అన్వేషించండి

Free Bus Service: ఏపీలో మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం, అధికారిక ప్రకటన

Andhrapradesh News: ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కీలక అప్ డేట్ వచ్చింది. ఆగస్ట్ 15 నుంచి ఈ పథకం అమలు చేస్తున్నట్లు సర్కారు అధికారికంగా ప్రకటించింది.

Free Bus Service Scheme In Andhrapradesh: ఏపీలో మహిళలకు ప్రభుత్వం (AP Government) గుడ్ న్యూస్ చెప్పింది. ఉచిత బస్సు ప్రయాణం (Free Bus Service) అమలు తేదీపై అధికారికంగా ప్రకటించింది. ఆగస్ట్ 15వ తేదీ నుంచి రాష్ట్రంలో మహిళలకు ఫ్రీ బస్ సర్వీస్ అమలు చేస్తామని వెల్లడించింది. ఈ మేరకు మంత్రి అనగాని సత్యప్రసాద్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. దీంతో మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోన్న ప్రభుత్వం తాజాగా ఈ శుభవార్త అందించింది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున విశాఖ వేదికగా సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభించే ఛాన్స్ ఉంది. అయితే, మంత్రి కొద్దిసేపటికే ఈ ట్వీట్‌ను డిలీట్ చేశారు. 
Free Bus Service: ఏపీలో మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం, అధికారిక ప్రకటన

ఇప్పటికే 'మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం' పథకం పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటకల్లో విజయవంతంగా అమలు చేస్తున్నారు. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో పథకం అమలు తీరును అధ్యయనం చేసిన రాష్ట్ర అధికారుల బృందం దీనిపై పూర్తి నివేదికను ప్రభుత్వానికి అందించారు. పథకం అమలైతే ఆర్టీసీపై పడే భారం, ఆర్థికంగా ఎలాంటి చర్యలు చేపట్టాలి.?, ఎదురయ్యే సమస్యలు వంటి వాటిపై వివరాలను అందులో పొందుపరిచారు. వీటన్నింటినీ పరిశీలించిన సర్కారు రాష్ట్రవ్యాప్తంగా అన్ని రూట్లలోనూ ఆగస్ట్ 15 నుంచి ఈ పథకాన్ని అమలు చేసే దిశగా చర్యలు చేపట్టింది.

అదే రోజు మరో పథకం

మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లను సైతం ఆగస్ట్ 15వ తేదీ నుంచే ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. నిరుపేదలకు రెండు పూటలా కడుపు నింపేలా.. తొలిదశలో 183 అన్న క్యాంటీన్లను ప్రారంభించేలా చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు క్యాంటీన్ల ఏర్పాటుకు టెండర్లు పిలవగా.. ఈ నెల 22 వరకూ గడువు ఉంది. ఈ నెలాఖరులోగా అన్న క్యాంటీన్లకు ఆహారం సరఫరా చేసే సంస్థలకు టెండర్లు ఖరారు చేయనుంది. గతంలో ఉన్న అన్న క్యాంటీన్ల భవనాలను రూ.20 కోట్లతో ఇప్పుడు మరమ్మతులు చేస్తున్నారు. అటు, క్యాంటీన్ల నిర్వహణ కోసం దాతల నుంచి విరాళాలు సేకరించాలని సర్కారు భావిస్తోంది. ఇందు కోసం ఓ ట్రస్ట్ ప్రారంభించి.. ప్రత్యేక వెబ్ సైట్ సైతం అందుబాటులోకి తీసుకురానున్నారు. దాతలు ఇచ్చే విరాళాలకు ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. కాగా, క్యాంటీన్లలో గతంలో కేవలం రూ.5కే ఉదయం టిఫిన్, మధ్యాహ్న భోజనం అందించేవారు. ఇప్పుడు కూడా అవే ధరలతో భోజనం అందించనున్నట్లు తెలుస్తోంది.

హామీల అమలు దిశగా..

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన నెల రోజుల్లోనే హామీల అమలు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తొలుత పింఛన్ల పెంపు, డీఎస్సీ ఉద్యోగాల భర్తీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, ఉచిత ఇసుక పంపిణీ, అన్న క్యాంటీన్ల ఏర్పాటు వంటి వాటిపై ముందడుగు పడింది. సీఎం చంద్రబాబు.. పింఛన్ జులై 1 నుంచి రూ.4 వేలకు పెంచుతామన్న హామీని వెంటనే అమలు చేశారు. ఏప్రిల్ ఎరియర్లతో కలిపి ఒకేసారి రూ.7 వేలను పింఛనుదారులకు అందజేశారు. అలాగే, ఇటీవల ఉచిత ఇసుక విధానాన్ని సైతం ప్రారంభించి.. ఇందుకు తగిన మార్గదర్శకాలను సైతం విడుదల చేశారు. తాజాగా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుపైనా ఆదేశాలు జారీ చేశారు.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Delimitation Politics: నియోజకవర్గాల పునర్విభజన పొలిటికల్ గేమ్ ఛేంజర్ - అధికారపార్టీలకు అడ్వాంటేజ్ అవుతాయా?
నియోజకవర్గాల పునర్విభజన పొలిటికల్ గేమ్ ఛేంజర్ - అధికారపార్టీలకు అడ్వాంటేజ్ అవుతాయా?
Vijayawada Crime News: ఉగ్రదాడిని తప్పించుకున్న బెజవాడ, ముగ్గురి అరెస్ట్ విచారణలో విస్తుపోయే అంశాలు: సర్వ శ్రేష్ఠ త్రిపాఠీ
ఉగ్రదాడిని తప్పించుకున్న బెజవాడ, ముగ్గురి అరెస్ట్ కేసు విచారణలో విస్తుపోయే అంశాలు!
Konaseema Crime News: సామూహిక అత్యాచారం కేసులో సంచ‌ల‌న తీర్పు.. ముగ్గురికి జీవిత‌ఖైదు.. రూ.5.80 ల‌క్ష‌ల జ‌రిమానా..
సామూహిక అత్యాచారం కేసులో సంచ‌ల‌న తీర్పు.. ముగ్గురికి జీవిత‌ఖైదు.. రూ.5.80 ల‌క్ష‌ల జ‌రిమానా!
Amaravati pipes on fire: అమరావతిలో వరుసగా పైపులకు నిప్పు - కుట్ర కోణం ఉందని ప్రభుత్వం అనుమానం - విచారణ షురూ !
అమరావతిలో వరుసగా పైపులకు నిప్పు - కుట్ర కోణం ఉందని ప్రభుత్వం అనుమానం - విచారణ షురూ !

వీడియోలు

Women Reservations 2029 | లోక్ సభ, అసెంబ్లీలో 50 శాతం స్థానాల పెంపు | ABP Desam
RCB KSCA Tributes Stampede Victims | విషాధ ఘటనను జ్ఞాపకంగా మార్చిన ఆర్సీబీ | ABP Desam
Petro Effect on PSL 2026 | పాపం పాకిస్తాన్ సూపర్ లీగ్ కాస్తా పెట్రోల్ షార్టేజ్ లీగ్ అయ్యిందే | ABP Desam
BCCI IPL 2026 New Rules | ఐపీఎల్ లో స్ట్రిక్ట్ రూల్స్...బీసీసీఐ సంచలన నిర్ణయం | ABP Desam
Jasprit Bumrah Injured IPL 2026 | ప్రాక్టీస్ మ్యాచ్ లకు హాజరుకాని జస్సీ భాయ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sonia Gandhi Hospitalised: సోనియా గాంధీకి మరోసారి అస్వస్థత.. ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో చికిత్స
సోనియా గాంధీకి మరోసారి అస్వస్థత.. ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో చికిత్స
Semaglutide: సెమాగ్లుటైడ్ వాడకంపై తెలంగాణ డీసీఏ కీలక ఆదేశాలు!సెల్ఫ్‌మెడికేషన్ ప్రాణాంతకమని హెచ్చరిక 
సెమాగ్లుటైడ్ వాడకంపై తెలంగాణ డీసీఏ కీలక ఆదేశాలు!సెల్ఫ్‌మెడికేషన్ ప్రాణాంతకమని హెచ్చరిక 
Tamil Nadu Assembly Elections 2026: పురుషులకూ ఉచిత బస్సు, ఇంటికో ఫ్రిడ్జ్, దశలవారీ మద్యనిషేధం - అన్నాడీఎంకే మేనిఫెస్టోలో అన్నీ వింతలే
పురుషులకూ ఉచిత బస్సు, ఇంటికో ఫ్రిడ్జ్, దశలవారీ మద్యనిషేధం - అన్నాడీఎంకే మేనిఫెస్టోలో అన్నీ వింతలే
Royal Challengers Bangalore and Rajasthan Royals: ఐపీఎల్‌లో కాసుల వర్షం; బిలియన్ క్లబ్‌లోకి ఆర్సీబీ, రాజస్థాన్ రాయల్స్‌! క్రికెట్ చరిత్రలోనే కళ్లు చెదిరే డీల్స్!
ఐపీఎల్‌లో కాసుల వర్షం; బిలియన్ క్లబ్‌లోకి ఆర్సీబీ, రాజస్థాన్ రాయల్స్‌! క్రికెట్ చరిత్రలోనే కళ్లు చెదిరే డీల్స్!
Fuel Crisis in Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్, LPG కష్టాలు! బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు.. ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక సూచన
హైదరాబాద్‌లో పెట్రోల్, LPG కష్టాలు! బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు.. ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక సూచన
Konaseema Crime News: సామూహిక అత్యాచారం కేసులో సంచ‌ల‌న తీర్పు.. ముగ్గురికి జీవిత‌ఖైదు.. రూ.5.80 ల‌క్ష‌ల జ‌రిమానా..
సామూహిక అత్యాచారం కేసులో సంచ‌ల‌న తీర్పు.. ముగ్గురికి జీవిత‌ఖైదు.. రూ.5.80 ల‌క్ష‌ల జ‌రిమానా!
Bomb Threat: ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన
ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన
RCB vs SRH Tickets Live: నేడు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు సేల్ ప్రారంభం.. ఆర్సీబీ, సన్‌రైజర్స్ మ్యాచ్ టికెట్ ఎక్కడ తీసుకోవాలి
నేడు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు సేల్ ప్రారంభం.. RCB vs SRH Tickets ఎక్కడ తీసుకోవాలి
Embed widget