Bail Granted To Chevireddy : అక్రమ మద్యం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెయిల్ మంజూరు, 226 రోజుల తర్వాత బెయిల్ ద్వారా ఊరట!
Chevireddy Bhaskar Reddy: అక్రమ మద్యం కేసులో YCP నేత, చంద్రగిరి మాజీ MLA చెవిరెడ్డి భాస్కర్రెడ్డికి భారీ ఊరట లభించింది. ఫిజియోథెరపి చేయించుకునేందుకు ACB కోర్టు అనుమతినివ్వడంతో ఈ ఊరట దక్కింది

Bail Granted To Chevireddy: అక్రమ మద్యం కేసులో YCP నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఊరట లభించింది. AP ఏపీ హైకోర్టు జనవరి 29 గురువారం చెవిరెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. భాస్కర్రెడ్డితో పాటు సజ్జల శ్రీధర్రెడ్డి, వెంకటేష్ నాయుడులకు కూడా బెయిల్ ఇచ్చింది. APలో వేల కోట్ల మద్యం కుంభకోణం జరిగిందని, అందులో చెవిరెడ్డి భాస్కర్రెడ్డి పాత్ర కూడా ఉందంటూ 2025 జూన్17న సిట్ అధికారులు బెంగుళూరులో ఆయన్ను అరెస్ట్ చేశారు. విజయవాడ జిల్లా జైల్లో ఉన్న చెవిరెడ్డి భాస్కర్రెడ్డికి ఫిజియోథెరపి చేయించుకునేందుకు ACB కోర్టు అనుమతినిచ్చింది. తాను వెన్ను నొప్పితో బాధపడుతున్నానని.. ఉండవల్లిలో ఉన్న మంతెన సత్యనారాయణరాజు ప్రకృతి చికిత్సాలయంలో వైద్యం చేయించుకునేందుకు అనుమతి మంజూరు చేయాలని చెవిరెడ్డి పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు..15 రోజుల పాటూ వైద్యం చేయించుకునేందుకు అనుమతి ఇస్తూ ఆదేశాలు ఇచ్చింది. 226 రోజుల తర్వాత బెయిల్ ద్వారా చెవిరెడ్డికి ఊరట లభించింది
YCP ప్రభుత్వం మద్యం పాలసీలను మార్చి , నిర్దిష్ట బ్రాండ్ లకు అనుకూలంగా చర్యలు తీసుకున్నారని, దీని ద్వారా కిక్ బ్యాక్ లు సేకరించారనే ఆరోపణలొచ్చాయి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన అనుచరులు 2024 ఎన్నికల సమయంలో 250 కోట్ల రూపాయల అక్రమ నగదును రవాణా చేశారని,
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరియు ఆయన అనుచరులు 2024 ఎన్నికల సమయంలో రూ. 250 కోట్ల అక్రమ నగదును రవాణా చేశారని, దీనికి ప్రధాన ఆరోపితుడు రాజ్ కాసిరెడ్డి నుంచి నిధులు వచ్చాయని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ తెలిపింది
2024 మే 09న జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్ పోస్ట్ వద్ద ట్రక్ లో 8 కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసుకోవడంతో ఈ వ్యవహారం మొత్తం బయటపడింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబం అక్రమ నిధులతో రూ.54.87 కోట్లకు పైగా నగదుతో భూములు, ఆస్తులు కొనుగోలు చేశారని, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లలో కేవలం రూ.8.85 కోట్లు మాత్రమే చూపించారని CID తెలిపింది.
2025 జూన్ 18న బెంగళూరు ఎయిర్ పోర్ట్ వద్ద భాస్కర్ రెడ్డి, ఆయన అనుచరుడు చెరుకూరి వెంకటేష్ నాయుడిని అరెస్ట్ చేశారు. వారు కొలంబోకు విమానం ఎక్కబోతున్న సమయంలో అరెస్ట్ చేశారు. విజయవాడ ACB కోర్టులో హాజరుపర్చగా 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి రిమాండ్ చేసింది. వెంకటేష్ నాయుడు ఫోన్లో రూ.35 కోట్ల నగదు బండిల్స్ వీడియో దొరకడంతో..ఇది స్కామ్ నిధులకు సంబంధించినదిగా భావిస్తున్నారు
2025 నవంబర్ లో ఏపీ ప్రభుత్వం చెవిరెడ్డి కుటుంబం, వారి కంపెనీలకు సంబంధించిన రూ. 63.72 కోట్ల ఆస్తులను అటాచ్ చేయడానికి చర్యలు తీసుకుంది. ఈ మేరకు అక్టోబర్ 2025 విజయవాడ ACB కోర్టు భాస్కర్ రెడ్డి సహా పలువురు ఆరోపితుల బెయిల్ పిటిషన్లు తిరస్కరించింది. మోహిత్ రెడ్డికి సుప్రీంకోర్టు అంటిసిపేటరీ బెయిల్ మంజూరు చేసింది
2026 జనవరి 29న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అక్రమ మద్యం కేసులో బెయిల్ మంజూరైంది
కేసు ఇంకా దర్యాప్తు దశలో ఉంది.. ఈ కేసుకి సంబంధించి మరిన్ని వివరాలు వెలుగుచూసే అవకాశం ఉంది
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























