అన్వేషించండి

AP PRS Issue: చర్చలకు రండి... లిఖిత పూర్వకంగా ఆహ్వానించిన ప్రభుత్వం... ఉద్యోగులు వెళ్తారా...!

కొత్త పీఆర్సీపై రేపు ప్రభుత్వం, పీఆర్సీ స్టీరింగ్ కమిటీ మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం చర్చలకు రావాలని ఉద్యోగ సంఘాలకు లిఖిత పూర్వక ఆహ్వానం పంపింది.

ప్రభుత్వం లిఖిత పూర్వకంగా పిలిస్తే చర్చలు గురించి ఆలోచిస్తామని ఉద్యోగ సంఘాలు ప్రకటించిన గంట వ్యవధిలోనే రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు లిఖిత పూర్వక ఆహ్వానం పంపింది. ఫిబ్రవరి 1వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు చర్చలకు రావాలని పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ సభ్యులకు ప్రభుత్వం ఆహ్వానం పంపింది. స్టీరింగ్ కమిటీలోని 20 మంది సభ్యులను చర్చలు రావాలని ప్రభుత్వం కోరింది. అయితే ప్రభుత్వం ఇచ్చిన ఈ చర్చల ఆఫర్ పై ఉద్యోగ సంఘాలు కూడా స్పందించాయి. రేపు ఉదయం గం.9.30లకు సెక్రటేరియట్ అసోసియేషన్ హాల్ లో స్టీరింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సభ్యులు అందరూ తప్పనిసరిగా హాజరుకావాలని స్టీరింగ్ కమిటీ ప్రకటన విడుదల చేసింది. ఈ సమావేశంలో ప్రభుత్వంతో చర్చలపై నిర్ణయించనున్నట్లు సమాచారం. 

AP PRS Issue: చర్చలకు రండి... లిఖిత పూర్వకంగా ఆహ్వానించిన ప్రభుత్వం... ఉద్యోగులు వెళ్తారా...!

మంత్రుల కమిటీతో చర్చలకు ఆహ్వానం  

 కొత్త పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలను ఉద్ధృతం చేస్తున్నారు. ఈ క్రమంలో ఉద్యోగ సంఘాల నేతలను ప్రభుత్వం మరోసారి చర్చలకు పిలిచింది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మంత్రుల కమిటీతో చర్చలకు జరపాలని కోరింది. పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ సభ్యులకు సాధారణ పరిపాలనశాఖ కార్యదర్శి లేఖ రాశారు. పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోకపోతే సమ్మెకు వెళ్తామని ఉద్యోగ సంఘాలు సమ్మె నోటీసు ఇచ్చాయి. దీంతో ప్రభుత్వం మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. మంత్రుల కమిటీతో చర్చించేందుకు కమిటీ సభ్యులు ముందుకు రాలేదు. దీంతో కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మంగళవారం కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు వేసేందుకు సమయాత్తమవుతోంది. 

ట్రెజరీ ఉద్యోగులకు మెమోలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హెచ్చరించినట్లుగానే ఉద్యోగులపై చర్యలకు ఉపక్రమించింది. జీతాల బిల్లులు ప్రాసెస్ చేయని ట్రెజరీ ఉద్యోగులకు చార్జి మెమోలు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనలు మాత్రమే చేస్తున్నారు. ఇంకా సమ్మెలోకి వెళ్లలేదు. విధుల్లో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం చెప్పినట్లుగానే చేయాలని ట్రెజరీ అధికారులు, పే అండ్ అకౌంట్స్ ఉద్యోగులను ఆదేశించారు. కొత్త పీఆర్సీ ప్రకారం జీతాల బిల్లులు ప్రాసెస్ చేయాలని ఉన్నత అధికారులు పలుమార్లు ఆదేశాలు జారీ చేశారు. సర్క్యూలర్లు ఇచ్చారు. అయితే అలా ప్రాసెస్ చేయవద్దని ఉద్యోగ సంఘాలు ట్రెజరీ అధికారులను కోరారు.  దీంతో కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు ప్రాసెస్ చేయబోమని ట్రెజరీ ఉద్యోగులు స్పష్టం చేశారు. కలెక్టర్ల ఒత్తిడి మేరకు పోలీసులు, జడ్జిలు, మున్సిపల్ సిబ్బందికి సంబంధించిన జీతాలు మాత్రం ప్రాసెస్ చేశారు.  తాము ఎంత చెప్పినా.. ఎన్ని సార్లు సర్క్యూలర్లు జారీ చేసినా జీతాల బిల్లులను ప్రాసెస్ చేయకపోవడంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు , మూడు రోజుల నుంచి విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకుంటామని చెబుతోంది. ఈ క్రమంలో అధికారులకు చార్జీ మెమోలు జారీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. వివిధ జిల్లాలకు చెందిన మొత్తం 27 మంది డిడి, ఎస్టీఓ, ఏటిఓ లకు మెమోలు జారీచేసారు. 2022 జనవరి 29 తేదీ సాయంత్రం 6 గంటల వరకూ తమ విధుల్లో విఫలమైన వారిపై క్రమశిక్షణా చర్యలు చేపట్టాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Also Read:  గవర్నర్‌పై దీదీ ఫైర్.. ఏకంగా ట్విట్టర్ ఖాతాను బ్లాక్ చేసిన సీఎం!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Araku Kauni: గిరిజన రుచులకు గ్లోబల్ బ్రాండింగ్ - అరకు కౌని మిల్లెట్ మెనూను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
గిరిజన రుచులకు గ్లోబల్ బ్రాండింగ్ - అరకు కౌని మిల్లెట్ మెనూను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
Autonomous shipbuilding: నెల్లూరులో డ్రైవర్లు అవసరం లేని నౌకల తయారీ కేంద్రం -అటానమస్ షిప్‌బిల్డింగ్ సెంటర్‌ ప్రత్యేకత ఇదే !
నెల్లూరులో డ్రైవర్లు అవసరం లేని నౌకల తయారీ కేంద్రం -అటానమస్ షిప్‌బిల్డింగ్ సెంటర్‌ ప్రత్యేకత ఇదే !
Iran War Effect On Vizag Steel Plant: విశాఖ ఉక్కుకు ఇరాన్‌ వార్‌ సెగ! పది రోజుల్లో స్టీల్ ప్లాంట్ మూతపడుతుందా? 
విశాఖ ఉక్కుకు ఇరాన్‌ వార్‌ సెగ! పది రోజుల్లో స్టీల్ ప్లాంట్ మూతపడుతుందా? 
TDP MLAs: భారీ మెజార్టీనే టీడీపీకి సమస్య- దారి తప్పిన ఎమ్మెల్యేలు - చంద్రబాబు చర్యలు తీసుకోలేకపోతున్నారా?
భారీ మెజార్టీనే టీడీపీకి సమస్య- దారి తప్పిన ఎమ్మెల్యేలు - చంద్రబాబు చర్యలు తీసుకోలేకపోతున్నారా?

వీడియోలు

IPL 2026 First Phase Schedule | ఐపీఎల్ 2026 సమరానికి షెడ్యూల్ ఖరారు | ABP Desam
Irfan Pathan Predicts Future Captain of Team India | శ్రేయాస్ పై ఇర్ఫాన్ పఠాన్ కామెంట్స్ | ABP Desam
ICC T20 Rankings after T20WC | ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా హవా | ABP Desam
Shivam Dube's Secret Train Journey | ట్రైన్ లో ప్రయాణించిన వరల్డ్ కప్ హీరో | ABP Desam
Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CEC Gyanesh Kumar : సీఈసీపై అభిశంసన - దేశ చరిత్రలో మొదటి సారి - 193 మంది ఎంపీల సంతకాలు!?
సీఈసీపై అభిశంసన - దేశ చరిత్రలో మొదటి సారి - 193 మంది ఎంపీల సంతకాలు!?
Ustaad Bhagat Singh : సెకండాఫ్ ఇంటెన్స్ సీన్ పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది - ఫ్యాన్స్ గెట్ రెడీ అంటున్న హరీష్ శంకర్
సెకండాఫ్ ఇంటెన్స్ సీన్ పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది - ఫ్యాన్స్ గెట్ రెడీ అంటున్న హరీష్ శంకర్
LPG Delivery Delay : గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత సిలిండర్ డెలివరీ కాకపోతే.. ఇలా ఫిర్యాదు చేయండి
గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత సిలిండర్ డెలివరీ కాకపోతే.. ఇలా ఫిర్యాదు చేయండి
Harish Shankar: హీరోయిన్ రాశీ ఖన్నాతో స్టెప్పులు వేసిన దర్శకుడు హరీష్ శంకర్ - ఫోటోలు చూశారా?
హీరోయిన్ రాశీ ఖన్నాతో స్టెప్పులు వేసిన దర్శకుడు హరీష్ శంకర్ - ఫోటోలు చూశారా?
Crime Thriller Telugu OTT: భర్త తల నరికి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన భార్య... తెలుగులో ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
భర్త తల నరికి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన భార్య... తెలుగులో ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
Affordable Mileage Bikes: హార్డ్‌ రూరల్‌ రోడ్లకు ఏ బైక్ మంచిది? బైక్ కొనే ముందు ఈ టూవిలర్స్ గురించి తెలుసుకోవడం చాలా మంచిది! 
హార్డ్‌ రూరల్‌ రోడ్లకు ఏ బైక్ మంచిది? బైక్ కొనే ముందు ఈ టూవిలర్స్ గురించి తెలుసుకోవడం చాలా మంచిది! 
Shivam Dube's Secret Train Journey | ట్రైన్ లో ప్రయాణించిన వరల్డ్ కప్ హీరో | ABP Desam
Shivam Dube's Secret Train Journey | ట్రైన్ లో ప్రయాణించిన వరల్డ్ కప్ హీరో | ABP Desam
Viral Girl Love Jihad Controversy: వైరల్ గర్ల్ మోనాలిసా లవ్ జీహాద్ బారిన పడ్డారా? - ఆమె సమాధానం ఇదే !
వైరల్ గర్ల్ మోనాలిసా లవ్ జీహాద్ బారిన పడ్డారా? - ఆమె సమాధానం ఇదే !
Embed widget