అన్వేషించండి

MLC Ananthababu case: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక పరిణామం - తదుపరి విచారణకు కోర్టు అనుమతి

Subramaniam Case: డ్రైవర్ సుబ్రహ్మణ్యం ను ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసిన కేసులో తదుపరి విచారణకు కోర్టు అనుమతించింది. హత్య తానే చేశానని ఎమ్మెల్సీ అంగీకరించారు.

Driver Subramaniam Murder Case: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో తదుపరి దర్యాప్తుకు అనుమతి ఇస్తూ   రాజమహేంద్రవరం ఎస్సీ, ఎస్టీ కోర్టులో తీర్పు వెలువడింది.   2022లో కాకినాడలో దళిత డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్యకు గురయ్యాడు. ఈ హత్యలో వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ అనంత బాబు ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. సుబ్రహ్మణ్యం శవాన్ని అతని ఇంటి వద్ద “డోర్ డెలివరీ” చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఈ కేసు విచారణ లోపభూయిష్టంగా జరిగిందని, నిందితుడు అనంత బాబుకు అనుకూలంగా పోలీసు విచారణ నడిచిందని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ కేసు పునర్విచారణ కోసం కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.       

పునర్విచారణకు కోర్టు అనుమతితో కీలక పరిణామాలు                

విచారణ జరిపిన రాజమహేంద్రవరం ఎస్సీ, ఎస్టీ కోర్టు ఈ కేసు పునర్విచారణకు అనుమతి ఇచ్చింది.  ఈ కేసును స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) ద్వారా తదుపరి విచారణ కొనసాగించేందుకు అవకాశం కల్పించింది.  ఈ ఏడాది ఏప్రిల్ 22, 2025న కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఈ కేసును పునర్విచారణకు ఆదేశించారు. విచారణ అధికారిగా ఐపీఎస్ అధికారి, కాకినాడ సబ్ డివిజనల్ పోలీసు అధికారి మనీష్ దేవరాజ్ పాటిల్‌ను నియమించారు. కోర్టు ఆదేశాల మేరకు, అనంత బాబుపై తదుపరి విచారణ కొనసాగనుంది. ఈ విచారణలో గత వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన విచారణలోని లోపాలను సరిదిద్ది, న్యాయం జరిగేలా చర్యలు తీసుకోనున్నారు.                

ప్రభుత్వం మారిన తర్వాత బాధిత కుటుంబానికి పరిహారం, న్యాయసాయం           

ప్రభుత్వం మారిన తర్వాత ఈ ఏడాది  ఫిబ్రవరి లో  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుబ్రహ్మణ్యం కుటుంబానికి   పరిహారం అందించింది.  న్యాయ సాయం అందించేందుకు న్యాయవాదిని కూడా కేటాయించింది. మరో వైపు  వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో అనంత బాబుకు రాచమర్యాదలు జరిగాయని  బాధిత కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేసిందని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. అదే సమయంలో దర్యాప్తు పూర్తిగా జరగకుండా.. పోలీసుల్ని నియంత్రించారని.. చార్జిషీటు దాఖలు చేయకుండా.. బెయిల్ వచ్చేలా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.                  

వైసీపీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న ఎమ్మెల్సీ  అనంతబాబు         

అనంతబాబు ను సస్పెండ్ చేసినట్లుగా ప్రకటించినప్పటికీ ఆయన వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అప్పటి ముఖ్యమంత్రి జగన్ తో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థుల కోసం విస్తృతంగా శ్రమించారు. ఈ కేసులో అనంతబాబు ఒక్కరే కాదని ఇంకా పలువురు ఉన్నారని.. వారెవరో బయటకు రాకుండా ఉండేందుకే తదుపరి దర్యాప్తు చేయలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఆ దర్యాప్తు చేయడం వల్ల .. ఆ హత్య కేసులో అసలు కారణాలేమిటో వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు.     

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TDP MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్
మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్

వీడియోలు

Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం
Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Election Commission: నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Seetha Payanam OTT : ఓటీటీలోకి సీతాపయనం - అర్జున్ కుమార్తె లవ్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలోకి సీతాపయనం - అర్జున్ కుమార్తె లవ్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Petrol Pump Scam: ఇప్పుడు 0 కాదు.. పెట్రోల్- డీజిల్ సాంద్రతతో మోసం చేస్తున్న పెట్రోల్ పంపులు!
ఇప్పుడు 0 కాదు.. పెట్రోల్- డీజిల్ సాంద్రతతో మోసం చేస్తున్న పెట్రోల్ పంపులు!
Lavanya Tripathi : టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన
టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
Embed widget