Breaking News Live: గురువారం వ్యాక్సినేషన్ ప్రక్రియకు విరామం.. ఆ టైమ్ లో శానిటైజర్ ఉపయోగించొద్దు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా నవంబరు 3న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

Background
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖ దర్శించుకున్నారు.. ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా, ప్రముఖ సినీ నటుడు విశాల్ వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.
అనంతరం ఆలయం వెలుపల విశాల్ మీడియాతో మాట్లాడుతూ.. కాలిబాటన తిరుమలకు చేరుకొని శ్రీవారిని దర్శించుకోవాలనే కోరిక నేటితో తీరిందని, ఇంతటి మంచి దర్శనం అందించిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి విశాల్ ధన్యవాదాలు తెలియజేశారు.. దీపావళి సందర్భంగా ‘ఎనిమి’ సినిమా విడుదల చేయనున్నాంమని, మా సినీమా కుటుంబ సభ్యుడైన పునీత్ అన్నయ్యను కోల్పోయాం, అన్నయ్య సంకల్పం ఆగి పోకూడదు అని కోరుకున్నాని తెలిపారు.
Also Read: ఈటల రాజేందర్ ఆధిక్యం వెనుక ఎవరి ‘హస్తం’ ఉంది..? కౌంటింగ్ సరళి చెబుతోంది అదేనా ?
‘‘పునీత్ అన్నయ్య చదివిస్తున్న వారిని నేను చదివిస్తా, నేను మరో ఇల్లు కొనుకోవాలని అనుకున్న కానీ ఇల్లు వచ్చే ఏడాది అయినా కొనుకోవచ్చు, కానీ అన్న బాధ్యత తీర్చాలని సంకల్పించా. పునీత్ అన్నయ్య ఎన్నో మంచి పనులు చేస్తూ వచ్చా’’రని విశాల్ గుర్తు చేశారు.
తిరుమల శ్రీవారిని తమిళనాడు మంత్రులు కూడా దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో తమిళనాడు వ్యవసాయ శాఖ మంత్రి ఎంఆర్కే పనీర్ సెల్వం., సమాచార శాఖ మంత్రి ఎంపీ స్వామినాథన్ లు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
Also Read: Kurnool Crime: బైక్ పై లవర్ మృతదేహం తరలింపు... హత్యా లేక ప్రమాదమా?
Also Read: వచ్చే మూడు రోజులు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ వెల్లడి
Also Read: అమెరికాలో తెలుగు వ్యక్తి దారుణ హత్య... 80 కిలోమీటర్లు వెంబడించి కాల్పులు
Also Read: హుజూరాబాద్ ఓటమిపై స్పందించిన మంత్రి కేటీఆర్... 20 ఏళ్లలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశామని ట్వీట్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
గురువారం వ్యాక్సినేషన్ ప్రక్రియకు విరామం.. ఆ టైమ్ లో శానిటైజర్ ఉపయోగించొద్దు
తెలంగాణలో ముమ్మరంగా సాగుతోన్న వ్యాక్సినేషన్ ప్రక్రియకు అధికారులు గురువారం సెలవు ప్రకటించారు. దీపావళి పండుగ సందర్భంగా కొవిడ్ వ్యాక్సినేషన్కు విరామం ఇస్తున్నట్టు చెప్పారు. తిరిగి శుక్రవారం నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ యథావిధిగా కొనసాగనుందని తెలిపారు. దీపావళి వేడుకలు నిర్వహించుకునే సమయంలో శానిటైజర్ ఉపయోగించవద్దని అధికారులు సూచించారు.
వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు.. ఎంతంటే..
దీపావళి పండగ వేళ వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని భారీగా తగ్గించింది. పెట్రోల్ పై రూ.5, డీజిల్ పై రూ.10 తగ్గిస్తున్నట్టు కేంద్రం ప్రభుత్వం తెలిపింది. తగ్గించిన ధరలను గురువారం నుంచి అమల్లోకి రానున్నాయి.





















