్ని అందిస్తోంది, ప్రధాని నరేంద్ర మోడీ సహాకారంతో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందన్నారు. 

పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి 216 జాతీయ రహదారి 316 కోట్లతో నిర్మాణం జరుగుతోంది. వశిష్ట నదిపై వంతెన, బైపాస్ ఏర్పాటు. 165 నెంబర్ జాతీయ రహదారి నిర్మాణానికి భూసేకరణ చేశామన్నారు. దాంతో పాటు నరసాపురం, భీమవరం రైల్వే స్టేషన్ మౌలిక సదుపాయాలు.. భీమవరం, నరసాపురం రైల్వే స్టేషన్ లకు 75కోట్లు కేంద్రం కేటాయించిందన్నారు. గుడివాడ -భీమవరం రైల్వే అభివృద్ధికి 1200కోట్లు, కోటిపల్లి నరసాపురం రైల్వే అభివృద్ధికి 75శాతం నిధులు మంజూరు చేసినా రాష్ట్రం వాటాను వైసీపీ ప్రభుత్వం చెల్లించడం లేదని ఆరోపించారు. 

ఆక్వా రంగం అభివృద్ధికి సరిపల్లెలో ఆక్వా యూనివర్సిటీ ఏర్పాటు కు 112 కోట్ల నిధులతో కేంద్రం సహకరిస్తోంది. జిల్లాలో లక్షా 5వేలు ఇళ్ళు మంజూరు చేస్తే ఎన్ని నిర్మాణం చేశారు. టిడ్కో ఇళ్ళు కాలనీల్లో మౌలిక సదుపాయాలు లేవు. వీధి లైట్లు లేవని విమర్శించారు. టిడ్కో ఇళ్ళు తాకట్టు పెట్టి బ్యాంకు రుణాలు వడ్డీ కట్టమంటోంది అంటూ జగన్ ప్రభుత్వంపై పురంధేశ్వరి మండిపడ్డారు. ఎవరైనా రాష్ట్ర ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తే ఎట్రాసిటీ కేసులు పెడుతూ నియంతృత్వం పాలన సాగుతోందని అభిప్రాయపడ్డారు. 

ఏపీలో అభివృద్ధి కోసం ప్రశ్నిస్తే కులవిభేదాలు సృష్టించి పబ్బం గడుపు కోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 40 లక్షల భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకపోయినా ఏపీ ప్రభుత్వానికి చలనం లేదని పురంధేశ్వరి విమర్శించారు. ఏపీ ప్రభుత్వంపై బీజేపీ పోరాటం కొనసాగుతోందని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో కేంద్రం కీలకపాత్ర పోషిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగి కాశీ విశ్వనాథ్ రాజు, రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాస వర్మ, జిల్లా అధ్యక్షుడు నార్ని తాతాజీ, కపర్థి, తదితరులు పాల్గొన్నారు.
Also Read: Nagababu in Nellore: మంత్రులందరికీ హాఫ్ బ్రెయిన్, నెల్లూరులో నాగబాబు హాట్ కామెంట్స్

టాప్ హెడ్ లైన్స్

Breaking News: విశాఖ అక్కిరెడ్డిపాలెం వద్ద మంటల్లో లారీ దగ్ధం.. రెండు గంటలు ట్రాఫిక్ జామ్
విశాఖ అక్కిరెడ్డిపాలెం వద్ద మంటల్లో లారీ దగ్ధం.. రెండు గంటలు ట్రాఫిక్ జామ్
Anagani Satya Prasad: అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
Breaking News: హైదరాబాద్‌లో టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అపశృతి.. ఇద్దరు విద్యార్థులకు గాయాలు
హైదరాబాద్‌లో టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అపశృతి.. ఇద్దరు విద్యార్థులకు గాయాలు
Net Zero Village: ఇంటింటా నెట్‌జీరో… అలవరం కోడూరులో ఈ విధానాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు
ఇంటింటా నెట్‌జీరో… అలవరం కోడూరులో ఈ విధానాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AUS Thrashes BAN In 2nd Test: ఐదు సెష‌న్లలోనే మ్యాచ్ ఖ‌తం.. బంగ్లాను బెంబేలెత్తించిన ఆసీస్.. చ‌రిత్ర‌లో నాలుగో అతిచిన్న మ్యాచ్.. తొలిస్థానంలో ఇండియా మ్యాచ్.. ఎవ‌రితో అంటే..?
5 సెష‌న్లలోనే మ్యాచ్ ఖ‌తం.. బంగ్లాను బెంబేలెత్తించిన ఆసీస్.. చ‌రిత్ర‌లో నాలుగో అతిచిన్న మ్యాచ్.. తొలిస్థానంలో ఇండియా మ్యాచ్
Anagani Satya Prasad: అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
Gachibowli Building Collapse: గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Toxic Pre Release Event : టాక్సిక్ ఈవెంట్‌లో ప్రమాదం - ఇద్దరు విద్యార్థులకు గాయాలు
టాక్సిక్ ఈవెంట్‌లో ప్రమాదం - ఇద్దరు విద్యార్థులకు గాయాలు
Adilabad Crime News: మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌లోకి అక్రమంగా మద్యం.. ప్రధాన నిందితుడి అరెస్ట్, 1300 బాటిళ్లు సీజ్
మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌లోకి అక్రమంగా మద్యం.. ప్రధాన నిందితుడి అరెస్ట్, 1300 బాటిళ్లు సీజ్
Konda Surekha Letter To TPCC: నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
Horror Thriller OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఒంటరిగా అస్సలు చూడొద్దు
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఒంటరిగా అస్సలు చూడొద్దు
Embed widget