అన్వేషించండి

TDP MLAs Suspension: మళ్లీ గందరగోళం ! ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యుల సస్పెన్షన్

ఏపీ అసెంబ్లీలో మరోసారి గందరగోళం నెలకొంది. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని సీతారాం ఒకరోజు సస్పెండ్ చేశారు.

AP Assembly News: ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యుల సస్పెన్షన్ పర్వం కొనసాగుతోంది. నేడు ఏపీ అసెంబ్లీలో మరోసారి గందరగోళం నెలకొంది. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని సీతారాం ఒకరోజు సస్పెండ్ చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో చర్చ జరుగుతుండగా, కల్తీ సారా, మద్యం ధరలపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. పెద్దగా నినాదాలు, పోడియంను చుట్టుముట్టి నిరసనలు చేశారు. వారి తీరుపై స్పీకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు వీధి రౌడీలు కాదని, ఇలా ప్రవర్తించడం సరికాదని అన్నారు. అశోక్ బేందాలం, ఆదిరెడ్డి భవానీ, నిమ్మకాయల చినరాజప్ప, వెంకట నాయుడు, జోగేశ్వరరావు, గద్దె రామ్మోహన్, వెలగపూడి రామక్రిష్ణ, మంతెన రామరాజు, రవికుమార్ గొట్టిపాటి, సాంబశివరావు ఏలేరు, సత్యప్రసాద్ అనగానిలను ఒకరోజు సభ నుంచి స్పీకర్ సస్పెండ్ చేశారు.

రగడ యథాతథం.. !
ఈ దఫా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలైనప్పటి నుంచీ ప్రతిపక్ష టీడీపీ సభ్యులు జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా మరణాలు ఏపీ సీఎం వైఎస్ జగన్ చేసిన హత్యలేనని, ఆయనే నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ దీనిపై చర్చ జరగాలని పట్టుబడుతున్నారు. కానీ అధికార వైఎస్సార్‌సీపీ నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ టీడీపీ నేతలను సభలో లేకుండా చేయడంలో సక్సెస్ అవుతున్నారు. మొదట గవర్నర్ ప్రసంగానికి అడ్డుపడ్డప్పటి నుంచి నేటి ఉదయం వరకు ప్రతిపక్ష టీడీపీ ఎమ్మెల్యేలు పలుమార్లు సస్పెండ్ అయ్యారు. సోమవారం అసెంబ్లీ మొదలుకాగానే జంగారెడ్డి గూడెంలో మరణాలు, రాష్ట్రంలో కల్తీ సారా మరణాలు, కల్తీ మద్యం బ్రాండ్లపై సభలో చర్చ జరగాలని టీడీపీ సభ్యులు డిమాండ్ చేశారు. 

పెగాసస్ దుమారం.. 
అసెంబ్లీ మొదలుకాగానే పెగాసస్ స్పైవేర్ పై చర్చ జరపాలని అధికార వైఎస్సార్ సీపీ సభ్యులు తెరలేపారు. అదే సమయంలో ప్రతిపక్ష టీడీపీ ఎమ్మెల్యేలు జంగారెడ్డి గూడెం కల్తీ సారా మరణాలపై చర్చ కోసం పట్టుపట్టారు. చంద్రబాబు హయాంలో పెగాసస్ వాడారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చెప్పారంటూ వైసీసీ సభ్యులు అన్నారు. రాష్ట్రంలో సమస్యలపై ప్రశ్నిస్తే ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని విపక్ష సభ్యులు ఆరోపించారు. స్పీకర్ తమ్మినేని సీతారాం వైసీపీ సభ్యులకు ప్రతినిథిగా వ్యవహిస్తున్నారని విమర్శించారు.

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలైన రోజే ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సహా ఐదుగురు టీడీపీ సభ్యులు సస్పెండ్ అయ్యారు. బడ్జెట్ సమావేశాలు ముగిసేంత వరకు స్పీకర్ తమ్మినేని సీతారాం వారిని సస్పెండ్ చేశారు. 

Also Read: Paritala Sunitha : కారు బాంబు పెట్టి 26 మందిని పొట్టన పెట్టుకున్నావ్, రాప్తాడు ఎమ్మెల్యేపై పరిటాల సునీత సంచలన ఆరోపణలు!

Also Read: Gudivada News : మంత్రి కొడాలి నాని-వంగవీటి రాధా భేటీ, ఏం మాట్లాడుకున్నారో అని ఆసక్తికర చర్చ!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Embed widget