అన్వేషించండి

CM Jagan: ఏం కావాలన్నా అడగండి.. బాధితులకు రూ.1000 చొప్పున ఖర్చులకు ఇవ్వండి

భారీ వర్షాలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. నెల్లూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు.

వర్షాలపై సీఎం జగన్ నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, కడప జిల్లాల కలెక్టర్లతో సమీక్ష చేశారు సీఎం జగన్. నెల్లూరు జిల్లాలోని తడ, సూళ్లూరుపేటతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారని.. ముఖ్యంగా తమిళనాడు సరిహద్దుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సీఎం చెప్పారు. 

బాధితులకు ఏం కావాలన్నా.. వెంటనే అడగాలని సీఎం అన్నారు. శిబిరాల్లో వారికి మంచి ఆహారం అందించాలని చెప్పారు. బాధితులకు రూ.వెయ్యి చొప్పున పరిహారం అందించాలని సీఎం సూచించారు. అన్ని విభాగాలు సమన్వయంతో వ్యవహరించాలన్నారు. ముంపు ప్రాంతాల నుంచి ప్రజల్ని తరలించేందుకు చర్యలు చేపట్టాలన్న సీఎం.. అవసరమైన చోట సహాయ శిబిరాలు తెరవాలన్నారు. మందులను అందుబాటులో పెట్టుకోవాలన్నారు. పీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల్లో మందుల కొరత లేకుండా  చూడాలన్నారు. పారిశుద్ధ్యం విషయంలోనూ చర్యలు తీసుకోవాలలి సీఎం చెప్పారు. 
అత్యవసర సేవలకు అంతరాయం లేకుండా జనరేటర్లను సీద్ధంగా ఉంచాలన్నారు. ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతింటే వెంటనే వాటిని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని, యుద్ధప్రాతిపదికన పనులు జరిగేలా విద్యుత్‌ శాఖ అధికారులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు.

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు

వాయుగుండం ఎఫెక్ట్ తో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి..నిన్న అర్థరాత్రి నుంచి కురుస్తున్న వర్షంతో జనజీవనం పూర్తిగా అస్థవ్యస్థం మారింది.. వరద ఉద్ధృతి ఎక్కువ కావడంతో చంద్రగిరి సమీపంలోని అమ్మచెరువు ప్రమదకర స్ధితిలోకి చేరింది.. దీంతో లోతట్టు గ్రామ ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షానికి ఐదేళ్ళ తరువాత మల్లెమడుగు రిజర్వాయర్, చైతన్యపురం చెరువులు జలకళ సంతరించుకున్నాయి. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

మరో వైపు ఆధ్యాత్మిక నగరి తిరుపతి నగరంలోని మాధురానగర్ లో పలు ఇళ్ళలోకి వర్షపు నీరు చేరుకోవడంతో నివాసితులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. డీఆర్ మహల్, వెస్ట్ రైల్వే అండర్ బ్రిడ్జిల వద్ద భారీ వర్షపు నీరు నిలిచి పోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పర్యటించారు.  నగర మేయర్ శిరీషా, కమిషనర్ పీఎస్ గిరీషా డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ ను వెంట తీసుకుని  సహాయక చర్యలు చేపట్టారు.  ఇటీవల కురిసిన వర్షాలతో స్థానిక వెస్ట్ చర్చ్ సమీపంలోని అండర్ బ్రిడ్జ్  వద్ద నీటి ప్రవాహంలో వాహనం చిక్కుకుని బెంగుళూరుకు చెందిన ఓ నవ వధువు మృతి చెందిన కారణంగా.. ఆ సంఘటనను దృష్టిలో ఉంచుకుని అండర్ బ్రిడ్జ్ వద్దకు చేరుకున్నారు. నగరంలో మిగిలిన లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితిని నగర పాలక సంస్థ మేయర్ శిరీష, కమిషనర్ పీఎస్ గిరీషాతో భూమన సమీక్షించారు. ప్రజలను వేంటనే అప్రమత్తం చేయాలని అధికారులకు పలు సూచనలు చేశారు.

జగనన్న సంపూర్ణ గృహ హక్కుపై సమీక్ష
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై సీఎం జగన్ సమీక్ష చేశారు. లబ్ధిదారులకు క్లియర్‌ టైటిల్‌తో రిజిస్ట్రేషన్‌ చేయాలని ఆదేశించారు. దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి జాప్యం లేకుండా అనుమతి ఇవ్వాలన్నారు. పథకం అమలుపై కింది స్థాయి అధికారులకు, లబ్ధిదారులకు అవగాహన కల్పించే కార్యక్రమాలను చేపట్టాలని సీఎం జగన్ అన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్‌ చేయాలన్నారు.

జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద లబ్ధిదారులకు నవంబర్‌ 20 నుంచి రిజిస్ట్రేషన్‌ స్టార్ట్ అవుతుందని సీఎం చెప్పారు. డిసెంబర్‌ 15 వరకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఉంటుందన్నారు. 52 లక్షల మంది ఈ పథకం కింద నమోదు చేసుకున్నట్లు ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు. 45.63 లక్షల మంది లబ్ధిదారుల డేటాను ఇప్పటికే సచివాలయాలకు ట్యాగ్‌ చేశామన్నారు. రిజిస్ట్రేషన్ల కోసం సరైనన్ని స్టాంపు పేపర్లను తెప్పించుకున్నామన్నారు. 10 నిమిషాల్లో రిజిస్ట్రేషన్‌ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం జగన్ కు అధికారులు వివరించారు.

Also Read: Nellore Heavy Rains: జోరు వానలో వైసీపీ ఎమ్మెల్యే అగచాట్లు.. కనీసం గొడుగు కూడా లేకుండా ఎందుకో తెలుసా?

Also Read: Multibagger Share: ఏడాదిలోనే లక్షకు రూ.18 లక్షల రాబడి ఇచ్చిన షేరు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Snake In Meeting: కౌన్సిల్ సమావేశానికి నాగుపామును తెచ్చిన సభ్యుడు.. మంత్రి నియోజకవర్గంలో షాకింగ్ సీన్
కౌన్సిల్ సమావేశానికి నాగుపామును తెచ్చిన సభ్యుడు.. మంత్రి నియోజకవర్గంలో షాకింగ్ సీన్
Geetu Royal: తిరుమల గుడి ముందు రీల్స్‌కు రి'యాక్షన్'... గీతూ రాయల్‌కు ఏడుపు ఒకటే తక్కువ
తిరుమల గుడి ముందు రీల్స్‌కు రి'యాక్షన్'... గీతూ రాయల్‌కు ఏడుపు ఒకటే తక్కువ
AP Free Bus: దివ్యాంగులకు శుభవార్త.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ!
దివ్యాంగులకు శుభవార్త.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ!
Kakinada Fireworks Explosion: వేట్లపాలెం ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.20 లక్షలు, పక్కా ఇళ్లు- నలుగురు అధికారులపై వేటు!
వేట్లపాలెం ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.20 లక్షలు, పక్కా ఇళ్లు- నలుగురు అధికారులపై వేటు!

వీడియోలు

ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
ABP Network Ideas of India Summit 2026 Inaguration | ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సమ్మిట్ ప్రారంభం | ABP Desam
Kavitha about Delhi Liquor Scam Case | లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్
India vs Zimbabwe Highlights T20 World Cup | జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా
Rinku Singh Father Passes Away | రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
Israel Strike On Iran: ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
PM Modi On Kakinada Incident: సామర్లకోట ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
సామర్లకోట బాణసంచా ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
Kokapet Swarupananda Lands: కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
Nara Lokesh : సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
TTD budget: వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
Ananya Nagalla: తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
Pakistan vs Sri Lanka: టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ రికార్డు బద్ధలుకొట్టిన పాక్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్
టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ రికార్డు బద్ధలుకొట్టిన పాక్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్
Embed widget