అన్వేషించండి

AP Liquor Case: లిక్కర్ స్కాంలో చాలా మంది డబ్బులు సంపాదించుకుని ఉండవచ్చు - మాజీ ఎక్సైజ్ మంత్రి కీలక వ్యాఖ్యలు

Narayana Swamy: ఏపీ మద్యం స్కాంలో నాటి ఎక్సైజ్ మంత్రి నారాయణ స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. చాలా మంది డబ్బులు సంపాదించుకుని ఉండవచ్చు కానీ తాను మాత్రం నిజాయితీ పరుడ్ననన్నారు.

Former Excise Minister Narayana Swamy:  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో లిక్కర్ స్కాం సంచలనం రేపుతోంది.  ఈ స్కాంపై వైసీపీ నేత, మాజీ ఎక్సైజ్ మంత్రి నారాయణ స్వామి తాజాగా సంచలన వ్యాఖ్యలుచేశారు.  స్కామ్‌లో వేరే వాళ్లు సంపాదించుకుని ఉండవచ్చు కానీ నేను నిజాయితీగా ఉన్నానని ప్రకటించారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ స్కాం గురించి తనకు తెలిసిన విషయాలన్నింటినీ సిట్‌కు చెబుతానని విచారణకు సహకరిస్తానని ప్రకటించారు. 

నారాయణ స్వామి ఎక్సైజ్ మంత్రిగా ఉన్నప్పుడే ఈ లిక్కర్ స్కాం జరిగింది. అందుకే ఆయన వాంగ్మలాన్ని నమోదు చేసుకునేందుకు సిట్ అధికారులు ఆయనకు నోటీసులు జారీచేశారు. సోమవారం హాజరు కావాలని సూచించారు. అయితే తనకు ఆరోగ్యం బాగోలేదని తాను రాలేనని చెప్పారు. దాంతో సిట్ అధికారులు స్థానిక సీఐను.. నారాయణ స్వామి ఇంటికి పంపి.. వీడియో కాల్ ద్వారా ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. ఇందులో ఆయన ఏం సమాధానాలిచ్చారో కానీ. ప్రెస్మీట్‌లో కొన్ని విషయాలపై మాట్లాడారు. లిక్కర్ డిజిటల్ లావాదేవీలు వద్దన్న మాట నిజమేనన్నారు. ఎందుకు వద్దన్నారు..ఎవరు వద్దన్నారు అన్నది మాత్రం చెప్పలేదు.  తనను ఈ కేసులో ఇరికించేందుకు  కొంత మంది వైసీపీ  నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సిట్ విచారణకు సహకరిస్తానన్నారు.                    

2019 -2024 మధ్యలో వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం నారాయణ స్వామి మంత్రిగా ఉన్నారు. ఎక్సైజ్, కమర్షఇయల్ టాక్సెస్ వంటి కీలక శాఖల్ని నిర్వహించారు. అయితే ఎప్పుడూ ఆయన అధికారులతో సమావేశాలు నిర్వహించనట్లుగా కానీ.. తన శాఖల విషయంలో సమీక్షలు చేసినట్లుగా కానీ ఎప్పుడూ బయటకు రాలేదు. మంత్రిగా ఉన్నప్పటికీ ఆయన ఎక్కువగా నియోజకవర్గానికే పరిమితయ్యేవారు. సాధారమంగా పతన శాఖలో జరిగే వ్యవహారాలపై ఆయనకు పెద్దగా సమాచారం ఉండేద ికాదు. పై స్థాయిలో నిర్ణయాలు తీసుకుని ఆదేశాలు జారీ చేస్తూ ఉంటారు. దాంతో నారాయణ స్వామి పదవి ఉంటే చాలన్నట్లుగా సైలెంట్గా ఉండిపోయారు.                        

ఇప్పుడు ఆ కేసు తనను చుట్టుముట్టేలా ఉండటంతో..తనను టార్గెట్ చేస్తారన్న అనుమానంతో నారాయణ స్వామి బయటకు వచ్చి మాట్లాడుతున్నట్లుగా తెలుస్తోంది. వైసీపీ నేతలే తనను ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని.. తన శాఖల్లో నిర్ణయాలు తీసుకునే  అవకాశం తనకు ఎప్పుడూ ఇవ్వకపోయినా.. ఇప్పుడు  భారీ లిక్కర్ స్కాంలో తనను నిందితుడిగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. అందుకే సేఫ్ గా తప్పించుకోవాలని.. సిట్ కు కావాల్సిన వివరాలన్నీ ఇస్తానని చెబుతున్నారని అంటున్నారు. 

ఎక్సయిజ్ మంత్రిగా ఉన్నప్పటికీ నిర్ణయాల్లో ఆయన పాత్రేమీ లేకపోవడంతో సిట్ అధికారులు ఇప్పటి వరకూ నిందితుడిగా చేర్చలేదు. అయితే మంత్రిగా ఉన్నందున ఆయన ప్రమేయంపై ఎక్కడైనా ఆధారాలు లభిస్తే వెంటనే పోలీసులు అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి. అందుకే నారాయణ స్వామి ముందు జాగ్రత్తగా విచారణకు సహకరిస్తానని చెబుతున్నట్లుగా భావిస్తున్నారు.              


 

 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: భోగాపురం పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్ వచ్చేసింది
భోగాపురం పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్ వచ్చేసింది
Rains In AP, Telangana: వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ - మత్స్యకారులకు వార్నింగ్
వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ - మత్స్యకారులకు వార్నింగ్
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
Team India Clean Sweep: టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
Iran US Conflict: 13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Embed widget