అన్వేషించండి

CM Jagan Review: సాగునీటి ప్రాజెక్టులపై సీఎం జగన్ సమీక్ష... పోలవరం ప్రాజెక్టు పనులకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై ఆరా... ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని ఆదేశాలు

సాగునీటి ప్రాజెక్టులపై సీఎం జగన్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు పనుల ప్రగతి, కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై ఆరా తీశారు. వెలుగొండ, తాండవ ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.

జలవనరులశాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు పనుల ప్రగతిని అధికారులు సీఎంకు వివరించారు. దిగువ కాపర్‌ డ్యాం పనులు, కెనాల్స్‌కు కనెక్టివిటీ తదితర అంశాలపై సమావేశంలో  చర్చజరిగింది. ఆర్‌ అండ్‌ ఆర్ ‌పనులు, కేంద్రం రీయింబర్స్‌ చేయాల్సిన నిధులకు సంబంధించి వివరాలను అధికారులు సీఎంకు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పనులకు కేంద్రం రీయింబర్స్‌ చేయాల్సిన సొమ్ము రూ.2033 కోట్లకు పైనే ఉందన్నారు. కేంద్రం నుంచి ఈ నిధులు తీసుకొచ్చేందుకు ప్రయత్నించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చు ఎప్పటికప్పుడు రీయింబర్స్‌ అయ్యేలా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలని అధికారులకు తెలిపారు. గ్యాప్‌ 3 కాంక్రీట్‌ డ్యామ్‌ పనులను పూర్తి చేశామని అధికారులు సీఎంకు వివరించారు. వచ్చే ఖరీప్‌ కు కాల్వల ద్వారా నీరందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. 

Also Read: బద్వేలు నామినేషన్లు ప్రారంభం ! బీజేపీ -జనసేన అభ్యర్థి ఎవరు ?


CM Jagan Review: సాగునీటి ప్రాజెక్టులపై సీఎం జగన్ సమీక్ష... పోలవరం ప్రాజెక్టు పనులకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై ఆరా... ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని ఆదేశాలు

వచ్చే ఆగస్టుకు అవుకు టన్నెల్ పూర్తి

దిగువ కాపర్‌ డ్యామ్‌ పనులను నవంబరు నాటికి పూర్తి చేసి, ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) పనులను ప్రారంభించడానికి ప్రణాళిక సిద్ధం చేశామని అధికారులు సీఎం జగన్ కు తెలిపారు. ఇతర ప్రాజెక్టుల ప్రగతిపై సీఎం ఆరా తీశారు. నెల్లూరు బ్యారేజీ పనులు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. నవంబర్‌లో ప్రారంభోత్సవానికి సిద్ధమని వెల్లడించారు. అవుకు టన్నెల్‌ నిర్మాణ పనుల్లో గణనీయ ప్రగతి సాధించామన్నారు. ఫాల్ట్‌జోన్‌లో తవ్వకాలు జరిపి, పటిష్టపరిచే కార్యక్రమాలను చురుగ్గా చేపడుతున్నామని అధికారులు స్పష్టం చేశారు. వచ్చే ఆగస్టు నాటికి టన్నెల్‌ పూర్తిచేసి ఆ టన్నెల్‌ ద్వారా నీటిని ఇవ్వగలుగుతామన్నారు. పనులు వేగవంతం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. పనుల్లో ఆలసత్వం వద్దని సూచించారు. 

Also Read: అనంత టీడీపీలో మరోసారి కలకలం.. తాడిపత్రిలోకి ప్రభాకర్ చౌదరి ఎంట్రీ !

వెలిగొండ ప్రాజెక్టు పనులపై సీఎం సమీక్ష

వెలిగొండ ప్రాజెక్టు పనులపై సీఎం  జగన్ సమీక్షించారు. రెండో టన్నెల్‌ పనుల వేగం పెంచాలని ఆదేశించారు. వంశధార స్టేజ్‌–2 ఫేజ్‌ –2 పనులన్నింటినీ కలిపి వచ్చే మే నాటికి పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. నిర్దేశించుకున్న సమయానికి ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు. నేరడి వద్ద బ్యారేజీ నిర్మాణం కోసం కూడా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఒడిశా రాష్ట్రంతో చర్చల కోసం తగిన చర్యలు తీసుకోవాలని సీఎం అన్నారు. తోటపల్లి బ్యారేజీ కింద వచ్చే ఖరీఫ్‌ నాటికి పూర్తిస్థాయిలో నీళ్లు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. వెంటనే పనులు పూర్తిచేయాలని సీఎం అన్నారు. మహేంద్ర తనయను పూర్తిచేయడంపైనా దృష్టిపెట్టాలన్నారు. ఈ పనులను ప్రాధాన్యతగా తీసుకున్నారు. గులాబ్‌ తుపాను, అనంతర వర్షాల కారణంగా ఎక్కడైనా ఇరిగేషన్‌ కాల్వలు దెబ్బతింటే వాటిని బాగుచేయడానికి సత్వర చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కొల్లేరు వద్ద గోదావరి, కృష్ణా డెల్టాలలో రెగ్యులేటర్‌ నిర్మాణ పనులను ప్రాధాన్యత క్రమంలో చేపట్టాలని సీఎం ఆదేశించారు. నిర్మాణంపైన దృష్టిపెట్టాలన్నారు. 

 Also Read: రాజు తలుచుకుంటే వరాలకు కొదవా? సీఎం జగన్ కు నిర్మాత అల్లు అరవింద్ రిక్వెస్ట్.. సినీ ఇండస్ట్రీ సమస్యలు పరిష్కరించాలని వినతి

తాండవ ప్రాజెక్టు విస్తరణపై దృష్టిపెట్టండి

తాండవ ప్రాజెక్టు విస్తరణ, కృష్ణా నదిపై బ్యారేజీల నిర్మాణంపై దృష్టిపెట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. తాండవ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఇప్పటికే టెండర్లను పిలిచామన్న అధికారులు, తొలివిడత టెండర్ల ప్రక్రియలో అధికంగా కోట్‌ చేసిన పనులకు సంబంధించి మరోసారి రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లామని అధికారులు తెలిపారు. ఈ సమీక్షలో జలవనరులశాఖ మంత్రి అనిల్‌ కుమార్, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, జలవనరులశాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.ఎస్‌ రావత్, జలవనరులశాఖ ఈఎన్‌సీసీ నారాయణరెడ్డి పాల్గొన్నారు.

Also Read: అమరావతిలో పవన్‌ను కలిసిన అగ్రనిర్మాతలు ! ఒంటరిని చేయలేదని క్లారిటీ ఇచ్చారా?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

GHMC Property Tax: గ్రేటర్‌ హైదరాబాద్‌ వాసులకు గుడ్‌న్యూస్- 90శాతం మిగిలే ఆఫర్ ప్రకటించిన జీహెచ్ఎంసీ  
గ్రేటర్‌ హైదరాబాద్‌ వాసులకు గుడ్‌న్యూస్- 90శాతం మిగిలే ఆఫర్ ప్రకటించిన జీహెచ్ఎంసీ  
VB–G RAM G Bill: ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తీసేయడంపై కమ్యూనిస్టుల విమర్శలు -ఘాటు కౌంటర్ ఇచ్చిన ఏపీ బీజేపీ
ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తీసేయడంపై కమ్యూనిస్టుల విమర్శలు -ఘాటు కౌంటర్ ఇచ్చిన ఏపీ బీజేపీ
Rowdy Janardhana Title Glimpse : ఇంటిపేరునే రౌడీగా మార్చుకున్న 'రౌడీ జనార్దన' - విజయ్ దేవరకొండ బ్లడ్ బాత్ నట విశ్వరూపం
ఇంటిపేరునే రౌడీగా మార్చుకున్న 'రౌడీ జనార్దన' - విజయ్ దేవరకొండ బ్లడ్ బాత్ నట విశ్వరూపం
GHMC Delimitation: జీహెచ్ఎంసీ డీలిమిటేషన్‌కు మార్గం సుగమం - అభ్యంతరాలపై అన్ని పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు
జీహెచ్ఎంసీ డీలిమిటేషన్‌కు మార్గం సుగమం - అభ్యంతరాలపై అన్ని పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు

వీడియోలు

Nidhhi Agerwal Samantha Anasuya Incidents | హీరోయిన్లతో అసభ్య ప్రవర్తన..ఎటు పోతోంది సమాజం | ABP Desam
India vs Pakistan U19 Asia Cup Final | అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్
Vaibhav Suryavanshi Shoe Gesture | వివాదంలో వైభవ్ సూర్యవంశీ
Smriti Mandhana Record Ind vs SL | టీ20ల్లో స్మృతి 4 వేల పరుగులు పూర్తి
India vs Sri Lanka T20 Highlights | శ్రీలంకపై భారత్ ఘన విజయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC Property Tax: గ్రేటర్‌ హైదరాబాద్‌ వాసులకు గుడ్‌న్యూస్- 90శాతం మిగిలే ఆఫర్ ప్రకటించిన జీహెచ్ఎంసీ  
గ్రేటర్‌ హైదరాబాద్‌ వాసులకు గుడ్‌న్యూస్- 90శాతం మిగిలే ఆఫర్ ప్రకటించిన జీహెచ్ఎంసీ  
VB–G RAM G Bill: ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తీసేయడంపై కమ్యూనిస్టుల విమర్శలు -ఘాటు కౌంటర్ ఇచ్చిన ఏపీ బీజేపీ
ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తీసేయడంపై కమ్యూనిస్టుల విమర్శలు -ఘాటు కౌంటర్ ఇచ్చిన ఏపీ బీజేపీ
Rowdy Janardhana Title Glimpse : ఇంటిపేరునే రౌడీగా మార్చుకున్న 'రౌడీ జనార్దన' - విజయ్ దేవరకొండ బ్లడ్ బాత్ నట విశ్వరూపం
ఇంటిపేరునే రౌడీగా మార్చుకున్న 'రౌడీ జనార్దన' - విజయ్ దేవరకొండ బ్లడ్ బాత్ నట విశ్వరూపం
GHMC Delimitation: జీహెచ్ఎంసీ డీలిమిటేషన్‌కు మార్గం సుగమం - అభ్యంతరాలపై అన్ని పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు
జీహెచ్ఎంసీ డీలిమిటేషన్‌కు మార్గం సుగమం - అభ్యంతరాలపై అన్ని పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు
TTD adulterated ghee case: టీటీడీ కల్తీ నెయ్యి కేసులోనూ చెవిరెడ్డి - జైల్లో ప్రశ్నించిన సీబీఐ అధికారులు
టీటీడీ కల్తీ నెయ్యి కేసులోనూ చెవిరెడ్డి - జైల్లో ప్రశ్నించిన సీబీఐ అధికారులు
Hyderabad Crime: మేడ్చల్ లెక్చరర్ అశోక్‌ను చంపింది భార్యే - నమ్మకంగా విషం పెట్టేసింది !
మేడ్చల్ లెక్చరర్ అశోక్‌ను చంపింది భార్యే - నమ్మకంగా విషం పెట్టేసింది !
Starlink Vs Russia: ఎలాన్ మస్క్‌కు రష్యా గండం - స్టార్ లింక్ శాటిలైట్లపై పుతిన్ కన్ను - ఇక విధ్వంసమేనా?
ఎలాన్ మస్క్‌కు రష్యా గండం - స్టార్ లింక్ శాటిలైట్లపై పుతిన్ కన్ను - ఇక విధ్వంసమేనా?
Doctors attack patient: ఆస్పత్రిలో రోగిపై వైద్యుడు దాడి - మాట మాట పెరిగినందుకే - షాకింగ్ వీడియో
ఆస్పత్రిలో రోగిపై వైద్యుడు దాడి - మాట మాట పెరిగినందుకే - షాకింగ్ వీడియో
Embed widget