అన్వేషించండి

Shirdi Sai Electricals: నాడు జగన్ బినామీ ఆరోపణలు - నేడు అదే కంపెనీకి భూములు, రాయితీలు - టీడీపీ ఎలా సమర్థించుకుంటుంది?

AP government : షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీకి ఏపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున రాయితీలిస్తోంది. గతంలో ఇదే కంపెనీని టీడీపీ నేతలు జగన్ బినామీ సంస్థ అని ఆరోపణలు చేశారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom

Shirdi Sai Electricals Company subsidies:  షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనే కంపెనీ పేరు వింటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు  జగన్ గుర్తుకు వస్తారు.  వైఎస్ఆర్‌సీపీ హయాంలో ఈ కంపెనీకి ఏపీలో అగ్ర తాంబూలం దక్కింది.  పవర్ రంగానికి చెందిన కాంట్రాక్టులు, ట్రాన్స్ ఫార్మర్ల సరఫరా చేసే కాంట్రాక్టులు అన్నీ ఈ కంపెనీకే దక్కేవి. టీడీపీ నేతలు కూడా తీవ్రంగా ఆరోపణలు చేసేవారు.  టీడీపీ రాగానే  ఆ కంపెనీ అక్రమాలన్నీ బయటకు తీస్తారని అనుకున్నారు. కానీ ఆ కంపెనీకి టీడీపీ ప్రభుత్వంలోనూ ప్రాధాన్యత లభిస్తోంది.  తాజాగా వంద కోట్లకుపైగా స్టాంప్ డ్యూటీని మినహాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. 

షిరిడి సాయి అనుబంధ సంస్థకు స్టాంప్ డ్యూటీ మినహాయింపు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షిరిడీసాయి ఎలక్ట్రికల్స్   అనుబంధ సంస్థ అయిన  సూర్యచక్ర డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు భారీ స్టాంప్ డ్యూటీ మినహాయింపు ఇచ్చింది. ఈ మినహాయింపు మొత్తం  రూ. 104.51 కోట్లు. ఈ మేరకు జీవోలు జారీ అయింది.  షిరిడీసాయి ఎలక్ట్రికల్స్ ఇప్పటికే శ్రీసిటీ  లో రూ. 3,000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టి సోలార్ ప్యానల్స్   ఫ్యాక్టరీ  పెట్టాలనుకుంటోంది. ఇప్పుడు కంపెనీ తన అనుబంధ సంస్థ సూర్యచక్ర డెవలపర్స్ ద్వారా  కొత్తగా మరో రూ. 2,000 కోట్ల పెట్టుబడి పెడతామని మినహాయింపులు కోరింది.  ప్రభుత్వం డిసెంబర్ 2025లో జారీ చేసిన GO Ms. No. 9 ప్రకారం.. 5,000 ఎకరాలకు పైగా కాకుండా కొనుగోలు చేసే భూమికి  100 శాతం స్టాంప్ డ్యూటీ మినహాయింపు ఇస్తున్నారు.  సూర్యచక్ర డెవలపర్స్ కొనుగోలు చేసిన భూమి విలువ రూ. 1,045 కోట్లు కాగా, దానిపై వచ్చే స్టాంప్ డ్యూటీ పూర్తిగా మాఫీ చేశారు. దీని వల్ల ఆ కంపెనీకి  రూ. 105  కోట్ల లాభం ఉంటుంది.  షిరిడీసాయికి ఇది మొదటిసారి కాదు. గతంలోనూ  2021–23 మధ్య  అంటే జగన్ హయాంలోనూ ఈ కంపెనీకి సుమారు  రూ. 200 కోట్లకు పైగా  స్టాంప్ డ్యూటీ, ల్యాండ్ కన్వర్షన్ ఛార్జీలు మాఫీ చేశారు. మొత్తం మీద ఈ కంపెనీకి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి  రూ. 300 కోట్లకు పైగా ప్రోత్సాహకాలు  వచ్చాయి.

టీడీపీ హయాంలోనూ పెద్ద ఎత్తున భూములు కేటాయింపు
   
టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కు 8,365 ఎకరాల భూమి కేటాయించారు. పదేళ్ల కిందట షిరిడి సాయి ఎలక్ట్రికల్స్  ట్రాన్స్ ఫార్మర్లు తయారు చేసే కంపెనీ.  తర్వాత భారీ విద్యుత్ కంపెనీగా మారింది. విద్యుత్ ప్రాజెక్టులు, పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులు కడతామని ఒప్పందాలు చేసుకుంది. ఈ కంపెనీ నర్రెడ్డి విశ్వేశ్వర్ రెడ్డి అనే వ్యక్తికి చెందినది.  రామయపట్నం వద్ద సోలార్ ప్లేట్లు తయారు చేస్తామంటూ ఓ కంపెనీ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ఇండో సోల్ పేరుతో ప్రారంభించింది. పది లక్షల అథరైజ్డ్ క్యాపిటల్‌తో  ప్రారంభమైన ఈ కంపెనీ పెద్ద ఎత్తున భూముల్ని  తీసుకుంది. 
 
వైసీపీ హయాంలో ఎన్నో మేళ్లు 

వైసీపీ ప్రభుత్వం  ఉన్నప్పుడు షిరిడిసాయి ఎలక్ట్రికల్స్‌కు కడప నగరానికి ఆనుకుని ఉన్న ఐటీ సెజ్ భూములు.కానీ డీ నోటిఫై చేసి 49.8 ఎకరాలను కేటాయించారు. సోమశిల వద్ద కూడా షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ సోమశిల వద్ద 900 మెగావాట్ల ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చింది. అల్లూరి సీతారామరాజుజిల్లా ఎర్రవరం వద్ద 1200 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును షిరిడి సాయి సంస్థకు ప్రభుత్వం నామినేషన్ పద్దతిలో జగన్ ప్రభుత్వం కేటాయించింది. ఇది చట్ట విరుద్ధమని టీడీపీ ఆరోపించింది.ఈ కంపెనీ తీరుపై పవన్ కల్యాణ్ విచారణకు కూడా ఆదేశించారు.   శేషాచలం వైల్డ్ లైఫ్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడుతోందని ఫిర్యాదులు ఉన్నాయి.  

తమపై అప్పుడు ఆరోపణలు చేసినా ఇప్పుడు వైసీపీ సైలెంట్ 

తమ హయాంలో తమ బినామీ అని ప్రచారం చేసినా.. ఇప్పుడు ఆ సంస్థకు పెద్ద ఎత్తున భూములు,  రాయితీలు కల్పించడాన్ని వైసీపీ కూడా ప్రశ్నించడం లేదు.  ఆ సంస్థకు మద్దతుగానే వైసీపీ ఉంది. అంటే.. రెండు పార్టీలకూ షిరిడిసాయి దగ్గర సంస్థ అని అర్థమవుతోంది. కానీ ఆరోపణలు చేసిన టీడీపీ ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Advertisement

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget