అన్వేషించండి

APCC Chief YS Sharmila: 'మట్టి చెంబు ఇచ్చి వెండి చెంబు తీసుకుంటున్నారు' - మెగా డీఎస్సీ కాదు దగా డీఎస్సీ అంటూ షర్మిల తీవ్ర విమర్శలు

YS Sharmila: ఏపీ ప్రభుత్వంపై పీసీసీ చీఫ్ షర్మిల విమర్శలు గుప్పించారు. ఎన్నికల స్టంట్ లో భాగంగానే ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిందని మండిపడ్డారు.

YS Sharmila Slams Ysrcp Government: రాష్ట్రంలో సంక్షేమం పేరిట ఓ చేత్తో మట్టి చెంబు ఇచ్చి వెండి చెంబు తీసుకుంటున్నారని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) ఆరోపించారు. ఇసుక మాఫియా వల్ల ప్రజల భూములు కబ్జాకు గురవుతున్నాయని.. ఇలాంటి ప్రభుత్వం మనకు అవసరమా.? అని ప్రశ్నించారు. గుంటూరు (Guntur) జిల్లా తెనాలి (Tenali) మండలం కొలకలూరులో గురువారం ఆమె పర్యటించారు. ఏపీలో ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడం పట్ల మండిపడ్డారు. ఎన్నికల స్టంట్ లో భాగంగానే నోటిఫికేషన్ ఇచ్చారని.. అది మెగా డీఎస్సీ కాదని, దగా డీఎస్సీ అని ఎద్దేవా చేశారు. 'ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం అమ్మకాలు, మద్యం మృతులు ఎక్కువే. ఏటా జాబ్ క్యాలెండర్ అంటూ హామీ ఇచ్చి మాట తప్పారు. ఉద్యోగాలు లేక యువత ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. పేదలకు 25 లక్షల ఇళ్లు కటిస్తానన్న జగన్.. ఒక్క ఇల్లు అయినా కట్టారా.?. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రం, మీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించి ఓటెయ్యండి. కాంగ్రెస్ వస్తేనే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుంది. రాహుల్ గాంధీ మొదటి సంతకం దాని పైనే చేస్తారు.' అంటూ షర్మిల వ్యాఖ్యానించారు.

షర్మిలకు భద్రత పెంపు

మరోవైపు, షర్మిలకు భద్రతను పెంచుతున్నట్లు కడప ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ తెలిపారు. స్థానికంగా ప్రోటోకాల్ అంశాలను పరిగణలోకి తీసుకొని భద్రత ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. గతంలో షర్మిలకు తెలంగాణ పోలీసులు... 4+4 భద్రత కల్పించారు. ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టడంతో ఏపీ సర్కార్ 1+1 సెక్యూరిటీ ఏర్పాటు చేసింది. అయితే, తనకు సెక్యూరిటీ పెంచాలంటూ షర్మిల డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని కోరారు. 4+4 భద్రత, ఎస్కార్ట్‌ వాహనం ఏర్పాటు చేయాలని కోరుతూ జనవరి 22న లేఖ రాశారు. షర్మిల కార్యకర్తల సమావేశాల కోసం రాష్ట్రమంతా పర్యటిస్తున్నారని... ఈ క్రమంలో అక్కడక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయని కాంగ్రెస్ నేతలు డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. అత్యవసరంగా ఆమెకు.. 4+4 సెక్యూరిటీ, ఎస్కార్ట్‌ వాహనం ఏర్పాటు చేయాలని సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ డీజీపీని కోరారు. మరోవైపు, షర్మిల సైతం తనకు భద్రత పెంచకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ప్రభుత్వం నాకు భద్రత కల్పించడం లేదంటే నా చెడు కోరుకున్నట్లే కదా.?' అని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ జిల్లాలో పర్యటించే సమయంలో ఆమెకు భద్రత పెంచుతామని జిల్లా ఎస్పీ ఓ ప్రకటన విడుదల చేశారు. 1+1 స్థానంలో 2+2 భద్రత కల్పిస్తామని చెప్పారు. 

Also Read: BAC Meeting: 4 రోజుల పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు - బీఏసీ సమావేశంలో నిర్ణయం

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
Bolla Brahma Naidu Arrest: గండిపేట భూకబ్జా కేసు - వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కాంచీపురంలో అరెస్ట్!
గండిపేట భూకబ్జా కేసు - వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కాంచీపురంలో అరెస్ట్!
Andhra Pradesh Rajya Sabha Elections:అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?
అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?
YS Sharmila Rajya Sabha Seat: చివరి క్షణంలో షర్మిలకు రాజ్యసభ చాన్స్ మిస్ - వైఎస్ఆర్‌సీపీతో స్నేహం కోసమే రాహుల్ వ్యూహాత్మక నిర్ణయమా?
చివరి క్షణంలో షర్మిలకు రాజ్యసభ చాన్స్ మిస్ - వైఎస్ఆర్‌సీపీతో స్నేహం కోసమే రాహుల్ వ్యూహాత్మక నిర్ణయమా?

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karnataka Congress Crisis: డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!
డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!
Revanth Reddy target GHMC :తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
Nandus World Scam: నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
K. Annamalai:
"అందుకే బీజేపీలో చేరా, ఏడాదిన్నర నుంచి విభేదాలు"అన్నామలై సంచలన వ్యాఖ్యలు! కొత్త రాజకీయ వేదిక ప్రకటన!
Breaking News:
"ఒక్కో ఉద్యోగం 40 లక్షలు" టీటీడీ ఇంజినీరింగ్ పోస్టుల భర్తీపై భూమన కరుణాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు 
Hyderabad Metro Fact Check:
"అమీర్‌పేట అగ్ని ప్రమాదంలో మెట్రో పిల్లర్‌కు నష్టం జరగలే, పగుళ్లు ప్రచారం ఫేక్" హైదరాబాద్‌ మెట్రో ఎండీ ప్రకటన
Andhra Pradesh Rajya Sabha Elections:అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?
అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?
Karnataka Minister Ramalinga Reddy : కర్ణాటక సీఎం డీకేకు షాక్! పోర్ట్‌పోలియోపై అసంతృప్తితో మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!
కర్ణాటక సీఎం డీకేకు షాక్! పోర్ట్‌పోలియోపై అసంతృప్తితో మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!
Embed widget